నిఖిల్, మదాలసా శర్మ జంటగా నటించిన చిత్రం 'ఆలస్యం అమృతం'. చంద్రమహేష్ దర్శకత్వం
వహించారు. డా|| డి.రామానాయుడు నిర్మాత. ఈ చిత్రంలోని గీతాల్ని హైదరాబాద్లో విడుదల
చేశారు. తొలి సీడీని వెంకటేష్ ఆవిష్కరించారు. రానా అందుకొన్నారు. అనంతరం వెంకటేష్
మాట్లాడుతూ ''పాటలన్నీ విన్నాను. కోటి మంచి సంగీతం అందించారు. ఈ చిత్రం తప్పకుండా
విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంద''న్నారు. రామానాయుడు ఈ చిత్రం గురించి చెబుతూ
''నవరస భరితమైన కథ ఇది. అయిదు పాటలూ ఆహ్లాదకరంగా ఉన్నాయి. కథకి బలాన్నిస్తాయి.
నటీనటులందరూ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఈ చిత్ర ఫలితం కూడా అమృతంలానే ఉంటుందని
భావిస్తున్నా'' అన్నారు. కె.వి. మహదేవన్ తరవాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎక్కువ చిత్రాలకు
పనిచేసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు కోటి. ఈ కార్యక్రమంలో సుమంత్, కోడి
రామకృష్ణ, పరుచూరి బ్రదర్స్, చంద్రసిద్ధార్థ్, జయప్రకాష్రెడ్డి, రఘుబాబు, ఏవీఎస్, శివారెడ్డి,
అరవింద్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.
|