విక్రమ్, అనుష్క, అమలా పాల్ కాంబినేషన్లో విజయ్ దర్శకత్వంలో శ్రీ రాజకాళియమ్మన్ మీడియాస్పై మోహన్ నటరాజన్ సమర్పణలో ఎం. చింతామణి నిర్మిస్తున్న చిత్రం ‘నాన్న’. హైదరాబాద్లో జరిగిన ఆడియో ఆవిష్కరణలో వీవీ వినాయక్, క్రిష్, కరుణాకరన్, భోగవల్లి ప్రసాద్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. ఆడియో సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి క్రిష్, కరుణాకరణ్లకు అందజేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ -‘‘విక్రమ్ నటించిన ‘9 నెలలు’కి నేను కో-డెరైక్టర్గా చేశాను.
తనతో నాకు మంచి స్నేహం ఉంది. ‘శేతు’లో విక్రమ్ నటన చూసి సూపర్ స్టార్ అవుతాడనుకున్నాను. కమల్హాసన్లాంటి నటుడు మళ్లీ వస్తాడా అనుకున్నాను. ఆ లోటుని విక్రమ్ తీర్చాడు’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ -‘‘నేను దర్శకుల హీరోని. దర్శకులు ఎలా చెబితే అలా చేస్తాను. ఇది ట్రికీ సబ్జెక్ట్. కామెడీ, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మామూలుగా అమ్మ గొప్పతనాన్ని చెబుతారు. నాన్న కూడా మన జీవితానికి ముఖ్యం అని చెప్పే చిత్రం ఇది’’ అని చెప్పారు.
‘‘విక్రమ్ గొప్ప నటుడు. దర్శకుడు విజయ్ మా నుంచి మంచి నటనను రాబట్టారు’’ అని అనుష్క అన్నారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నామని మోహన్ నటరాజన్ అన్నారు. విజయ్ మాట్లాడుతూ -‘‘దర్శకుడిగా నాకిది నాలుగవ సినిమా. విక్రమ్తో సినిమా చేయాలన్న నా కల ఇంత త్వరగా నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. ఇంకా ఈ వేడుకలో అమలాపాల్, జీవీ ప్రకాష్కుమార్ తదితర యూనిట్ సభ్యులు కూడా
పాల్గొన్నారు.
|