నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వీడుతేడా’. పూజాబోస్ కథానాయిక. బి.చిన్నికృష్ణ దర్శకుడు. లక్ష్మీనరసింహా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రకాష్, కళ్యాణ్ చక్రవర్తి నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందించిన పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆడియో తొలిసీడీని, ట్రైలర్ను డాడి.రామానాయుడు ఆవిష్కరించారు. వి.వి.వినాయక్ తొలిసీడీని అందుకున్నారు.
హైదరాబాద్లో జరిగిన ఆడియో వేడుకలో నిఖిల్, పూజాబోస్, నాని, శర్వానంద్, కృష్ణుడు, వేణు, అలీ, పుల్లారావు, కుసుమకుమార్, భాస్కరభట్ల, ప్రకాష్, కళ్యాణ్ చక్రవర్తి, పాతూరి నాగభూషణం, డి.వి.వి.దానయ్య, ఎమ్మెల్యే పుల్లారెడ్డి, రమేష్ పుప్పాల, మాస్టర్ భరత్, ఎం.ఎస్.నారాయణ, గౌతంరాజు, సురేష్రెడ్డి, గీతామాధురి తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కృష్ణ-సినిమాకి వినాయక్ వద్ద సహాయదర్శకుడిగా చేరాను.
తననుంచి ఎన్నో నేర్చుకున్నా. నా సినిమా కథకి తగ్గ పాత్రధారి నిఖిల్. నిజజీవితంలోనూ తను ఆ తరహానే. తనని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. చక్రి మాట్లాడుతూ ‘వినాయక్ శిష్యుడిగా అంకితభావంతో ఈ చిత్రాన్ని తీశారు దర్శకుడు. పాటల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘నిఖిల్ నటన నిత్యనూతనం. చిన్ని మంచి దర్శకుడిగా స్థిరపడతారు.