''నేను ఎంతగానో అభిమానించిన నందమూరి తారకరామారావు మా తొలి చిత్రానికి కొబ్బరికాయ
కొట్టారు. ఆ మహానటుడితోనే మేజర్ చంద్రకాంత్ చిత్రం నిర్మించి నటించే అవకాశం కూడా దక్కడం
నిజంగా నా అదృష్టమే! మా శ్రీలక్ష్మీప్రసన్న సంస్థలో 54 చిత్రాలు తెరకెక్కించాం. ఇప్పుడు నిర్మించిన
'ఝుమ్మంది నాదం' ఎంతో సంతృప్తిని కలిగిస్తోంద''న్నారు మోహన్బాబు. ఆయన సమర్పణలో
శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చిత్రం 'ఝుమ్మందినాదం'. శతాధిక చిత్ర దర్శకుడు
కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచు మనోజ్, తాప్సీ జంటగా నటించారు.
మోహన్బాబు ప్రధాన పాత్ర పోషించారు. మంచు లక్ష్మీప్రసన్న నిర్మాత. జులై 1న 'ఝుమ్మంది
నాదం' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ''రాఘవేంద్రరావుగారి సినిమాలో నటించడం నా అదృష్టం.
దేవుడొచ్చి దర్శకత్వం చేసినట్లనిపించింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతీది మరిచిపోలేని
అనుభూతే'' అన్నారు మనోజ్. నిర్మాత మాట్లాడుతూ ''అప్పుడే సినిమా పూర్తయ్యింది అంటే
నమ్మలేకపోతున్నాను. ప్రతి ఒక్కరినీ మెప్పించేలా ఉంటుంది మా ఝుమ్మంది నాదం. చక్కటి
కథ, వినోదం కలబోశారు మా దర్శకులు. కీరవాణి స్వరపరచిన గీతాలు అందరికీ నచ్చాయ''న్నారు.
ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, తాప్సి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అశోక్కుమార్రాజు.ఎమ్.
పాల్గొన్నారు.
|