ఫిలిం న్యూస్
 
 
 
 
మాయగాడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్
వేణు, ఛార్మి జంటగా దిలీప్ పోతన్ దర్శకుడిగా సాంబశివ క్రియేషన్స్ పతాకంపై బేబి జ్యోతిక సమర్పణలో యలమంచిలి నాగరాణి నిర్మాణ సారధ్యంలో యలమంచి రవిచందర్ నిర్మిస్తున్న ‘మాయగాడు’ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. కాగా సినిమా ఆడియో ఇీవల విడుదలై ప్లాటినం డిస్క్ ను సాధించింది. ఈ ప్లాటినం డిస్క్ ప్రధానోత్సవం విన్ ఫ్లోరా హోటల్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో చక్రి, యలమంచిలి రవిచందర్, దిలీప్ పోలన్, వేణు, ధనిఏలె, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు సినిమా యూనిట్ కు ప్లాటినం డిస్క్ లను అందజేశారు.

దిలీప్ పోలన్ మాట్లాడుతూ - కామెడీ ప్రధానంగా ఈ సినిమాను రూపొందించాము. ఈ సినిమా కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాత రాజీ పడకుండా సినిమాను రూపొందించారు. వేణు తన సహకారాన్ని అందించారు. సినిమాలో వేణు పాత్ర మాయ చేస్తూ ఉంటుంది. ఈ సినిమాకు చక్రి ఆరు వైవిధ్యమైన పాటలను ఇచ్చారు. సినిమా విడుదలకు ముందే ప్లాటినం డిస్క్ అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.

చక్రి మాట్లాడుతూ - దర్శకుడి అభిరుచి మేరకు పాటలను కంపోజ్ చేయడం జరిగింది. పాటల్లో అన్ని రసాలు ఉంటాయి. అలాగే సినిమాకు మంచి సాహిత్యం కూడా తోడయింది. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

రవిచంద్ర మాట్లాడుతూ - ఈ నెల 15న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ఆడియో హిట్ అయ్యింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

వేణు మాట్లాడుతూ - నేను నటించిన ‘గోపి గోపిక గోదావరి’ సినిమా చక్రి సంగీతం వల్ల మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తరువాత సంగీతపరంగా అంత మంచి పాటలు ఈ సినిమాకు కుదిరాయి. చక్రి చాలా మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ఫలించి మాకు మంచి ఫలితాలు అందాలని కోరుకుంటున్నాను అన్నారు.

రవివర్మ మాట్లాడుతూ - చక్కటి కలయికలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వందరోజులు ఆడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్లాటినం డిస్క్ అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.