Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ఓంకార్ ‘జీనియస్’
     ఓంకార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై చిన్నికృష్ణ కథ, స్క్రీన్ ప్లే తో, ఓంకార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘జీనియస్’ చిత్రం లోగో ఆవిష్కరణ జరిగింది. కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, బి.గోపాల్, పరుచూరి గోపాలకృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర, వినాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

కె.విశ్వనాథ్ మాట్లాడుతూ - చిన్నికృష్ణ గత చిత్రాల్లా ఈ చిత్రం కూడా విజయవంతం కావాలి. ఈ చిత్రం ప్రచారం ఆసక్తికరంగా ఉందని అన్నారు. అల్లు అరవింద్ మట్లాడుతూ - అల్లు అర్లున్ హీరో కావడానికి ముఖ్య కారకుల్లో చిన్నికృష్ణ ఒకరు. ఇన్నేళ్ళలో అతి తక్కువ చిత్రాలకు రాసాడంటే - అతను ఒక్కో చిత్రానికి ఎంత కష్టపడి రాస్తాడో అర్థమవుతుంది. ఓంకార్ వంటి క్రియేటివ్ పర్సన్ ని భావ దారిద్ర్యం ఉన్న మన చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానిస్తున్నాను - అని అన్నారు.

చిన్నికృష్ణ మాట్లాడుతూ - స్వాతంత్ర్యం తర్వాత మన వాళ్ళు కొత్త విషయాలేవీ కనిపెట్టలేని పరిస్థితికి కారణం చర్చిస్తూ, విద్యార్థులు ఏమి నేర్చుకోకూడదో ఇందులో చెబుతున్నాం. ఓంకార్ సోదరుడితో పాటు ఇందులో మొత్తం నలుగురు హీరోలుంటారు. టాలెంట్ హంట్ ద్వారా ఈ చిత్రంలో నటీనటులను ఎంపిక చేస్తాం - అని అన్నారు. ఓంకార్ మాట్లాడుతూ - టాలెంట్ ఉంటే చిత్ర రంగంలో తప్పని సరిగా ప్రోత్సాహం లభిస్తుంది. చిన్నికృష్ణ అన్నయ్య ప్రోత్సాహంతో చేస్తున్న ఈ చిత్రం బాగా చేయడం ద్వారానే నేను జీనియస్ ని అని నిరూపించుకుంటాను - అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ : ఠాగూర్ మధు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com