1981లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన' పిరానా 2' చిత్రాన్ని ప్రేరణగా తీసుకొని
అలెగ్జాండర్ ఆజా దర్శకత్వంలో డైమెన్షన్ ఫిలింస్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం 'పిరానా 3డి'.
అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. ఈ నెల
27న లేదా వచ్చే నెల 2న ఇండియాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాకు ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి పంపిణి చేస్తున్నారు. ఈ
సందర్భంగా ఆమె మాట్లాడుతూ " తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం విజువల్ ట్రీట్లా వుంటుంది.
మనసుషులను తినే పిరానా అనే భయంకరమైన చేపలు విక్టోరియా లేక్లో సృష్టించిన బీభత్సమే ఈ
'పిరానా 3' కథాంశం. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వుంది'
అన్నారు. ఈ సమావేశంలో హీరా ఫిలింస్ ప్రతినిధి ముఖేష్ కూడా పాల్గొన్నారు.