Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘రాజ్’ లోగో ఆవిష్కరణ
     సుమంత్ కథానాయకుడుగా ప్రియమణి, విమలా రామన్ కథానాయికలుగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ‘రాజ్’ చిత్ర లోగో విడుదల కార్యక్రమం అన్నపూర్ణా స్టూడియోస్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో సుమంత్, నిర్మాతలు కుమార్ బ్రదర్స్, దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, కమెడియన్ శ్రీనివాసరెడ్డి తదితరలు పాల్గొన్నారు. కార్యక్రమంలో లోగో విడుదల కార్యక్రమం అనంతరం...

సుమంత్ మాట్లాడుతూ - ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. మొదటిసారిగా ముక్కోణపు ప్రేమ కథలో నటిస్తున్నాను. సినిమా టైటిల్ ‘రాజ్’ అని వున్నా ఇది యాక్షన్ సినిమా కాదు. ఇదొక చక్కటి ప్రేమకథ. ఈ సినిమాలో నేనొక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా నటిస్తున్నాను. ఇక నుంచి సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తాను అన్నారు.

వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ - మంచి కథ, మంచి సాంకేతిక నిపుణులను ఎన్నుకున్నారు సుమంత్. కారణాంతరాల వల్ల దర్శకుడు మారవలసి వచ్చి నాకు ఈ అవకాశం కలిగింది. నిర్మాతలతో చాలా కంఫర్టబుల్ గా వుంది. సుమంత్, ప్రియమణి, విమలారామన్ ల పెర్ ఫార్మెన్స్ బాగుంది. కోటి మంచి మ్యూజిక్ని ఇచ్చారు. నాగార్జునగారి ‘ఘరానా బుల్లోడు’లోని ‘భీమవరం బుల్లెమ్మ’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసాం. ఈ సినిమాలో ఆరు పాటలు వున్నాయి. కెమెరామెన్ జగన్ హీరో హీరోయిన్లను చాలా బాగా చూపించాడు అన్నారు.

కుమార్ బ్రదర్స్ మాట్లాడుతూ - ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసి... ఆఖరివారంలో సినిమాని విడుదల చేయనున్నాం అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com