తెలుగులో పరిచయమైన హీరోయిన్ రంభ ఆ తర్వాత అగ్రహీరోల చిత్రాల్లో నటించింది. ఆ పిమ్మట హిందీ వైపు
మళ్లింది. దివ్య భారతి పోలికలతో పాటు అందాలు కూడా పుష్కలంగా కనువిందు చేయడంతో కొంతకాలం
నెట్టుకొచ్చింది.
అలా సంపాదించిన డబ్బుతో ‘‘త్రీ రోజెస్’’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించింది. ఆ మూడు గులాబీల చిత్రం
రంభ ఆర్థిక పరిస్థితిని గుచ్చి గుచ్చి పెట్టడం తో పైసలు ఖాళీ అయిపోయాయ్. దీంతో సినీ నిర్మాణానికి స్వస్తి
చెప్పి మళ్లీ కోలీవుడ్, టాలీవుడ్ లలో ఛాన్స్ ల కోసం పాకులాడింది. అయితే ఈ రెండు పరిశ్రమలు పొమ్మని
చెప్పడంతో భోజపురి చిత్రాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అక్కడా అనుకున్నంతగా అవకాశాలు తలుపు తట్టకపోవడంతో ఇటీవలే కెనాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను
పెళ్లి చేసుకున్నది. పెళ్లయిన తర్వాత రంభ దంపతులిద్దరూ ఫిజే దేశానికి హనీమూన్ వెళ్లారు. అక్కడ రోజుకు
4 లక్షల రూపాయలు అద్దెతో ఓ భవంతిని తీసుకున్నారు. అలా అక్కడ 14 రోజులు ఎంజాయ్ చేశారు.
మొత్తంమీద అద్దెతో కలిసి ఇతర వినోద కార్యక్రమాలకు అయిన ఖర్చు వెరసి కోటి రూపాయలుగా తేలినట్టు
తెలిపింది. అదే ఇప్పుడు పెద్ద చర్చ అయి కూర్చుంది.
|