| |
‘కొమరంభీమ్’గా బాలకృష్ణ... కృష్ణుడిగా ఎన్టీఆర్
దాసరి ‘పరమవీరచక్ర’లో బాలయ్య సినిమా హీరోగా ఓ పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రలో బాలకృష్ణను విభిన్న
గెటప్స్ లో దాసరి చూపే ప్రయత్నంలో ఉన్నారు. రావణబ్రహ్మగా బాలయ్య కనిపిస్తారని ఇప్పటికే తెలిసింది.
ఆదివాసి పోరాట యోధుడు ‘కొమరం భీమ్’ గెటప్ లో కూడా బాలయ్య కనిపిస్తారని తాజా వార్త. తాతయ్య
ఎన్టీఆర్ లానే పౌరాణిక పాత్రలంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మక్కువ. ‘దాన వీర శూర కర్ణ’ రీమేక్ చేసి
అందులో ప్రధాన పాత్రలన్నీ పోషించాలని కోరిక. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘బృందావనం’లో కృష్ణుడి గెటప్ లో
కాసేపు కనిపిస్తారని సమాచారం.
|
పూరి ‘ఇడియట్’... పోసాని ‘మెంటల్ కృష్ణ’ సీక్వెల్స్
రవితేజతో పూరిజగన్నాధ్ చేసిన ‘ఇడియట్’ మంచి విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా ‘ఇడియట్
- 2’ రూపొందించే పనిలో పూరి ఉన్నారు. ఇందులో హీరోగా అతని తమ్ముడు సాయిరాం నటిస్తారు.
పోసాని కృష్ణమురళి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన ‘మెంటల్ కృష్ణ’ నిర్మాతకు ఆర్థిక విజయాన్ని
ఇచ్చింది. దానికి కూడా సీక్వెల్ నిర్మించే ప్రయత్నం జరుగుతోంది.
|
టివిలో రాజమౌళి... కేసులో రాంగోపాల్ వర్మ
‘మగధీర’, ‘మర్యాదరామన్న’లతో దర్శకుడిగా మంచి జోరుమీదున్న రాజమౌళి ఓ టివి షోలో
పాల్గొంటున్నారు. ‘కమాన్ ఇండియా’ పేరుతో ఓ వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ కార్యక్రమం
హెట్.ఎం.టివిలో త్వరలో టెలీకాస్ట్ అవుతుంది. ‘డార్లింగ్’ చిత్రంలో నటించినందుకు తనకు రావల్సిన
పారితోషికం 13 లక్షలు రామ్ గోపాల్ వర్మ ఇంకా ఇవ్వలేదంటూ - హేమామాలిని కుమార్తె ఇషాడియోల్ వర్మపై
కేసు పెట్టారు. ‘సినీ అండ్ టివి ఆర్టిస్ట్ అసోసియేషన్’కు కూడా ఆమె ఏడాది కిందటనే ఈ విషయమై ఫిర్యాదు
చేశారు.
|
నిర్మాతలుగా మారుతున్న మురుగదాస్, మీరా జాస్మిన్
‘గజిని’తో సంచలన విజయాన్ని దేశ వ్యాప్తంగా సాధించిన మురుగదాస్ సూర్య, శృతిహసన్ లతో ప్రస్తుతం ఓ
చిత్రం తమిళంలో చేస్తున్నారు. త్వరలో నిర్మాతగా మారి ఓ దేశభక్తి చిత్రం చేసే ప్రయత్నంలో మురుగదాస్
ఉన్నారు. దీనికి అతని అసిస్టెంట్ శరవణన్ దర్శకత్వం వహిస్తారని, జై, విమల్ హీరోలుగా నటిస్తారని
తెలుస్తోంది. దక్షిణాది చిత్రాలన్నింటిలో చేసిన నాయిక మీరా జాస్మిన్ త్వరలో నిర్మాత కావాలనుకుంటోంది.
మొదటిగా తన మాతృభాష మలయాళంలో చిత్రాల నిర్మాణం చేయాలనే ప్రయత్నంలో ఉంది.
|
డ్రగ్స్, వ్యభిచారం నిందితులపై పరిశ్రమ నిషేధం
ఇటీవల చిత్ర పరిశ్రమలో డ్రగ్స్, వ్యభిచారం కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరు చేసే తప్పులకు పరిశ్రమ
అంతా నిందలపాలు కావాల్సి వస్తోదని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. అందుకనే డ్రగ్స్, వ్యభిచారం వంటి చట్ట
వ్యతిరేక కార్యకలాపాల విషయంలో పట్టుబడ్డవారిపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ విషయమై
త్వరలో నిర్ణయం తీసుకుంటారు.
|
------------------------------------------------------ |
సెప్టెంబర్ 24 నుండి మహేష్ - శ్రీను వైట్ల చిత్రం
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నిర్మిస్తున్న చిత్రం సెప్టెంబర్
24 నుండి గుజరాత్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి
‘దూకుడు’ అని పేరును పరిశీలిస్తున్నారు.
|
ప్రభుదేవా - నయనతారల పెళ్ళి డిసెంబర్ లో
నయనతార ఈ మధ్య సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. తెలుగులో కూడా ఓ అగ్రహీరోతో మంచి అవకాశం వచ్చినా
అంగీకరించలేదు. ప్రభుదేవాతో ఆమె పెళ్ళి డిసెంబర్ లో జరగ నుండటం వల్లనే ఆమె సినిమాలు
వదులుకుంటోందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ - పోని వర్మల పెళ్ళి వల్ల, ఇంతవరకూ
డైలమాలో ఉన్న ప్రభుదేవా ఇప్పుడు ధైర్యం చేసి పెళ్ళికి సిద్ధమయ్యాడని అంటున్నారు.
|
‘రగడ’లో నాగార్జునతో కలిసి ఛార్మి డాన్స్
‘మాస్’లో నాగార్జునతో కలిసి చేసిన ఛార్మి ఇప్పుడు మరో సారి అతనితో ఓ పాటలో డాన్స్ చేస్తోంది. వీరు పోట్ల
దర్శకత్వంలో కామాక్షి పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో అనూష్క, ప్రియమణి హీరోయిన్లు. ఈ చిత్రంలోని ఓ
పాటలో ఛార్మి నాగార్జున సరసన నటిస్తోంది. రాయలసీమ నేపధ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్
గా రూపొందుతోంది.
|
‘శివం’గా సునీల్... నరేష్ తో నాగేశ్వరరెడ్డి
‘ప్రవరాఖ్యుడు’ చిత్రం నిర్మించిన గణేష్ ఇందుకూరి సునీల్ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి రాజమౌళి
అసిస్టెంట్ కోటి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి ‘శివం’ అని పేరును
పెట్టాలనుకుంటున్నారు. ‘సీమశాస్త్రి’ చేసిన అల్లరి నరేష్, నాగేశ్వరరెడ్డి త్వరలో మరో చిత్రం చేస్తున్నారు.
గతంలో నరేష్ తో విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సంస్థ ఈ చిత్రాన్ని చేస్తుంది.
|
ఇకపై తప్పుడు నిర్ణయాలుండవంటున్న నమిత
శృంగార నటి నమిత తను ఇప్పుడు రూటు మార్చానని అంటోంది. ఇప్పటి వరకూ ఒకే తరహా పాత్రలు చేయడంతో
నాకూ, ప్రేక్షకులకూ బోర్ కొట్టేసింది. ఇకపై డిఫరెంట్ పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నానని అంటోంది.
కొత్త తరహా పాత్రలతో వస్తే దాని కోసం శృంగార పరంగా ఎంతైనా అభినయంచడానికి సంశయించనంటోంది నమిత.
ఇకపై తప్పుడు నిర్ణయాలు తీసుకోనని ఖరాఖండీగా చెబుతోంది.
|
------------------------------------------------------ |
నాగార్జున ‘రాజన్న’కు కె.సి.ఆర్ సూచనలు
తెలంగాణలో గతంలో జరిగిన రజాకార్ల సంఘటనలను ఆధారంగా చేసుకుని నాగార్జున ‘రాజన్న’ అనే
చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించే ఈ
చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను అతని కుమారుడు రాజమౌళి నేతృత్వంలో చిత్రీకరిస్తారు. నాగార్జున
సరసన ఇందులో స్నేహ నటిస్తుంది. ఇటీవల ఓ చోట కలిసినపుడు నాగార్జున కె.సి.ఆర్ కి ఈ కథ
విషయం చెబితే, చారిత్రాత్మక కథాంశాల విషయంలో జాగ్రత్త వహించాలని అంటూ - ఈ చిత్రం
విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కె.సి.ఆర్. సంసిద్ధత వ్యక్తం చేశారు.
|
దాసరితో శ్రీను వైట్ల... రానాతో ఇలియానా
దర్శకులు కూడా సినిమాల్లో కనిపించడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇటీవల ‘ఏ మాయ
చేశావె’లో పూరిజగన్నాధ్ కూడా కనిపించారు. ఇప్పుడు దాసరి దర్శకత్వం వహిస్తున్న
‘పరమవీరచక్ర’లో శ్రీనువైట్ల కనిపిస్తారు. ఇందులో సినిమా హీరోగా చేస్తున్న బాలకృష్ణను డైరెక్ట్ చేస్తూ
దర్శకుడిగా శ్రీనువైట్ల నటిస్తున్నారు. రానా హీరోగా పూరిజగన్నాధ్ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి
నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇందులో ఇలియానా హీరోయిన్ గా
అనుకుంటున్నారు.
|
మమత మ్యూజిక్... సోహా వీడియో క్లిప్పింగ్స్
నటి మమతామోహన్ దాస్ మంచి గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన మాతృభాష
మలయాళంలో నటిగా బిజీగా ఉన్న మమత త్వరలో ఓ తెలుగు సినిమాకి సంగీత దర్శకత్వం
వహిస్తుందట. సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ అర్థనగ్న దృశ్యాలు ముంబై సెల్ ఫోన్స్ లో విరివిగా
కనిపిస్తున్నాయట. ఆమె ఓ బ్యూటీ పార్లర్ లో ఉన్నపుడు రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
|
‘జోకర్’గా, హాలీవుడ్ చిత్ర నిర్మాతగా అక్షయ్ కుమార్
త్వరలో ఫరాఖాన్ నిర్మించే చిత్రంలో ‘జోకర్’గా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. గతంలో రాజ్ కపూర్
‘మేరా నామ్ జోకర్’లో జోకర్ పాత్రతో ప్రేక్షకులను స్పందింప జేసినట్లుగానే ‘జోకర్’ చిత్రంలో అక్షయ్
కుమార్ కూడా ఆకట్టుకుంటాడని ఫరాఖాన్ చెబుతోంది. అక్షయ్ కుమార్ నిర్మాతగా ఓ హాలీవుడ్ చిత్రం
నిర్మిస్తున్నారు. వినయ్ విర్శాని హీరోగా నటించే ఈ చిత్రానికి ‘బ్రేక్ అవే’ అని పేరు పెడుతున్నారు.
కామిల్లా బెల్లేను హీరోయిన్ గా ఎంపిక చేశారు.
|
అర్జున్, చక్రవర్తి ‘కాంట్రాక్ట్’, విద్యాబాలన్ మోహిని అట్టం
జె.డి.చక్రవర్తి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అమీర్ దర్శకత్వంలో ‘కాంట్రాక్ట్’ అనే చిత్రం ప్రారంభం
కానుంది. అర్జున్, జె.డి.చక్రవర్తి ఇందులో హీరోలు. జానీలాల్ సినిమాటోగ్రఫీ అందిస్తారు.
సంతోష్ శివన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న మలయాళ చిత్రం ‘ఉరిమి’లో విద్యాబాలన్ మోహినీ అట్టం డాన్స్
లో అతిథిగా కనిపిస్తుంది. 1498లో కేరళ లో అడుగుపెట్టిన వాస్కోడిగామాను చంపడానికి
ప్రయత్నించిన కేలు నాయర్ గా పృథ్విరాజ్, పోర్చుగీసు యువరాణిగా జెనీలియా, హీరో అనుచరుడిగా
ప్రభుదేవా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
|
------------------------------------------------------ |
‘ఖలేజా’తర్వాత మహేష్ బాబు చిత్రం సుకుమార్ తోనే
రెండున్నరేళ్ళుగా ‘ఖలేజా’ చిత్రాన్ని చేస్తున్న మహేష్ బాబు ఇకపై అభిమానులను ఆనందింపజేసేందుకు సంవత్సరానికి రెండు చిత్రాలు చేస్తానని మాటిచ్చారు. దాని ప్రకారమే శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్, సుకుమార్, రాజమౌళి వంటి వారి కథలు విన్నారు. ఆయా చిత్రాలకు సంబంధించిన వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ తో సినిమా చేయడానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నాగచైతన్యతో సుకుమార్ చేసే గీతా ఆర్ట్స్ చిత్రం కూడా మహేష్ బాబు చిత్రం తర్వాతనే వుండవచ్చు.
|
కళ్యాణ్ రామ్ చిత్రానికి ‘కత్తి’ దక్కేలాలేదు!
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘కత్తి’ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే ఆ టైటిల్ పవన్ కళ్యాణ్, వినాయక్ లతో దానయ్య నిర్మించే చిత్రం కోసం ఇంతకుముందే రిజిస్టర్ చేయడంతో ఇబ్బంది ఏర్పడింది. ‘మహేష్ ఖలేజా’ టైప్లో కళ్యాణ్ రామ్ ‘కత్తి’ అని రిజిస్టర్ చేసే ప్రయత్నంలో కూడా విఫలం కావడంతో కొత్త పేరు కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
|
ఎన్టీఆర్ ‘బృందావనం’ అక్టోబర్ 1 విడుదల
‘కొమరం పులి’, ‘రోబో’ చిత్రాల విడుదలలో ఏర్పడిన అస్పష్టత వల్ల తెలుగు సినిమాల విడుదల పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. ఎన్టీఆర్ - వంశీ పైడిపల్లితో నిర్మించిన ‘బృందావనం’ మాత్రం అక్టోబర్ 1న విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన రాజల్, సమంతా నాయికలుగా నటిస్తున్నారు.
|
ఫ్లాప్ కి తోడు డ్రగ్స్ అభియోగంలో త్రిష
ఎప్పటి నుండో ఎదురుచూసిన బాలీవుడ్ చిత్రం ‘కట్టామీటా’ చేదు పలితం ఇవ్వడంతో ఇబ్బందిపడుతున్న త్రిష బయటికి మాత్రం - ఇలాంటి చిన్న విషయాలకు బాధపడను- అంటూ బింకాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఇటీవల హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బయటపడటం అందులో త్రిష పేరు కూడా వినిపించడం కొత్త సమస్యగా మారింది. ‘నన్ను చూసి ఓర్వలేని వారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఎదిగేవారిని కిందికి లాగాలనుకోవడం బాధాకరం’ అని అంటున్న త్రిష ఈ విషయంలో న్యాయపోరాటానికి కూడా సిద్ధమని చెబుతోంది.
|
సమీరాకు యాక్సిడెంట్... హాలీవుడ్ కే ఫ్రిదాపింటో
ప్రియదర్శన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘బుల్లెట్ ట్రెయిన్’ హిందీ చిత్రం షూటింగ్ లో సమీరారెడి్డ ప్రమాదానికి గురయ్యింది. బైక్ నడిపే సీన్లో బండి బ్యాలెన్స్ తప్పింది. ప్రమాదం జరిగినా కూడా ఫస్ట్ ఎయిడ్ తర్వాత సమీరా ఆ సీన్ పూర్తిచేయడం విశేషం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ప్రపపంచ దృష్టిని ఆకట్టుకున్న ఫ్రిదా పింటో ఇప్పుడు అయిదు ఇంగ్లీష్ చిత్రాల్లో చేస్తోంది. బాలీవుడ్లో మాత్రం ఆమెను తీసుకోలేదనే అసంతృప్తితో వున్న ఫ్రిదా ఆవేపు కూడా ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది.
|
------------------------------------------------------ |
30న పవన్ క్రీస్తు చిత్రం జెరూసలెంలో ప్రారంభం
‘శ్రీరామదాసు’ నిర్మించిన కొండా కృష్ణంరాజు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ క్రీస్తు చిత్రం నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జెరూసలెంలో ఈనెల 30న ప్రారంభం అవుతుంది.
|
బిగ్ బితో శ్రీదేవి... ఇందిరగా ప్రియాంక
బోనీకపూర్ ని పెళ్ళి చేసుకుని సినిమాలు మానుకున్న శ్రీదేవి ఇప్పుడు ఆర్.బల్కి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుందని వార్తలొచ్చాయి. ఇందులో అమితాబ్ బచ్చన్ హీరోగా చేస్తున్నారు. గతంలో ‘ఆఖ్రీరాస్తా’, ‘ఇంక్విలాబ్’, ‘ఖుదాగవా’ చిత్రాల్లో అమితాబ్ తో శ్రీదేవి జంటగా నటించారు. బల్కి అమితాబ్ తో ‘చీనీకమ్’, ‘పా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తారు. భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్ దర్శకుడు గతంలో ‘షాలిమార్’ వంటి భారీ చిత్రాలు నిర్మించారు. ఇప్పుడు ‘మదర్ -ద ఇందిరాగాంధీ స్టోరీ’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర కోసం గతంలో మాధురీ దీక్షిత్ ను అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇందిర పాత్రకు ప్రియాంక చోప్రాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
|
టీవి తెర చాలా పెద్దదంటున్న జగపతిబాబు
ప్రముఖ హీరో జగపతిబాబు ‘ఈటీవి’లో ‘రాజు-రాణి-జగపతి’ పేరుతో ఓ గేమ్ షో ప్రెజెంటర్ గా చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- టీవిని మనం బుల్లితెర అని అంటాం కానీ, నిజానికి ఇది చాలా పెద్ద తెర. ఎక్కువమందికి చేరువచేసే మాద్యమం టీవి. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జంటలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరచిపోలేను- అని అంటున్నారు.
|
‘ఈగ’ చేయాలనేది ఆలోచన మాత్రమే...
యానిమేషన్ చిత్రం ‘ఈగ’ చేయాలనేది ఆలోచన దశలోనే వుందని రాజమౌళి ట్విట్టర్లో స్పష్టం చేశారు. ప్రభాస్ చేయబోయే భారీ చిత్రానికి ముందు ఈ చిత్రం చేయాలా? లేదా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. ఇది సాంకేతిక ప్రధాన చిత్రం కనుక డిస్నీతో కలిసి చేస్తే బాగుంటుందని వుంది. రొటీన్ కి భిన్నంగా, చిన్న బడ్జెట్ లో చేసే ఈ చిత్రం ఎంపిక చేసే థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయాలనేది మా ఆలోచన- అని ఆయన అన్నారు.
|
వర్మ ‘డిపార్ట్ మెంట్’.... కిమ్ శర్మ రహస్య వివాహం
‘రణ్’ పేరుతో మీడియా మీద సినిమా తీసి పరాజయాన్ని పొందిన వర్మ కన్ను ఇప్పుడు పోలీసు శాఖపై పడింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్, ప్రదీప్ సావంత్ ల ప్రేరణతో అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లతో రాంగోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్నాడు. ‘ఖడ్గం’, ‘మగధీర’, ‘యాగం’ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి కిమ్ శర్మ రహస్య వివాహం చేసుకుంది. ఇటీవల యువ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడ్డట్టు వార్తలకెక్కిన కిమ్ ఇప్పుడు ఆప్రికాకు చెందిన ఓ యువకుడిని గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుందని బాలీవుడ్ సమాచారం.
|
------------------------------------------------------ |
ముగ్గురు హీరోయిన్లతో బాలకృష్ణ రెండు పాత్రలు
దాసరి ‘పరమవీరచక్ర’లో బాలకృష్ణ మిలిటరీ ఆఫీసర్ గానూ, సినిమా హీరోగానూ రెండు
పాత్రలుపోషిస్తున్నారు. దీనితో పాటు గతంలో ఎన్టీఆర్ చేసిన తరహాలో పలు గెటప్స్ లో బాలకృష్ణ
కనిపిస్తారు. ఇందులో అమీషాపటేల్, షీలా, నేహా ధూపియా హీరోయిన్లుగా చేస్తున్నారు.
|
ఆగ్రాలో రవితేజలో ‘మిరపకాయ్’, 27 నుండి ‘వీర’
‘డాన్ శీను’తో మరో మంచి విజయం సాధించిన రవితేజ ఇప్పుడు ‘మిరపకాయ్’గా బిజీ షూటింగ్ లో
ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆగ్రాలో జరుగుతోంది.
రిచా గంగోపాద్యాయ, దీక్షా సేథ్ ఇందులో హీరోయిన్లు, రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న
‘వీర’ ఈ నెల 27 నుండి షూటింగ్ జరుపుకుంటుంది. అనూష్క, తాప్సీ ఇందులో హీరోయిన్లు.
|
‘మర్యాదరామన్న’ సునీల్ హీరోగా బిజీ
‘అందాల రాముడు’, ‘మర్యాదరామన్న’లతో హీరోగా విజయపథంలో ఉన్న సునీల్ ఇప్పుడు
వరుసగా చిత్రాలు చేస్తున్నారు. వర్మ దర్శకత్వంలో ‘కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం = అప్పలరాజు’
త్వరలో ప్రారంభం అవుతుంది. రాజమౌళి కో-డైరక్టర్ కోటి దర్శకత్వంలో సునీల్ మరో చిత్రం
చేస్తున్నాడు. ఇది సెప్టెంబర్ 3 నుండి ప్రారంభం అవుతుంది. వినాయక్ దర్శకత్వంలో యాక్షన్ చిత్రం
చేయాలని ఉందంటున్న సునీల్ కోరిక కూడా త్వరలో తీరే సూచనలు కనిపిస్తున్నాయి.
|
వై.వి.ఎస్.చౌదరి చిత్రంలో చిరు మేనల్లుడు ‘రే’
చిరంజీవి మేనల్లుడు తేజ హీరోగా వై.వి.ఎస్.చౌదరి స్వీయదర్శకత్వంలో ‘రే’ అనే చిత్రం
చేస్తున్నారు. మిస్ ఎర్త్ అమృతా పట్టి, మోడల్ శుభ్రా అయ్యప్ప ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు.
చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజున ఈ చిత్రం విశేషాలను వెల్లడించే అవకాశం
ఉంది.
|
ప్రియాంక పబ్లిక్ ముద్దులు... హాలీవుడ్ కి దీపిక
ప్రియాంక చోప్రా, షాహిద్ కపూర్ లు ఇప్పుడు మంచి ప్రేమలో ఉన్నారట. ఇప్పటివరకూ రూమర్ల
స్థాయిలోనే ఉన్న వీరు ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో పబ్లిక్ గా కెమేరాలకు దొరికిపోయారు. షూటింగ్
కోసం విదేశాలకు వెళ్తున్న ప్రియాంకకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన షాహిద్ ‘మళ్ళీ ఎప్పుడు కలుస్తామో’
అంటూ ఎయిర్ పోర్ట్ లోనే ఆమెను ముద్దులాడిన దృశ్యాలు ఛానెల్స్ ప్రసారం చేశాయి. దీపికా పదుకొనే కు
ఓ హాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చిందట. అయితే, అందులో రెండు సన్నివేశాల్లో ఆమె నగ్నంగా
నటించాలట. అందుకనే, దీపిక ఈ మద్య - సందర్భానికి అనుగుణంగా నగ్నంగా నటిస్తే
తప్పేముంది? ‘టైటానిక్’లో కేట్ విన్ స్లెట్ చేయలేదా? - అంటూ ప్రకటనలిస్తోంది.
|
------------------------------------------------------ |
మహేష్ ‘దూకుడు’... త్వరలో జంటగా మహేష్ - జెన్నీ
శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సెప్టెంబర్ 3 నుండి షూటింగ్ జరుపుకుంటుంది.
పోలీసు అధికారిగా తొలిసారి మహేష్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘దూకుడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో
సమంత హీరోయిన్ గా చేస్తోంది. త్వరలో మహేష్ హీరోగా చేస్తున్న ఓ చిత్రంలో జెనీలియా నాయికగా నటించే
అవకాశం ఉంది. ఇటీవల ‘ఖలేజా’ షూటింగ్ లో మహేష్ ని జెనీలియా కలిసినపుడు ఈ జంట తమ కాంబినేషన్
ప్రేక్షకులను మెప్పింస్తుందనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.
|
కార్తితో భాస్కర్... చంద్రమహేష్ తో నిఖిల్, అరవింద్
‘ఆవారా’ హీరో కార్తితో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఓ చిత్రం చేస్తున్నారు. ‘చత్రపతి’ ప్రసాద్ దీనికి నిర్మాత.
రెండుభాషల్లో నిర్మించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ప్రేయసి రావే
చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రమహేష్ మరో చిత్రం చేస్తున్నారు. ‘యంగ్ ఇండియా’,‘యువ రాజ్యం’
చిత్రాల్లో నటించిన, ప్రభుత్వ అధికారి శర్మ కుమారుడు అరవింద్ కృష్ణతో పాటు ‘హ్యాపీ డేస్’ నిఖిల్ ఇందులో
హీరోలుగా చేస్తారు. ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
|
రామ్ చరణ్ పెళ్ళి... కన్నారావు ‘రోబో’ కబుర్లు
రామ్ చరణ్ కు త్వరలో పెళ్ళి కానుందని కామినేని హాస్పిటల్స్ కుటుంబం నుండి ఉపాసనా కామినేనితో అతని పెళ్ళి
నిశ్చితార్థం జరిగిందని ముంబై పాపులర్ ప్రతిక ‘మిడ్ డే’ ఓ వార్తతో సంచలనం సృష్టించింది. అయితే,
అటువంటిది ఏమీ లేదంటూ చిరు కుంటుంబం చెబుతోంది. ‘రోబో’ తెలుగు డబ్బింగ్ 25 నుండి 30 కోట్ల
ధరకు గోదావరి జిల్లాకు చెందిన కన్నారావు కొన్నారు. సినిమా రంగానికి సంబంధించని కన్నారావు ఇంత డబ్బుతో
ఎలా కొన్నాడని పరిశీలిస్తే - అతను దర్శకుడు వినాయక్ కి దగ్గరివాడని, చిరంజీవి బృందంలోని వ్యక్తి అని, అల్లు
అరవింద్ కి సన్నిహితుడని తెలుస్తోంది.
|
శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
అభ్యుదయ భావాలు, చక్కటి అభిరుచిగల దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లీడర్’ తర్వాత ఏం చేయబోతున్నారనే
ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. శేఖర్ త్వరలో హిందీ లో ఓ భారీ చిత్రం ప్రముఖ నటీనటులతో చేసే ప్రయత్నంలో ఉన్నట్లు
వార్తలొచ్చాయి. తెలుగులో మళ్ళీ కొత్త వారితో ఓ చిన్న బడ్జెట్ చిత్రం చేసే ఆలోచన కూడా ఉందని అంటున్నారు.
అతని బ్యానర్ పై ఇక్కడి ఫిల్మ్ ఛాంబర్ లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే పేరు రిజిష్టర్ చేసి పెట్టారు.
|
జీవిత రాజశేఖర్ లపై చిరు సైన్యం అసహనం
రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ చిరంజీవి బృందానికి సహనం అలవడలేదు. ఇప్పటికీ విమర్శకులపై
విరుచుకుపడటం, అదిరించి బెదిరించడం చేస్తూనే ఉన్నారు. ఇటీవల తమని విమర్శించిన జీవిత రాజశేఖర్ ల
నాలుకలు చీలుస్తామంటూ అల్లుఅరవింద్ ప్రెస్ మీట్ లోనే వార్నింగ్ ఇచ్చారు. గతంలో చిరు బృందం జీవిత రాజశేఖర్
లపై చేసిన రాళ్ళ దాడిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా, చిరు అభిమానులు జీవిత రాజశేఖర్ లను
మానవబాంబులతో పేల్చేస్తామంటూ ఫోన్ లు, ఎస్సెమ్మెస్ లు చేసి బెదిరిస్తున్నారు.
|
------------------------------------------------------ |
బాలయ్యతో హన్సిక, అనూష్క బదులు అమీషా
‘సింహా’తో విజృంభిస్తున్న బాలకృష్ణతో పరుచూరి మురళి దర్శకత్వంలో కె.ఎల్.కుమార చౌదరి ఓ చిత్రం
చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన హన్సిక కథానాయికగా చేస్తోందని అంటున్నారు. దాసరి దర్శకత్వంలో
బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తున్న ‘పరమవీరచక్ర’లో అనూష్క బదులు అమీషా పటేల్ ని హీరోయిన్ గా ఎంపిక
చేశారు. ఇందులో మరో హీరోయిన్ గా షీలా చేస్తోంది.
|
ప్రభాస్ ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’, రాంగోపాల్ వర్మ ‘బూచి’
దిల్ రాజు దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’ అనే పేరును
పరిశీలిస్తున్నారు. రాంగోపాల్ వర్మ త్వరలో ఓ 3డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బూచి’ అనే పేరుతో
ఎడ్వెంచురస్, హార్రర్, ఫాంటసీ కథాంశంతో దీన్ని రూపొందిస్తారు.
|
ఎన్టీఆర్ - సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ - త్రివిక్రమ్...
ఎన్టీఆర్ - సురేందర్ రెడ్డిల కాంబినేషన్ మరోసారి రాబోతోంది, త్వరలో వీరితో ఓ పెద్ద నిర్మాత భారీ చిత్రానికి ప్లాన్
చేస్తున్నారు. ‘జల్సా’ ‘ఖలేజా’ దర్శకుడు త్రివిక్రమ్ - రామ్ చరణ్ ల కాంబినేషన్ లో మరో చిత్రానికి
రూపకల్పన జరుగుతోంది.
|
మహేష్ - మెహర్ రమేష్, కమల్ - లింగుస్వామి...
‘కంత్రీ’, ‘శక్తి’ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ తో మహేష్ బాబు హీరోగా ఓ చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది.
దీన్ని ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తారని తెలుస్తోంది. ‘పందెంకోడి’, ‘ఆవారా’ చిత్రాల
దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో కమల్ హసన్ ఓ చిత్రం చేస్తున్నారు. దీన్ని ‘దశావతారం’ నిర్మించిన
‘ఆస్కార్’ రవిచంద్రన్ నిర్మిస్తారు.
|
‘లంహా’, ‘తేరే బిన్ లాడెన్’ చిత్రాలపై నిషేధం
కాశ్మీర్ లో అనిశ్చిత పరిస్థితులపై నిర్మించిన ‘లంహా’ చిత్రాన్ని పాకిస్తాన్, కువైట్, ఖతార్, యు.ఎ.ఇ,
ఓమన్ లో నిషేధించారు. ఒసామా బిన్ లాడెన్ ను పోలినట్లు పేరు పెట్టినందున ‘తేరే బిన్ లాడెన్’ చిత్రాన్ని బ్యాన్
చేశారు.
|
------------------------------------------------------ |
పదికోట్లు ఎవరూ ఇవ్వలేదంటున్న రాజమౌళి
దర్శకుడిగా నేను ఎక్కువ పారితోషికం తీసుకోవాలనే అనుకుంటాను. కానీ, నేల విడిచి సాము చేయడం ఇష్టం లేక పరిమితి
విధించుకుంటాను. నాకొచ్చిన అత్యధ్యిక ఆఫర్ పదికోట్లు. అది ఒప్పుకో లేదు. పేరుకే అయిదు, పది కోట్లు డరెక్టర్ ని.
నిజానికి ఇంతవరకూ అంత ఇచ్చిన వారెవరూ లేరు - అని అంటున్నారు రాజమౌళి ఓ టివి ఛానెల్ లో మాట్లాడుతూ.
మల్టీస్టారర్లు చేయడానికి హీరోలు సిద్ధమే. అయితే అభిమానులతోనే సమస్య వస్తుంది - అని అన్నారు. హీరోయిన్లలో
అనూష్క అంటే చాలా ఇష్టం అని చెప్పారు.
|
సెప్టెంబర్ 17న ‘రోబో’... విలన్ గా అమీర్ ఖాన్
భారత చిత్రరంగంలో సంచలనం సృష్టిస్తున్న రజనీ - శంకర్ ల ‘రోబో’ సెప్టెంబర్ 17న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఇంతవరకూ ఎవరూ చేయనన్ని ప్రింట్స్ తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
సైంటిస్ట్ గా, రోబో గా నే కాకుండా రజనీకాంత్ ఇందులో మరో ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. ప్రయోగాత్మకంగా నటుడిగా
కెరీర్ ని కొనసాగిస్తున్న అమీర్ ఖాన్ త్వరలో ‘ధూమ్ - 3’లో విలన్ గా నటించే అవకాశం కనిపిస్తోంది. ‘ధూమ్’లో జాన్
అబ్రహాం, ‘ధూమ్ - 2’ హృతిక్ రోషన్ నెగెటివ్ పాత్రలు చేశారు. ఇటీవల నిర్మాత యష్ చోప్రా అమీర్ ఖాన్ ని కలిసి
‘ధూమ్ - 3’ చేయమని కోరారు.
|
తమిళ చిత్రంలో సమంతా బికినీ ప్రదర్శన
తెలుగులో ‘ఏం మాయ చేశావె’ చేయకముందే సమంతా తమిళంలో నటించడం ప్రారంభించింది. ఆమె చేసిన తొలి చిత్రం
ఇప్పుడు విడుదలవుతోంది. ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘మాస్కోవిన్ కావేరి’ చిత్రంలో ఆమె బికినీ ధరించిన ఫోటోలు అక్కడ
సంచలనం సృష్టిస్తున్నాయి. ‘ఏం మాయ చేశావె’లో సంప్రదాయబద్ధంగా కనబడ్డ సమంత ఇందులో అందుకు పూర్తి భిన్నంగా
గ్గామర్ డాల్ లా కనిపించడం విశేషం.
|
హిందీ హీరోగా పేస్, రాక్ స్టార్ గా బ్రెట్ లీ
టెన్నిస్ స్టార్ గా ప్రంపచ రికార్డులు నెలకొల్పిన లియాండర్ పేస్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ‘‘నేను హిందీ
చిత్రాల్లో నటిస్తున్నాను. రెండింటిలోనూ నావి యాక్షన్ హీరో పాత్రలే. అందులో ఒకటి ‘రాజధాని’ పేరుతో చేస్తారు’’ అని
చెబుతున్నారు పేస్. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కెరీర్ గాయాల కారణంగా ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు తనకు ఇష్టమైన
సంగీత ప్రపంచంలోకి వచ్చి రాక్ స్టార్ కావాలనుకుంటున్నాడు. త్వరలో తన బృందంతో కలిసి మన దేశంలో ప్రదర్శనలివ్వడానికి
సిద్ధమవుతున్నాడు బ్రెట్ లీ.
|
దేవానంద్ ‘హరే రామ.. హరే కృష్ణ’, కృష్ణుడు ‘మ్యాంగో’
నలభై ఏళ్ళ కిందట దేవానంద్, జీనత్ ఆమన్ ల ‘హరే రామ.. హరే కృష్ణ’ సంచలనం సృష్టించింది. దాన్ని ఇప్పుడు
రీమేక్ చేస్తానని 86 ఏళ్ళ దేవానంద్ అంటున్నాడు. వెంకటేష్ తో ప్లాన్ చేసిన ‘గంగ’ ఆగిపోవడంతో నృత్య దర్శకుడు,
సినిమా దర్శకుడు అమ్మరాజశేఖర్ ఇప్పుడు కృష్ణుడు హీరోగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. దీనికి ‘మ్యాంగో’ అని పేరు
పెడుతున్నారు.
|
------------------------------------------------------ |
ప్రభాస్ ‘చూసుకుందాంరా’, గోపీచంద్ ‘ఘరానా’
ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో భగవాన్, పుల్లారావు ఓ చిత్రం నిర్మిస్తున్నారు.
ఇందులో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. దీనికి ‘చూసుకుందాంరా’ అని పేరు పెట్టాలనుకుంటున్నారు.
గోపీచంద్, దీక్షాసేథ్ జంటగా రచయిత రవి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భవ్య
క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఘరానా’ అని పేరు పెట్టాలనుకుంటున్నారు.
|
అన్నపూర్ణ ‘రాజన్న’లో రాజమౌళి, నాగ్ ‘రగడ’
అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున ‘రాజన్న’ అనే చారిత్రక నేపధ్యం ఉన్న
చిత్రం నిర్మిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున ఓ
ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు రాజమౌళి దర్శకత్వం వహించడం విశేషం.
‘కేడి’ చిత్రాన్ని నిర్మించిన కామాక్షి పతాకంపై శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు.
నాగచైతన్య, కాజల్ జంటగా అజయ్ భూయాన్ దర్శకత్వంలో ఓ చిత్రం, నాగార్జున, అనూష్క, ప్రియమణి
కాంబినేషన్ లో మరో చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో ఒక చిత్రానికి ‘రగడ’ అని పేరు పెడుతున్నారు.
|
శ్రీదేవితో వర్మ ‘షక్’, విశాల్, త్రిషతో ప్రభుదేవా
శ్రీదేవి విరాభిమాని రాంగోపాల్ వర్మ గతంలో ఆమెతో ‘క్షణం క్షణం’ చేసిన విషయం తెలిసిందే. బోనీ కపూర్ ని
పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన శ్రీదేవి ఆ మధ్య ఓ టివి సీరియల్ చేసింది. ఇప్పుడు వెండితెరపైకి
రానుంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తారు. ‘షక్’ అనే పేరుతో నిర్మిస్తున్న ఈ
చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తారు. ప్రస్తుతం ‘ఇచ్’ అనే చిత్రానికి
దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవా త్వరలో విశాల్ హీరోగా మరో తమిళ చిత్రం ప్రారంభిస్తున్నారు. ఇందులో త్రిష
నాయికగా నటించే అవకాశం ఉంది.
|
వరుణ్ ‘కుదిరితే కప్పు కాఫీ’, నిఖిల్ ‘ఫ్లాట్ నెం4’
రమణ సాల్వ దర్శకత్వంలో వరుణ్ సందేష్ ఓ చిత్రం చేస్తున్నారు ఇందులో సుమ భట్టాచార్య నాయికగా చేస్తోంది.
మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి, శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హ్యాపీడేస్’, ‘కళావర్ కింగ్’
నటుడు నిఖిల్ హీరోగా ‘ఫ్లాట్ నెం4’ అని చిత్రం త్వరలో ప్రారంభం అవుతోంది.
|
బిపాసా గొంతుతో ‘గుడ్ మార్నింగ్’
బాలీవుడ్ నటి బిపాసా బసు పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఓ సంస్థ బిపాసా గొంతుతో సంభాషణలు, అలారం
టోన్లు సిద్ధం చేస్తోంది. ఆమె పేరుతో ఓ సైట్ నే ఏర్పాటు చేసి ప్రచారం చేస్తోంది. ‘‘నాకు పొద్దున్నే లేవడం
ఇష్టం. అలారం పెట్టుకుని కూడా లేవలేని వారికోసం నా గొంతును వినియోగిస్తున్నాను. పలు హావభావాలతో
వాటిని రికార్డ్ చేసారు. అభిరుచిని బట్టి వాటిని ఎంచుకోవడం అభిమానుల బాధ్యత’’ - అని చెబుతోంది
బిపాసా.
|
------------------------------------------------------ |
మహేష్ ‘ఖలేజా’... రానా ‘ఊసరవెల్లి’
మహేష్ బాబు, అనూష్క జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో
నిర్మించిన ‘ఖలేజా’ టైటిల్ తమదేనంటూ ఛాంబర్ కు ఫిర్యాదు
రావడంతో పేరులో స్వల్ప మార్పు చేశాడు. ఇప్పుడు ఈ చిత్రం పేరు
‘మహేష్ ఖలేజా’. రామ్, జెనీలియాలతో సురేందర్ రెడ్డి
చేయాలనుకున్న ‘ఊసరవెల్లి’ ఆగిపోయింది. ఇప్పుడు అదే చిత్రాన్ని
రానా హీరోగా సురేందర్ రెడ్డి చేసే అవకాశం కనిపిస్తోంది.
|
బాలకృష్ణతో కాజల్ కాంబినేషన్ లేదు
‘మగధీర’తో తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిన కాజల్ కి
అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణ హీరోగా దాసరి
నారాయణరావు దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ‘పరమవీర
చక్ర’లో హీరోయిన్ గా మొదట కాజల్ నే అడిగారట. కోటి రూపాయల
పారితోషికం కూడా ఆఫర్ చేశారట. కారణం తెలియదు కానీ, కాజల్ ఆ
చిత్రం చెయ్యనని చెప్పేసిందట. ఈ చిత్రంలో ఇప్పుడు బాలకృష్ణ నాయిక
రోజా కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.
|
కథ నచ్చి విక్రమ్ చేస్తున్న ఉచిత చిత్రం
‘అపరిచితుడు’ విక్రమ్ కు దక్షిణాది భాషలన్నింటా మంచి ఫాలోయింగ్
ఉంది. ఇప్పుడు విక్రమ్ మలయాళంలో ఓ చిత్రం చేస్తున్నాడు. అక్కడ
పలు విజయవంతమైన చిత్రాలు చేసిన రోషన్ అండ్రూస్ విక్రమ్ కి ఓ కథ
చెప్పాడు. ఆ కథ అతనికి విపరీతంగా నచ్చడంతో ఆ చిత్రంలో చేస్తానని
చెప్పడమే కాదు, ఉచితంగా చేస్తానని రోషన్ కి మాట ఇచ్చాడు విక్రమ్.
|
జాన్ అబ్రహాం శరీరానికి 10 కోట్ల బీమా
నటీనటులు తమ శరీరంలో భాగాలను ఇన్సూరెన్స్ చేయించుకోవడం
హాలీవుడ్ లో ఇప్పటికే కొనసాగుతోంది. తాజాగా మన దేశంలోనూ
ప్రారంభమైంది. రజనీకాంత్ తన గొంతును ఇన్సూర్ చేస్తే, ఇప్పుడు
యువ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం తన శరీరాన్ని 10 కోట్లకు
ఇన్సూర్ చేశాడు.
|
త్రివిక్రమ్ తో వెంకీ, మణిరత్నంతో కార్తీక్ కొడుకు
వెంకటేష్ హీరోగా ‘ఖలేజా’ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చిత్రం
చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దానయ్య దీన్ని నిరిస్తారు. ‘రావణ్’
తర్వాత మణిరత్నం నిర్మించే తమిళ చిత్రానికి ‘పూక్కడై’ అని పేరు
పెట్టారు. పూర్వకాలపు ప్రముఖ హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ ఈ
చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
లింగుస్వామితో మహేష్-కాజల్, వెంకీతో అనూష్క
లింగుస్వామి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా త్వరలో ఓ చిత్రం ప్రారంభం అవుతోంది. ఇందులో అనూష్క హీరోయిన్ గా చేసే అవకాశం వుంది.
|
మీడియా వారికి ‘లోకల్ టీవి’ అవార్డులు
మీడియాలోని అన్ని విభాగాల వారికి దాదాపు 30 అవార్డులను ఇస్తున్నట్లు ‘లోకల్ టీవి’ వారు ప్రకటించారు. ఈ నెల 15న ఈ అవార్డుల ఉత్సవం ‘టాటాడొకొమో’ వారి సహకారంతో నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వాహకులు విష్ణు చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘లోకల్ టీవి’ మేనేజింగ్ డైరెక్టర్ స్వప్నదత్, ‘టాటా డొకొమో’ ప్రతినిధి రామకృష్ణ, లోకల్ టీవి మార్కెటింగ్ ప్రతినిధి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
|
‘బిగ్ బాస్’గా సల్మాన్... ‘కరోడ్ పతి’గా అమితాబ్
బుల్లితెర కార్యక్రమాల్లోకి సల్మాన్ ఖాన్ కూడా అడుగు పెడుతున్నాడు. అమితాబ్ నిర్వహించిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా సల్మాన్ చేస్తారు. దీనికి మొదట షారూక్, అక్షయ్ ల పేర్లు వినిపించాయి. అమితాబ్ నిర్వహించిన సంచలన కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అక్టోబర్ 11నుండి నాలుగవ భాగం ప్రసారం ప్రారంభం అవుతోంది. దీన్ని తిరిగి ఆయనే నిర్వహిస్తారు.
|
ఛానెల్ కి చిరంజీవి... సర్కస్ కి సూర్య
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి పార్టీ ప్రచారానికి ఉపయోగపడేలా ఓ టీవి న్యూస్ ఛానెల్ ప్రారంభిస్తున్నారు. అలాగే ఓ దినప్రతికనూ ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘మా టీవి’లో భాగస్వామిగా కొనసాగుతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో సూర్య సర్కస్ కళాకారుడిగా నటిస్తున్నారు. శృతిహసన్ ఈ చిత్రంలో హీరోయిన్.
|
గోళ్ళపాటిపై ఆరోపణలు, అమిత్ రాయ్ కి అవార్డు
‘బ్రహ్మలోకం’ దర్శకుడు గోళ్ళపాటి నాగేశ్వరరావు గతంలో ఓ వారపత్రికలో తను రాసిన ‘నరుడా ఏమి నీ కోరిక’ సీరియల్ ను కాపీ చేశారని రచయిత్రి ముచ్చర్ల రజనీ శకుంతల ఆరోపించారు. ‘రోడ్ టు సంగం’ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించిన అమిత్ రాయ్ కి గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డ్ లభించింది. 12న చెన్నైలో జరిగే సభలో ఈ అవార్డును అనిల్ కపూర్ చేతుల మీదుగా అందజేస్తారు.
|
------------------------------------------------------ |
నాగార్జున, అజిత్, మనోజ్ ల చిత్రం, హీరోగా కనల్ కన్నన్...
అజిత్ హీరోగా చేస్తున్న 50వ చిత్రంలో ‘మాంగాతా’ లో అక్కినేని నాగార్జున మంచు మనోజ్ కూడా
నటిస్తున్నారు. నీతూ చంద్ర, లక్ష్మీరాయ్ చేస్తున్నారు. దక్షిణాదిలో వందలాది చిత్రాలకు ఫైట్స్
సమకూర్చిన కనల్ కన్నన్ హీరోగా మారుతున్నారు. ‘శంకరన్ కోవిల్’ అనే చిత్రంతో అతను తెర
మందుకొస్తున్నారు.
|
రామ్, జెనీలియాలతో నల్లమలుపు బుజ్జి చిత్రం
సురేంద్రరెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ ప్లాన్ చేసిన ‘రామ్ అండ్ జెన్నీ’ ఆగిపోయింది. అయితే
రామ్ , జెన్నీ కాంబినేషన్ లో నల్లమలుపు బుజ్జి ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. దీనికి విక్రమ్ అనే
నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.
|
అక్టోబర్ 29న వివేక్ ఓబరాయ్ పెళ్ళి
ఐశ్వర్యారాయ్ ప్రియుడిగా విశేష ప్రచారాన్ని స్వంతం చేసుకున్న యువహీరో వివేక్ ఓబరాయ్ పెళ్ళి
అక్టోబర్ 29న జరుగుతోంది. లండన్ లో బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన బెంగుళూరు అమ్మాయి
ప్రియాంక అల్వాను అతను పెళ్ళి చేసుకుంటున్నాడు. ఆమె తండ్రి జీవరాజ్ అల్వా ప్రముఖ జనతాదళ్
నాయకుడు. ఆమె తల్లి నందిని అల్వా గతంలో కర్నాటక మంత్రిగా పని చేశారు.
|
వైవిధ్యమే ప్రియమణి విజయ రహస్యం
సినిమా సినిమాకీ వైవిధ్యంగా కనబడే ప్రయత్నం చేస్తాను. దీని వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టదు. అదే నా
విజయ రహస్యం - అని అంటోంది ప్రియమణి. నెగెటివ్ టచ్ ఉన్నవి, హాస్యభరితంగా ఉన్నవి,
మసాలా, ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది అని అంటోంది. ప్రస్తుతం నాగార్జున, సుమంత్
చిత్రాల్లో చేస్తున్న ప్రియమణి మలయాళంలో మమ్ముట్టితో ఓ చిత్రంలో నటిస్తోంది.
|
రచయిత రవి దర్శకత్వంలో గోపీచంద్, దీక్ష
పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన బి.వి.ఎస్.రవి దర్శకుడిగా మారుతున్నారు.
గోపీచంద్, దీక్షా సేథ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
గతంలో గోపీచంద్ తో ‘శౌర్యం’ నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత.
ఆగస్టు 12 నుండి రెగ్యులర్ షూటింగ్. జరుపుకునే ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రసూల్, సంగీతం
చ్రకి అందిస్తున్నారు.
|
------------------------------------------------------ |
బాలయ్య, అనూష్క, షీలాతో ‘పరమవీరచక్ర’
దాసరినారాయణరావు దర్శకత్వంలో వస్తున్న 150వ చిత్రం ‘పరమవీరచక్ర’ ఇటీవల బాలకృష్ణ
జన్మదినోత్సవంలో ప్రారంబమైంది. రెగ్యులర్ షూటింగ్ 26 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో
జరుగుతోంది. అనూష్క, షీలా హీరోయిన్లుగా చేస్తున్న ఈ చిత్రంలో ప్రధానమైన మిలిటరీ
సన్నివేశాలను బాగా మంచుకురిసే సమయంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో నవంబర్, డిసెంబర్ లో
చిత్రీకరిస్తారు.
|
నయనతార సినిమాలు వదులుకుంటోంది
అందాలనటి నయనతార ప్రస్తుతం చేస్తున్నవి తప్ప, కొత్తవి అంగీకరించడం లేదని సినిమా వర్గాలు
చెబుతున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ తమిళ దర్శకుడు, నిర్మాత ఓ చిత్రం విషయంలో ఆమెను
సంప్రదిస్తే అంగీకరించలేదట. ఇటీవల ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారంలో వార్తలకెక్కిన నయనతార
సినిమాలు వదులుకుని ప్రభుదేవానే అంటి పెట్టుకుటుందని కొందరు అంటున్నారు. అదేంలేదు,
మంచి కథతో వస్తే చేసేందుకు ఆమెకు అభ్యంతరం లేదని మరి కొందరంటున్నారు.
|
దర్శకురాలిగా డ్రీమ్ గర్ల్ హేమామాలిని
కూతురు ఇషా డియోల్ కు మార్కెట్ లో ఇమేజ్ సృష్టించడం కోసం హేమామాలిని స్వయంగా ‘టెల్ మీ ఓ
ఖుదా’ అనే చిత్రం నిర్మిస్తోంద. అయితే ఆ చిత్రం దర్శకుడు మయూర్ పురిలో విభేదాల కారణంగా
కొంత చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం నుండి అతన్ని తొలిగించారు. ఇప్పుడు దర్శకత్వ బాధ్యతను కూడా
స్వీకరించిన హేమామాలిని ఇషాకు మంచి హిట్ ఇచ్చేందుకు కృషి చేస్తోంది.
|
బెల్లంకొండ, కుమార చౌదరి చిత్రాల్లో బాలకృష్ణ
మొదట రమేష్ వర్మ, ఆ తర్వాత పూరిజన్నాధ్ లతో అనుకున్న బాలకృష్ణ - బెల్లంకొండ సురేష్ ల
చిత్రం ఇప్పుడు బి.గోపాల్ తో చేస్తారని తెలుస్తోంది. ఎం.ఎల్.కుమార చౌదరి నిర్మించే మరో చిత్రానికి
పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తారి అంటున్నారు.
|
నపుంసకుడిగా ‘పందెం కోడి’ విశాల్
ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించే బాల దర్శకత్వంలో మరో చిత్రం తయారవుతోంది. ‘అవన్ - ఇవన్’
పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్, ఆర్య హీరోలుగా చేస్తున్నారు. వారి పాత్రల వివరాలు
బయటకు రాకపోయినా - విశాల్ ఈ చిత్రంలో నపుంసకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో
విశాల్ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. అతని కెరీర్ లోనే ఇది ఛాలెంజింగ్ గా నిలుస్తుంది -
అంటూ బాల చెబుతున్నారు.
|
------------------------------------------------------ |
రామ్ సురేందర్ చిత్రం, పూరి ‘బుడ్ఢా’ ఆగిపోయీయి
రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రామ్ - జెన్నీ’ చిత్రం కొన్ని కారణాల వల్ల
లేనట్లేనని తెలుస్తోంది. రామ్ కరుణాకరన్ తో చిత్రం, సురేందర్ మరో పెద్ద హీరోతో చిత్రం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
బాలకృష్ణతో చిత్రం వాయిదాపడ్డ పూరిజగన్నాథ్ అమితాబ్ తో ‘బుడ్ఢా’ అనే హిందీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ వారంలో
ప్రారంభించాల్సి ఉంది. అయితే కారణాంతరాల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు వెంకటేష్ తో చిత్రం చేసేందుకు పూరి సబ్జక్ట్
సిద్ధం చేస్తున్నారు.
|
‘3 ఇడియట్స్’లో మహేష్ బాబుతో ఇలియానా
హిందీలో విజయవంతమైన ‘3 ఇడియట్స్’ తెలుగులో మహేష్ బాబు హీరోగా, తమిళంలో విజయ్ హీరోగా శంకర్
దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఇలియానా దాదాపు ఖాయం అయ్యింది. రెండు భాషల్లో మాధవన్
పాత్రని అతనే పోషిస్తాడు. మరో పాత్రని తెలుగులో అల్లరి నరేష్ చేసే అవకాశం ఉంది.
|
‘హ్యాపీ డేస్’తో పాటు ప్రకాష్ రాజ్ తమిళ ‘ప్రస్థానం’
అభిరుచిగల నటుడు ప్రకాష్ రాజ్ తెలుగులో విజయవంతమైన ‘హ్యాపీ డేస్’ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. దాదాపు
పూర్తయ్యి సెప్టెంబర్ లో విడుదలకానున్న ఈ చిత్రానికి ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల
విడుదలై మంచి పేరు తెచ్చుకున్న ‘ప్రస్థానం’ చిత్రాన్ని కూడా ప్రకాష్ రాజ్ తమిళంలో నిర్మిస్తున్నారు. ఇందులో
సాయికుమార్ పోషించిన పాత్రను ప్రకాష్ రాజ్ చేసే అవకాశం ఉంది.
|
వ్యాప్ గా నటించడం శ్రియ డ్రీమ్ రోల్
పక్కింటి అమ్మాయిలా, గ్రామీణ యువతిగా, గ్లామర్ గర్ల్ గా రకరకాల పాత్రలు పోషించాను. ఇపడు నటనకు పెద్ద పీట
వేయాలనుకుంటున్నాను. హాస్య చిత్రాలంటే నాకెంతో ఇష్టం. అలాంటి చిత్రాలో్ల హాస్య పాత్రలు చేయాలని ఉంది.
అలాగే, నెగెటివ్ షేడ్స్ వ్యాంప్ పాత్ర చేయాలని ఉంది. అది నా డ్రీమ్ రోల్ అని అంటోంది శ్రియ. ఆమె నటించిన స్ట్రెయిట్
చిత్రం ‘డాన్ శీను’ త్వరలో విడుదలవుతోంది.
|
నా చిత్రాలే నాకిష్టమంటున్న అమీర్ ఖాన్
‘నేను చేసిన చిత్రాలే నాకిష్టం’ - అని అంటున్నాడు అమీర్ ఖాన్. నేను నటించిన ‘త్రీ ఇటియట్స్’, ‘లగాన్’,
‘తారే జమీన్ పర్’ ఇలా ప్రతీ చిత్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందినదే. మల్టీప్లెక్స్ ప్రేక్షకులతో పాటు గ్రామీణ
ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకుని రాజ్ కుమార్ హీరానీ చిత్రాలు చేస్తారు. మిగతా దర్శకులు సిటీ ప్రేక్షకులను మాత్రమే
దృష్టిలో ఉంచుకుంటారు. రైతుల సమస్యలు, మీడియా రాజకీయాల స్పందనపై అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘పీప్లీ లైవ్’అనే
చిత్రం నిర్మిస్తున్నారు. అది ఆగస్టులో విడుదలవుతుంది.
|
------------------------------------------------------ |
మహేష్ బాబుతోనూ శ్రీనువైట్ల మందుసీను
శ్రీనువైట్ల చిత్రాలన్నింటిలో మందు సీను తప్పనిసరిగా వుంటోంది. ఇప్పుడు మహేష్ బాబుతో శ్రీనువైట్ల ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో కూడా అటువంటి సన్నివేశం వుంటుందా? అని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ‘నేను కూడా ఈ విషయం సీరియస్ గా ఆలోచిస్తున్నాను. అయితే అటువంటి సీన్ వుందీ, లేనిదీ సినిమా చూసే తెలుసుకోవాలి’ అంటూ సస్పెన్స్ లో పెడుతున్నారు శ్రీను వైట్ల. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 11నుండి కలకత్తాలో ప్రారంభం అవుతుంది.
|
శ్రీనివాసరెడ్డి కామెడీ చిత్రంలో అక్కినేని నాగార్జున?
ఇటీవల తక్కువ చిత్రాలు చేసిన నాగార్జున ఇప్పుడు స్పీడ్ పెంచారు. ‘గగనం’ విడుదలకు సిద్ధమవుతోంది. అనూష్కతో కామాక్షి మూవీస్ చిత్రం ప్రారంభమైంది. కృష్ణవంశీ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించే చిత్రం, ‘బిందాస్’ నిర్మాత అనిల్ సుంకర నిర్మించే చిత్రంలోనూ నాగార్జున చేస్తున్నారు. ‘కిక్’, ‘డాన్ శీను’ వంటి భారీ చిత్రాల సంస్థ ఆర్.ఆర్.మూవీమేకర్స్ వెంకట్ నిర్మించే చిత్రంలోనూ నాగార్జున చేస్తారని దీన్ని కామెడీ చిత్రాల స్పెషలిస్టు శ్రీనివాసరెడ్డి పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తారని వినిపిస్తోంది. అజిత్ నటించే 50వ తమిళ చిత్రం ‘మాంగాత’లోనూ చేసేందుకు నాగార్జున అంగీకరించారు.
|
ఓవర్ బడ్జెట్ కష్టాల్లో ‘ఖలేజా’, ‘కొమరం పులి’
ప్రముఖ సినిమా ఫైనాన్షియర్ సింగనమల రమేష్ ప్రారంభించిన ‘ఖలేజా’, ‘కొమరంపులి’ రెండేళ్ళకుపైగా నిర్మాణం జరగడంతో బడ్జెట్ దాదాపు రెట్టింపయ్యింది. ఇప్పుడు విడుదలకు సిద్ధమయిన ఈ చిత్రాలకు ఓవర్ బడ్జెట్ పెద్ద ఇబ్బందిని కలిగిస్తోంది. ‘ఖలేజా’ టైటిల్ మాదేనంటూ నిత్యశ్రీ ప్రొడక్షన్స్ వారు ఛాంబర్లో ఫిర్యాదు చేసారని తెలిసింది. ‘కొమరం పులి’ తెలంగాణలో ఏ ఇబ్బంది లేకుండా విడుదల చేసుకోవాలంటే రూ.10కోట్లు ఇవ్వాలంటూ కెసిఆర్ కూతురు కవిత డిమాండ్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి.
|
బాలయ్య - బి.గోపాల్, వెంకీ - పూరి జగన్నాథ్...
గతంలో పలు విజయవంతమైన చిత్రాలు అందించిన బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ త్వరలో ఓ చిత్రం చేయాలనుకుంటున్నారు. వెంకటేష్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాతలే ప్లాన్ చేస్తున్నారు.
|
చైనాలో సూర్య-శృతి... సమీరా ‘అర్థరాత్రి కుక్కలు’
తెలుగులో అనువాదమై విడుదలకానున్న రెండు చిత్రాల విశేషాలు... ‘గజనీ’ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, శృతిహసన్ జంటగా చేస్తున్న భారీ చిత్రం కీలక సన్నివేశాల చిత్రీకరణ చైనాలో ఆగస్టులో జరుగుతుంది. హ్యారిస్ జయరాజ్ సంగీతంలో శృతిహసన్ ఈ చిత్రంలో రెండుపాటలు పాడటం విశేషం. ‘ఏం మాయచేసావె’ దర్శకుడు గౌతమ్ మీనన్ సమీరారెడ్డితో ఓ థ్రిల్లర్ నిర్మిస్తున్నారు. దీనికి ‘అర్థరాత్రి కుక్కలు’ అని అర్థం వచ్చే పేరు పెట్టారు.
|
------------------------------------------------------ |
మహేష్ బాబు ‘ఖలేజా’సెప్టెంబర్ 23న
మహేష్ బాబు అభిమానులను ఆనందింపజేసే వార్త... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ - అనుష్క జంటగా
నటిస్తున్న ‘ఖలేజా’ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలవుతుంది. ఆగస్టులో ఆడియో విడుదల చేస్తారు. మణిశర్మ ఈ
చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
|
మళ్ళీ కత్రీనా వీడియో గొడవ
కత్రీనా కైఫ్ ని పోలిన అమ్మాయి వీడియో క్లిప్పింగ్స్ బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో ఆ అమ్మాయితో చాలా
మంది అబ్బాయిల శృంగార దృశ్యాలున్నాయి. అయితే, ‘‘ఆమ్మాయికి నాకు పోలికే లేదు. అర్థంలేని ప్రచారం
చేస్తున్నారంటూ’’ కత్రీనా ఖండిస్తోంది. గతంలో కూడా కత్రీనా చెల్లెలు ఇస్బెల్లా పై కూడా ఇదే విధమైన ప్రచారం జరిగింది. |
రాజేంద్ర ప్రసాద్ సుహాసిని ‘‘మొగుడు పెళ్ళాల పెళ్ళి’’
‘బ్రహ్మలోకం’లో నాలుగు తలల బ్రహ్మగా నటిస్తున్న రాజేంద్ర ప్రసాద్, ‘బావ’లో మరో ప్రధాన పాత్ర పోసిస్తున్నారు.
సుహాసిని జంటగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న ఉషా చరణ్ క్రియేషన్స్ చిత్రానికి ‘మొగుడు పెళ్ళాల పెళ్ళి’ అని పేరు పెట్టారు.
|
త్రిష ‘మాక్సిమ్’ ఫోటోలు ఊపేస్తున్నాయి
‘కట్టా మీఠా’తో అక్షయ్ కుమార్ సరసన బాలీవుడ్ ప్రవేశం చేసిన త్రిష ప్రముఖ పత్రిక ‘మాక్సిమ్’ కోసం ఇటీవల ఫోటో
సెషన్ చేసి గతంలో ఎప్పుడూలేని విధంగా భంగిమలు అందించింది. ఈ ఫోటోలు బాలీవుడ్ ని ఊపేస్తున్నాయట. వీటి ఎఫెక్ట్స్
తో త్రిష మరికొన్ని పెద్ద ప్రాజెక్ట్ లు బాలీవుడ్ లో కొట్టేసే అవకాశం ఉందంటున్నారు.
|
ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ సందేశ్
‘మీ శ్రేయోభిలాషి’, ‘మనోరమ’ చిత్రాల దర్శకుడు ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో యువ హీరో వరున్ సందేశ్ ఓ చిత్రంలో
నటిస్తున్నారు. ఇటీవల భారీ హాలీవుడ్ చిత్రాలను తెలుగులో విడుదల చేసిన మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ
చిత్రం నిర్మిస్తుంది. నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది.
|
------------------------------------------------------ |
మహేష్ బాబు ‘కలేజా’ సెప్టెంబర్ లో విడుదల
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘కలేజా’ చిత్రం కోసం
అతని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు
దాదాపు పూర్తయిన ఈ చిత్రం ఆడియో ఆగస్టులో మహేష్ బాబు పుట్టిన రోజున
విడుదల చేయాలనుకుంటున్నారు. సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తారు.
ఇందులో అనుష్క నాయికగా చేసింది.
|
శ్రీకాంత్ హీరోగా ‘గాడ్సే’, ‘దుశ్శాసన’
‘మహాత్మ’ చిత్రం తర్వాత శ్రీకాంత్ జనాన్ని ఆకట్టుకునే కమర్షియల్ టైటిల్స్ తో
చిత్రాలు చేస్తున్నారు. జి.వి. దర్శకత్వంలో ‘రంగా ది దొంగ’, సముద్ర దర్శకత్వంలో
‘సేవకుడు’ నిర్మాణంలో ఉన్నాయి. వీటి తర్వాత ‘గాడ్సే’, ‘దుశ్శాసన’ పేర్లతో మరో
రెండు చిత్రాలు శ్రీకాంత్ చేస్తున్నారు.
|
రామ్ చరణ్ తో మంజుల, సంజయ్ స్వరూప్
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘ఆరంజ్’ అనే చిత్రం చేస్తున్న
విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్ మలేషియాలో జరుగుతోంది.
ఇందులో రామ్ చరణ్ అక్క, బావలుగా మహేష్ బాబు సోదరి మంజుల, ఆమె భర్త
సంజయ్ స్వరూప్ నటించడం విశేషం.
|
శంకర్ దర్శకత్వంలో తమిళ తెలుగు ‘3 ఇడియట్స్’
రజనీకాంత్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా భారీ స్థాయిలో ‘రోబో’ రూపొందించిన
శంకర్ ఈ చిత్రం ఆగస్టులో విడుదల అవుతుండగా, తదుపరి చిత్రం గురించి ప్రణాళిక
సిద్ధం చేసుకుంటున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన అమీర్ ఖాన్ ‘3
ఇడియట్స్’ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులు జెమినీ ఫిలిం సర్యూట్ వారు
తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో చేసే చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తారని
తెలుస్తోంది.
|
ఎలా ఉండాలో అలానే ఉంటానంటున్న త్రిష
నాకేమీ రెండు జీవితాలు లేవు. అందరిలానే చెన్నైలోనో, హైదరాబాద్ లోనో,
ముంబైలోనో తిరుగాడే మద్య తరగతి యువతిని. పనిలో అలసిపోతే కాఫీ షాపుకో,
పబ్ లకో వెళ్తుంటానంతే. అయితే దాని వల్లే నన్ను ‘పార్టీ యానిమల్’గా కొందరు
అనుకుంటున్నారు. అయినా ఫర్వాలేదు. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో
అలానే ఉంటాను. ఓ యంగ్ ప్రొఫెషనల్ కి విశ్రాంతి చాలా అవసరం - అని అంటోంది
త్రిష.
|
------------------------------------------------------ |
అక్కినేని నాగార్జున, నాగచైతన్యలతో భారీ చిత్రం
అక్కినేని నట కుంటుంబం నటించే చిత్రానికి ఓ పెద్ద నిర్మాత ప్రయత్నిస్తున్నారు.
అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఇందులో నటిస్తారు. నాగార్జున రాధామోహన్
దర్శకత్వంలో ప్రస్తుతం ఓ చిత్రంలో చేస్తున్నారు. ప్రముఖ అందాలనటి ఇలియానా
త్వరలో నాగార్జున సరసన ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
|
అసిన్ కి గండం గడిస్తే - నయనతార యాడ్స్ కి రెడీ
తమిళ చిత్ర రంగం నిషేధం విధించిన శ్రీలంకలో షూటింగ్ నిషేధం పేరుతో అసిన్
చేసిన విహారాల విషయమై త్వరలో ఆమెపై తమిళ చిత్ర రంగం నిషేధం విధిస్తుందని
వార్తలొచ్చాయి. అయితే - ‘‘అసిన్ తన వృత్తిలో భాగంగానే శ్రీలంక వెళ్ళింది.
దర్శకనిర్మాతలు ఎక్కడ షూటింగ్ చేయమంటే నటీనటులు అక్కడే చేయాలి.
అందువల్ల ఆమె చేసింది తప్పు కాదంటూ’’ తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడు
శరత్ కుమార్ ప్రకటించారు. ఎంత గొప్ప ఆఫర్ వచ్చినా ప్రకటనల్లో నటించనంటూ
మొండిపట్టు పట్టిన నయనతార ఇప్పుడు యాడ్స్ లో చేయడానికి అంగీకరించారనేది
మరో వార్త.
|
‘బద్రీనాధ్’ 26 నుండి, ‘బుఢా’ ఆగస్టు 3 నుండి
అల్లు అర్జున్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘బద్రీనాధ్’
రెగ్యులర్ షూటింగ్ కులుమనాలిలో 26 నుండి దాదాపు 60 రోజుల పాటు
జరుగుతుంది. తమన్నా నాయికగా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా
ఉంటుంది. ‘గోలీమార్’ అందించిన పూరిజగన్నాధ్ అమితాబ్ బచ్చన్ హీరోగా ‘బుఢా’
అనే హిందీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 3 నుండి
హైదరాబాద్ లో జరుగుతుంది.
|
సింగీతంతో పవన్... వెంకట్ ప్రభుతో మనోజ్
కొండా కృష్ణంరాజు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘క్రీస్తు’ చిత్రం
కాకుండా, పవన్ కళ్యాణ్ సింగీతం దర్శకత్వంలో వినోదాత్మకంగా ఉండే మరో చిత్రం
చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ చిత్రం నవంబర్ లో ప్రారంభమై వచ్చే ఏప్రిల్ లో
విడుదలవుతుందని అంటున్నారు. మంచి దర్శకుడిగా తమిళంలో పేరున్న వెంకట్
ప్రభు దర్శకత్వంలో మంచు మనోజ్ ఓ చిత్రం చేస్తున్నారు. ఇది తమిళ తెలుగు
భాషల్లో ఒకే సారి నిర్మాణమవుతుంది. ఇందులో అజిత్ తో పాటు మరో ప్రముఖ
తెలుగు హీరో కూడా నటిస్తారు.
|
ఒకే యాడ్ లో ఐశ్వర్యారాయ్, కేట్ విన్ స్లెట్
అందాలనటి ఐశ్వర్యారాయ్ వ్యాపార ప్రకటనల్లోనూ విశేష ఆదరణ పొందుతున్న
విషయం తెలిసిందే. ఇప్పుడు ఐశ్వర్య చేస్తున్న యాడ్ మరింత ప్రత్యేకమైనది.
‘టైటానిక్’ నాయిక కేట్ విన్ స్లెట్ తో కలిసి ఐశ్వర్య ఓ ప్రపంచ స్థాయి వ్యాపార
ప్రకటనలో పాలుపంచుకుంటోంది. ఈ యాడ్ లో చేస్తున్నందుకు ఐశ్వర్యకు 5 కోట్లు
పారితోషికం ఇస్తున్నారు.
|
------------------------------------------------------ |
పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమంటున్న మహేష్ బాబు
‘కొమరం పులి’ ఆడియో విడుదలలో పవన్ కళ్యాణ్ చాలా బాగా
మాట్లాడారు. అయితే, దానికి నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే పవన్ ను నేను
రెండు, మూడు సార్లు మాత్రమే కలిసినా అతని వ్యక్తిత్యం, మంచితనం గురించి నాకు
తెలుసు. ‘అర్జున్’ పైరసీపై నేను పోరాడిన సమయంలో ఆయన నాకిచ్చిన
ప్రోత్సాహం మరిచిపోలేను. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అతని
మంచినే నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఎప్పటిలానే ‘కొమరం పులి’ చిత్రంలో కూడా
పవన్ అదరగొడతాడని అనుకుంటున్నానని - మహేష్ బాబు ‘ట్విట్టర్’లో
రాసుకున్నారు.
|
పోలీస్, రౌడీగా రెండు పాత్రల్లో విక్రమ్
ఇటీవల విడుదలైన ‘విలన్’లో విలన్ గా, ‘రావణ్’లో హీరోగా ఒకే సినిమా రెండు
వెర్షన్స్ లో రెండు పాత్రలు చేసిన విక్రమ్, ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో
ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూపతి పాండ్యన్ దర్శకత్వంలో ఇలియానా
నాయికగా చేస్తున్న ఈ చిత్రం పేరు ‘వెడి’, తెలుగులో కూడా విడుదలయ్యే ఈ
చిత్రంలో విక్రమ్ పోలీస్, రౌడీగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. కోట, బ్రహ్మానందం,
రవిరాజా పినిశెట్టి ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని
అందిస్తున్నారు. |
సెప్టెంబర్ 3న రజనీకాంత్ కుమార్తె వివాహం
రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య వివాహం సెప్టెంబర్ 3న చెన్నైలో భారీ స్థాయిలో
జరుగనుందని తెలుస్తోంది. అశ్విన్ ను సౌందర్య పెళ్ళి చేసుకుంటోంది. ఈ పెళ్ళికి
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అమితాబ్ బచ్చన్, రిజర్డ్ గెరె తో పాటు
ప్రముఖులెందరినో ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ఇటీవలనే రజనీ మొదటి
కుమార్తె సౌందర్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే, శంకర్ దర్శకత్వంలో రజనీ
చేసిన భారీ చిత్రం ‘రోబో’ ఆగస్టు చివరిలో విడుదలవుతోంది.
|
అవార్డు చిత్రాలు ముఖ్యం కాదంటున్న ఇలియానా
వ్యాపార పరమైన సినిమాలు చేస్తేనే మనకు లాభం. అలాకాకుండా నటనకు
ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తే పేరొస్తుంది కానీ, నిర్మాతకి డబ్బు రావాలిగా - అని
ప్రశ్నిస్తోంది ఇలియానా. నేను అభినయ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు వ్యతిరేకం కాదు.
కానీ, వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోను. సినిమాకి వచ్చే ప్రేక్షకులకు వినోదం
పంచిస్తే చాలు. అలాంటి పాత్రలే చేస్తా. ఈ ఆర్ట్ సినిమాలు, అవార్డు సినిమాలూ
నాకంత ముఖ్యం కాదు అని సూటిగా చెప్పేస్తోంది.
|
శ్యామ్ బెనెగల్ చిత్రంలో చేస్తున్న సిద్దార్థ?
‘నువ్వొస్తానంటే - నేనొద్దంటానా’తో ఘన విజయాన్ని పొందిన చిత్రాల్లో నటించిన
సిద్దార్థ, నటుడిగా విభిన్న చిత్రాల్లో చేయాలనే తపన ఉన్న నటుడు. అమీర్ ఖాన్ తో
అతను చేసిన ‘రంగ్ దే బసంతి’లో అతని నటనకు విశేష ప్రశంసలు పొందారు.
ఇటీవల బాలీవుడ్ లో ‘స్ట్రైకర్’ అనే మరో చిత్రం సోలో హీరోగా చేసినా విజయం
లభించలేదు. అయితే, అతని నటనా విధానం నచ్చి ప్రముఖ దర్శకుడు శ్యామ్
బెనెగల్ తను నిర్మించే తదుపరి చిత్రంలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
రాణిగా జెనీలియా... హుస్సేన్ తో విద్యాబాలన్
ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ‘ఉరుము’ అనే చారిత్రాత్మక చిత్రాన్ని మలయాళంలో చేస్తున్నారు.
ఇందులో పోర్చుగీసు యువరాణిగా జెనీలియా నటించడం విశేషం. 300 ఏళ్ళనాటి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో
పృధ్వీరాజ్ హీరోగా చేస్తున్నాడు. ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ తన 94వ ఏట విద్యాబాలన్ హీరోయిన్ గా ఓ
చిత్రం చేసే పనిలో పడ్డాడు. గతంలో మాధురీ దీక్షిత్ తో ‘గజగామిని’ చిత్రం నిర్మించిన హుస్సేన్ ఆ తర్వాత టబు,
అమృతారావులని అభిమానించారు. ఇప్పుడు హాస్య ప్రధానంగా విద్యాబాలన్ తో చిత్రం చేస్తున్నారు.
|
తిరిగి సినిమాలకు సోనాలి... పెళ్ళి కోరుతున్న లీసారే
‘మురారీ’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’ మొదలైన చిత్రాల్లో నటించిన అందాలనటి సోనాలి బింద్రే ఇటీవల పెళ్ళి చేసుకుంది. అయినా
మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకుంటోంది. మా ఆయన, అత్తగారు సినిమాలు చేయమంటున్నారు. మంచి పాత్ర లభిస్తే
తప్పకుండా చేస్తాను. అలాగే, నిర్మాణరంగంలోకి కూడా రావాలనుకుంటున్నానని అంటోంది సోనాలి. కేన్సర్ మహమ్మారి
నుండి బయటపడ్డ ప్రముఖ మోడల్, నటి లీసారే ఇప్పుడు పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనాలని ఆశపడుతోంది. ఈ వ్యాధి
జీవితంపై తనకున్న అభిప్రాయాలను, ప్రాధాన్యాలను మార్చేసిందని అంటోంది లీసారే.
|
మన సంస్కృతి ఎటు పోతోందంటున్న కె.విశ్వనాథ్
ఓ చెట్టు కింద ఆరు మోటార్ బైకులు, చుట్టూ నలుగురు ఆకతాయి కురాళ్ళను చూపించి... అమ్మాయిలను ఏడిపించడం
ఎలా? ఉపాధ్యాయులను ఆట పట్టించడం ఎలా? అనే సన్నివేశాలతో కథలు అల్లుకుంటే, మనం జనానికి ఏం
నేర్పిస్తున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్. మన చదువు, సంస్కృతి ఎక్కడికి పోతున్నాయి?
అని ఇప్పటి చిత్రాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
|
రాబోయే మోహన్ బాబు చిత్రం ‘వివేకానంద’?
ఇటీవల ‘ఝుమ్మంది నాదం’ చిత్రాన్ని అందించిన మోహన్ బాబు హీరోగా నటించి చాలా కాలమైంది. త్వరలో మోహన్
బాబు ప్రధాన పాత్రలో ఓ ప్రముఖ దర్శకుడితో ‘వివేకానంద’ అనే చిత్రం ప్రారంభం అవుతుందని వార్తలొస్తున్నాయి.
ప్రముఖ దార్శనికుడు, తత్వవేత్త వివేకానందుడిలానే ఇప్పటి సమాజానికి మంచి మార్గాన్ని చూపించే విధంగా ఈ చిత్రంలో
కథానాయకుని పాత్ర ఉంటుందని అంటున్నారు.
|
ఇంకా ఏడేళ్ళే కీరవాణి ఉంటారు!
ఇప్పుడు నా వయస్సు 49 ఏళ్ళు. మరో ఏడేళ్ళు మాత్రమే నేను సినిమాలకు సంగీతం అందిస్తాను. ఆ తర్వాత సంగీత
దర్శకత్వాన్ని వదిలేస్తాను - అని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత ప్రియులకు చేదు వార్త చెప్పారు. సకాలంలో
పూర్తి చేసి సవ్యంగా విడుదల చేసే చిన్న చిత్రాలకు సైతం సంగీతం అందించడానికి సిద్ధంగా ఉన్నానని కీరవాణి చెప్పారు.
|
------------------------------------------------------ |
సుహాసిని మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్?
అందాలనటి ఐశ్వర్యారాయ్ కి మణిరత్నం అంటే అంతులేని గౌరవం. అదేవిధంగా మణిరత్నం భార్య సుహాసిని అన్నా.... ‘రావణ్’ చిత్రం తమిళ వెర్షన్ చేసేటప్పుడు సుహాసిని ఐశ్వర్యకు చాలా సహకరించింది. ఆ సందర్భంలో వారి మధ్య మంచి స్నేహం కుదిరింది. సుహాసిని సిద్ధం చేసుకున్న లేడీ ఓరియెంటెడ్ కథను ఐశ్వర్యకు వినిపిస్తే చేయడానికి ‘ఓకె’ చెప్పిందని తెలుస్తోంది.
|
చక్రవర్తి దర్శకత్వంలో ‘మనీమనీ మోర్ మనీ’
రాంగోపాల్ వర్మ ‘మనీ’ మంచి విజయాన్ని సాధించింది. అందులో ఖాన్ దాదాగా బ్రహ్మానందం పాత్రకు చాలామంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘మనీ’కి కొనసాగింపుగా ‘మనీమనీ’ వచ్చింది. ఇప్పుడు జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో మూడవ భాగం ‘మనీమనీ మోర్ మనీ’ పేరుతో నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం ఖాన్ దాదాగా పూర్తి కామెడీ చిత్రంగా దీన్నిరూపొందిస్తున్నారు. ‘అనంతపురం’, ‘సర్వం’ అందించిన రఘునాథ్, నరేందర్ దీనికి నిర్మాతలు.
|
శివాజీ ‘బ్రహ్మలోకం’లో మళ్ళీ లయ
పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిన లయ మనసు మాత్రం ఇక్కడే వుంది. అప్పుడప్పుడు షాపుల ఓపెనింగ్స్ లో, టీవి కార్యక్రమాల్లో పాల్గొంటున్న లయ ఇప్పుడు మరోసారి ‘బ్రహ్మలోకం’ చిత్రంతో వెండితెరపై కనిపిస్తోంది. శివాజీ హీరోగా గోళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆదిపరాశక్తి పాత్రలో అతిథి పాత్రను లయ పోషించారు. రాజేంద్రప్రసాద్ ఇందులో బ్రహ్మదేవుడిగా నాలుగు ముఖాలతో కనిపించడం ఇందులో ప్రత్యేకత.
|
రానా గర్ల్ ఫ్రెండ్... సమీరా బోయ్ ఫ్రెండ్
‘లీడర్’తో పరిచయమై ఓ హిందీ చిత్రంలో నటిస్తున్న రానాపై అప్పుడే గాసిప్స్ మొదలయ్యాయి. హిందీ చిత్రంలో చేస్తున్న బిపాసాబసుతో కొన్ని హాట్ సీన్స్ లో రానా జీవించాడని మొదట్లో రాసారు. ఆ తర్వాత శ్రియతో చాలా సన్నిహితంగా వుంటున్నాడని అంటున్నారు. సమీరారెడ్డిని పెళ్ళి గురించి అడిగితే- సింగిల్ గా వున్నాను. బోర్ కొడుతోంది బోయ్ ఫ్రెండ్ లేక. మంచి వ్యక్తి కోసం చూస్తున్నానని- అంటోంది సరదాగా.
|
‘మన్మథబాణం’లో 30ఏళ్ళ కుర్రాడిగా కమల్
రవికుమార్ దర్శకత్వంలో కమల్, త్రిష జంటగా నటిస్తున్న ‘మన్మథన్ అంబు’ (మన్మథబాణం) ప్రధాన భాగం ‘స్టార్ క్రూయిజ్’ ఓడలో చేయడం విశేషం. ఇందులో 30ఏళ్ళ కుర్రాడిగా కమల్ హసన్ రొమాంటిక్ పాత్ర చేస్తున్నారు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలతోపాటు రెండు పాటలు కూడా రాసారు. త్రిషతో కలిసి ఓ పాట కూడా పాడారు.
|
------------------------------------------------------ |
వర్మ ‘‘కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం = అప్పలరాజు’’
సునీల్ హీరోగా రామ్ గోపాల్ వర్మ 12 ఏళ్ళ తర్వాత తెలుగులో ఓ స్ట్రెయిట్ చిత్రానికి దర్శకత్వం
వహిస్తున్నారు. ‘‘కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం = అప్పలరాజు’’ పేరుతో నిర్మించే ఈ చిత్రంలో తెలుగు
చిత్రరంగంలోని హాస్య నటీనటులంతా నటిస్తారు. అమలాపురం నుండి సినిమా తీయడానికొచ్చిన
అప్పలరాజు పడ్డ పాట్లు ఈ చిత్ర కథాంశమని, ‘రక్త చరిత్ర’ తర్వాత దీని షూటింగ్ ప్రారభిస్తామని
వర్మ చెప్పారు.
|
ఆగస్టులో వస్తున్న రవితేజ ‘డాన్ శీను’
‘కిక్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఆర్.ఆర్.మూవీమేకర్స్ సంస్థ మలిలేని గోపీచంద్
దర్శకత్వంలో ‘డాన్ శీను’ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ, శ్రియ జంటగా
నటిస్తున్న ఈ చిత్రం పలుదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. త్వరలో క్లైమాక్స్ పూర్తి చేసుకుని
ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ -
కె.అచ్చిరెడ్డి, సహనిర్మాత : సురేష్ రెడ్డి, నిర్మాత : వెంకట్ |
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఇంటింటా అన్నమయ్య’
ఇటీవల ‘ఝుమ్మంది నాదం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు త్వరలో
‘ఇంటింటా అన్నమయ్య’ అనే చిత్రం నిర్మిస్తారని తెలుస్తోంది. అమెరికా నేపధ్యంలో నడిచే
కథాంశంతో ఉండే ఈ చిత్రంలో నలుగురు ప్రముఖ హీరోలు ప్రధాన పాత్రలు పోషిస్తారట.
|
పేరు మారిన కళ్యాణ్ రామ్ చిత్రం సెప్టెంబర్ లో
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై మల్లి దర్శకత్వంలో ఓ చిత్రం కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. దీనికి మొదట
‘హరే రామ - హరే కృష్ణ’ అని పేరు అనుకున్నారు. అయితే ఇటీవల రామ్ హీరోగా ‘రామ రామ -
కృష్ణ కృష్ణ’ అనే చిత్రం రావడంతో పేరు మారుస్తున్నట్లు కళ్యాణ్ రామ్ చెప్పారు. కళ్యాణ్ రామ్
సరసన సనాఖాన్ నటిస్తున్న ఈ చిత్రంలో శరణ్యా మోహన్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘కిక్’ ఫేమ్
శ్యామ్ కూడా ఇందులో మరో ప్రధాన పాత్రధారి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల
చేయాలనుకుంటున్నారు.
|
పరిశ్రమలో ఐక్యత లేదంటున్న మోహన్ బాబు
పరిశ్రమలో అంతా కలిసికట్టుగా ఉన్నామని అనడం అసత్యం. ఇక్కడ ఎవరికి వారే రాజు, మంత్రి.
పైరసీ విషయంలో ఫిర్యాదు చేసినా నిర్మాతల మండలి నుండి స్పందన లేదు. అక్కడ నిజమైన
నిర్మాతలు ఎంత మంది ఉన్నారు? పైరసీ వల్ల కలిగే ఆవేదన నిజమైన నిర్మాతకే అర్థమవుతుందని
- ఆవేదన వ్యక్తం చేసారు మోహన్ బాబు ‘ఝుమ్మంది నాదం’ పైరసీపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్
లో.
|
------------------------------------------------------ |
ప్రభాస్ - అనూష్క జంటగా లారెన్స్ దర్శకత్వంలో చిత్రం
‘బిల్లా’ జంట ప్రభాస్, అనూష్క మరో చిత్రంలో కనిపిస్తున్నారు. పలువిజయవంతమైన చిత్రాలు
నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లా రావు శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఈ చిత్రం
నిర్మిస్తున్నారు. ‘మాస్’, ‘డాన్’ చిత్రాల దర్శకుడు లారెన్స్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
సమకూరుస్తున్నారు. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ చిత్రం సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్
జరుపుకుంటుంది.
|
వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా చిత్రం
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ సంస్థ వరుణ్ సందేశ్ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తోంది. ఆర్తి అగర్వాల్ సోదరి నిషా
అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. చక్రి సంగీతాన్ని
అందిస్తున్నారు. సమర్పణ : అరిమిల్లి రామకష్ణ, నిర్మాత : కేసన్నపల్లి రాధామోహన్.
|
విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున, రాజమౌళి
రాజమౌళి తండ్రి, పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్
దర్శకత్వంలో మరో భారీ చిత్రం ప్రారంభం అవుతోంది. పూర్తి వివరాలు వెల్లడికాని ఈ చిత్రంలో
నాగార్జున ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని రెండు ఫైట్స్ కు రాజమౌళి
రూపకల్పన చేస్తున్నట్లు చెబుతున్నారు.
|
కోటి మందికి విద్యా కార్యక్రమంలో కరీనా
ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది చిన్నారులకి విద్య అందించాలనే లక్ష్యంతో ‘వన్ గోల్’
ప్రారంభించారు. దీనికి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కేంద్ర మంత్రి అంబికా సోనీ తో
పాటు నందితాదాస్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ నటీమణులు ప్రచార సహకారాన్ని
అందిస్తున్నారు. గొప్ప లక్ష్యంతో చేస్తున్న ఈ కార్యక్రమం నా మనసును కదిలించింది. అందుకే నా
వంతు బాధ్యతగా ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నానని అంటోంది కరీనా.
|
కోమాలో హాస్యనటుడు సుధాకర్
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా
ఉంది. ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి వైద్యం చేస్తున్న సుధాకర్ ప్రస్తుతం కోమాలో ఉన్నారు. అతని
శరీరమంతా ఇన్ఫెక్షన్ వచ్చింది. అది మెదడుకూ వ్యాపించింది. చికిత్సకు అతని శరీరం
స్పందించడం లేదు - అని ‘కేర్’ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
|
------------------------------------------------------ |
కమల్ - రజనీల కాంబినేషన్ లో చిత్రం
గురువు బాలచందర్ చిత్రాల్లో తొలి దశలో కలిసి చేసిన తమిళ సూపర్ స్టార్స్ కమల్ హసన్,
రజనీకాంత్ ఇటీవల ఎందులోనూ కలిసి కనిపించలేదు. బాలచందర్ నిర్మించే చిత్రంలో గానీ,
దర్శకత్వంలో గానీ మళ్ళీ కలిసి చేయడానికి అభ్యతరం లేదని చెబుతున్న వీరి కాంబినేషన్ లో
త్వరలో ఓ భారీ చిత్రం రానుంది. ‘చంద్రముఖి’ చిత్రాన్ని నిర్మించిన శివాజి ప్రొడక్షన్స్ సంస్థ ఈ
చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉంది.
|
ఈతరం ‘‘ఏం పిల్లో - ఏం పిల్లాడో’’ 16 విడుదల
ఉత్తమ చిత్రాల నిర్మాణ సంస్థ ఈతరం ఫిలింస్ 15వ చిత్రం యూత్ ఎంటర్ టైనర్. ఏం పిల్లో -ఏం
పిల్లాడో’ నిర్మించింది. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనీష్, నూతన
నాయిక ప్రణీత జంటగా నటించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. ‘‘ప్రేమించు కోవడానికి
రెండు మనసులే కాదు, కొన్ని వందల మంది ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పే ఈ చిత్రం మా
సంస్థ నిర్మించిన చిత్రాలన్నింటి కన్నా వినోదాత్మకంగా ఉంటుందని’’ - నిర్మాత పోకూరి బాబూరావు
చెప్పారు. ఈ చిత్రాన్ని 16 న విడుదల చేస్తున్నారు.
|
నాగార్జునతో కృష్ణవంశీ, జగపతి - నితిన్ లతో రవికుమార్
‘నిన్నే పెళ్ళాడతా’ కాంబినేషన్ నాగార్జున, కృష్ణవంశీలతో మరో చిత్రం వచ్చే అవకాశాలున్నాయి.
తగిన కథ కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు, నితిన్ హీరలుగా ‘ఏం పిల్లో - ఏం
పిల్లడో’ దర్శకుడు రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఒకరు భారీ చిత్రాన్ని
నిర్మిపస్తున్నారు.
|
నెలాఖరు నుండీ ఎన్.శంకర్ తెలంగాణ చిత్రం
తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో కొత్త వారితో ఎన్.శంకర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఈ
నెలాఖరు నుండి షూటింగ్ జరుపుకుంటుంది. ‘‘నటీనటుల ఎంపిక పూర్తయ్యింది. వారికి రెండు
బృందాలగా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని’’
ఎన్.శంకర్ చెప్పారు.
|
ఇలియానాను ఇబ్బంది పెడుతున్న కొత్త హీరోయిన్లు
కోటి రూపాయల పారితోషికంతో అగ్రనాయికగా ఫుల్ డియాండ్ లో ఉన్న ఇలియానా ప్రభావానికి
కొత్తనాయికలతో ఇబ్బంది ఏర్పడింది. వరుసగా ముంబై నుండి, విదేశాల నుండి వెల్లువెత్తుతున్న
నూతన నాయికలతో చాలా మంది, నటన సంగతి ఎలా వంటి ఉన్నా గ్లామర్ లో మాత్రం మొదటి
వరుసలో ఉన్నాయి. సమంత, తాప్సీ వంటి హీరోయిన్లు ప్రముఖ హీరోలతో చేస్తున్నారు. దాంతో
ఇలియానా ఇప్పుడు - ‘‘పాత్ర బాగుంటే చాలు, పారితోషికం విషయంలో పట్టింపు లేదని’’ అంటోంది.
|
------------------------------------------------------ |
పవన్ కళ్యాణ్ ‘పులి’ ఆగస్టు 12 విడుదల?
సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న పవన్ కళ్యాణ్ ‘పులి’ పాటలు ఈ నెల 11న విడుదలవుతాయి.
ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నికిషా పటేల్ హీరోయిన్ గా సూర్య
దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం హక్కులను గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ స్వంతం చేసుకున్నట్లు
తెలుస్తోంది. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల చేయాలనుకుంటున్నారు.
|
అవకాశాలతో తాప్సీ ఝుమ్మంటోంది
‘ఝుమ్మంది నాదం’లో నాయికగా పరిచయం అయిన మోడల్ తాప్సీ ఆ చిత్రం పరాజయం
పాలైనా, పలు అవకాశాలను మాత్రం స్వంతం చేసుకుంటోంది. ఈ చిత్రంలో తన అందాలతో
ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తాప్సీ ఇప్పుడు విష్ణు, రవితేజ, ప్రభాస్ ల సరసన చేస్తోంది.
తమిళంలో కూడా ఆమె రెండు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా మారింది. |
రాజమౌళితో మహేష్, సపన్ తో నరేష్
‘మగధీర’ వంటి భారీ విజయాన్ని అందించిన రాజమౌళి సునీల్ తో చేసిన ‘మర్యాద రామన్న’
త్వరలో విడుదలవుతోంది. మహేష్ బాబుతో రాజమౌళి ఓ చిత్రం చేసే అవకాశం ఉందని
తెలుస్తోంది. ఇటీవల రాజమౌళి మహేష్ ని కలిసి కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి. ‘పప్పు’తో మంచి
పేరు తెచ్చుకున్న సపన్ పసుపర్తి దర్శకత్వంలో నరేష్ ఓ చిత్రం చేసేందుకు అంగీకరించారు.
|
హన్సిక కు ప్రభుదేవా ప్రశంసలు
తెలుగులో వరుస పరాజయాలతో వెనుకబడి పోయిన హన్సిక ఇప్పుడు తమిళ రంగంలో విజయం
కోసం కృషి చేస్తోంది. ధనుష్ తో ‘మా పిళ్ళై’, విజయ్ తో ‘వేలాయుధం’ చిత్రాలు చేస్తోంది. ఇటీవల
ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న ఓ చిత్రంలో ఆమె పెద్ద వర్షంలో 15 గంటలు విరామం లేకుండా
పని చేసింది. దాంతో ప్రభుదేవా - హన్సిక మంచి నటే కాదు, చిన్న వయసులోనే వృత్తి పట్ల అంకిత
భావం ఉన్న నటి - అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.
|
మరోసారి జాతీయ అవార్డు కోరుతున్న ప్రియమణి
గతంలో ఓసారి జాతీయ ఉత్తమ నటిగా తమిళ చిత్రానికి అవార్డు తీసుకున్న ప్రియమణి ఈ సారి
మలయాళ చిత్రంతో అవార్డు ఆశిస్తోంది. ప్రముఖ నటి శ్రీ విద్య జీవిత కథతో రంజిత్ దర్శకత్వంలో
నటించిన ప్రియమణి ఇప్పుడు అతని దర్శకత్వంలోనే ‘ప్రాచియెట్టన్ అండ్ ది సెయింట్’ అనే మరో
చిత్రం చేస్తోంది. మమ్ముట్టి హీరోగా ఈ చిత్రంతో మరో సారి ఆమె జాతీయ అవార్డు
సాధించాలనుకుంటోంది.
|
------------------------------------------------------ |
పుస్తక రూపంలో రంజిత- నిత్యానంద అనుభవాలు
సంచలనం సృష్టించిన స్వామి నిత్యానందతో రాసలీలల్లో కనిపించిన నటి రంజిత ఇప్పుడు తన
అనుభవాలతో ఓ పుస్తకం రాస్తోంది. నిత్యానందతో పరిచయం ఏర్పడినప్పటి నుండీ శృంగార
దృశ్యాల సిడీలు బయటపడినప్పటి వరకూ ఎదురైన సమస్యలు, అవమానాలు అన్నీ ఇందులో
పొందుపరుస్తున్నానని, ఇది యువతకు ఉపయోగపడుతుందని ఆమె చెబుతోంది. రంజిత
ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోనే వుంది.
|
శ్రీకాంత్ ‘సేవకుడు’లో హీరో కృష్ణ, మంజుల
శ్రీకాంత్, ఛార్మి జంటగా సముద్ర దర్శకత్వంలో సుధాకర్ ‘సేవకుడు’ అనే చిత్రం నిర్మిస్తున్న
విషయం తెలిసిందే. ఇందులో హీరో కృష్ణతో పాటు అతని కుమార్తె మంజుల కూడా నటించడం
విశేషం. కృష్ణగారు ప్రయోజనాత్మక పాత్ర పోషిస్తున్నారని, మంజుల కీలక పాత్ర చేస్తున్నారని
సుధాకర్ చెబుతున్నారు.
|
తప్పుల్ని సరిదిద్దు కోవాలంటున్న అమితాబ్
గతంలో అభిషేక్ నటించిన ‘ఢిల్లీ - 6’ ను విమర్శించారు. ఇప్పుడు ‘రావణ్’ను విమర్శించారు.
ఎందుకని? అంటూ అమితాబ్ ను ప్రశ్నిస్తే - ప్రేక్షకులు డబ్బులు పెట్టి సినిమా చూసేటప్పుడు,
వారికి నచ్చని అంశాలను ఎత్తి చూపుతారు. నాకు సరిగా లేవనిపించిన కొన్ని అంశాలను
చెప్పానంతే. సినిమా ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటాయి. విమర్శలను అర్థం చేసుకుని
ఎవరైనా తప్పుల్ని సరిదిద్దు కోవాల్సిందే - అంటూ చెబుతున్నారు అమితాబ్ బచ్చన్.
|
తమిళ సినిమాలో అసిన్ పై నిషేధం?
ఇటీవల శ్రీలంకలో తమిళులపై జరిగిన దమన కాండకు నిరసనగా తమిళ చిత్ర రంగం ఇటీవల
అక్కడ జరిగిన ‘ఫిల్మోత్సవ్’ ను బహిష్కరించింది. అందులో పాల్గొనే వారిని తమిళనాట
నిషేధిస్తామని హెచ్చరించారు. దాని ప్రకారమే కొన్ని సినిమాలను నిలుపు చేశారు. అయితే,
ఇటీవల ‘రెడీ’ సినిమా షూటింగ్ కి సల్మాన్ తో పాటు శ్రీలంక వెళ్ళిన అసిన్ అద్యక్షుడు రాజ్ పక్సే
ఇచ్చిన విందులో పాల్గొనడంతో ఆమెపై నిషేధం వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
సూర్యుడికి ముందు, వెనకా కమల్ కి తెలుసు
అభిమాన నటుడు కమల్ హసన్ తో ‘మన్మథన్ అంబు’ చిత్రంలో నటిస్తున్న ఆనందంలో త్రిష
అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. సూర్యుడికి ముందు, సూర్యిడికి వెనుక ఉన్న
విషయాలన్నింటి గురించి కమల్ సార్ కి తెలుసు. ఆయనకి అపారమైన పరిజ్ఞానం ఉంది. కమల్
జీనియస్. ఈ సినిమా పూర్తయ్యే లోపు అతని జ్ఞానం నుండి నేను కూడా కొంత నేర్చుకుంటాననే ఆశ
ఉంది - అని అంటోంది త్రిష.
|
------------------------------------------------------ |
జూన్ 15న మహేష్ చిత్రం, దసరాకి ఎన్టీఆర్ చిత్రం...
‘నమో వెంకటేశ’ నిర్మాతలు శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం చేస్తున్న
విషయం తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ 15న ప్రారంభం
అవుతుంది. ‘సింహా’ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రామారావు
ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరాకు ప్రారంభమై సంక్రాంతికి విడుదలవుతుంది.
|
నిత్యానంద స్వామిగా రమేష్ అరవింద్ చిత్రం
ఇటీవల సంచలనం సృష్టించిన నిత్యానంద స్వామిపై కన్నడలో ఓ చిత్రం తయారవుతోంది.
తెలుగువారికి చిరపరిచితుడైన రమేష్ అరవింద్ ఇంధులో స్వామీజీగా నటిస్తున్నారు. గజేంద్ర
అచార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
|
‘టామ్ అండ్ జెర్రీ’, ‘ఊసరవెల్లి’ కాదు ‘రామ్ అండ్ జెన్నీ’
రామ్ హీరోగా ‘కిక్’ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు.
ఇందులో జెనీలియాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మొదట ‘టామ్ అండ్ జెర్రీ’ అనే పేరు
పరిశీలించి, ఆ తర్వాత ‘ఊసరవెల్లి’ అనే పేరు అనుకున్నారు. ఇప్పుడు దాన్ని ‘రామ్ అండ్
జెన్నీ’గా మార్చారు.
|
గ్రీకు పవన్ కళ్యాణ్ ‘ఖుషీగా’, నరేష్ ‘పనిలేని పులిరాజు’
జయంత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా గణేష్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. త్వరలో
ప్రారంభమయ్యే ఈ చిత్రంలో ఓ నాయికగా ‘బోణి’ ఫేమ్ కృతి ఎంపికైంది. దీనికి ‘ఖుషీగా’ అనే పేరు
పరిశీలిస్తున్నారు. నరేష్ హీరోగా మరో చిత్రం ప్రారంభం అవుతోంది. దీనికి ‘పనిలేని పులిరాజు’ అని
పేరు పెడుతున్నారు. ‘బ్రహ్మలోకం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రచయిత గోళ్ళపాపటి
నాగేశ్వరరావు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
|
‘పా’తో పుంజుకున్న అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్
అమితాబ్ బచ్చన్ ఎ.బి.సి.ఎల్. పేరుతో ఒక భారీ చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి పలు భాషల్లో
చిత్రాలు నిర్మించి నష్టపోయారు. ఇప్పుడు అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య సినిమాలతో బిజీగా
వుండడంతో ఇటీవల ‘పా’ నిర్మించి లాభాలు సంపాయించారు. కేవలం డబ్బు కోసమో, లేకుంటే
సేవకోసమో సినిమాలు కాకుండా, అందరూ లాభపడేలా మా సంస్థ చిత్రాలు తీస్తుంది. మాకు
నమ్మకం వున్న కథలతో త్వరలో మరో అయిదు చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో
చేస్తామని- అభిషేక్ బచ్చన్ చెప్పారు.
|
------------------------------------------------------ |
రానా చిత్రం సెల్వతో కాదు గౌతమ్ తో...
‘లీడర్’ రానా ఇప్పుడు ‘దమ్ మారో దమ్’ అనే హిందీ చిత్రంలో చేస్తున్నారు. దీని తర్వాత సెల్వ రాఘవన్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం అనుకున్నారు. అయితే, దీన్ని ప్రస్తుతం పక్కన పెట్టి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రాంభిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా చేస్తుంది. రానా, సమంతాలపై ఇటీవల ఫొటో సెషన్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
|
రవితేజ ‘వీర’లో అనూష్క, తాప్సీ
‘ప్రవరాఖ్యుడు’ నిర్మించిన టాలీ టు హాలీ సంస్థ రవితేజ హీరోగా ‘వీర’ అనే చిత్రం నిర్మిస్తోంది. దీనికి ‘రైడ్’ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనూష్క హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా, ‘ఝుమ్మందినాదం’ నాయిక తాప్సీని కూడా మరో హీరోయిన్ గా తీసుకున్నారు. |
‘సింహా’ నిర్మాతకి మీడియా అంటే చులకన
సూపర్ హిట్ అయిన ‘సింహా’ 50రోజుల వేడుకలో నిర్మాత పరుచూరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత మహేందర్ మీడియవారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో వారు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్ళారు. ఫంక్షన్ అనంతరం ఏర్పాటుచేసిన ఢిన్నర్ను కూడా బహిష్కరించారు. ‘సింహా’ నిర్మాత వ్యవహారశైలిపై బాలకృష్ణ అభిమానులు కూడా అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది.
|
నరేష్ ‘సిల్లీ ఫెలో’, శ్రీధర్ రెడ్డి ‘ఓం మంగళం’
‘బురిడి’ నిర్మాతలు నరేష్ హీరోగా ఇవివి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘సిల్లీ ఫెలో’ అని పేరు పెట్టాలనుకుంటున్నారు. ఇంతకుముందు దీనికి ‘కత్తి కాంతారావు’ అనే పేరును పరిశీలించారు. కొత్తవారితో ‘స్నేహగీతం’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించిన శ్రీధర్ రెడ్డి రెండవ చిత్రంగా ‘ఓం మంగళం మంగళం’ అనే చిత్రం చేస్తున్నారు.
|
‘రాజ్ నీతి’ ప్రకాష్ ఝా దర్శకత్వంలో ‘ద్రౌపది’గా ఏంజలినా?
కత్రినాకైఫ్ నాయికగా ‘రాజ్ నీతి’ నిర్మించి విజయవంతమైన ప్రకాష్ ఝా ఇప్పుడు ద్రౌపది కథతో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందించే ప్రయత్నంలో వున్నారు. గతంలో మాధురీదీక్షిత్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇంగ్లీషులో ఏంజలినా జోలి హీరోయిన్ గా నిర్మించాలనుకుంటున్నారు.
|
------------------------------------------------------ |
ఆగస్టు 22న ‘రోబో’, ‘ఆప్తరక్షక’లో రజనీకాంత్
రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్లో ఐశ్వర్యారాయ్ నాయికగా భారీస్థాయిలో నిర్మించిన ‘రోబో’ ఆగస్టు 22న ప్రపంచవ్యాప్తంగా
అత్యధిక ప్రింట్స్ తో విడుదలవుతోంది. కన్నడలో విజయవంతం అయిన ‘చంద్రముఖి-2’ ‘ఆప్తరక్షక’ తమిళ్ రీమేక్ లో
రజనీకాంత్ నటించడానికి అంగీకరించారట. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో వెంకటేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
|
సాయికిరణ్ పెళ్ళి 24న తిరుపతిలో...
ప్రముఖ గాయకుడు రామకృష్ణ కుమారుడు యువ హీరో సాయికిరణ్ వివాహం 24న తిరుపతిలో జరుగుతుంది.
బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ నిపుణురాలు వైష్ణవిని సాయికిరణ్ వివాహం చేసుకుంటున్నాడు. బెంగుళూరులో 25న,
హైదరాబాద్లో జూలై 3న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
|
జగన్ కు అమితాబ్ తో సినిమా, బాలయ్యతో కథ ‘ఓకె’
బాలకృష్ణ - పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో చిత్రానికి కథ దొరకలేదని, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ లేనట్లేనని ఇటీవల
వార్తలొచ్చాయి. అయితే కోన వెంకట్ చెప్పిన కథ ‘ఓకె’ అయ్యిందట. ఈలోగా ఎబిసిఎల్ బ్యానర్ పై అమితాబ్ బచ్చన్
హీరోగా ఓ చిత్రం జగన్ చేస్తారు. దీనికి ‘బుఢా’ (ముసలాడు) అని పేరు పెడుతున్నారు.
|
సినిమా పంపిణీ రంగంలోకి కత్రినాకైఫ్
ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లు నటనతోపాటు పలు వ్యాపారాలు చేస్తూ రాణిస్తున్నారు. అందులోకి కత్రినాకైఫ్ కూడా
చేరుతోంది. ‘రాజనీతి’ చిత్రంతో మంచినటిగా పేరు సంపాయించిన కత్రినా, ఇప్పుడు సినిమా పంపిణీరంగంలోకి అడుగు
పెట్టాలనుకుంటోంది. అందుకోసం స్నేహితులు, బంధువుల సూచనలు, సలహాలు తీసుకుంటోంది.
|
గర్వపడటానికి ఏం వుంటుంది? అంటున్న అర్జున్
‘ఆర్య-2’ చేస్తున్నప్పుడే నాకు తెలుసు. ఆ చిత్రం ఖచ్చితంగా ‘ఆర్య’ అంత గొప్పగా వుండదని, క్రిష్ తో ‘వేదం’ చేసేందుకు
అంగీకరించినపుడే అనుకున్నాను.... ‘వేదం’ ‘గమ్యం’లా వుండకపోవచ్చని. అయితే, రొటీన్ సినిమాలు చేసుకుంటూ పోతే...
రేపు నేను వెనక్కితిరిగి చూసుకుంటే గర్వపడటానికి ఏముంటుంది?- అని అంటున్నాడు ప్రయోగాత్మకంగా కెరీర్ని
రూపుదిద్దుకుంటున్న యువహీరో అల్లు అర్జున్.
|
------------------------------------------------------ |
రాజమౌళి ‘ఈగ’, రాధాకృష్ణ ‘జనగణమన’
‘మగధీర’ వంటి భారీ విజయాన్ని స్వంతం చేసుకున్న రాజమౌళి ఇప్పుడు సునీల్ హీరోగా ‘మర్యాద రామన్న’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా రాజమౌళి మరో చిత్రం చేయాల్సివుంది. అయితే, ‘ఈగ’ పేరుతో మరో భారీ గ్రాఫిక్స్ చిత్రం చేయడానికి రాజమౌళి సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రముఖ నటీనటులు నటించే ఈ చిత్రంలో ‘ఈగ’ పాత్ర ప్రధానంగా వుంటుందట. ఇక, ‘గమ్యం తర్వాత ‘వేదంతో విజయం సాధించిన రాధాకృష్ణ మరో చిత్రం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి ‘జనగణమన’ అని పేరు పెడతారట.
|
సదాకు కంగుతినిపించిన కన్నడ నిర్మాత
తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి నటిగా నిరూపించుకున్న సదాకు ఇప్పడు అవకాశాలు కరువయ్యాయి. ‘అ ఆ ఇ ఈ’ ఆమె ఆఖరు తెలుగు చిత్రం. దాంతో ఆమె కన్నడరంగం వేపు మళ్ళింది. అక్కడ రెండు మూడు చిత్రాలు చేస్తోంది. అయితే- ‘కన్నడలో రెండోసినిమాతోనే కంగుతిన్నాను. దానికి రావాల్సిన డబ్బు సినిమా పూర్తయ్యేవరకూ ఇవ్వకుండా- రేపు మాపు అంటూ చెప్పి నిర్మాత తప్పించుకున్నారు’ - అని వాపోతోంది సదా.
|
మీడియాతో రవిచంద్రన్ నిర్మాతల వివాదం
రవిచంద్రన్, నమిత, మీరాజాస్మిన్ నటించిన ‘హు’ (పువ్వు) కన్నడ చిత్రం ఇటీవల విడుదలైంది. దీనిపై ‘బెంగుళూరు మిర్రర్’ జర్నలిస్ట్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష రాస్తూ- రవిచంద్రన్, నమితల మధ్య ప్రేమ రెండు గున్న ఏనుగుల మధ్య ప్రేమలా వుందని రాయడంతో- నిర్మాత దినేష్ గాంధీకి కోపం వచ్చింది. శ్యామ్ ప్రసాద్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. దాంతో శ్యామ్ ప్రసాద్ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దినేష్ గాంధీని అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.
|
గ్రీకు నాటకం ఆధారంగా నయనతార ‘ఎలక్ట్రా’
నాకు డబ్బే ప్రధానం కాదు. అలా అయితే ఎన్నో కంపెనీల వారు నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేయమన్నా చేయలేదు- అని అంటున్న నయనతార మలయాళంలో గ్రీకు నాటకం ఆధారంగా నిర్మిస్తున్న ‘ఎలక్ట్రా’లో నటిస్తోంది. నటిగా తనకు మంచి పేరు తెస్తుందని నయనతార భావిస్తున్న ఈ చిత్రంలో ఆమె తల్లిదండ్రులుగా మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దీనికి శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
|
‘సలీమ్’ చౌదరి, ‘వరుడు’ గుణశేఖర్ల స్వంత చిత్రాలు
‘సలీమ్’తో పరాజయం పొందిన వై.వి.ఎస్.చౌదరి ఇప్పుడు స్వంత బ్యానర్ పై ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి మేనల్లుడు తేజ హీరోగా నటిస్తున్నారు. ‘కృష్ణా ముకుందా మురారీ’ అని పేరు పెట్టాలనుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ‘వరుడు’తో పరాజయాన్ని వరించిన గుణశేఖర్ స్వంత బ్యానర్ పై ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించేపనిలో వున్నారు. గతంలో అతను బాలలతో నిర్మించిన ‘రామాయణం’లో సీతగా నటించిన స్మితను ఇందులో నాయికగా పరిచయం చేస్తారని తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
త్వరలో హీరోగా అక్కినేని అఖిల్ రంగప్రవేశం
అక్కినేని వంశం నుండి మరో హీరో త్వరలో వెండితెరపైకి రానున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య
ఇటీవల హీరోగా రంగప్రవేశం చేశారు. ఇప్పుడు నాగార్జున- అమల కుమారుడు అఖిల్ హీరోగా కాబోతున్నాడు. చిన్నప్పుడే ‘సిసింద్రీ’గా చేసిన అఖిల్
ఇటీవల ఆస్ట్రేలియాలో చదువుతోపాటు ఆటలు, నటనలో కూడా శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ‘స్టార్ క్రికెట్ మ్యాచ్’లో మెరుపులు మెరిపించిన అఖిల్
త్వరలో వెండితెర మీద కూడా వెలుగులు విరజిమ్ముతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
|
బాలయ్య - కృష్ణవంశీ కాంబినేషన్లో చిత్రం
బెల్లంకొండ సురేష్ బాలకృష్ణతో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడిగా మొదట అనుకున్నారు. అయితే
పూరి జగన్నాథ్ కథలు బాలయ్యకు నచ్చకపోవడంతో బాలయ్య - జగన్ల చిత్రం ప్రస్తుతానికి లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పుడు కృష్ణవంశీతో ఈ ప్రాజెక్ట్
చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు భోగట్టా. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. |
మీడియా మీద విరుచుకుపడ్డ స్నేహ
ఎందుకో తెలియదు. ఈమధ్య హీరోయిన్లు అంటే మీడియా వేశ్యల్లా చూస్తోంది. ఇదిచాలా దురదృష్టకరం. ఏదిపడితే అది రాసేస్తున్నారు. మాకూ ఓ
కుటుంబం వుంటుందని, ఈ రాతల వల్ల వారు బాధపడతారని కూడా ఆలోచించడంలేదని - ఆవేదన వ్యక్తం చేసింది స్నేహ. నటన కూడా ఉద్యోగం
వంటిదే. ప్రతిచోటా ఉన్నట్లే ఇక్కడ కూడా ప్రేమలు, స్నేహాలు వుంటాయి. కాకుంటే - సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి విషయం
మీడియాలో వచ్చేస్తోంది- అని అంటోంది.
|
అల్లరి నరేష్- ఇవివి చిత్రం పేరు ‘కత్తి కాంతారావు’
‘బెండు అప్పారావు’తో సక్సెస్ ఇచ్చిన ఇవివి - అల్లరి నరేష్ ల కాంబినేషన్లో మరో చిత్రం వస్తోంది. ఇటీవల ఇవివి సత్యనారాయణతో ‘బురిడి’ చిత్రాన్ని
నిర్మించిన నిర్మాతలు ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు. దీనికి ‘కత్తి కాంతారావు’ అని పేరు పెడుతున్నారు.
|
ముంబాయి తారలకు తమిళ నట సంఘం వార్నింగ్
తళుకు బెళుకులతో దక్షిణాది సినిమా వారిని ఆకర్షించి అవకాశాలు చేజిక్కించుకుంటున్న ముంబాయి నటీమణులు దక్షిణాది ఆర్టిస్టుల సంఘాల్లో
మాత్రం సభ్యత్వం తీసుకోవడంలేదు. సమీరారెడ్డి, కాజల్, జెనీలియా, హన్సిక, అనూష్క మొదలైన హీరోయిన్లకు తమిళ నట సంఘం ఈ విషయమై
వార్నింగ్ ఇచ్చింది.
|
------------------------------------------------------ |
కరుణాకరన్ తో రామ్, చంద్రశేఖర్ ఏలేటితో కళ్యాణ్ రామ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఊసరవెల్లి’ అనే చిత్రం చేసు్తన్న రామ్ త్వరలో కృష్ణవంశీ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నాడు. తాజాగా, ‘డార్లింగ్’ దర్శకుడు కరుణాకరన్ తో మరో చిత్రం చేసేందుకు అంగీకరించారని తెలుస్తోంది. దీనిని ‘ఎదురే లేదు’ అనే పేరు పెడతారట. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’ వంటి చిత్రాలు అందించిన చంద్రశేఖర్ ఏలేటి త్వరలో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నాడు. ‘సింహా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
బాలకృష్ణ ‘పరమవీరచక్ర’లో అనూష్క, హన్సిక
దాసరి నారాయణరావు దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ‘పరమవీరచక్ర’ ఇటీవల బాలకృష్ణ పుట్టిన రోజున భారీగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అనూష్క, హన్సిక నటిస్తారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
|
వాస్తవికత లేకనే మన చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయి...
సంఖ్యాపరంగా మన దేశంలో అత్యధిక చిత్రాలు తీస్తునా్న ప్రమాణాల పరంగా అంతర్జాతీయ స్థాయిలో సరితూగడంలేదని ‘‘అసోచాం’’ అభిప్రాయపడింది. వాస్తవికత లోపించడం వల్లనే 95శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయని, మెరుగైన శిక్షణ లేకపోవడమే నాసిరకం చిత్రాలు రావడానికి ప్రధాన కారణమని తెలిపింది. కాకతాళీయంగా మంచి నిపుణులు ఒకచోట చేరటం ద్వారా మంచి చిత్రాలు వస్తున్నాయి తప్ప మిగతావన్నీ నాసిరకంగానే వుంటున్నాయని చెప్పారు.
|
జూలై 16న రాజమౌళి ‘మర్యాద రామన్న’ విడుదల
‘మగధీర’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందించిన రాజమౌళి సునీల్ హీరోగా ఇప్పుడు ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా పూర్తి రొమాంటిక్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని జూలై 16న విడుదల చేయాలనుకుంటున్నారు.
|
‘హిట్లర్’ జీవిత చిత్రంలో అనుపమ్ ఖేర్
భారీ స్థాయిలో ఇంగ్లీషులో ‘హిట్లర్’ జీవిత కథతో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో హిట్లర్ గా అనుపమ్ ఖేర్ నటించడం విశేషం. ఈ చిత్రం కోసం అధ్యయనం చేస్తున్నానని అనుపమ్ చెబుతున్నారు. ఈ చిత్రంలో హిట్లర్ ఉంపుడుగత్తె పాత్రను నేహా ధూపియా పోషిస్తోంది.
|
------------------------------------------------------ |
నాగచైతన్య బ్యాంకాక్, ఎన్టీఆర్ ఈజిప్ట్, అర్జున్ వియత్నాం...
కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఈ నెల 21నుండి బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నాగచైతన్య, కాజల్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘శక్తి’ షూటింగ్ ఈనెల 20నుండి ఈజిప్ట్ లో చేస్తారు. ఎన్టీఆర్, ఇలియానా ఇందులో హీరో హీరోయిన్లు. గీతా ఆర్ట్స్ పతాకంపై వినాయక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘బద్రీనాథ్’ షూటింగ్ వియత్నాంలో చేయాలనుకుంటున్నారు. అల్లు అర్జున్, తమన్నా ఇందులో ప్రధాన పాత్రధారులు.
|
విలువలు లేని సినిమా తీయనంటున్న ‘వేదం’ రాధాకృష్ణ
విలువలు లేకుండా నేను సినిమా తీయను. తదుపరి సినిమా కూడా ఆర్కా మీడియాలోనే చేస్తాను. ఒక మంచి కథ అనుకున్నాను. అందుకు తగ్గ హీరోనే ఎన్నుకుంటాం. దాదాపు పెద్ద హీరోతోనే ఈ చిత్రం వుంటుంది.- అని చెబుతున్నారు. మంచి సినిమాలు ‘గమ్యం’, ‘వేదం’ అందించిన రాధాకృష్ణ, ‘వేదం’ ఇక్కడే కాదు విదేశాలో్ల కూడా మంచి వసూళ్ళు సాధిస్తోంది.
|
‘గగనం’లో నిషా అగర్వాల్, విష్ణుతో తాప్సీ
రాధామోహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ‘గగనం’ కోసం రామోజీ ఫిలిం సిటీలో రెండున్నర కోట్లతో విమానం సెట్ చేసి చిత్రీకరిస్తున్నారు. నాగార్జున హీరో, ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా కాజల్ ని అనుకున్నారు. అయితే కారణాంతరాల వల్ల ఆమె బదులు ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ను ఎంపిక చేశారు. ‘ఝుమ్మందినాదం’ నాయిక తాప్సీ ప్రభాస్ తో ఓ చిత్రం చేస్తోంది. తాజాగా విష్ణువర్థన్ హీరోగా చేసే ఓ చిత్రం కూడా అంగీకరించింది.
|
ముంబైలో త్రిష అందం చిందులేస్తోంది...
దక్షిణాది నుండి ముంబైకి ‘కట్టామీటా’తో వెళ్ళిన త్రిష అక్కడి కల్చర్ కి తగ్గట్టు చాలా స్పీడ్ గా మారిపోతోంది. ‘మాగ్జిమ్’ అనే ఓ మగాళ్ళ పత్రికకు ఇటీవల శ్రియ, కత్రినాకైఫ్, సమీరారెడ్డి, అమృతారావు వంటి నటీమణులు అదరగొట్టే విధానంతో ఫోజులిచ్చారు. ఇప్పుడు వారి దారిలోనే త్రిష కూడా చిట్టిపొట్టి డ్రెస్ లతో అందాలు చిందించింది.
|
కత్రినాకైఫ్ మర్యాద.... బిపాసా ధైర్యం...
‘రాజ్ నీతి’ విజయవంతమై కత్రినాకి మంచి పేరు తెచ్చింది. అయితే, అందులో మరో పాత్ర పోషించిన మనోజ్ బాజ్ పాయ్ కి కూడా చాలా మంచి పేరు వచ్చింది. కత్రినా ఏకంగా ‘మీ నటన సూపర్బ్’ అంటూ మనోజ్ బాజ్ పాయ్ కి పాదాభివందనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదేళ్ళ కిందట బిపాసాబసు ఓ యాడ్ ఫిల్మ్ కోసం టాప్ లెస్ గా నటించింది. దాన్ని ఇప్పుడెవరో నెట్లో పెట్టడం సంచలనం సృష్టించింది. చాలామందిలా ‘‘ఆ ఫిల్మ్ లో వున్నది నేను కాదంటూ’’ బిపాసా దబాయించకుండా, ఆ ఫిల్మ్ చేసింది తనేనంటూ ధైర్యంగా ఒప్పుకుంది.
|
------------------------------------------------------ |
ఎన్టీఆర్ - రాజమౌళి 3డి ‘పాతాళభైరవి’?
గతంలో మూడుసార్లు కలిసి చేసిన ఎన్టీఆర్ - రాజమౌళికి త్వరలో ఓ పౌరాణిక చిత్రం చేయాలని వుందట. మొదట ‘దాన వీర శూర కర్ణ’ రీమేక్ అనుకున్నారు కానీ, ఇప్పుడు ‘పాతాళభైరవి’ చేయాలనుకుంటున్నారట. ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గ్రాఫిక్స్ కి ప్రాధాన్యతనిస్తూ 3-డిలో ఈ చిత్రం చేయాలనుకుంటున్నట్లు, దీనికి తగిన నేపథ్యాన్ని సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
|
రానాతో అయిదేవేల ఏళ్ళనాటి ప్రేమకథ
‘లీడర్’ రానా ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో రానా హీరోగా హిందీ, తెలుగు, తమిళ్ లో ఓ చిత్రం తయారవుతోంది. ‘యుగానికొక్కడు’ రూపొందించిన సెల్వరాఘవన్ దీనికి దర్శకుడు. అయిదువేల ఏళ్ళనాటి ప్రేమకథతో ఈ చిత్రం అత్యంత భారీగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తారు. ఇందులో నటించేందుకు హీరోయిన్ ను ఎంపిక చేసే పని ప్రస్తుతం జరుగుతోంది. |
ఆర్.బి.చౌదరితో మహేష్.... గణేష్ తో ప్రభాస్...
మహేష్ బాబు లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం శింబు హీరోగా లింగుసామి తమిళంలో నిర్మిస్తున్న ఓ చిత్రాన్ని తెలుగులో మహేష్ బాబుతో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మిస్తారు. ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం ప్రారంభం అవుతుంది. దీన్ని నటుడైన నిర్మాత గణేష్ నిర్మిస్తారు.
|
ప్రాధాన్యత గల పాత్రల కోసం శ్రియ ప్రయత్నం
అందాలనటిగా ఇప్పటివరకూ పలు భాషా చిత్రాల్లో నటించిన శ్రియ... ఇప్పుడిప్పుడే పునరాలోచనలో పడిందట. అందాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ఓకె. కానీ, నటిగా నిరూపించుకునే పాత్రలు చేయాల్సిన అవసరం కూడా వుందని గుర్తించిందట. ఇకపై ఏవిపడితే అవి చేయకుండా పెర్ఫార్మెన్స్ కి ప్రాధాన్యత వున్న చిత్రాలే ఎంచుకోవాలనుకుంటోంది. నా అభిమాన నటి హేమమాలినిలా నేను కూడా గొప్ప నటిగా నిలవాలి. నా ఈ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తానంటోంది. శ్రియ.
|
సినిమా ‘సాధన’ తప్పిందంటున్న కమల్ హసన్
సినిమాలకి సంబంధించిన చాలా విషయాలు పట్టించుకోవడం మానేసాం. అందులో ‘రిహార్సల్’ ఒకటి. నాలుగు లక్షలు ఖర్చుచేసే డ్రామాకే రిహార్సల్ చేస్తారు. 40కోట్లు ఖర్చుచేసే సినిమాకి మాత్రం మర్చిపోయారు. సినిమాల పరాజయానికి ‘సాధన’ లేకపోవడం కూడా ఒక కారణం. ప్రస్తుతం మేము చేస్తున్న ‘మన్మథన్ అంబు’ కోసం మళ్ళీ రిహార్సల్ చేస్తున్నాం. దీనివల్ల నిర్మాతకి ఖర్చుతగ్గి, సినిమా క్వాలిటీ పెరుగుతుంది- అని అంటున్నారు కమల్ హసన్. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష నాయిక. మాధవన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
|
------------------------------------------------------ |
బాలయ్య సరసన హన్సిక.... సిద్దూతో సమంత
‘సింహా’ బాలకృష్ణతో త్వరలో దాసరి దర్శకత్వంలో ‘పరమవీరచక్ర’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం
కానున్నాయి. ఇందులో ఓ చిత్రంలో బాలకృష్ణ సరసన హన్సిక నాయికగా చేస్తోంది. ఇక, ఫుల్ డిమాండ్లో వున్న ‘ఏ
మాయచేసావె’ నాయిక సమంత మరో చిత్రం అంగీకరించిందట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ హీరోగా
చేస్తున్నారు.
|
పవన్, వెంకీలతో దిల్ రాజు భారీ చిత్రం
తెలుగులో మల్టీ స్టారర్స్ కి అవకాశం లేదని అనుకుంటుంటాం. అయితే, దిల్ రాజు త్వరలో పవన్ కళ్యాణ్, వెంకటేష్
హీరోలుగా ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. ‘కొత్త బంగారులోకం’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే ఈ చిత్రానికి
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని పేరు పెడుతున్నట్లు సమాచారం.
|
ఠాగూర్ గా అమితాబ్... మూకీలో మోహన్ లాల్
నోబుల్ పురస్కారం అందుకున్న ప్రముఖ బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత కథతో ఓ చిత్రం ఉజ్వల్ ఛటర్జీ
చేస్తున్నారు. జావేద్ అక్తర్ స్క్రిప్ట్ రాస్తున్న ఈ చిత్రంలో బెంగాల్ కే చెందిన ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఠాగూర్
పాత్రను పోషిస్తారు. ‘పుష్పక విమానం’ తర్వాత మలయాళంలో మోహన్ లాల్ హీరోగా మరో మూకీ చిత్రం వస్తోంది. జాన్
మత్తయ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
|
‘డార్లింగ్’లో డిఫరెంట్ గా ట్రై చేసానంటున్న ప్రభాస్
‘డార్లింగ్’లో నా కాస్ట్యూమ్స్ కి మిశ్రమ స్పందన వస్తుందని నాకు ముందే తెలుసు. కొందరు బాగున్నాయని అంటే,
మరికొందరు మరీ క్యాజువల్ గా వున్నాయని తేల్చేశారు. ఎప్పుడూ టైట్ ఫ్యాంట్, టైట్ షర్ట్ వేసుకుని వేసుకుని నాకే బోర్
కొట్టింది. అందుకనే ‘డార్లింగ్’లో అలా డిఫరెంట్ గా ట్రై చేశాను- అని అంటున్నారు ప్రభాస్.
|
‘వేదం’ కోసం అర్జున్, అనూష్కల రాయితీ
మంచి సినిమా కోసం అంతా సహకరించాలి. క్రిష్ ‘వేదం’ కోసం అల్లు అర్జున్, అనూష్క తమ రెగ్యులర్ రెమ్యూనరేషన్ను
పక్కనపెట్టి రాయితీపై పనిచేశారు. అల్లు అర్జున్ ఈ చిత్రానికి ఒక కోటి మాత్రమే తీసుకున్నాడు. అనూష్క రోజుకి రెండు
లక్షలు మాత్రమే తీసుకుందట.
|
------------------------------------------------------ |
అందుకే పూరి జగన్ మంచి సినిమాలు చేయలేదు
పదేళ్ళయ్యింది నేను దర్శకుడినై. కోట్లు సంపాయించాను. కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాను. నా సినిమాల్లో ట్విస్టులు
ఉన్నట్లుగానే.... నా జీవితంలో కూడా ఎన్నో ట్విస్టులున్నాయి. చాలా ఎదురుదెబ్బలు తిని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.
ఇవన్నీ నాలోని క్రియేటివిటీపై ప్రభావం చూపించాయి. అందుకే మంచి సినిమాలు చేయలేకపోతున్నాను- అంటూ
దర్శకుడిగా మంచి హిట్ ఇవ్వలేని తన పరిస్థితిని ఓ ఇంటర్వ్యూలో వివరించారు పూరి జగన్నాథ్.
|
ఆగస్టులో రజనీ - శంకర్ ల ‘‘రోబో’’
రజనీకాంత్ - ఐశ్వర్యారాయ్ జంటగా భారీస్థాయిలో శంకర్ నిర్మించిన ‘రోబో’ (తమిళంలో ‘యంత్రం’) ఆగస్టులో
విడుదలవుతుందని రజనీకాంత్ చెప్పారు. ఒక్కపాట మాత్రమే ఇంకా బ్యాలెన్స్ వుందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు
జరుగుతున్నాయని చెప్పారు. ‘రోబో’ సంతృప్తికరంగా వచ్చింది. విడుదల కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను-
అన్నారు.
|
వరుణ్ సందేష్ ‘కుదిరితే కప్పు కాఫీ’లో సుమ
మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి, శివ నిర్మిస్తున్న ‘కుదిరితే కప్పు కాఫీ’లో వరుణ్ సందేష్ సరసన సుమ
భట్టాచార్యను హీరోయిన్ గా ఎంపిక చేశారు. రమణ సాల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి
తనయుడు యోగీశ్వర్ (సాయి) సంగీతాన్ని అందిస్తున్నారు. యోగీశ్వర్ లండన్ లో సంగీత శిక్షణ పొందాడు.
|
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నారా రోహిత్?
చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి తనయుడు నారా రోహిత్ ఇటీవల ‘బాణం’ చిత్రంలో హీరోగా పరిచయం అయ్యి
ప్రశంసలందుకున్నాడు. రోహిత్ రెండవ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని తెలుస్తోంది. దీనికి ‘ఏ మాయ చేసావె’
దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.
|
తండ్రితోనూ, తమిళంలోనూ అల్లరి నరేష్
కె.విశ్వనాథ్ ‘శుభప్రదం’, వంశీ ‘సరదాగా కాసేపు’ చిత్రాలు చేస్తున్న అల్లరి నరేష్ త్వరలో ‘శంభో శివ శంభో’ దర్శకుడు
సముద్రకని దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. ఇందులో శశికుమార్, అంజలి, కలర్స్ స్వాతి ఇతర పాత్రలు చేస్తారు.
దీన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారు. ‘బురిడీ’ నిర్మించిన బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై తండ్రి ఇవివి
సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్ మరో చిత్రం చేస్తున్నారు. ఇది జూలై 1న ప్రారంభమై సెప్టెంబర్ లో విడుదలవుతుంది.
|
------------------------------------------------------ |
‘సింగమ్’తో రెచ్చిపోయిన అనూష్క
ఇక్కడ గోలీమార్ విడుదలయిన రోజునే తమిళంలో సూర్య హీరోగా మరో పోలీసు చిత్రం ‘సింగమ్’ విడుదలై
విజయవంతమైంది. అనూష్కకు ఈ చిత్రం ద్వారా తమిళంలో మరో మంచి విజయం లభించింది. ‘బిల్లా’లో బికినీతో
ఊరించిన అనూష్క ‘సింగమ్’లో మరో మసాలా పాటలో రెచ్చిపోయిందట. అయితే, ఆమె ఉత్సాహాన్ని సెన్సార్ వారు
చల్లార్చారు. ఆమె అందాలకు కత్తెర పడటంతో తమిళ ప్రేక్షకులు నిరాశ పడ్డారు.
|
గోపీచంద్ హీరోగా రచయిత రవి దర్శకత్వం
‘సత్యం’, ‘కింగ్’, ‘మున్నా’, ‘వరుడు’ వంటి పలు చిత్రాలకు రచన చేసిన బి.వి.ఎస్.రవి త్వరలో దర్శకుడు కాబోతున్నాడు.
అతని తొలిచిత్రంలో గోపీచంద్ హీరోగా చేస్తున్నాడు. గతంలో గోపీచంద్ తో ‘శౌర్యం’ నిర్మించిన భవ్య క్రియేషన్స్ పతాకంపై
ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. |
‘బొమ్మరిల్లు’ కాంబినేషన్ లో మరో చిత్రం
సిద్దార్థ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘బొమ్మరిల్లు’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తిరిగి వీరిద్దరి
కాంబినేషన్ లో మరో చిత్రం ప్రారంభం అవుతోంది. వేణు శ్రీరామ్ దీనికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దిల్ రాజు
ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘బృందావనం’, నాగార్జునతో ‘గగనం’, ప్రభాస్ తో మరో చిత్రం నిర్మిస్తున్నారు.
|
‘సురా’ నష్టపరిహారం కోరుతున్న ఎగ్జిబిటర్లు
విజయ్ తో ఇటీవల నిర్మించిన భారీ చిత్రం ‘సురా’ పెద్ద ఫ్లాప్ కావడంతో ధియేటర్ల వారు తీవ్రంగా నష్టపోయారు. తమకు
నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతని కోరుతున్నారు. గతంలో రజనీ, కమల్ హసన్ చిత్రాలు ఫ్లాప్ అయినప్పుడు కూడా
ధియేటర్ల వారికి కొంత నష్టపరిహారం చెల్లించారు. ‘సురా’ చిత్రం ఘోర పరాజయం వల్ల తమకు 40శాతం పరిహారం
చెల్లించాలని ధియేటర్ల వారు కోరుతున్నారు.
|
‘రాజ్ నీతి’ టెన్షన్ లో కత్రీనా కైఫ్
రాజకీయ నాయకురాలిగా, తొలిసారి తన ‘గ్లామర్ డాల్’ ఇమేజ్ కి భిన్నంగా నటనకు మంచి అవకాశమున్న పాత్ర
పోషించిన కత్రీనా కైఫ్ ‘రాజ్ నీతి’ విడుదల కోసం టెన్షన్ గా ఎదురు చూస్తోంది. ఈ చిత్రం విడుదలై నటిగా తనకు మంచి
మార్కులు పడతాయని ఆమె ఎంతగానో ఆశిస్తోంది. ఈ చిత్రంలో కత్రీనా అర్జున్ రామ్ పాల్ పై దర్శకుడు చిత్రీకరించిన ఓ
హాట్ సన్నివేశాన్ని సెన్సార్ వారు లేపేసారు. తద్వారా ‘ఎ’ సర్టిఫికెట్ ఇబ్బంది తప్పింది.
|
------------------------------------------------------ |
ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో చిత్రం
‘డార్లింగ్’ ప్రభాస్ ఇప్పుడు దశరధ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు నిర్మించే చిత్రంలో చేయాలి. అయితే దాని కన్నా ముందు లారెన్స్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. సెప్టెంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావచ్చు.
|
‘అరుంధతి’ లాంటి సినిమా చేయాలంటున్న త్రిష
నేను ఇంత వరకూ ప్రాధాన్యత లేని పాత్రలు చేయలేదు. నాకు వచ్చిన గుర్తింపు అంతా నా పాత్రల వల్ల వచ్చిందే. నాకు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో చేయాలని ఉంది. అయితే, ‘అరుంధతి’ వంటి సినిమా చేయాలి. అప్పుడే నేను చేసిందుకు.. మీరు చూసినందుకు ఓ విలువ ఉంటుంది - అని తన మనసులోని మాటను చెబుతోంది త్రిష. త్రిష ఇప్పుడు కమల్ హసన్ తో ఓ చిత్రంలో నటిస్తోంది.
|
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్, అజిత్
‘ఏ మాయ చేసావె’ దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు సమీరారెడ్డితో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. దీని తర్వాత ‘ఏ మాయ చేసావె’ హిందీలో చేస్తారు. తమిళంలో నటించిన త్రిషనే హిందీలో కూడా తీసుకోవాలనుకుంటున్నారు. వీటి తర్వాత ప్రముఖ తమిళ హీరో అజిత్ నటించే చిత్రం దయానిధి అళగిరి నిర్మాతగా ప్రారంభం అవుతుంది. విక్రమ్ హీరోగా మరో చిత్రం వచ్చే సంవత్సరం గౌతమ్ మీనన్ చేస్తారు.
|
‘కిల్ బిల్’ వంటి యాక్షన్ చిత్రాలు టబు చేస్తుందట
నేను ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. అయితే నాకు వ్యక్తిగతంగా యాక్షన్ చిత్రాలంటే చాలా ఇష్టం. అయితే, అటువంటి పాత్ర ఇంతవరకూ చేయలేకపోయాను. ‘కిల్ బిల్’, ‘క్రౌచింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్’ వంటి యాక్షన్ చిత్రాలు చేయాలని ఉంది. అటువంటి అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని అంటోంది టబు.
|
‘కాదంటే ఆత్మహత్యే’నని అంటున్న నయనతార
ప్రభుదేవా - నయనతారల ప్రేమ వ్యవహారం తెలిసిందే. అయితే, వీరి ప్రేమను ప్రభుదేవా భార్య రమాలత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నయనతారను పెళ్ళి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. అదే విధంగా, తనను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ నయనతార కూడా హెచ్చరించడంతో ప్రభుదేవా పరిస్థితి అరకత్తెరలో పోకచెక్కలా మారింది.
|
------------------------------------------------------ |
మహేష్ బాబు ‘కలేజా’ తర్వాత ‘పవర్’
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న చిత్రానికి ‘కలేజా’ అనే పేరునే ఖాయం చేసే
అవకాశం ఉంది. అనూష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలవుతుంది. మహేష్ సోదరి
మంజుల శ్రీనువైట్ల దర్శకత్వంలో నిర్మించే చిత్రానికి కథ సిద్ధమవుతోంది. మహేష్ సరసన సమంత నటించే ఈ
చిత్రానికి ‘పవర్’ అని పేరు పెడతారట.
|
తన కోసమే స్క్రిప్టులు రాయాలంటున్న జయప్రద
ప్రముఖ అందాల నాయిక జయప్రద రాజకీయాల్లో ప్రవేశించినా నటన పట్ల అభిరుచిని వదులుకోలేదు.
‘లోకల్ టివి’లో ‘జయప్రదం’ పేరుతో ఓ కార్యక్రమానికి ప్రెజెంటర్ గా ఆమె చేస్తున్న సందర్భంగా మీడియాతో
మాట్లాడుతూ - నది ప్రవహిస్తూ ఓ దారిని సృష్టించుకున్నట్లు నటిగా నేను కూడా కొనసాగుతూనే ఉంటాను.
నా కోసమే స్క్రిప్టులు రాసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. అది అశ్వనీదత్ గారి సంస్థలోనే జరిగితే
బాగుంటుంది. ‘సాగర సంగమం’ వంటి చిత్రంలో చేయాలనే నా కోరికను కె.విశ్వనాథ్ గారే తీర్చాలి - అని
అన్నారు.
|
సుమంత్ - స్వాతిల చిత్రం పేరు ‘తొక్కుడు బిళ్ళ’?
‘అష్టాచెమ్మా’ చిత్రంతో విజయం సాధించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పుడు సుమంత్, స్వాతి జంటగా మరో
చిత్రం చేస్తున్నారు. వినోద ప్రధానంగా ఉండే ఈ చిత్రానికి ‘అష్టాచెమ్మా’ తరహాలోనే ‘తొక్కుడు బిళ్ళ’ అని పేరు
పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
|
దాసరి, పూరి తర్వాత మెహర్ రమేష్ తో బాలకృష్ణ
దాసరి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘పరమవీరచక్ర’ బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10న ప్రారంభం
అవుతుంది. దీనితో పాటే పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుంది. దీని కథా చర్చలు
జరుగుతున్నాయి. ‘శక్తి’ దర్శకుడు మెహర్ రమేష్ తో మరో చిత్రం చేస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు.
|
అగ్రహీరోలకే సమంతా అగ్రతాంబూలం
‘ఏ మాయ చేసావె’తో పరిచయం అయిన సమంతా దక్షిణాది ఐశ్వర్యారాయ్ అనిపించుకోవాలనుకుంటోంది.
అందుకు తగ్గట్టుగానే సినిమాల ఎంపిక కూడా చేసుకుంటోంది. బ్రహ్మానందం కొడుకు గౌతమ్, యువహీరో
నితిన్, మరి కొందరు పాపులర్ హీరోలు ఎంత ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు. సమంతా ఇప్పుడు
ఎన్టీఆర్ తో ‘బృందావనం’, మహేష్ బాబుతో ‘పవర్’, రాజమౌళి - ప్రభాస్ చిత్రంలో నటిస్తోంది.
|
------------------------------------------------------ |
ప్రభాస్ - సమంతా - రాజమౌళి చిత్రం
కె.రాఘవేంద్రరావు నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ఓ భారీ చిత్రం ప్రారంభం అవుతుంది. ఇందులో
ప్రభాస్, సమంతా జంటగా చేస్తారు. చారిత్రాత్మక ప్రేమకథతో ఈ చిత్రం నిర్మిస్తారని తెలుస్తోంది. గ్రాఫిక్స్ కి
ఇందులోనూ ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. |
విజయ్ ‘వేలాయుధం’లో జెనీలియా, హంసిక, స్వాతి.
తమిళ యువ హీరో విజయ్ మరో భారీ చిత్రం చేస్తున్నాడు. జయం రాజా దర్శకత్వం వహించే ఈ
చిత్రంలో జెనీలియా, హంసిక హీరోయిన్లుగా నటిస్తారు. స్వాతి విజయ్ చెల్లెలుగా ఓ ప్రధాన పాత్రను పోషిస్తోంది.
ఈ చిత్రాన్ని ‘దశావతారం’ వంటి భారీ చిత్రాన్ని అందించిన ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. |
‘గుణశేఖర్ వల్లనే గడ్డు పరిస్థితి’ - అంటున్న భానుశ్రీ
‘వరుడు’లో హీరోయిన్ గా పరిచయం అయిన భానుశ్రీ మెహ్రా - ఈ చిత్రంలో హీరోయిన్ కనిపించకుండా
దర్శకుడు గుణశేఖర్ చేసిన ప్రయోగం వల్ల నష్టపోయానని అంటోంది. ఈ ప్రయోగం వల్ల పాపులర్ కాకుండా
పోయానని, అలాగే ఈ చిత్రం పూర్తయ్యే వరకూ వేరే ఏ చిత్రం చేయొద్దన్న నిబంధన వల్ల, వచ్చిన మంచి
అవకాశాలనూ కోల్పోయానని వాపోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ను చూడకుండా హీరో పెళ్ళి చేసుకోవడం
అనేది ఒక అర్థం లేని ఆలోచనగా చెప్పింది. పెళ్ళి చేసుకునే వాళ్ళు ‘‘నలుగురిని చూడాలి - ఒకరిని
పెళ్ళాడాలి’’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది.
|
శశి దర్శకత్వంలో శ్రీదేవి కుమార్తె జాహ్నవి?
శ్రీదేవి - బోనీకపూర్ ల కుమార్తె జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేయాలన్న ఆలోచన ఉంది. ప్రస్తుతం
ఆమెకు నటన, డాన్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నారట. తమిళంలో ప్రతిభావంతుడైన దర్శకుడిగా ఇటీల పేరు
తెచ్చుకున్న శశికుమార్ దర్శకత్వంలో ఆమెను వెండితెరకు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారని,
ఇటీవల శశి్కుమార్ ని ముంబై పిలిపించి ఈ విషయమై మాట్లాడారని అంటున్నారు.
|
దర్శకుడిగా లఘు చిత్రంతో ధనుష్ ప్రాక్టిస్
రజనీకాంత్ అల్లుడు తమిళ హీరో ధనుష్ కి దర్శకుడు కావాలని కోరిక కలిగింది. కథలు సిద్ధం చేసుకోవడంతో
పాటు అనభవజ్ఞులతో సంప్రదింపులు చేస్తున్నాడు. ఇటీవల తన దర్శకత్వంలో ఓ లఘు చిత్రం కూడా తీశాడు.
ఇందులో అతనితో పాటు కన్నడ నటి రమ్య నటించింది. అయితే ఈ చిత్రం కేవలం ప్రాక్టీస్ కోసం తీసిందే తప్ప
ప్రేక్షకుల కోసం కాదని తెలుస్తోంది. |
------------------------------------------------------ |
రెడ్ కార్పెట్ ప్రొడక్షన్స్ రెండు భారీ చిత్రాలు
‘రైడ్’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసిన రవి ఉప్పలపాటి సమర్పణలో రెడ్ కార్పెట్ ప్రొడక్షన్స్
పతాకంపై రెండు భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇందులో ఓ చిత్రంలో వరుణ్ సందేష్, నాని హీరోలుగా
నటిస్తున్నారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి కథ: వెన్నెల
కిషోర్, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కాకర్ల అశోక్, బి.చిన్నికృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ
నిఖిల్ హీరోగా మరో చిత్రం చేస్తున్నారు. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మారం భువనేశ్వర్, నిర్మాత : అనిల్
కుమార్ ఉప్పలపాటి.
|
లింగుసామి, రాజమౌళితో మహేష్ బాబు చిత్రాలు
‘పందెంకోడి’, ‘ఆవారా’ చిత్రాల దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ చిత్రం చేసా్తరని
తెలుస్తోంది. ప్రస్తుతం శింబుతో తమిళంలో లింగుసామి ఓ చిత్రం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో కూడా
ఓ చిత్రం చేసే అవకాశం వున్నట్లు మహేష్ బాబు స్వయంగా ట్టిట్వర్లో చెప్పారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో
నిర్మిస్తున్న చిత్రం పూనెలో జరుగుతున్న షెడ్యూల్ తో పూర్తవుతుంది. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9న
విడుదల చేసే ఆలోచన వుందని అంటున్నారు.
|
జి.తెలుగులో భారీ సీరియల్ ‘అరుంధతి’
ప్రేక్షకాదరణ పొందుతున్న పలు కార్యక్రమాలను అందిస్తున్న జి.తెలుగు ఛానెల్ లో 24నుండి ‘అరుంధతి’
అనే భారీ సీరియల్ ప్రతిరోజూ టెలీకాస్ట్ అవుతుంది. జన్మజన్మల ప్రేమయుద్ధం కథాంశంగా నిర్మిస్తున్నారు. ఈ
సీరియల్ లో మౌనిక, సెల్వరాజ్ జంటగా, వైజాగ్ ప్రసాద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్
సంగీతం అందిస్తున్న ఈ సీరియల్ కి ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.
|
దశరథ ‘ద్రౌపది’, కృష్ణుడు ‘రామదండు’, జెడి-జగపతి....
‘టర్గెట్’ చిత్రాన్ని నిర్మించిన సంగిశెట్టి దశరథ ఇప్పుడు ‘మహాభారతం’లోని ద్రౌపదిని ప్రధానాంశంగా తీసుకుని
ఓ ప్రముఖ నటితో ‘ద్రౌపది’ అనే చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి ‘మిస్టర్ గిరీశం’ దర్శకుడు విశ్వప్రసాద్
దర్శకత్వం వహిస్తారు. రచయిత, దర్శకుడు వేగ్నేష్ సతీష్ దర్శకత్వంలో కృష్ణుడు హీరోగా ‘రామదండు’ అనే
చిత్రం నిర్మిస్తున్నారు. ‘హోమం’, ‘సిద్ధం’ చిత్రాలు కలిసి చేసిన జగపతిబాబు- జెడి చక్రవర్తి ఇప్పుడు మరో
చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు.
|
తమిళంలో తమన్నా స్పీడ్ కి బ్రేక్ పడింది
నెంబర్ వన్ స్థానానికి సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్న తమన్నా... ఈ మధ్య కోటి రూపాయల
పారితోషికానికి ఎదిగిందని వార్తలొచ్చాయి. అబ్బే అటువంటిదేమీ లేదని తమన్నా ఖండించినప్పటికీ విజయ్
తో ఆమె చేసిన ‘సురా’ విజయంతో కోటి రెమ్యునరేషన్ ను నిజం చేసుకోవాలనే తమన్నా ఆశపడింది.
అయితే ‘సురా’ సూపర్ ఫ్లాప్ కావడంతో ఆమె స్పీడ్ కి బ్రేక్ పడింది. ‘కిక్’ ఆధారంగా జయం రవి హీరోగా
తమిళంలో చేస్తున్న ‘తిల్లాలంగడి’పైనే ఆమె ప్రస్తుతం ఆశలు పెట్టుకుంది.
|
------------------------------------------------------ |
మంచు మనోజ్ ‘‘ఊకొడతారా - ఉలిక్కిపడతారా’’
మా నాన్నలాగ రకరకాల పాత్రలు పోషించాలి. అందుకనే ఈ మధ్య విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను - అని అంటున్నారు మంచు మనోజ్. త్వరలో తమిళంలో ఓ చిత్రంలో విలన్ గా చేసు అవకాశం ఉంది. దాన్ని తెలుగులోకి కూడా డబ్ చేస్తారు. ఇప్పుడు నా చిత్రాలు ‘వేదం’, ‘ఝుమ్మంది నాదం’ తర్వాత ఐదుభాషల్లో ‘‘ఊకొడతారా - ఉలిక్కిపడతారా’’ అనే చిత్రం రాజా దర్శకత్వంలో చేయబోతున్నాను అని చెప్పారు.
|
చక్రవర్తి - శివాజి కాంబినేషన్ లో చిత్రం
వీరశంకర్ దర్శకత్వంలో జె.డి.చక్రవర్తి, శివాజీల కాంబినేషన్ లో ఓ చిత్రం రానుంది. ఓ ప్రముఖ హీరో ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తారు. జూలై నుండి ప్రారంభం అయ్యే ఈ చిత్రం వినోద ప్రధానంగా ఉంటుందని వీరశంకర్ చెప్పారు. చెల్లారెడ్డి, త్రినాధ్ ఈ చిత్రానికి నిర్మాతలు.
|
గ్లామర్ పాత్రలతో పనిలేదంటున్న శరణ్య
‘విలేజ్ లో వినాయకుడు’తో తెలుగు తెరకు పరిచయం అయిన మరో మలయాళీ హీరోయిన్ శరణ్య మోహన్ ఇప్పుడు ‘భీమిలి’, ‘హ్యాపీ హ్యాపీగా’, ‘హరేరామ హరేకృష్ణ’లో ప్రముఖ యువ హీరోల సరసన నటిస్తోంది. అయితే తనకు గ్లామర్ పాత్రలంటే ఆసక్తి లేదని శరణ్య చెబుతోంది. ఇక ఎక్స్పోజింగ్ అనేది చేయనుగాక చేయనని అంటోంది. ఆ తరహా పాత్రలకు తను సరిపోనని కూడా చెబుతోంది.
|
రెగ్యులర్ షూటింగ్ లో వెంకటేష్ ‘నాగవల్లి’
కన్నడ నుంది రీమేక్ చేస్తున్న ‘చంద్రముఖి - 2’లో వెంకటేష్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనూష్క, కమలిని ముఖర్జీ, శ్రద్దాదాస్, రిచా గంగోపాద్యాయ, పూనమ్ కౌర్, సుజ హీరోయిన్లుగా చేస్తున్నారు. ‘నాగవల్లి’ అని పేరు పెట్టాలనుకుంటున్న ఈ చిత్రానికి పి.వాసు దర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ విజయనగరం సమీపంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ లో జరుగుతోంది.
|
ఎన్టీఆర్ ‘బృందావనం’లో మరో రీమిక్స్ పాట
ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడితల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘బృందావనం’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల వస్తున్న ఎన్టీఆర్ చిత్రాలకు భిన్నంగా ఇందులో సున్నితమైన ప్రేమ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ పాట ‘‘బృందావనమది అందరిదీ, గోవిందుడు అందరి వాడేలే’’ ఈ చిత్రంలో రీమిక్స్ చేసి జూనియర్ ఎన్టీఆర్ పై చిత్రీకరించారని తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు హీరోగా ఓ చిత్రం ప్రారంభం అయ్యింది. హేమంత్ మధుకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ సంగీతం, ఎస్.గోపాల్ రెడ్డి ఫోటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి ‘వస్తాడు నా రాజు’ అని పేరు పెట్టారు. |
‘గజిని’ యూనిట్ తో సూర్య ‘సెవెంత్ సెన్స్’
సూర్య, అసిన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తిరిగి అదే కాంబినేషన్ లో ‘సెవెంత్ సెన్స్’ అనే చిత్రం ప్రారంభమైంది. సూర్య, అసిన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. |
‘ప్రస్థానం - 2’ ఆలోచనల్లో దేవ్ కట్టా
దేవ్ కట్టా దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘ప్రస్థానం’ విశేష ప్రశంసలు అందుకుంది. ఈ కథాంశాన్ని కొనసాగిస్తూ ‘ప్రస్థానం - 2’ రూపొందించాలని దేవ్ కట్టా ఆలోచిస్తున్నారు. ఒకటి, రెండు చిత్రాలు చేసిన తర్వాత, స్క్రిప్టు సిద్ధం చేసుకుని వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం ప్రారంభించాలని దేవ్ కట్టా అనుకుంటున్నారు.
|
పబ్ కి వెళ్ళడం నేరం కాదంటున్న అసిన్
యువ హీరోయిన్లు త్రిష, శ్రియలు పబ్ లకెళ్ళి తాగి తందనాలాడిన వార్తలు మనం చాలా చూశాం. ఇప్పుడు అందులో అసిన్ కూడా చేరింది. బాలీవుడ్ కి వెళ్ళాక అసిన్ పబ్ కల్చర్ కి బాగా అలవాటు పడిపోయిందట. ఈ విషయమై ఆమెను అడిగితే - బాలీవుడ్ అంటేనే స్పీడ్ కల్చర్. అక్కడ అది తప్పదు. అయినా పార్టీలకి, పబ్ లకి వెళ్తే తప్పేంటి? నా వయసులో పబ్ లకి వెళ్తే నేరం ఏమీకాదు. నా వరకూ నేను చాలా కంట్రోల్ గా ఉంటానని అంటోంది.
|
దర్శకుడవుతున్న ప్రముఖ నిర్మాత బోనీకపూర్
బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అందాలనటి శ్రీదేవి భర్త బోనీకపూర్ దర్శకుడు కాబోతున్నారు. గతంలో ప్రముఖ దర్శకుల దగ్గర అనుభవాన్ని సంపాయించిన బోనీకపూర్ త్వరలో ఓ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. శ్రీదేవితో మరో భారీ చిత్రాన్ని బోనీ నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. బోనీ - శ్రీదేవిల కుమార్తె జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేసే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. |
------------------------------------------------------ |
గోపీచంద్ - బి.గోపాల్ చిత్రం జూన్ 7నుండి
పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన నల్లమలుపు బుజ్జి గోపీచంద్ హీరోగా ఓ చిత్రం
చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 7నుండి
ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. శరత్ కుమార్ తో ‘1977’ చిత్రాన్ని నిర్మించిన దినేష్
కుమార్ దర్శకత్వంలో కూడా గోపీచంద్ ఓ చిత్రం చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
|
‘మాటీవి’లో భారీస్థాయిలో డాన్స్ ‘ఘర్షణ’
ప్రముఖ టీవి ఛానల్ ‘మాటీవి’లో ఇకపై వారాంతాల్లో సినిమాలకు బదులు ‘ఘర్షణ’ పేరుతో భారీ
డాన్స్ కార్యక్రమం ప్రసారం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం 10వేలమంది నుండి 30మందిని
ఎంపిక చేశామని, విజేతలకు కారు, 10లక్షల బహుమతులు ఇస్తామని చెప్పారు. ‘మగధీర’ డాన్స్
షో ప్రారంభం అయ్యే కార్యక్రమానికి మారుతి సుజుకి స్పాన్సరర్ గా వుంటారని చెప్పారు. కౌశల్,
విద్య, జ్యోతి ఈ కార్యక్రమానికి మెంటర్స్ గా వ్యవహరిస్తారు.
|
బాలకృష్ణ - పూరి చిత్రంలో త్రిష, శ్వేతాబసు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా త్వరలో ప్రారంభం అవుతున్న చిత్రంలో
హీరోయిన్ గా త్రిష, మరో హీరోయిన్ గా శ్వేతాబసు ప్రసాద్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ప్రముఖ
నిర్మాత ఎం.ఎస్.రాజు తన కుమారుడు సుమంత్ ను హీరోగా పరిచయం చేస్తున్న చిత్రంలోనూ
శ్వేతాబసును హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలొచ్చాయి.
|
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్, మహేష్ - పూరి కాంబినేషన్స్
‘పోకిరి’ కాంబినేషన్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ లతో ఓ చిత్రం ప్లానింగ్ జరుగుతోందని
వినిపిస్తోంది. అలాగే ‘జల్సా’ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల జంట కూడా మరో చిత్రం
చేస్తున్నారని అంటున్నారు. ఈ రెండు చిత్రాలకు ప్రస్తుతం సబ్జెక్ట్ వర్క్ జరుగుతోందట.
|
బాబాయ్ పాటకు అబ్బాయి ‘మెరుపు’ డాన్స్?
‘మగధీర’లో తండ్రి పాట రీమిక్స్ లో డాన్స్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్
పాటకు డాన్స్ చేస్తారని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇప్పుడు ధరణి దర్శకత్వంలో ‘మెరుపు’ చిత్రంలో
నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - ధరణి కాంబినేషన్ లో వచ్చిన ‘బంగారం‘లో పాపులర్ సాంగ్
‘రారా బంగారం‘ పాటను రీమిక్స్ చేసి ‘మెరుపు‘లో ఉపయోగిస్తారని తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
పవన్ కళ్యాణ్ - వినయక్ ల ‘కత్తి’
పవన్ కళ్యాణ్ ‘పులి’ త్వరలో విడుదలవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మించే చిత్రం
తర్వాత, వినాయక్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో భారీ చిత్రం చేస్తున్నారు. యూనివర్సల్
మీడియా పతాకంపై దానయ్య నిర్మించే ఈ చిత్రానికి ‘కత్తి’ అని పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది.
|
ఎన్టీఆర్ - బోయపాటి, నాగచైతన్య - భాస్కర్ ల కాంబినేషన్
‘సింహా’తో పెద్ద హిట్ కొట్టిన బోయపాటి శ్రీనుకు చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్
హీరోగా తదుపరి చిత్రం చేసేందుకు శ్రీను అంగీకరించారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు
దీన్ని నిర్మిస్తారు. నాగచైతన్య హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో మరో చిత్రం ప్లానింగ్
జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత ఎవరనేది త్వరలో తెలుస్తుంది.
|
సూర్య- పూరి -వర్మల ‘ది బిజినెస్ మ్యాన్‘
మాఫియా కథలు తెరకెక్కించడంలో పేరుపొందిన వర్మ ఇప్పుడు ‘ది బిజినెస్ మ్యాన్’ పేరుతో
మరో చిత్రం చేస్తున్నాడు. దీనికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడం విశేషం. సూర్య హీరోగా
నటించే ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగులో నిర్మిస్తారు. ‘పేలే తుపాకీకి వాదోపవాదాలు అవసరం
లేదు’ అని నమ్మే వ్యక్తి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం అవుతుంది.
|
సురేందర్ రెడ్డి పెళ్ళి మే 28న
‘కిక్’ దర్శకుడు సురేందర్ రెడ్డి పెళ్ళి కొడుకవుతున్నాడు. ఈ నెల 28న హైదరాబాద్ లో అతని
పెళ్ళి జరుగుతోంది. సురేందర్ దర్శకత్వంలో రామ్ హీరోగా ‘ఊసరవెల్లి’ త్వరలో ప్రారంభం
అవుతోంది. దీని తర్వాత మహేష్ బాబుతో మరో చిత్రం చేసే అవకాశం వుంది.
|
నాగార్జున - సి.కళ్యాణ్, జగపతి - శ్రీనివాసరాజుల చిత్రాలు
బాలకృష్ణ- దాసరి కాంబినేషన్ లో ‘పరమ వీరచక్ర’ చిత్రాన్ని నిర్మిస్తున్న సి.కళ్యాణ్... దీని తర్వాత
మరో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున హీరోగా ఈ చిత్రం చేస్తున్నారు. దీనికి సబ్జెక్ట్
సిద్ధం చేస్తున్నారు. ఇక జగపతిబాబు హీరోగా మరో చిత్రం ప్రారంభం అవుతోంది. దీన్ని భీమవరం
శ్రీనివాసరాజు నిర్మిస్తున్నారు.
|
------------------------------------------------------ |
అచ్చిరెడ్డి, విజయభాస్కర్ ల కాంబినేషన్ లో చిత్రం
పలు విజయవంతమైన చిత్రాలు అందించిన మనీషా ఫిలింస్ కు నిర్మాతగా, ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కు సమర్పకుడిగా వ్యవహరించిన కె.అచ్చిరెడ్డి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావు వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు కె.విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ సంస్థ తొలి చిత్రం ప్రారంభిస్తోంది. ఈ చిత్రంలో ఆది అనే నూతన హీరోని పరిచయం చేస్తున్నారు. |
నిర్మాతగా కొత్తవారిని నమిత ప్రోత్సహిస్తుందట
తెలుగుతో ప్రారంభించి ఇప్పుడు తమిళభాషలో ప్రముఖ సెక్సీ నటిగా రాణిస్తున్న నమిత ఇటీవల ఘన విజయం సాధించిన ‘సింహ’లో ఓ పాత్రను పోషించింది. త్వరలో నమిత నిర్మాతగా మారాలనుకుంటోందట. మొదట తమిళంలో, ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనతో ఆమె కథలు కూడా వింటోందట. తను నిర్మించే చిత్రాల్లో కొత్తవారిని పోత్సహించాలని నమిత యోచిస్తోంది. |
తాగి తందనాలాడుతున్న యువహీరో నవదీప్
యువహీరో నవదీప్ చాలా సినిమాల్లో చేసినప్పటికీ అవి విజయానికి ఆమడ దూరంలోనే వుండిపోయాయి. దాంతో ఎప్పుడు చూసినా హైదరాబాద్ పబ్ లలోనే నవదీప్ కనిపిస్తున్నారు. ఇప్పుడు తాగి కారు నడుపుతూ హంగామా సృష్టించారు. వేగంగా వెళ్తున్న అతని కారుని అడ్డుకోవాలని ప్రయత్నించిన పోలీసులను తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు అరెస్టయి బెయిల్పై బయటపడ్డాడు.
|
‘రామరామ - కృష్ణకృష్ణ’కు ఎన్టీఆర్, ‘అప్పు’కు నరేష్....
‘జల్సా’ చిత్రం నేపథ్యంలో మహేష్ బాబు గొంతు మనకు వినిపిస్తుంది. ఇటీవల ‘మరోచరిత్ర’లో ప్రకాష్ రాజ్, ‘వరుడు’లో చిరంజీవి అలానే వినిపించారు. ఇప్పుడు దిల్ రాజు ‘రామరామ - కృష్ణకృష్ణ’లో ఎన్టీఆర్ గొంతు మనం వింటాం. అలాగే, కృష్ణుడు హీరోగా చేస్తున్న ‘అప్పు’లో అల్లరి నరేష్ కూడా మనకు వినిపిస్తాడు.
|
రామ్ చరణ్ తో అశ్వనీదత్ ‘జగదేకవీరుడు-2’
‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ సూపర్ హిట్ అయ్యి ఇప్పటికి ఇరవై ఏళ్ళయ్యింది. త్వరలోనే ‘జగదేకవీరుడు-2’ నిర్మిస్తానని నిర్మాత అశ్వనీదత్ ప్రకటించాడు. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తారని, కరుణాకరన్ దర్శకత్వం వహించే అవకాశం వుందని అంటున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే అవకాశం వుంది. |
------------------------------------------------------ |
రాజమౌళి - బాలకృష్ణ, రామ్ చరణ్ - అల్లు అర్జున్...
చాలా ఏళ్ళ తర్వాత ‘సింహా’తో బాలకృష్ణ ఘన విజయాన్ని స్వంతం చేసుకున్నారు. ఇప్పుడు దాసరితో ‘పరమవీరచక్ర’, పూరిజగన్నాధ్
తో మరో చిత్రం చేస్తున్నారు. అయితే ‘మగధీర’ దర్శకుడు రాజమౌళితో ఓ చిత్రం బాలకృష్ణ చేస్తున్నారంటూ ఓ వార్త ఆసక్తికరంగా
మార్కెట్లోకి వచ్చింది. అదే విధంగా చిరంజీవి కుటుంబంలోని యువహీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కలిసి ఓ చిత్రంలో
చేస్తున్నారంటూ మరో వార్త వచ్చింది. ‘చరణ్ - అర్జున్’ పేరుని అల్లు అరవింద్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేశారు. అయితే, ఇప్పట్లో
బాలకృష్ణ - రాజమౌళి చిత్రంగానీ, ‘చరణ్ - అర్జున్’ కానీ ప్రారంభం అయ్యే అవకాశమేదీ లేదు.
|
బోయపాటి శ్రీనుకి, ‘ఆరెంజ్’కి భలే డిమాండ్
‘సింహా’తో దర్శకుడిగా హ్యాట్రిక్ సాధించిన బోయపాటి శ్రీనుకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 8 మంది ప్రముఖులు అతనికి
అవకాశం ఇచ్చారని, ఒకరు బ్లాంక్ చెక్ ఆఫర్ చేశారని చెప్పుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆరెంజ్’ చిత్రం కూడా సాటిలైట్
హక్కుల విషయంలో సంచలనాత్మక ఆఫర్ ని స్వంతం చేసుకుందట.
|
కళ్యాణ్ రామ్ ‘హరేరామ - హరేకృష్ణ’ ప్రోగ్రెస్
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ ‘హరేరామ -
హరేకృష్ణ’ అనే చిత్రం చేస్తోంది. మల్లిఖార్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విశేషాలు బయటికి రానప్పటికీ, రెగ్యులర్ షూటింగ్
జరుపుకుంటోంది
|
మమతా మోహన్ దాస్ ప్రేమలో పడిందట
ఇటీవల ‘కింగ్’, ‘కేడి’ చిత్రాల్లో నటించిన మమతా మోహన్ దాస్ కు ఇక్కడ మంచి విజయాలు, తగినన్ని అవకాశాలు రాక పోవడంతో
మాతృభాష మలయాళంపై ఇటీవల దృష్టి పెట్టింది. ఓ మలయాళ చిత్రంలో ఆమెతో నటిస్తున్న ఇటలీ నటుడు విన్సెజో బోసిరెల్లి తో ఆమె
ప్రేమలో పడిందని కొన్ని పత్రికలు రాసాయి.
|
కమల్ హసన్ - త్రిషల చిత్రం ‘కారుణ్యం’
‘దశావతారం’ రవికుమార్ దర్శకత్వంలో కమల్ హసన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘కారుణ్యం’ అని పేరు పెడుతున్నారు. ఇందులో
కమల్ తో తొలిసారి త్రిష హీరోయిన్ గా నటించడం విశేషం. ‘త్రి ఇడియట్స్’ మాధవన్ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
|
------------------------------------------------------ |
వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ‘సావిత్రి’
‘జయం’ దర్శకుడు తేజకు ఇటీవల చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ‘అటు - ఇటు’ అనే ప్రాజెక్ట్ కొత్త వాళ్ళతో చేయాలనుకున్నా
జరగలేదు. ఇప్పుడు మరో మంచి కథను వెంకటేష్ కోసం సిద్ధం చేశారని తెలుస్తోంది. దీనికి ‘సావిత్రి’ అని పేరు పెడతారట.
|
చక్రవర్తి దర్శకత్వంలో హీరోగా నితిన్
‘హోమం’, ‘సిద్ధం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన నటుడు జె.డి.చక్రవర్తి ఇప్పుడు మరో చిత్రం ప్రారంభిస్తున్నారు. ‘ఆవహం’
చిత్రాన్ని అందించిన ప్రశాంత్ బుర్రా నిర్మించే ఈ చిత్రంలో నితిన్ హీరోగా చేస్తారు. ఇది మూడు దేశాల్లో జరిగే ప్రేమ కథ,
ఎక్కువగా అమెరికాలో జరుగుతుంది. సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది - అని చక్రవర్తి చెప్పారు.
|
సూర్య హీరోగా పూరి జగన్నాథ్, వర్మల చిత్రం
ప్రముఖ తమిళ హీరో సూర్యతో హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రాంగోపాల్ వర్మ ఓ చిత్రం నిర్మిస్తారని, దీనికి పూరిజగన్నాథ్
దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. ఇంతకు మందు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో అమితాబ్ హీరోగా ‘బుఢా’ అనే హిందీ
చిత్రాన్ని వర్మ నిర్మిస్తారని అనుకున్నారు. త్వరలో ఎన్టీఆర్ హీరోగా నల్లమలుపు బుజ్జి నిర్మించే చిత్రానికి పూరి జగన్నాథ్
దర్శకత్వం వహిస్తారు.
|
పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అనూష్క
‘లవ్ ఆజ్ కల్’ హింతీ చిత్రం ఆధారంగా తెలుగులో పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి జయంత్ సి పర్జాని దర్శకత్వం
వహిస్తున్నారు. గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాయికగా అనూష్క ఎంపికయ్యింది. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్
విదేశాల్లో ప్రారంభం అవుతుంది.
|
వై.వి.ఎస్. చౌదరి చిత్రంలో చిరు మేనల్లుడు
చిరంజీవి మేనల్లుడు తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి స్వీయ
దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో తేజ్ హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం వెస్టిండీస్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
|
------------------------------------------------------ |
కాంగ్రెస్ తో రాజకీయాల్లోకి కుష్బూ
‘పెళ్ళికి ముందు సెక్స్’ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి కుష్బూపై దాఖలైన 22 కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. కుష్బూ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి. ఆమెకు భావస్వేచ్ఛ ఉందని- కోర్టు చెప్పింది. ‘పెళ్ళికి ముందు సెక్స్’ విషయంలో తను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే వున్నానంటూ కోర్టు తీర్పు తర్వాత కుష్బూ ప్రకటించింది. కుష్బూ త్వరలో తమిళనాడు రాజకీయాల్లోకి రానుందని, కాంగ్రెస్ పార్టీలో చేరనుందని తెలుస్తోంది. |
విలక్షణ కథ, కథనమే రాధాకృష్ణ ‘వేదం’
‘గమ్యం’ వంటి కొత్త ఆలోచనాత్మక చిత్రం అందించిన రాధాకృష్ణ ఇప్పుడు చేస్తున్న ’వేదం‘లో కూడా కథ, కథనం విలక్షణంగా వుంటుందని తెలుస్తోంది. బాక్సాఫీస్ ఫార్ములాకు భిన్నంగా ఈ చిత్రం వుంటుంది. అయినా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోగలననే నమ్మకంపై రాధాకృష్ణ వున్నారు. ఇందులో కేబుల్ రాజుగా అల్లూ అర్జున్, విజయ్ చక్రవర్తిగా మంచు మనోజ్, అమలాపురం సరోజగా అనూష్క నటిస్తున్నారు. సీతారామశాస్త్రి సాహిత్యం, కీరవాణి సంగీతం ఇందులో ప్రత్యేకత. |
‘బాడీగార్డ్’ షూటింగ్ లో అసిన్ కు ప్రమాదం
మలయాళంలో విజయవంతం అయిన ‘బాడీగార్డ్’ చిత్రాన్ని తమిళంలో విజయ్, అసిన్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కరైకుల్ లో జరుగుతున్నపుడు షాట్ గ్యాప్ లో అసిన్ తన కెరావ్యాన్ లోకి వెళ్ళింది. చాలా సేపటివరకూ రాకపోయేసరికి తలుపు తెరిచి చూస్తే అసిన్, ఆమె తండ్రి, మేకప్ మెన్ సృహతప్పి వున్నారు. వ్యాన్ లో గ్యాస్ లీక్ అవడం వల్ల అలా జరిగినట్లు యూనిట్ వారు చెబుతున్నారు.
|
‘పయ్యా’ హిట్ తో కోటికి చేరిన తమన్నా
‘హ్యాపీడేస్’ నుండి కెరీర్ హ్యాపీగా మారిపోయిన తమన్నా ఈమధ్య పలువురు పాపులర్ హీరోలతో సినిమాలు చేసింది. సూర్య తమ్ముడు కార్తితో తమన్నా నటించిన ‘పయ్యా’ మంచి విజయం సాధించడంతో ఆమె ఇప్పుడు తన పారితోషికం కోటికి పెంచిందని అంటున్నారు. ప్రస్తుతం తమన్నా తమిళం, తెలుగులో రెండేసి చిత్రాలు చేస్తోంది.
|
సినిమా - క్రికెట్ ల కొత్త బంధం
క్రీడారంగానికీ, కళారంగానికీ అనుబంధం ఇప్పటిది కాదు. పటౌడి - షర్మిలా ఠాగూర్ నుండి దీపిక- యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ - గీతా బస్రా, సుస్మితాసేన్ - వాసిమ్ అక్రమ్, లక్ష్మీరాయ్ - శ్రీకాంత్ లతో ఇప్పుడు మరో జంట చేరింది. అసిన్ - ధోనీలు ఈమధ్య ఓ యాడ్ ఫిల్మ్ లో కలిసి చేసారట. అప్పటినుండీ వారిమధ్య స్నేహం బాగా ముదిరిందని అంటున్నారు. ధోనీ పుట్టినరోజున కూడా అసిన్ హాజరైందట. |
------------------------------------------------------ |
మహేష్ బాబుతో టాలీ టు హాలీ ‘నందలాల’
త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం పూర్తికావచ్చిన దశలో మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో మరో చిత్రం ప్రారంభం అవుతోంది. ఇందులో ‘ఏ మాయ చేసావె’ నాయిక సమంత హీరోయిన్ గా చేస్తోంది. గతంలో ‘ఆ ఒక్కడు’, ‘ప్రవరాఖ్యుడు’ చిత్రాలు నిర్మించిన టాలీ టు హాలీ సంస్థ నిర్మించే మరో చిత్రం మహేష్ బాబు అంగీకరించారని అంటున్నారు. గతంలో మహేష్ తో ‘మిర్చి’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తారనుకున్న జాస్తి హేమాంబర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి ‘నందలాల’ అని పేరు పెట్టారని వార్తలొచ్చాయి. టాలీ టు హాలీ ప్రస్తుతం రవితేజతో ‘వీర’ చిత్రం ప్రారంభిస్తోంది.
|
కమలిని ముఖర్జీ దర్శకత్వం చేస్తుందట
ఇటీవల సినిమాలు సన్నగిల్లిన ‘ఆనంద్’ నటి కమలిని ముఖర్జీ ఇప్పుడు దర్శకత్వం వేపు దృష్టి మళ్ళించింది. అందుకోసం ఇప్పటినుండే సన్నాహాలు చేస్తోందట. తను చేస్తున్న చిత్రాల దర్శకుల నుండి దర్శకత్వపు మెళుకువలు నేర్చుకుంటోందట. కమలిని తెలుగులో రాజశేఖర్ తో ‘మా అన్నయ్య బంగారం’, వెంకటేష్ తో ‘చంద్రముఖి-2’ చిత్రాల్లో నటిస్తోంది.
|
నాగచైతన్య కామాక్షి చిత్రం 15న, గీతా ఆర్ట్స్ 19న...
‘ఏ మాయ చేసావె’తో విజయం సాధించిన నాగచైతన్యతో ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభం అవుతున్నాయి. ఇటీవల ‘కే.డి’ చిత్రం నిర్మించిన కామాక్షి మూవీస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో ఓ చిత్రం మే 15న ప్రారంభం అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించే చిత్రం మే 19న ప్రారంభం అవుతుంది. కామాక్షిలో కాజల్, గీతా ఆర్ట్స్ లో తమన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు.
|
నాగార్జున - ప్రకాష్ రాజ్ ల చిత్రం ‘గగనం’
విమానం హైజాక్ కథాంశంతో రాధామోహన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో నాగార్జున - ప్రకాష్ రాజ్ లు నాయక, ప్రతినాయక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో దిల్ రాజు, తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గగనం’ అని పేరు పెట్టినట్లు నాగార్జున ‘ట్విట్టర్’లో తెలిపారు.
|
‘వరుడు’లో విలన్ ఆర్యకు కోటీ పాతిక లక్షలు
‘వరుడు’లో విలన్ గా చేసిన తమిళ హీరో ఆర్యకు కోటీ పాతిక లక్షలు పారితోషికం ఇచ్చారట. ‘నమో వెంకటేశ’లో నటించినందుకు బ్రహ్మానందం 80లక్షలు తీసుకున్నారట. చిత్ర నిర్మాణంలో ఖర్చులు తగ్గించుకునేందుకు పూనుకున్న పరిశ్రమ ప్రముఖుల సమావేశాల్లో ఇటువంటి భారీ పారితోషికాల వివరాలన్నీ బయటపడుతున్నాయి.
|
------------------------------------------------------ |
అతనికి బ్రహ్మానందం... నిర్మాతకి నిత్యనరకం
చిత్రం నిర్మాణంలో అదుపు లేకుండా పెరిగిపోతున్న వ్యయాన్ని నియంత్రించడానికి వేసిన కమిటీ ప్రతిరోజూ
సమావేశమై సమస్యలపై చర్చిస్తోంది. అన్ని విషయాలపై సమగ్రంగా పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకున్న
తర్వాతనే పెద్ద చిత్రాల ప్రారంభోత్సవాలు జరపాలని అనుకుంటున్నారని తెలిసింది. అలాగే ప్రముఖ హాస్య
నటుడు బ్రహ్మానందం డిమాండ్లు, అతను హాజరయ్యే సమయం, నిర్మాతలకి కలిగిస్తున్న ఇబ్బందుల విషయం
కూడా వాడివేడిగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
|
దగ్గుబాటి రానా సరసన హీరోయిన్ కావాలి
‘లీడర్’తో పరిచయం అయిన రామానాయుడు మనవడు రానా ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో చేస్తున్నాడు.
త్వరలో ‘యుగానికొక్కడు’ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేస్తాడు.
సురేస్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రంలో రానా సరసన నటించడానికి నూతన నటిని తీసుకుంటున్నారు.
అమాయకంగా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, నటనా ప్రతిభగల నూతన నటీమణులు ఫోటోలతో
రామానాయుడు స్టూడియోస్ లో సంప్రదించ వచ్చును.
|
ప్రియమణి, అసిన్ లకు తల్లిగా అందాల రోజా
దక్షిణాది భాషల్లో వందకుపైగా చిత్రాల్లో నటించి రాజకీయ రంగంలో కూడా పని చేసిన ప్రముఖ నటి రోజా తిరిగి
సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ‘శంభో శివ శంభో’లో చేసిన రోజా పూరిజగన్నాధ్ చిత్రం ‘గోలీమార్’లో నాయిక
ప్రియమణి తల్లిగా నటిస్తోంది. మలయాళ చిత్రం ‘బాడీగార్డ్’ తమిళ రీమేక్ లో నాయిక అసిన్ తల్లిగా చేసేందుకు
కూడా అంగీకరించింది.
|
‘జి.తెలుగు’ ఛానెల్ లో ప్రభాకర్ ‘థ్రిల్’
ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో జి.తెలుగు ఛానెల్లో ‘థ్రిల్’ అనే ఫన్ రియాలిటీ షో ప్రసారం
కానుంది. ఈ నెల 28 నుండి ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్ అయ్యే ఈ కార్యక్రమంలో టివి తెరపై
కనిపిస్తున్న ప్రముఖ నటీనటులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించడం మరో విశేషం.
|
ఆగస్టు 15న ఎన్టీఆర్ ‘బృందావనం’
ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘బృందావనం’ ఆగస్టు 15న
విడుదలవుతుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రధాన పాత్ర పోషించారు. ‘ఏ
మాయ చేసావె’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత ఈ చిత్రంలో ఓ కథానయికగా చేయడం విశేషం.
|
------------------------------------------------------ |
దాసరి - బాలకృష్ణ కాంబినేషన్ లో సి.కళ్యాణ్ చిత్రం
ఎన్టీఆర్ తో సూపర్ హిట్ చిత్రాలు చేసిన దాసరి నారాయణరావు బాలకృష్ణ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం
వహిస్తారని ఎప్పటి నుండో వినిపిస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు తెరపైకి రానుంది. బాలకృష్ణ హీరోగా
దాసరినారాయణరావు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ‘దక్షిణ భారత
చలన చిత్ర వాణిజ్య మండలి’ ప్రముఖుడు సి.కళ్యాణ్ నిర్మిస్తారు. |
జేమ్స్ బాండ్ కీ కష్టాలు తప్పలేదు
అత్యంత భారీ చిత్రాలకు ‘జేమ్స్ బాండ్’ చిత్రాలు పెట్టింది పేరు. ‘జేమ్స్ బాండ్’ సిరీస్ లో 23వ చిత్రం షూటింగ్
ప్రారంభమై ఆగిపోయింది. ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ ‘ఎం.జి.ఎం స్టూడియోస్’ అప్పుల ఊబిలో కూరుకు పోవడంతో
ఈ చిత్రానికి నిధుల సమస్య వచ్చింది. ఈ సమస్యను అధిగమించే వరకూ ఈ చిత్ర నిర్మాణం నిలిపేస్తున్నట్లు
నిర్మాతలు విల్సన్, బ్రొకోలి ప్రకటించారు. ఇందులోనే బాండ్ గర్ల్ గా ఫ్రిదా పింటో నటిస్తోంది. |
రీమాసేన్ తో ముద్దు ముచ్చట 30సార్లు
‘యుగానికొక్కడు’ నాయిక రీమాసేన్ ‘సొసైటీ’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో యువ హీరో రాజ్ వీర్
సింగ్ రీమా బుగ్గపై ముద్దు పెట్టుకునే సీన్ ఉంది. అయితే, చిత్రీకరణలో రీమాని ముద్దు పెట్టుకోవడానికి రాజ్
వీర్ చాలా ఇబ్బంది పడ్డాడు. దాదాపు 30 టేక్ లు తిన్నాక ఓకె అనిపించాడు.
|
కరీంనగర్ లో సునీల్ - రాజమౌళి ‘మర్యాద రామన్న’
‘మగధీర’ తర్వాత రాజమౌళి సునీల్ హీరోగా వినోదాత్మక చిత్రం ‘మర్యాద రామన్న’ చేస్తున్న విషయం
తెలిసిందే. సలోని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరీంనగర్ పరిసరాల్లో జరుగుతోంది. తెలంగాణ
వాదులు ఈ చిత్రం షూటింగ్ ని కూడా అడ్డుకుని ‘జై తెలంగాణ’ అనిపించి, ఆ తర్వాత అనుమతించారు.
|
పవన్ కళ్యాణ్ - వినాయక్ లతో దానయ్య చిత్రం
‘ఓయ్’, ‘వరుడు’ నిర్మాత దానయ్య పవన్ కళ్యాణ్ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. దీనికి వినాయక్ దర్శకత్వం
వహిస్తారు. అయితే, పవన్ కళ్యాణ్ తో గణేష్ నిర్మిస్తున్న చిత్రం, అల్లు అర్జున్ తో వినాయక్ చేస్తున్న ‘బద్రినాధ్’
పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. |
------------------------------------------------------ |
నాగచైతన్య - సుకుమార్ ల చిత్రం మే 19న ప్రారంభం
‘ఏ మాయ చేసావె’తో విజయం సాధించిన నాగచైతన్య ‘ఆర్య’ దర్శకుడు సుకుమార్ తో ఓ చిత్రం
చేస్తున్నారు. దీన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించడం విశేషం. నాగచైతన్య సరసన తమన్నా
హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మే 19న ప్రారంభమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం
అందిస్తున్నారు.
|
కె.విశ్వనాధ్ - నరేష్ ల చిత్రం పేరు ‘శుభోదయం’
చాలా కాలం తర్వాత కె.విశ్వనాధ్ మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లరి నరేష్,
మంజరి ఇందులో జంటగా నటిస్తున్నారు. గతంలో కె.విశ్వనాధ్ తో చిత్రం నిర్మించిన కౌశవేంద్రరావు దీన్ని
నిర్మిస్తున్నారు. మొదట్లో ‘సుమధురం’ అని పేరు పెట్టాలనుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు ‘శుభోదయం’ అని
పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
|
హిమాలయాల్లో భూమిక ‘తకిట తకిట’
డౌన్ టౌన్ ఫిలింస్ పతాకంపై భూమిక నిర్మిస్తున్న ‘తకిట తకిట’ చివరి షెడ్యూల్ షూటింగ్
హిమాలయ పర్వతాల్లో జరుగుతోంది. అంతా కొత్తవారు నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, అనూష్క అతిథి
పాత్రల్లో కనిపిస్తారు. శ్రీహరి నాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ
అందిస్తున్నారు.
|
రామ్ చరణ్ - ధరణిల చిత్రం ఈ నెల 30న ప్రారంభం
ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ‘ఆరెంజ్’ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్
‘బంగారం’ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా
నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. మెగా సూపర్ గుడ్ పతాకంపై ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
|
మేలో నారాయణమూర్తి ‘వీర తెలంగాణ’
విప్లవచిత్రాల దర్శకుడు ఆర్.నారాయణమూర్తి నిర్మించిన తాజా చిత్రం ‘వీర తెలంగాణ’ మేలో
విడుదలవుతుంది. 1920 నుండి 1957 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కథాంశంతో,
చరిత్రను వక్రీకరించకుండా ఈ చిత్రాన్ని తీశానని - నారాయణమూర్తి చెప్పారు. స్వీయ సంగీత
దర్శకత్వంలో రూపొందించిన పాటలను ఈ నెలలోనే విడుదల చేస్తామని చెప్పారు.
|
------------------------------------------------------ |
విష్ణువర్థన్ తో అల్లుఅర్జున్, రవి సి.కుమార్ తో సుమంత్
‘బిల్లా’ వంటి స్టైలిష్ చిత్రాన్ని తమిళంలో అందించిన విష్ణువర్థన్ త్వరలో ఓ తెలగు - తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ‘సామాన్యుడు’ చిత్రానికి
దర్శకత్వం వహించిన రవి.సి.కుమార్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా ఓ చిత్రం ప్రారంభం అవుతోంది.రవితేజతో ‘మిరపకాయ్’ చిత్రాన్ని నిర్మిస్తున్న రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
|
‘సూర్య హీరో అయితే నేనె విలన్’ అంటున్నకార్తి
‘యుగానికొక్కడు’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో సూర్య తమ్ముడు కార్తి ఇటీవల ‘పయ్యా’ అనే చిత్రంలో నటించారు. తమిళంలో విజయవంతం అయిన ఈ చిత్రాన్ని త్వరలో ‘ఆవారా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సూర్యతో కలిసి ఓ చిత్రంలో చేయడానికి నేను సిద్ధం. అందులో సూర్య హీరో అయితే నేను విలన్ గా చేస్తా - నని అంటున్నారు కార్తి. మంచి కథ దొరికితే తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తానని చెప్పాడు. కార్తి హీరోగా చేస్తున్న ‘నాన్ మహాన్ అల్ల’ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.
|
ధునుష్ రికమండేషన్ తో జెనీలియా డిమాండ్
తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని తమిళంలో ధనుష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా జెనీలియాని తీసుకొమ్మని ధనుష్ రికమండ్ చేశాడు. తీరా, జెనీలియాని కలిస్తే కోటి
రూపాయలు కోరిందట. చివరికి 75 లక్షలకి అంగీకరించిందని తెలుస్తోంది. జవహర్ మిత్రన్ దర్శకత్వంలో ‘ఉత్తమ పుత్తిరన్’ పేరిట నిర్మిస్తున్న ‘రెడీ’ రీమేక్ లో నటిచడం చాలా ఆనందంగా ఉందని జెనీలియా
అంటోంది.
|
శిల్పాశెట్టి త్వరలో ఆత్మకథ రాస్తుందట
ప్రముఖ బాలీవుడ్ నటి, ఇటీవల లండన్ లోని వ్యాపారవేత్తను పెళ్ళాడిన శిల్పశెట్టి త్వరలో తన ఆత్మ కథను రాస్తుందట. ఐ.పి.ఎల్ క్రికెట్ జట్టుతో సహా పలు వ్యాపార ప్రయోగాలు చేసిన శిల్ప ఇటీవల జరిగిన
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు అభ్యర్ధులకి ప్రచారం కూడా నిర్వహించింది.
|
సిలికాన్ సహకారం కోరుతున్న ఇలియానా, నమిత
అందాల సుందరిగా పేరు సంపాయించుకున్నా అవసరం మేరకు అందాలు లేవనే అసంతృప్తి ఒకరిది. శృంగార దేవతగా ఉర్రూతలూగిస్తున్నా కావాల్సిన దాని కన్నా అన్నీ అధికమే అయిన ఇబ్బంది మరొకరిది.
సిలికాన్ ప్లాంటేషన్ చికిత్స ద్వారా అందాలు పెంచుకోవాలని ఇలియానా, అందాలు తగ్గించుకోవాలని నమిత డాక్టర్లని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
నాగార్జున - నాగచైతన్యలతో గౌతం మీనన్ చిత్రం?
‘ఏ మాయ చేసావె’తో నాగచైతన్యకు తొలి విజయం అందించిన గౌతమ్ మీనన్ ఈసారి
నాగార్జున, నాగచైతన్యలతో చిత్రం చేసే ప్రయత్నంలో వున్నారట. అందుకు తగిన కథకోసం
అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. వరుసగా భారీ చిత్రాలు చేస్తున్న బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని
అంటున్నారు. |
శంకర్ ‘తెలంగాణ’ చిత్రానికి పాటల రికార్డింగ్
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, తాజా పరిస్థితులు చూపుతూ ఎన్.శంకర్ ఓ
చిత్రం నిర్మిస్తున్నారు. చక్రి సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభించారు. పూర్తిగా
కొత్తవారితో ఈ చిత్రం నిర్మిస్తాం. ఇందులో 8పాటలుంటాయి. మే నెలాఖరు నుండి షూటింగ్ ప్రారంభిస్తాం-
అని శంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రసమయి బాలకృష్ణ, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్, కోదాడ
శీను, చంద్రమహేష్ పాల్గొన్నారు. |
‘12 యాంగ్రీమెన్‘ ఆధారంగా ‘ఒక్క క్షణం’
ప్రధానమైన నిర్ణయం చేసేటప్పుడు ‘ఒక్క క్షణం’ ఆలోచిస్తే మంచి జరుగుతుందనే అంశంతో
కె.వి.రావు దర్శకత్వంలో నిర్మించిన ‘ఒక్క క్షణం’ ఈ నెల 30న విడుదలవుతోంది. జ్ఞాన్ చందర్ రెడ్డి
సమర్పించిన ఈ చిత్రంలో రక్ష, రాజీవ్ కనకాల, కోట, వైజాగ్ ప్రసాద్, శకుంతల, గిరిబాబు, ఆహుతి ప్రసాద్,
ఎల్బీ శ్రీరామ్, జీవా నటించారు. ఈ ప్రయోగాత్మక చిత్రం 1954లో వచ్చిన ‘12 యాంగ్రీమెన్’ అనే బ్లాక్ అండ్
వైట్ ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా నిర్మించారని పరిశీలకులు చెబుతున్నారు. |
తెలుగు ‘బాడీగార్డ్’లో హీరో వెంకటేష్?
సిద్దిక్ దర్శకత్వంలో దిలీప్, నయనతార జంటగా మలయాళంలో నిర్మించిన ‘బాడీగార్డ్’ పెద్ద
హిట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ తో ఈ చిత్రం
ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో విజయ్, అసిన్ తో చేస్తున్నారు. తెలుగులో ఓ పెద్ద నిర్మాత, ప్రముఖ
దర్శకుడితో చేస్తున్న ఈ చిత్రంలో హీరోగా వెంకటేష్ పేరు వినిపిస్తోంది.
|
శేఖర్ కమ్ముల నుండి మరో సున్నితమైన సినిమా
‘లీడర్’తో రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలనే సందేశాన్ని అందించిన శేఖర్ కమ్ముల
ప్రస్తుతం మరో తెలుగు సినిమా చేసే ఆలోచనలో వున్నాడు. ఈ చిత్రం సున్నితంగా ఉంటుందని, ఇందులో
కొంత సందేశం కూడా వుంటుందని శేఖర్ చెబుతున్నారు. ‘హ్యాపీడేస్’ హిందీలో చేయాలని గతంలో శేఖర్
అనుకున్నారు. కానీ, తెలుగులోనే ఇప్పుడు సినిమా చేయాలనుకోవడం సంతోషదాయకం. |
------------------------------------------------------ |
తిరుపతిలో వైభవంగా జరిగిన రంభ పెళ్ళి
ప్రముఖ అందాల నాయిక రంభ వివాహం గురువారం తిరుపతిలో వైభవంగా జరిగింది. కెనడాలో స్థిరపడిన ప్రవాసభారతీయుడు ఇంద్రకుమార్ తో జరిగిన ఈ పెళ్ళికి కె.రాఘవేంద్రరావు, రోజా వంటి సినిమా రంగానికి చెందిన కొద్దిమందినే ఆహ్వానించారు. చెన్నైలో శనివారం భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
|
‘సౌత్ ఇండియన్ స్టార్’గా అల్లు అర్జున్
నేను చేసిన తెలుగు చిత్రాలు మలయాళంలోకి డబ్ అయ్యి విజయవంతం అయ్యాయి. నాకు అక్కడ చాలా మంచి గుర్తింపు ఉంది. ఇక, తమిళంలో వచ్చే ఏడాది చేయాలనుకుంటున్నాను. వీలయితే,తెలుగు, తమిళ్ భాషల్లో ఒకే చిత్రం చేస్తాను. తెలుగు చిత్రాలు ఎలాగూ కర్నాటకలో విడుదలయ్యి బాగా నడుస్తాయి కనుక అక్కడి వారికి నేను పరిచయం ఉన్నాను. దక్షిణాది భాషలన్నింట్లో గుర్తింపు పొంది
‘సౌత్ ఇండియన్ స్టార్’ అనిపించుకోవడమే ప్రస్తుతం నా లక్ష్యం - అని అంటున్నాడు ‘ఆర్య-2’, ‘వరుడు’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్.
|
దర్శకులవుతున్న షామిలి, ఆండ్రియా...
షాలిని చెల్లి, ‘ఓయ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బేబీ షామిలి దృష్టి ఇప్పుడు దర్శకత్వం వేపు మళ్ళింది. ‘ఓయ్’ తర్వాత నటిగా అవకాశాలు వచ్చినా వద్దనుకున్న షామిలి సింగపూర్లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందింది. ఇక, ‘యుగానికొక్కడు’ ద్వారా నటిగా మారిన గాయని ఆండ్రియా త్వరలో దర్శకురాలవుతుందట. నటిగా గ్లామర్ విషయంలో ఎటువంటి నిబంధనలూ పెట్టని ఆండ్రియా దర్శకత్వం పట్ల తనకున్న ఆసక్తి కొద్దీ సెల్వరాఘవన్ దగ్గర అసిస్టెంట్ గా ఓ చిత్రానికి పనిచేస్తోంది.
|
వెంకటేష్ తో 28 నుండి ‘నాగవల్లి’గా ‘చంద్రముఖి - 2’
కన్నడలో విజయవంతం అయిన ‘చంద్రముఖి - 2’ ‘ఆప్తరక్షక’ను తెలుగులో వెంకటేష్ హీరోగా బెల్లంకొండ సురేష్ పునర్ నిర్మిస్తున్నారు. 28 నుండి ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి ‘నాగవల్లి’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అయిదుగురు హీరోయిన్లుండే ఈ చిత్రంలో అనూష్క, కమలిని ముఖర్జీ, శ్రద్దాదాస్, రిచ గంగోపాద్యాయ ఇప్పటివరకు ఎంపికయ్యారు. పి.వాసు ఈ చిత్రానికి దర్శకుడు.
|
జూన్ 18న వస్తున్న ‘రావణ్’కు శింబు డబ్బింగ్
మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్యారాయ్ లతో నిర్మించిన భారీ చిత్రం ‘రావణ్’ జూన్ 18న విడుదలవుతుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్లో అభిషేక్ కు నటుడు శింబు డబ్బింగ్ చెప్పడం విశేషం. తెలుగు వెర్షన్ లో విక్రమ్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. త్వరలో జరిగే కేన్స్ ఫిల్మోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ప్రచారం కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాల్లో అభిషేక్, ఐశ్వర్య, విక్రమ్ తో కలిసి మణిరత్నం పర్యటించనున్నారు.
|
------------------------------------------------------ |
రజనీ ‘రోబో’లో రాజకీయాలూ వుంటాయి
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న ‘రోబో’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతతం జరుగుతోంది. ‘అవతార్’ వంటి సైన్స్ ఫిక్షన్ మా చిత్రం. ‘అవతార్’ పన్నెండు సంవత్సరాల్లో చేస్తే, ‘రోబో’ ప్రారంభించిన ఏడాదికే ఇంకెంతకాలం? అని అడుగుతున్నారు. మా శ్రమ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. మా సినిమా అందంగా, శక్తివంతంగా వుంటుంది. ఈ కథను చేయగల ఒకే ఒక్కడు రజనీకాంత్. ఇందులో రాజకీయ సంభాషణలు కూడా వుంటాయి. అందరినీ ఆలోచింపజేసేలా వుంటాయి- అని చెబుతున్నారు శంకర్. |
జూన్ 19న మనీషా కొయిరాలా పెళ్ళి
ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా పెళ్ళి జూన్ 19న జరుగుతుంది. అమెరికాలో చదువుకుని నేపాల్లో స్వంతంగా పెట్రో ఉత్పత్తుల సంస్థను నెలకొల్పిన సమ్రాట్ దహల్ తో రెండేళ్ళుగా మనీషా సన్నిహితంగా వుంటోంది. దహల్ చక్కటి కుటుంబం నుండి వచ్చిన ఉన్నత విద్యావంతుడు, అతనితో మనీషా వివాహాన్ని తాము సంతోషంగా అంగీకరిస్తున్నాం అంటూ ఆమె తండ్రి ప్రకాష్ కొయిరాలా చెప్పారు.
|
దిల్ రాజు మాటలు పట్టించుకోనంటున్న అనిత
నేను అమెరికాలో పెట్టి పెరిగిన అమ్మాయిని. అమ్మ తెలుగు, నాన్న అమెరికన్. ‘మరోచరిత్ర’లో పాత్రకు అనుగుణంగా నన్ను ఎంపిక చేశారు. నా ఆడిషన్ టెస్ట్ లో దిల్ రాజు కూడా వున్నారు. సినిమా పూర్తయ్యే వరకూ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఆయన ‘మరోచరిత్ర’లో హీరోయిన్ రాంగ్ సెలక్షన్ అంటూ చెప్పడం... ఆయన విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. అతని మాటలకు బాధపడను, పట్టించుకోను, వాటివల్ల నా కెరీర్ కి నష్టం కూడా వుంటుందని అనుకోను- అంటూ చెబుతోంది ‘మరోచరిత్ర’ నాయిక అనిత.
|
‘గాడ్ అండ్ సెక్స్’తో మరో వర్మ మసాలా చిత్రం
చర్చనీయాంశంగా ఉన్న కథలతో ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునే రాంగోపాల్ వర్మ ఇప్పుడు స్వామి నిత్యానందను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంతమంది యోగులు, స్వాములు, బాబాలు మన దేశంలోనే వున్నారు. అందులో కొందరు స్వార్థ బుద్ధితో చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. సామాన్యులు ఎలా స్వాములవుతున్నారు? వారి కార్యకలాపాలు ఏంటి? అనే దృక్కోణంలో రాంగోపాల్ వర్మ ‘గాడ్ అండ్ సెక్స్’ పేరుతో ఓ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. కావాల్సినంత మసాలాకు అవకాశం వుందీ చిత్రంలో. |
కృష్ణవంశీతో రామ్... నట్టికుమార్ తో శ్రీహరి
దిల్ రాజు ‘రామరామ కృష్ణకృష్ణ’ చిత్రం పూర్తిచేసి, సురేంద్ర రెడ్డి చిత్రం త్వరలో ప్రారంభిస్తున్న రామ్, జూలై నుండి కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘దాసన్న’గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీహరి నట్టికుమార్ నిర్మించే మరో చిత్రంలో హీరోగా చేస్తున్నారు. దీనికి ‘భైరవ ఐపిఎస్’ అని పేరు పెడుతున్నారు.
|
------------------------------------------------------ |
మెర్లిన్ మన్రోగా కరీనా... వైజయంతిగా విమల...
సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు తీసే మాధుర్ బండార్కర్ ఇప్పుడు హాలీవుడ్ లో ఓ చిత్రం చేస్తున్నారు. అందాల నటి మెర్లిన్ మన్రో జీవిత కథనంతో నిర్మించే ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక, బాలీవుడ్ అందాలనటి వైజయంతిమాల నటించిన ఓ పాత్రను విమలా రామన్ పోషిస్తోంది. నలభై ఏళ్ళ కిందట వచ్చిన ‘అమ్రపాలి’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవరికర్ పునర్ నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్నారు. |
రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ గా రమణమూర్తి
‘అభినందన‘, నీరాజనం, శ్రీసాయి మహిమ’ మొదలైన చిత్రాలను నిర్మించిన సంగీత పిపాసి ఆర్.వి.రమణమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం ‘సాంస్కృతిక మండలి’ చైర్మన్ గా నియమించింది. ఘంటశాల పేరుతో జాతీయ అవార్డు నెలకొల్పుతామని, రవీంద్రభారతిని అభివృద్ధి చేస్తామని - ఈ సందర్భంగా రమణమూర్తి చెప్పారు. సాంస్కృతిక కళా వికాసాల కోసం కృషి చేస్తానని, ఆదరణ లేక బాధపడుతున్న నిజమైన కళాకారుల సంక్షేమానికి పాటుపడతానని అన్నారు. |
మే 14న పవన్ కళ్యాణ్ ‘పులి’ విడుదల
ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించిన ‘పులి’ బ్యాలెన్స్ పాటలు ఏప్రిల్ 10 నుండి చిత్రీకరిస్తారు. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 14న విడుదల చేస్తారు. ఇందులో నికిషా పటేల్ అనే నూతన కథానాయికను పరిచయం చేస్తున్నారు. |
ఆదిత్య దర్శకత్వంలో హీరోగా సుమంత్ పరిచయం
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడు సుమంత్ ను వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో హీరోగా పరిచయం చేస్తున్నారు. సుమంత్ ఆర్ట్స్ లో ‘మనసంతా నువ్వే’, ‘ఆట’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదిత్య తో నిర్మించే ఈ చిత్రానికి ‘మిర్చి’ అని పేరు పెడుతున్నారు. గతంలో తేజ దర్శకత్వంలో సుమంత్ ను పరిచయం చేయాలనుకున్నారు. కారణాంతరాల వల్ల అది వీలు కాలేదు.
|
లగడపాటి శ్రీధర్ - అశోక్ ల ‘ధనాధన్’
లార్ స్కో పతాకంపై ‘ఎవరిగోల వారిదే’, ‘స్టైల్’ చిత్రాలు నిర్మించిన లగడపాటి శ్రీధర్ కళాదర్శకుడు అశోక్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. ‘స్టైల్ - 2’గా రూపొందే ఈ చిత్రానికి ‘ధనాధన్’ అని పేరు పెట్టారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. మధురా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘స్నేహగీతం’ ఈ నెలలోనే విడుదల కానుంది. |
------------------------------------------------------ |
ఏప్రిల్ 9న వివేక్ ఓబరాయ్ ‘ప్రిన్స్’ విడుదల
‘రేస్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన కుమార్ తురానీ వికేక్ ఓబరాయ్ హీరోగా ‘పిన్స్’ అనే భారీ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం గురించి హైదరాబద్ వచ్చిన వివేక్ మాట్లాడుతూ - ఇందులో దొంగగా నటిస్తున్నాను. ఇండియన్ స్ర్కీన్ పై ఎప్పుడూ చూడని యాక్షన్ సన్నివేశాలతో అత్యంత భారీగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం అని చెప్పారు. కుకీ వి.గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరుణ షీల్డ్స్, నందనా సేన్, నీరూ సింగ్ కథనాయికలుగా నటించారు.
|
రవితేజ కొత్త చిత్రం ‘కత్తిలాంటోడు’
వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించే రవితేజ చిత్రాల పేర్లు కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. గతంలో ‘ఇడియట్’, ‘వెంకీ’, ‘కిక్’, ‘విక్రమార్కుడు’ వంటి చిత్రాలు చేసిన రవితేజ ప్రస్తుతం ‘డాన్ శీను’, ‘వీర’, ‘మిరపకాయ్’ చిత్రాలు చేస్తున్నారు. త్వరలో ప్రారంభం అయ్యే రవితేజ చిత్రానికి కూడా మరో ఆకర్షణీయమైన పేరు పెట్టారు. రెయిన్ బో రీల్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం పేరు ‘కత్తిలాంటోడు’.
|
23 గెటప్స్ లో వడివేలు కనిపిస్తారు.
‘23 పులకేశి’లో హీరోగా ఘనవిజయాన్ని స్వంతం చేసుకున్న వడివేలు ఇప్పుడు మరో చిత్రంలో కొత్త ప్రయోగం కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇందులో ఆయన 23 గెటప్స్లో కనిపిస్తారు. దాని కోసం విదేశీ మేకప్ మెన్ పని చేస్తారు. భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ చిత్రంలో 10 మంది హీరోయిన్లు నటిస్తారు.
|
ఏప్రిల్ 10న టివి నుండి అవార్డుల ఉత్సవం
2008 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ టివి నంది అవార్డులు ఏప్రిల్ 10న జరిగే భారీ కార్యక్రమంలో విజేతలకు ప్రధానం చేస్తారు. దుర్గా నాగేశ్వరరావు చైర్మన్ గా ఏర్పడ్డ కమిటీ ఎంపిక చేసిన విజేతలను ఇటీవల ప్రకటించారు. ఈ నంది ప్రధాన ఉత్సవం హైదరాబాద్ లోని లలితకళా తోరణంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి కె.రోశయ్య, మంత్రి గీతారెడ్డి తదితరులు హాజరవుతారు.
|
ప్రభుత్వం చిన్న చిత్రాలను ఆదుకోవాలి
సంక్షోభంతో సతమతమవుతున్న చిన్న చిత్రాలను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు దర్శకులు సమావేశమై తీర్మానించి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డిని కలిసి విన్నవించారు. రాష్ట్రంలోని ధియేటర్లు ఏడాదికి కనీసం 24 వారాల పాటు చిన్న చిత్రాలను పర్సెంటేజి పద్ధతిన ప్రదర్శించాలని, మొదటి 4 వారాల పాటు వినోదపు పన్ను మినహాయించాలని కోరారు. చిన్న చిత్రాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంచి హామీ ఇచ్చారు.
|
------------------------------------------------------ |
అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ ల పెళ్ళి ఈ ఏడాదే
ఇటీవల అనారోగ్యం నుండి బయటపడి, ‘బెండు అప్పారావు’తో మంచి విజయాన్ని స్వంతం చేసుకున్న ఇవివి సత్యనారాయణ ఇప్పుడు ‘బురుడి’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇవివి కుమారులు, హీరోలు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లకు మంచి సంబంధాలు చూసి ఈ ఏడాదిలోనే పెళ్ళి చేయాలనుకుంటున్నామని ఇవివి చెప్పారు. |
ఏప్రిల్ 9న ‘పోలీస్ - పోలీస్’ విడుదల
శ్రీరామ్, పృథ్వీరాజ్ ల హీరోలుగా కమలిని ముఖర్జీ, సంజన హీరోయిన్లుగా మన్మోహన్ దర్శకత్వంలో ‘పోలీస్ - పోలీస్’ నిర్మించారు. పోలీసు వ్యవస్థలోని మంచి చెడులను చూపుతూ పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలవుతోంది. నట్టికుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు : వేటూరి, సంగీతం : విశ్వ, సాయికార్తిక్, ఫోటోగ్రఫీ : భరణి కె.ధరన్, సమర్పణ : మోహన్ పాటిల్.
|
బి.జయ దర్శకత్వంలో ‘డబుల్ ధమాకా’
ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు బి.జయ దర్శకత్వంలో బెల్లం కొండ సురేష్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ‘డబుల్ ధమాకా’ పేరుతో రూపొందే ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ‘అష్టాచెమ్మా’ నాని, ‘వినాయకుడు’ కృష్ణుడు హీరోలుగా నటించే ఈ చిత్రంలో కొత్త హీరోయిన్లు చేస్తారు. మే నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది.
|
నటుడిగా గాయకుడు విజయ్ జేసుదాస్
ప్రముఖ గాయకుడు జేసుదాస్ కుమారుడు ఇటీవల బాగా పాపులర్ అవుతున్న గాయకుడు విజయ్ జేసుదాస్ మంచి గాయకుడిగా పలు అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు విజయ్ ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నందన్ కావిల్ దర్శకత్వంలో ‘అవన్’ పేరిట నిర్మిస్తున్న మలయాళ చిత్రంలో ఓ హీరోగా విజయ్ చేస్తున్నాడు. ఇందులో బాల మరో హీరోగా చేస్తున్నారు. |
‘1940లో ఒక గ్రామం’ ఏప్రిల్ 9న విడుదల
బాలాదిత్య, శ్రీరమ్య జంటగా నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన ‘1940 లో ఒక గ్రామం’ జాతీయ, రాష్ట్రీయ అవార్డులను సాధించిన విషయం తెలిసిందే. విడుదల సమస్యను ఎదుర్కొంటున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి డి.టి.ఎస్ చేయించి మంచి ధియేటర్స్ లో ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నామని బెల్లంకొండ సురేష్ చెప్పారు.
|
------------------------------------------------------ |
| |