| |
ఉయ్యాలవాడగా చీరంజీవా? బాలయ్యా?
స్వాతంత్ర్య సమరయోధుడు కర్నూలుకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో త్వరలో ఓ భారీ తెలుగు చిత్రం రాబోతోంది. రాజకీయాల్లోకి రాకముందు చిరంజీవి ఈ కథతో సినిమా తీసి ఇమేజ్ పెంచుకోవాలనుకున్నారు. పరుచూరి బ్రదర్స్ తో విదేశాల్లో ఈ స్క్రిప్టు పని పూర్తి చేయించారు. అయితే కారణాంతరాల వల్ల ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు బాలకృఫ్ణ హీరోగా ఆ చిత్రం జయంత్ సి. పర్జాని దర్శకత్వంలో వస్తోందని వార్తలొస్తున్నాయి. మళ్ళీ సినిమాల్లోకి చిరంజీవి వస్తే తొలిచిత్రంగా ఉయ్యాలవాడ చిత్రాన్నే చేస్తారని అంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. |
నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ చిత్రం
‘ఏ మాయ చేసావె’తో విజయం సాధించిన నాగచైతన్య మూడవ చిత్రం శివప్రసాద్ రెడ్డి బ్యానర్ పై త్వరలో ప్రారంభం అవుతోంది. అయితే, మగధీర వంటి భారీ విజయాన్ని అందించిన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నాగచైతన్యతో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ‘బ్రదీనాధ్’ అనే భారీ చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నారు.
|
నిర్మాతగా ‘బావ’, ‘యోధ’ హీరో సిద్దార్థ
తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా చేసిన సిద్దార్థ ఇప్పుడు రాంబబు దర్శకత్వంలో ‘బావ’, ప్రకాశరావు దర్శకత్వంలో ‘యోధ’ చిత్రాల్లో చేస్తున్నారు. సిద్దార్థ త్వరలో నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించారు. బహుశా వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని చెప్పారు.
|
‘అభిరుచి’గలవారు భువనేశ్వరిని వదులుకోరు
ఈ మధ్య సెక్స్ రాకెట్ లో అరెస్ట్ అయ్యి సంచలనం సృష్టించిన భువనేశ్వరి తనకున్న పెద్దల మద్దతుతో మరోసారి తప్పించుకుని బయటపడింది. ‘అభిరుచి’ గల మనవాళ్ళు ఇటీవల ‘రంగ ది దొంగ’ చిత్రంలోని ఓ పాటలో భువనేశ్వరికి అవకాశం కల్పించి ఆనందపడ్డారు. ఈ సందర్భంగా, ఆమెపై ఉన్న అభియోగాల గురించి అడిగితే - ‘అంతా ఉత్తదే’ అంటూ కొట్టి పడేసింది భువనేశ్వరి. |
దసరా కానుకగా మహేష్ బాబు ‘కలేజా’?
మహేష్ బాబు, అనుష్క జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘కలేజా’ అనే పేరు పెట్టాలని అనుకుంటున్నారు. ఇందులో మహేష్ బాబు టాక్సీ డ్రైవర్ గా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు.
|
------------------------------------------------------ |
పట్టువదలని ప్రచార ‘లీడర్’ రానా
ఏ సినిమాకి అయినా విడుదల సమయంలో ప్రచారం చేయడం హైప్ క్రియేట్ చేయడం సహజం. అయితే రామానాయుడు మనవడు రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మించిన ‘లీడర్’ చిత్రం విడుదలకు మాత్రం ఎడతెగని ప్రచారం జరగడం, అందులో సడలని ఉత్సాహంతో రానా పాల్గొనడం విశేషం. సినిమా టాక్ ఎలావున్నా, ఈ ప్రచారం కూడా సినిమా విజయానికి ఉపయోగపడుతుంది. రానాలోని ఉత్సాహాన్ని, పట్టుదలని అంతా పశంసిస్తున్నారు. |
దాసరి ‘యంగ్ ఇండియా’ ఏప్రిల్ 9 విడుదల
స్వీయ దర్శకత్వంలో దాసరి నారాయణరావు నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా’ టాకీ పూర్తయ్యింది. ఈనెల 11నుండి పాటలు చిత్రీకరిస్తారు. 81మంది నూతన నటీనటులను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో అధికభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకుంటున్నారు. |
హక్కుల సంఘానికి తేజ, శ్రీనివాసరావుల గొడవ
ప్రముఖ దర్శకుడు తేజ ఇటీవల చదలవాడ శ్రీనివాసరావుతో గొడవ కారణంగా వార్తలకెక్కాడు. గతంలో తేజ ఇంటిపై శ్రీనివాసరావు దగ్గర తీసుకున్న అప్పు విషయంలో ఇప్పుడు ఆ ఇంటిపై హక్కులు తమవేనంటూ ఇరువురూ వివాదానికి దిగారు. పెద్దమనుషుల సమక్షంలో సెటిల్ చేసుకోవాల్సిన ఈ వివాదాన్ని రాష్ట్ర మానవ హక్కుల సంఘం వరకూ తీసుకెళ్ళారు. శ్రీనివాసరావు చేసిన విజ్ఞప్తి మేరకు హక్కుల సంఘం పోలీసుల నుండి పూర్తి సమాచారాన్ని సేకరిస్తోంది. |
సెప్టెంబర్ 17న రామ్ చరణ్ ‘ఆరంజ్’ ?
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ హీరోగా చేస్తున్న చిత్రం ‘ఆరంజ్’ భారీ షెడ్యూల్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. జెనీలియా నాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 17న విడుదల అవుతుందని తెలుస్తోంది.
|
కమల్ సినిమాలో త్రిష, మాధవన్
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కమల్ హసన్ హీరోగా చేస్తున్న చిత్రానికి ‘యావరుమ్ కేళీర్’ అని పేరు పెట్టారు. ఇందులో కమల్ సరసన త్రిష తొలిసారి కథానాయికగా చేస్తోంది. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉదయనిధి కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు. ‘3ఇడియట్స్’లో ఒక హీరోగా చేసిన మాధవన్ ఈ చిత్రంలో కూడా ఓ ప్రత్యేకత గల పాత్ర పోషించడం విశేషం. |
------------------------------------------------------ |
వీరనారి ‘రాణి రుద్రమదేవి’గా అనుష్క?
‘అరుంధతి’గా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు వన్నెతెచ్చే నాయికగా ఇమేజ్ ని పెంచుకున్న అనుష్క ఇప్పుడు ‘పంచాక్షరి’లో మరోసారి టైటిల్ రోల్ చేస్తోంది. ‘గమ్యం’ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘వేదం’లోను, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రంలోను చేస్తున్న అనుష్క త్వరలో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో వీరనారిగా నటిస్తుందని అంటున్నారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్ర్కిప్టు తయారు చేసి పెట్టుకున్న ‘రాణి రుద్రమదేవి’ని అనుష్కతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
|
అమితాబ్, మోహన్ లాల్, సూర్యలతో ‘కాందహార్’
భారత విమానాన్ని హైజాక్ చేసిన ‘కాందహార్’ సంఘటనను ఆధారంగా చేసుకుని మేజర్ రవి ‘కాందహార్’ అనే భారీ చిత్రం నిర్మిస్తున్నారు. ఆయన గతంలో మోహన్ లాల్ తో ‘కీర్తిచ్రక’, ‘కురుక్షేత్ర’ చిత్రాల నిర్మించారు. సైన్యం నుండి వచ్చిన దర్శకుడయిన మేజర్ రవి కేరళ, ఢిల్లీ, నేపాల్ లో షూటింగ్ చేసే ఈ చిత్రంలోఅమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, సూర్య హీరోలుగా నటిస్తారు.
|
‘ఏ మాయ చేసావె’ దర్శకనిర్మాతల మద్య స్పర్ద
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘ఏ మాయ చేసావె’ చిత్రాన్ని కృష్ణ కుమార్తె మంజుల నిర్మించారు. అయితే, ఈ చిత్రంకి గౌతం మీనన్ కి ఇస్తామని చెప్పిన పారితోషికం, లాభాల్లో కొంతభాగం ఇచ్చే విషయంలో మంజుల ముందుగా అనుకున్న విధంగా చేయలేదని గౌతమ్ మీనన్ చెబుతున్నారట. అందువల్ల, ఇకపైన వారి సంస్థలో పనిచేయనని ఆయన అంటున్నారు.
|
ధియేటర్ లీజ్ దారులపై రాజా ధ్వజం
రామోజీరావు, దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ లు ప్రధానమైన ధియేటర్లన్నింటిని లీజ్ కి తీసుకుని చిన్న నిర్మాతలకి ధియేటర్లు దొరకకుండా అన్యాయం చేస్తున్నారంటూ - నటుడు రాజా మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ అంశం తమ పరిధిలోకి రాదని కమీషన్ చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి తేల్చి చెప్పారు.
|
పూరి తదుపరి హీరో అమితాబ్ లేదా ఎన్టీఆర్
గోపీచంద్ తో ‘గోలీమార్’ చేస్తున్న పూరిజగన్నాధ్ తదుపరి చిత్రం ఏమిటి? రాంగోపాల్ వర్మ నిర్మాతగా అమితాబ్ బచ్చన్ హీరోగా ‘బుఢా’ అనే హిందీ చిత్రం పూరిజగన్నాధ్ దర్శకత్వంలో చేసే ఆలోచన ఉందట. అలాగే, నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం చేసే ప్రతిపాదన కూడా నడుస్తోందట.
|
------------------------------------------------------ |
సుమంత్ - స్వాతిలతో మోహన్ కృష్ణ చిత్రం
‘అష్టాచెమ్మా’ వంటి విజయవంతమైన చిత్రాన్నిఅందించిన మోహన్ కృష్ణ అదే బ్యానర్ పై మరో చిత్రం చేస్తున్నారు. సుమంత్, స్వాతి జంటగా నటించే ఈ చిత్రం ‘ది మెన్ వితిన్’ అనే హరిమోహన్ నవల ఆధారంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత రామ్మోహన్ చెప్పారు. |
మోహన్ బాబు డబ్బు బాకీ అంటున్న చౌదరి
విష్ణు హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో మోహన్ బాబు ‘సలీమ్’ చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. చౌదరికి ఈ చిత్రం చేసినందుకు ఇవ్వాల్సిన మొత్తంలో కొంత చెల్లించారు. బ్యాలెన్స్ 40 లక్షలకు చెక్కు ఇచ్చారు. అయితే, అది బ్యాంకులో చెల్లలేదు. ఆ విషయమై చౌదరి డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు.
|
జీరోసైజ్ అనర్థదాయకమంటున్న హేమ
ఇప్పటి హీరోయిన్ల జీరోసైజు సరదా పట్ల ‘డ్రీమ్ గర్ల్’గా పేరు పొందిన ప్రముఖ హీరోయిన్ హేమామాలిని తన విముఖత వ్యక్తం చేశారు. సౌందర్యం భగవంతుడు ఇచ్చిన వరం. నలుగురిలో కనిపించేటప్పుడు ఆడది అందంగా కనిపించాలి. మరీ సన్నబడటం అనారోగ్యానికి కారణమవుతుంది - అంటూ హీరోయిన్లను ఆమె హెచ్చరిస్తోంది.
|
అల్లు అర్జున్ ‘వరుడు’లో 15 నిముషాల పాట
అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న ‘వరుడు’లో 100 కుటుంబాలు కనిపించడం ఒక విశేషం అయితే, ఇందులో పెళ్ళిపై 15 నిముషాల పాట పెట్టడం మరో విశేషం. ఇంతవరకూ పెళ్ళిపై వచ్చిన పాటలన్నింటిలో ఈ పాట ప్రత్యేకంగా, ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. తమిళ నటుడు ఆర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. |
‘అదుర్స్’ తర్వాత షీలా కెరీర్ కేక
‘పరుగు’ వంటి చిత్రాల్లో సాంప్రదాయకంగా కనిపించిన షీలా ఒక్కసారిగా ట్రాక్ మార్చి ‘మస్కా’లో గ్లామర్ పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘అదుర్స్’లో మరింత అందాలు ఆరబోసింది. ‘అదుర్స్’ తర్వాత షీలాకు 9 సినిమాల్లో అవకాశాలొచ్చాయట. అయితే నటిగా ఇప్పుడే నా స్థాయి పెరిగింది కనుక అందుకు తగిన సినిమాలనే ఆచి తూచి చేస్తానంటోంది షీలా.
|
------------------------------------------------------ |
రవితేజ ‘మిరపకాయ’ (వీడు చాలా హాట్ గురూ)
కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ ‘డాన్ శీను’గా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా త్రిష బదులు శ్రియ చేయడం కొత్త విశేషం. దీని తర్వాత వెంకట్ సమర్పణలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న చిత్రంలో రవితేజ నటిస్తున్నారు. ‘షాక్’ హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి మొదట ‘వీర’ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే, ఇప్పుడు దీనకి ‘మిరపకాయ’ (వీడు చాలా హాట్ గురూ) అని పేరు పెట్టాలనుకుంటున్నారు. |
రామ్ చరణ్ ‘ఆరంజ్’లో జెనీలియా, షరాన్, షాజన్
‘మగధీర’ తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ చేస్తున్న ‘ఆరెంజ్’ ఆస్ర్టేలియాలోని సిడ్నీలో రెండు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటుంది. నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియాతో పాటు ‘రాకెట్ సింగ్’ ఫేమ్ షాజన్ పదమ్ సీ, పాప్ గాయని షరాన్ ప్రభాకర్ లు నటిస్తున్నారు. |
ప్రచారానికీ పారితోషికం అడుగుతున్న ఛార్మి
వేణు, ఛార్మి జంటగా యలమంచి గోపీచంద్ ‘మాయగాడు’ అనే సినిమా చేశారు. అయితే కారణాంతరాల వల్ల ఆ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు విడుదల సన్నాహాలు చేస్తున్న నిర్మాత ఆ చిత్రం ప్రచార కార్యక్రమాలకి రమ్మని ఛార్మిని కోరితే - అదనంగా డబ్బులివ్వాలని అడిగిందట. పైగా, నిర్మాత అస్తమానం ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ మూవీ ఆర్టిస్తుల సంఘానికి ఫిర్యాదు చేసింది. |
చిరంజీవి - చరణ్ తో జానారెడ్డి సినిమా
మాజీ మంత్రి జానారెడ్డి అసెంబ్లీలోని ప్రజారాజ్యం పార్టీ ఛాంబర్లో చిరంజీవితో గంటపాటు సమావేశం కావడం ఆసక్తి కలిగించింది. ఆ విషయమై జానారెడ్డిని అడిగితే - మా అబ్బాయి, చిరంజీవిగారి అబ్బాయి రామ్ చరణ్ మంచి మిత్రులు. చిరంజీవి, రామ్ చరణ్ లను కలిపి ఓ సినిమా తీయాలనుందని మా అబ్బాయి చెప్పాడు. ఆ విషయమే చిరంజీవితో మాట్లాడాను - అని చెప్పాడు.
|
‘రామరామ-కృష్ణకృష్ణ’లో పోలీసు అధికారిగా రామ్
‘దేవదాస్’ రామ్ దిల్ రాజు నిర్మిస్తున్న ‘రామరామ-కృష్ణకృష్ణ’లో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు రాజమండ్రి పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా జరిగింది. ఇందులో రామ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఓ సన్నివేశంలో 60 ఏళ్ళ వృద్ధుడిగా కూడా కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. |
------------------------------------------------------ |
మూడు భాషల హీరోగా రానా జోరు
తొలిచిత్రం ‘లీడర్’తో మంచి ఓపెనింగ్స్ సాధించిన రానా రెండవ చిత్రంగా హిందీలో ‘దమ్ మారో దమ్’లో చేస్తున్నాడు. అభిషేక్ బచ్చన్, ప్రదీప్ బచ్చర్ లతో కలిసి హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో రానా సరసన బిపాసా బసు హీరోయిన్ గా చేస్తోంది. త్వరలో రానా హీరోగా తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ చిత్రం నిర్మించడానికి ఓ ప్రముఖ తమిళ నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. రెండు మూడు నెలల్లో తెలుగులో కూడా మరో చిత్రం చేస్తానని రానా చెప్పారు.
|
తెలుగులో అగ్రహీరోతో త్వరలో ‘చంద్రముఖి - 2’
ఘనవిజయం సాధించిన ‘చంద్రముఖి’ రెండవభాగాన్ని పి.వాసు ‘ఆప్తరక్షక’ పేరుతో కన్నడలో చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ హీరో విష్ణువర్థన్ హీరోగా నటించారు. గతంలో తమిళంలో నిర్మించిన ‘చంద్రముఖి’ని తెలుగు డబ్బింగ్ చేయడం కాకుండా, ఈసారి తెలుగులోనే ఓ అగ్రహీరోతో నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నారు.
|
‘మాయ చేసిన’ సమంత తెలుగమ్మాయేనట
నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’లో నాయికగా పరిచయం అయిన సమంత నిజంగానే యువ ప్రేక్షకులను మాయ చేసింది. మొదట్లో ఈ అమ్మాయి ముంబై మోడల్ గా వార్తలొచ్చాయి. అయితే, నిజానికి ఆమె చెన్నై అమ్మాయి... అదీ గాక అచ్చం మన తెలుగు అమ్మాయి అని తెలుస్తోంది. చాలా కాలంగా చెన్నైలో వారికుటుంబం స్థిరపడిపోవడం వల్ల ఆమెను తమిళ అమ్మాయిగానే భావిస్తున్నారు. ఈ మధ్యనే ఓ తమిళ చిత్రంలో నాయికగా అవకాశం వచ్చిన సమంతను, ఆ చిత్రం విడుదలకు ముందే గౌతమ్ మీనన్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
|
కులుమనాలిలో నాగార్జున - రాధామోహన్ ల చిత్రం
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘ఆకాశమంత’ దర్శకుడు రాధామోహన్ నాగార్జున హీరోగా ‘పయనం’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 26 నుండి కులుమనాలిలో జరుగుతోంది. ఈ చిత్రానికి ‘పయనం’ అనే పేరు బదులు ఇంకాస్త ఫోర్స్ తో ఉండే పేరు పెట్టాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ కు ఇందులో ప్రతినాయకుడుగా నటిస్తున్న ప్రకాష్ రాజ్ నిర్మాత.
|
అనూష్క ప్రత్యేక పాత్రలో లారెన్స్ ‘కాంచన’
‘మాస్’, ‘డాన్’ చిత్రాల దర్శకుడు లారెన్స్ ‘కాంచన’ అనే మరో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ‘అరుంధతి’ నాయిక అనూష్క ఇందులో కాంచనగా పవర్ ఫుల్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ స్వంతంగా నిర్మిస్తున్నారు.
|
------------------------------------------------------ |
‘ఆర్య’ సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య
‘ఆర్య’ - ‘ఆర్య-2’ చిత్రాలతో కొత్త తరహా ట్రీట్ మెంట్ కి మంచిపేరు సంపాయించిన దర్శకుడు సుకుమార్ త్వరలో నాగచైతన్య హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. గౌతం మీనన్ తో నాగచైతన్య చేసిన ‘ఏ మాయ చేసావె’ 26న విడుదలవుతుంటే కాజల్ కాంబినేషన్లో నాగచైతన్య మరో చిత్రం అజయ్ భూయన్ దర్శకత్వంలో మార్చిలో ప్రారంభం అవుతోంది. |
గోపీచంద్ - అనుష్కతో బి.గోపాల్ చిత్రం
‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ వంటి మసాలా సూపర్ హిట్ చిత్రాలను అందించిన బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ చిత్రం వస్తోంది. ఇందులో అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
మార్చి 12 నుండి (ఐ.పి.ఎల్) క్రికెట్ ఎఫెక్ట్
ఇండియా ఆడే క్రికెట్ మ్యాచ్ లకి యూత్ లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఆ సమయంలో సినిమా ధియేటర్లు వెలవెలా పోతుంటాయి. మార్చి 12 నుండి ఐ.పి.ఎల్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లు నెల రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ ఎఫెక్ట్ కి సినిమాల వసూళ్ళు దాదాపు యాభైశాతం కోల్పోయే అవకాశముందని పరిశీలకులంటున్నారు. ఆ సమయంలో కొన్ని ధియేటర్స్ లో సినిమాల బదులు టెలీకాస్ట్ పద్ధతిన క్రికెట్ మ్యాచ్ లనే ప్రదర్శించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
|
రామానాయుడు చిత్రంలో వరుణ్ సందేష్
ఇటీవల ‘బెండు అప్పారావు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు త్వరలో వరుణ్ సందేష్ హీరోగా ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. దీనికి ‘మీ శ్రేయోభిలాషి’ దర్శకుడు ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. |
ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం
పి.రఘు (మాటివి) అద్యక్షుడిగా ‘‘ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’’ నూతన కార్యవర్గం ఎన్నికైంది. దీనికి ఉపాద్యక్షులుగా : రవి చంద్ర (టివి 9), లక్ష్మీనారాయణ (ఎన్ టివి), కార్యదర్శలుగా : సురేంద్ర కుమార్ నాయుడు (ఇండియా గ్లిట్జ్.కామ్), సత్యనారాయణ (ఈటివి), సహకార్యదర్శులుగా : విజయ్ గోపాల్(విస్సా), నాగు గవర (లోకల్), ట్రెజరర్ గా ప్రసాద్ (సిటీ కేబుల్) ఎన్నికయ్యారు.
|
------------------------------------------------------ |
విమానం హైజాక్ కథతో నాగార్జున ‘పయనం’
‘ఆకాశమంత’ దర్శకుడు రాధామోహన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నిర్మిస్తున్న ‘పయనం’ విమానం హైజాక్ కథాంశంతో ఉంటుందని అంటున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన ప్రకాష్ రాజ్ నుండి నాగార్జున ఎలా రక్షించారనే ఆసక్తికరమైన అంశంతో ఈ చిత్రాన్ని తమిళంలో ప్రకాష్ రాజ్, తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. హిందీ వెర్షన్ ను బోనీకపూర్ నిర్మించే అవకాశం ఉంది. |
లారెన్స్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చిత్రం?
‘వరుడు’, ‘రామరామ - కృష్ణ కృష్ణ’ , ‘వేదం’ చిత్రాల్లో నటిస్తున్న అల్లు అర్జున్ త్వరలో వినాయక్ దర్శకత్వంలో ‘బద్రీనాధ్’ చేయబోతున్నారు. త్వరలో అల్లు అర్జున్ ‘మాస్’, ‘డాన్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన లారెన్స్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేసే అవకాశం ఉందని అంటున్నారు. లారెన్స్ హీరోగా నిర్మించిన ‘కౌబోయ్’ చిత్రం మార్చి 26న విడుదలవుతుంది. |
తిక్కలోడనుకున్నా మనోజ్ కి ఫర్వాలేదు
నాకు కావల్సిన విజయం ఇది కాదంటున్నారు ‘బిందాస్’ సక్సెస్ గురించి మాట్లాడుతూ మంచు మనోజ్. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలి. నా ఆలోచనలు ఎప్పుడూ అంత ఎత్తులో తిరుగుతుంటాయి. ఏదో ఒకటి విభిన్నంగా చేయాలి. నన్ను చూసి అంతా తిక్క సినిమాలు చేస్తాడంటూ తిట్టుకోవాలి అని అంటున్నారు మనోజ్. ‘ఊ కొడతారా... ఉలిక్కిపడతారా’ అనే చిత్రాన్ని రాజా దర్శకత్వంలో అంతా ఉలిక్కిపడేలా వాణిజ్యవిలువలతో ప్రయోగాత్మకంగా త్వరలో చేస్తున్నానని చెప్పారు. |
సిద్దార్ధ - శృతిహసన్ ల స్నేహం ముదిరింది
ఇటీవల భార్యకి విడాకులు ఇచ్చిన సిద్దార్ధతో కమల్ హసన్ కుమార్తె శృతి సన్నిహితంగా ఉంటోందని, ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. సిద్దార్ధ చిత్రం ‘స్ట్రైకర్’ ప్రీమియర్ షోకి కూడా వీరిద్దరూ కలిసే వచ్చారట. వీరు ప్రస్తుతం ‘యోధ’ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. అప్పటి నుండి వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమ వరకూ వచ్చిందని ఇటీవల సిద్దార్థను శృతి తన తల్లిదండ్రులకు పరిచయం చేసిందని అంటున్నారు.
|
ఇవివి సినిమా పతాకంపై ‘సారీ మూర్తిగారూ’
దాసరి ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ‘రావణ’, సిరిమీడియా పతాకంపై ‘పితృదేవోభవ’ పేర్లు ఫిలింఛాంబర్లో రిజిస్టర్ చేశారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, స్రవంతి మూవీస్ ‘టామ్ అండ్ జెర్రీ’, సురేష్ ప్రొడక్షన్స్ ‘రాముడు - భీముడు’, క్రియేటివ్ కమర్షియల్స్ ‘షాడో’, ఎస్.పి.ఎంటర్ టైన్ మెంట్స్ ‘ఫ్యాషన్ డిజైనర్’ (సన్నాఫ్ లేడీస్ టైలర్), ఫ్లెయింగ్ ప్రాగ్స్ పతాకంపై ‘మనసారా...’ అనే పేర్లు రిజిస్టర్ చేశారు. |
------------------------------------------------------ |
బాలకృష్ణ ‘సింహా’ ఏప్రిల్ 16 విడుదల
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నిర్మిస్తున్న ‘సింహా’ టాకీ పూర్తయ్యింది. నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్ కథానాయికలుగా చేస్తున్న ఈ చిత్రం పాటల షూటింగ్ 22 నుండి విదేశాల్లో జరుగుతుంది. పాటల విడుదల మార్చి 5న చేస్తారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదల చేయాలనుకుంటున్నారు.
|
ప్రభుదేవా ‘నవరస’ నాట్య నిలయం
ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న, ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, చిత్ర దర్శకుడు ప్రభుదేవా అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ నాట్యశాలను ఏర్పాటు చేస్తున్నారు. ‘నవరస’ పేరుతో నిర్వహించే ఈ నాట్యశాలను ప్రపంచమంతటా విస్తరించాలని ప్రభుదేవా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరు, కాలిఫోర్నియా, మలేషియాల్లో ‘నవరస’ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
|
శింబుతో గాఢమైన ముద్దు సీన్లో త్రిష
శింబు నాకు మంచి మిత్రుడు, అతను అందరూ అనుకుంటున్నట్లు చెడ్డవాడు కాడంటూ ఈ మధ్య ప్రకటనలిచ్చిన త్రిష, శింబుతో నటించిన ‘‘విన్నైతాండి వరువాయా’’లో అతనితో ఘాటైన ముద్దు సీన్ లో నటించింది. కథా గమనానికి కీలమైన సన్నివేశం కనుక ఈ ముద్దు సన్నివేశానికి ‘నో’ చెప్పలేక పోయానని సమర్థించుకుంటోంది త్రిష. గౌతంమీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో నాగచైతన్య - సమంత జంటగా ‘ఏ మాయ చేశావె’ పేరుతో నిర్మించారు.
|
మణిరత్నం ‘రావణ్’ (అశోకవనం) మే 21న విడుదల
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య జంటగా విక్రమ్ ప్రతినాయకుడిగా మణిరత్నం నిర్మించిన ‘రావణ్’ మే 21న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విక్రమ్, ఐశ్వర్య జంటగా నటించారు. ఇందులో ప్రియమణి, పృధ్వీరాజ్ మరో జంటగా చేశారు. దీనికి ‘అశోకవనం’ అని పేరు పెడుతున్నారు.
|
రాయలసీమ నేపధ్యంలో సునీల్ ‘మర్యాదరామన్న’
‘అందాల రాముడు’ తర్వాత సునీల్ హీరోగా చేస్తున్న ‘మర్యాదరామన్న’ షూటింగ్ రామోజీఫిలిం సిటీలో జరుగుతోంది. ‘మగధీర’ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షనిజమ్ నేపధ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ వినోదాత్మక చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు.
|
------------------------------------------------------ |
మహేష్ - లింగుసామి, నాగార్జున - గౌతమ్ మీనన్...
మన అగ్రహీరోల కొత్త చిత్రాల గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వస్తుంటాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల చిత్రం ఈ వేసవిలో వస్తుందని అంటున్నారు. దీని తర్వాత శ్రీనువైట్లతో చిత్రం చేస్తున్న మహేష్, లింగుసామి దర్శకత్వంలో కూడా చేసే ఆలోచనతో ఉన్నారట. ‘కేడి’గా మన ముందుకొచ్చిన నాగార్జున రాధామోహన్ తో చేస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం అవుతోంది. నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రం చేయాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. |
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కొత్త ప్రేమ
ఇటీవల భార్యకు విడాకులిచ్చిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కొత్త ప్రేమలో పడ్డాడని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ డాన్స్ మాస్టర్ బోనీ వర్మతో ప్రకాష్ రాజ్ ప్రేమాయణం సాగిస్తున్నాడని, వారిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని అంటున్నారు. వీరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని, బోనీ వర్మ తల్లిదండ్రులు అందుకు అంగీకరించారని తెలుస్తోంది.
|
ఈశ్వర్ రెడ్డితో రామానాయుడు, రేలంగితో దాసరి...
‘మీ శ్రేయోభిలాషి’ వంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. దీనికి బలభద్రపాత్రుని రమణి రచన చేస్తున్నారు. ‘యంగ్ ఇండియా’ పేరుతో 81 మంది కొత్త వారిని పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్న దాసరి నారాయణరావు దీని తర్వాత రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఓ హాస్య చిత్రం చేయాలనుకుంటున్నారట. ఇందులో రాంజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ మామా అల్లుళ్ళుగా అలరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
మళ్ళీ నటిస్తానంటూ ఊరిస్తున్న చిరంజీవి
రాజకీయాల్లోని ఇబ్బందులు ఊహించనివేమీ కావు. దానికి మానసికంగా తయారవ్వకుండా నేను రాలేదు. అలా వచ్చాను కనుకనే ఏదీ నన్ను బాధ పెట్టట్లేదు. ఇక సినిమా విషయాల కొస్తే... ఇకపై నేను సినిమాలు చేయలేను అనుకుంటున్నాను. కానీ, ఎక్కువ మంది మళ్ళీ నన్ను వెండితెరపై చూడాలని బలంగా కోరుకుంటే... బహుశా అది జరుగుతుందేమో - అంటూ తన సినిమారంగ పునర్ ప్రవేశంపై తెలివిగా చెబుతున్నారు చిరంజీవి ఓ తాజా ఇంటర్వ్యూలో |
గోపీచంద్ తో పరశురామ్, తనిష్ తో రవికుమార్....
‘శౌర్యం’ హీరో గోపీచంద్ తో యువత దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాత నిర్మిస్తారు. ‘ఈ తరం’ చిత్రాల నిర్మాత పోకూరి బాబూరావు ‘రైడ్’ హీరో తనిష్ తో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తారు.
|
------------------------------------------------------ |
పవన్ కళ్యాణ్ -విజయభాస్కర్- త్రివిక్రమ్ కాంబినేషన్
‘స్వయంవరం’, ‘నువ్వేకావాలి’, ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్ చిత్రాలు అందించిన విజయభాస్కర్ -త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఈమధ్య విడిపోయారు. త్రివిక్రమ్ దర్శకుడిగా విజయవంతం అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం కోసం వీరు తిరిగి కలిశారు. నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే, విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేస్తున్నారు. ఏప్రిల్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. |
నిలబడి నీళ్ళు తాగుతానంటున్న కాజల్
కాజల్ బాలీవుడ్ చిత్రాలవైపు చూస్తోంది- అంటూ ఈమధ్య మీడియాలో వార్తలు చూస్తున్నాను. ఇక్కడ నన్ను మహరాణిలా చూసుకుంటుంటే... బాలీవుడ్ వేపు చూడాల్సిన అవసరం ఏంటి చెప్పండి? పరుగెత్తి పాలుతాగడం కంటే, నిలబడి నీళ్ళు తాగడం అంటేనే నాకిష్టం. ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు సినిమాలపైనే- అంటూ చెబుతోంది ‘మగధీర’ నాయిక కాజల్ అగర్వాల్. |
తెరపైన పూరి జగన్నాథ్ కనిపిస్తారు
ఈమధ్య రాజమౌళి, వినాయక్ కొన్ని సన్నివేశాల్లో కాసేపు తెరపైన కనబడ్డారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కనిపిస్తారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నిర్మిస్తున్న ‘ఏ మాయ చేసావె’లో పూరి జగన్నాథ్ తన నిజజీవిత పాత్రనే కాసేపు పోషించారట. అతని అసిస్టెంట్ గా నాగచైతన్య చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం మార్చి 26న విడుదలవుతోంది. |
పైరసీ దోపిడిపై మండిపతున్న శ్రియ
శరత్ కుమార్, శ్రియ నటించిన ‘జగ్గూభాయ్’ విడుదలకు ముందే పైరసీకి గురయ్యింది. ఈ విషయమై శ్రియ మండిపడుతోంది. సినిమా కోసం నిర్మాత కోట్లు ఖర్చుపెడుతారు. ఎంతోమంది ఎంతోకాలం శ్రమిస్తేనే సినిమా తయారవుతోంది. ఆ శ్రమని పైరసీదారులు దోపిడీ చేయడం అన్యాయం. ఇలా అయితే, భవిష్యత్తులో సినిమాకన్నా పైరసీయే పెద్ద పరిశ్రమగా మారిపోతుంది. అలా జరగకూడదని- అంటోంది శ్రియ.
|
సిద్దార్థ హీరోగా శంకర్ యూత్ చిత్రం?
తన వద్ధ దర్శకత్వ శాఖలో పనిచేసిన సిద్దార్థను ‘బోయ్స్’లో హీరోగా పరిచయం చేశారు శంకర్. ఆ తర్వాత సిద్దార్థ దక్షిణాది చిత్రాల్లో పాపులర్ హీరో అయ్యాడు. ‘రోబో’ తర్వాత శంకర్ సిద్దార్థ హీరోగా యూత్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. |
------------------------------------------------------ |
మహేష్ బాబు - శ్రీనువైట్ల చిత్రం మేలో ప్రారంభం
‘14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్’ పతాకంపై వెంకటేష్ - శ్రీనువైట్ల కాంబినేషన్ లో ‘నమో వెంకటేశ’ విడుదలయ్యింది. ఇదే నిర్మాతలు శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబుతో ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకునే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభమవుతుంది.
|
మార్చిలో రామ్ - ఇలియానాల చిత్రం ప్రారంభం
‘కిక్’ దర్శకుడు సురేందర్ తో రామ్ - ఇలియానా జంటగా స్రవంతి రవికిషోర్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. వినోద ప్రధానంగా ఉండే ఈ చిత్రానికి ‘టామ్ అండ్ జెర్రీ’ అని పేరు పెడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభం అవుతుంది.
|
శ్రీకాంత్ ఓ పక్క ‘సేవకుడు’, మరోపక్క ‘దొంగ’
‘మహాత్మ’గా 100వ చిత్రాన్ని చేసిన శ్రీకాంత్ హీరోగా ప్రస్తుతం ఓ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘అధినేత’ దర్శకుడు సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ త్వరలో ‘సేవకుడు’ అనే చిత్రంలో చేస్తున్నారు. ‘మహాత్మ’ నిర్మాతలు నటుడు జి.వి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రంగ ది దొంగ’ చిత్రంలోనూ నటించడానికి అంగీకరించారు.
|
మే 20న ఎన్టీఆర్ - బుజ్జిల చిత్రం ప్రారంభం
ప్రస్తుతం ‘బృందావనం’, ‘శక్తి’ చిత్రాల్లో నటిస్తున్న ఎన్టీఆర్ త్వరలో నల్లమలుపు బుజ్జి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం మే 20న ప్రారంభమవుతుంది. దీనికి ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. బుజ్జి నిర్మాతగా త్వరలో వెంకటేష్ - అమ్మరాజశేఖర్ ల కాంబినేషన్లో ‘గంగ’ ప్రారంభమవుతుంది.
|
త్వరలో ప్రభాస్, దశరధ్, దిల్ రాజుల చిత్రం
ప్రభాస్ తో ‘మున్నా’ నిర్మించిన నిర్మాత దిల్ రాజు తిరిగి ప్రభాస్ తో మరో చిత్రం చేస్తున్నారు. దీనికి దశరధ్ దర్శకత్వం వహిస్తారు. మార్చిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. దిల్ రాజు ప్రస్తుతం వరుణ్ సందేష్ తో ‘మరో చరిత్ర’, ఎన్టీఆర్ తో ‘బృందావనం’, రామ్ తో ‘రామరామ - కృష్ణ కృష్ణ’ చిత్రాలు నిర్మిస్తున్నారు.
|
------------------------------------------------------ |
రెహమాన్కు రెండు 'గ్రామీ' అవార్డులు
సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డులకు రెండు విభాగాల్లో నామినేట్ అయిన రెహమాన్ రెండింటిలోనూ అవార్డులు సాధించారు. 'స్లమ్డాగ్ మిలియనీర్' సంగీతానికి, 'జయహో' పాటకు ఈ అవార్డులు లభించాయి. గత ఏడాది ఆస్కార్ అందుకున్న రెహమాన్ ఈసారి కూడా 'కపుల్స్ రిట్రీట్' చిత్రంలోని 'నా... నా' అనే పాటకు ఆస్కార్కు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.. |
'మగధీర', 'అదుర్స్' కాపీ కథనాలు
1998లో తను రాసిన 'చందేరి' నవల ఆధారంగానే 'మగధీర' నిర్మించారని దానికి తనకు 50 లక్షల పరిహారం ఇప్పించాలంటూ ఎస్.పి.చారి అనే రచయిత కోర్టుని శ్రయించారు. అదే విధంగా ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్' చిత్ర కథ తనదేనంటూ, ఎన్టీఆర్కు తను చెప్పిన కథతోనే ఆ చిత్రం నిర్మించారని, ఆందుకు పరిహారం ఇప్పించాలంటూ - రాంరెడ్డి అనే విద్యార్థి ఉస్మానియా జె.ఎ.సి నేతలకు ఫిర్యాదు చేశాడు.
|
ప్రియంక రోల్మోడల్ షారుక్ ఖాన్
షారుక్ నాటకరంగం నుండి తన కెరీర్ ప్రారంభించి, ఆపై బుల్లితెరపై అవకాశాలు సంపాయించారు. అక్కడ వచ్చిన గుర్తింపుతో వెండితెరకు వచ్చి ఇప్పుడు 'బాలీవుడ్ బాదుషా'గా ఎదిగారు. ఈ పరిణామ క్రమంలో అతనికి ఎవరి సహాయం లేదు. స్వయంకృషితో ఎదిగిన షారుక్ అంటే నాకు ఎంతో అభిమానం. అతన్ని ఆదర్శంగా తీసుకుంటానని అంటోంది ప్రియంక చోప్రా.
|
5 లక్షలతో ఎన్టీఆర్ కారు నెంబర్
ఫ్యాన్సీ నెంబర్లు ఆర్టీయేవారు వేలం వేస్తారు. అందరినీ ఆకర్షించిన '9999' నంబర్ను 'అదుర్స్' హీరో ఎన్టీఆర్ 5 లక్షలకు స్వంతం చేసుకున్నారు. 'త్రీ ఇడియట్స్', '2012', 'అవతార్' వంటి చిత్రాలు చూసిన ప్రేక్షకులు ఇక్కడి సినిమాల్లోనూ వైవిధ్యం కోరుతున్నారు. భవిష్యత్లో తెలుగులో కొత్తరకం సినిమాలు తప్పకుండా వస్తాయి - అని అంటున్నారు ఎన్టీఆర్. |
ఎవిఎస్ దర్శకత్వంలో కృష్ణుడి 'కోతి మూక'
ప్రముఖ హాస్య నటుడు ఎవిఎస్ మళ్ళీ దర్శకత్వం వహిస్తున్నారు. 'వినాయకుడు' కృష్ణుడు హీరోగా, శ్రద్ధ ఆర్య హీరోయిన్గా 'కోతిమూక' అనే చిత్రం నిర్మిస్తున్నారు. జనార్థన మహర్షి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందంతో సహా పలువురు ప్రముఖ కమేడియన్లు నటిస్తారు. ఫోటోగ్రఫీ: శ్రీనివాసరెడ్డి, సంగీతం: మణిశర్మ అందిస్తున్నారు.
|
------------------------------------------------------ |
ధరణి దర్శకత్వంలో రామ్ చరణ్ చిత్రం
‘మగధీర’తో ఘన విజయాన్ని సాధించిన రామ్ చరణ్ ‘ఆరంజ్’పేరుతో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘బంగారం’ చిత్రానికి దర్శకత్వం వహించిన ధరణి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రం చేసేందుకు అంగీకరించాడు. ప్రముఖ నిర్మాతలు మెగాసూపర్ గుడ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. |
పెళ్ళికి సిద్ధమయిన గ్లామర్ నటి ఛార్మి
తెలుగులో పలువురు పెద్ద హీరోలతో నటించిన గ్లామర్ నటి ఛార్మి అప్పట్లో... కృష్ణవంశీతో, ఇటీవల... దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమలో పడ్డట్లు వార్తలొచ్చాయి. ‘మంత్ర’ వంటి విజయాల తర్వాత ఛార్మి చేసిన చిత్రాలన్నీ వరుస పరాజయం పాలవ్వడంతో, ఛార్మి కన్నడలో చిన్న చిత్రాలకు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆమె పంజాబులో ఓ వ్యాపారవేత్తతో పెళ్ళి ప్రయత్నాల్లో వుందని తెలుస్తోంది. త్వరలోనే అతనితో పెళ్ళికి సిద్ధమవుతోందని అంటున్నారు. |
విష్ణువర్థన్ దర్శకత్వంలో రామ్ ద్విభాషా చిత్రం
అజిత్, అనూష్క జంటగా తమిళంలో ‘బిల్లా’కు దర్శకత్వం వహించిన విష్ణువర్థన్ త్వరలో ఓ తెలుగు - తమిళ చిత్రం చేస్తున్నారు. ‘రెడీ’ హీరో రామ్ హీరోగా భారీస్థాయిలో ఈ చిత్రం త్వరలో ప్రారంభం అవుతుంది. |
నాలుగు పాత్రలు చేస్తానంటున్న ఎన్టీఆర్
దర్శకత్వం వహిస్తూనే మా తాతగారు ‘దానవీర శూర కర్ణ’లో మూడు పాత్రలు చేసి మెప్పించారు. ఆ మూడు పాత్రలూ నేను చేయాలనుకుంటున్నాను. అలాగే వినాయక్ కి కూడా ఈ చిత్రం అంటే చాలా ఇష్టం. దీనికి దర్శకత్వం చేయడానికి వినాయక్ ఒప్పుకుంటే, అతన్ని ఒప్పించి భీముడి పాత్ర కూడా నేనే చేస్తాను- అని అంటున్నారు ‘అదుర్స్’ హీరో ఎన్టీఆర్.
|
‘దశావతారం’లో కమల్ మేకప్ కి 600గంటలు
నా సినీ జీవితంలో నేను ఎక్కువ రిస్క్ తీసుకున్న చిత్రం ‘దశావతారం’. ఒకే నటుడు 10 పాత్రలు చేయడం ఏంటి? విడ్డూరంకాకపోతే. మెంటల్ లక్షణాలున్నాయేమోనని చాలామంది అనుకున్నారు. నేను వాటిని లక్ష్య పెట్టలేదు. ఈ చిత్రంలో నా మేకప్ కి 600గంటలు వెచ్చించానంటే, ఆ సినిమా మీద నాకు ఎంత ప్రేమ వుందో మీకు అర్థమవుతుంది- అంటూ చెబుతున్నారు కమల్ హసన్. |
------------------------------------------------------ |
మార్చిలో నాగచైతన్య 'ఏం మాయ చేశావో' విడుదల
'జోష్' హీరో అక్కినేని నాగచైతన్య తన రెండవ చిత్రంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శింబు, త్రిష జంటగా తమిళంలో గౌతమ్ మీనన్ చేస్తున్న 'నిన్తైతాండి వరువాయా' చిత్రం ఆధారంగా దీన్ని ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సూపర్స్టార్ కృష్ణ కుమార్తె మంజుల నిర్మిస్తున్నారు. చెన్నైలోను, విదేశాల్లోనూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
|
సీరియస్ పాత్రలంటేనే హన్సికకి ఇష్టం
నిజానికి నాకు సీరియస్ పాత్రలంటేనే ఇష్టం. అయితే, ఈ వయసులో అటువంటి పాత్రలు చేయడం బాగుండదు. అవి చేయడానికి ఇంకా చాలా టైముంది. ఇప్పుడు నా వయసుకు తగిన పాత్రలే చేస్తాను - అంటూ చెబుతోంది ముంబై ముద్దుగుమ్మ హన్సిక. తెలుగులో ఇప్పటికి ఆరు సినిమాలు చేశాను కాబట్టి అభిమానుల కోసం కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నాను. నా పాత్రలకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నానని అంటోంది.
|
త్వరలో సిద్దార్థ 'యోధ', రవితేజ 'వీర'
రామ్చరణ్ తేజ నటించిన 'మగధీర' ఘన విజయంతో మనవాళ్ళ దృష్టి ఇప్పుడు 'వీర' రసం వేపు మళ్ళింది. ఇదే తరహాలో సిద్దార్థ హీరోగా రాఘవేంద్రరావు కుమారుడు సూర్యప్రకాష్ నిర్మిస్తున్న చిత్రానికి 'యోధ' అని పేరు పెడుతున్నారు. రమేష్వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న చిత్రానికి 'వీర' అని పేరు పెట్టారు. ఇటీవల సల్మాన్ఖాన్ హీరోగా హిందీలో వచ్చిన ఈ తరహా చిత్రం 'వీర్' పరాజయం పాలయ్యింది.
|
వెండితెరపై కాజోల్ మళ్ళీ బిజీ
అగ్ర నాయికగా ఉన్న సమయంలోనే అజయ్దేవ్గన్ను పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన కాజోల్ ఇప్పుడు మళ్ళీ నటిగా విజృంభిస్తోంది. హిట్ పెయిర్గా పేరు పడ్డ షారుఖ్ - కాజోల్ నటించిన 'మై నేమ్ ఈజ్ ఖాన్' త్వరలో విడుదలవుతోంది. కిరీటి ఖురానా దర్శకత్వంలో చేసిన 'తూన్ పూర్ కా సూపర్ హీరో', సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో చేసిన 'లవ్ యూ మా' చిత్రాలు కూడా ఇదే సంవత్సరం విడుదలవుతాయి.
|
ఐటమ్ సాంగ్స్లో మెరుస్తున్న శ్రియ, ఐశ్వర్య
గ్లామర్ తారలు ఐటమ్ సాంగ్స్లో కనిపించినా ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణే అవుతుంది. 'దేవదాసు', 'తులసి' మొదలైన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియ ఇప్పుడు 'పులి'లో ఓ పాట చేస్తుందని తెలిసింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ పవన్ కళ్యాన్ చిత్రానికి ఎస్.జె.సూర్య దర్శకుడు. అందాల తార ఐశ్వర్య అక్షయ్ హీరోగా చేస్తున్న 'హౌస్ఫుల్'లో భారీ బడ్జెట్తో తీస్తున్న ఐటమ్ సాంగ్లో చేస్తోంది. ఐశ్వర్య గతంలో చేసిన 'ఇష్క్ కమీనా' 'కజరారే' పాటలు సంచలనం సృష్టించాయి.
|
------------------------------------------------------ |
ఫిబ్రవరి 15 నుండి నాగార్జున - రాధామోహన్ ల చిత్రం
‘ఆకాశమంత’ చిత్రంతో మంచి పేరు సంపాయించిన రాధామోహన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ చిత్రం ప్రారంభం అవుతోంది. త్రిభాషా చిత్రంగా రూపొందే ఈ చిత్రాన్ని హిందీలో బోనీకపూర్, తమిళ్ లో ప్రకాష్ రాజ్, తెలుగులో దిల్ రాజు నిర్మిస్తారు. ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి తెలుగులో ‘వాంటెడ్’ అనే పేరు పరిశీలనలో ఉంది. |
నాగచైతన్యతో కాజల్, అర్జున్ తో తమన్నా...
నాగచైతన్య హీరోగా నటించే మూడవ చిత్రంలో అతని సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. శివప్రసాద్ రెడ్డి నిర్మించే ఈ చిత్రానికి అజయ్ భూయన్ దర్శకత్వం వహిస్తారు. అల్లు అర్జున్ తో వినాయక్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో తమన్నా నాయికగా చేస్తోంది. గీతా ఆర్ట్స్ భారీస్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.
|
ప్రభాస్ - రాజమౌళి చిత్రానికి కథ సిద్ధం
’మగధీర‘ తర్వాత రాజమౌళి సునీల్ హీరోగా ’మర్యాద రామన్న’ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్ హీరోగా అన్ని కమర్షియల్ హంగులతో ఓ భారీ చిత్రం ప్రారంభిస్తున్నారు. దీనికి కథ సిద్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు నిర్మిస్తారు.
|
త్వరలో వెంకటేష్ - రాజశేఖర్ ల ’గంగ‘
’లక్ష్మీ‘ గా నటించిన వెంకటేష్ ’గంగ‘ గా మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్న చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. డాన్స్ మాస్టర్ నుండి సినిమా డైరెక్టర్ గా ఎదిగిన అమ్మ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయవంతమైన చిత్రాల నిర్మాత బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మించారు. |
’బావ‘ సిద్దార్ధకు తండ్రిగా రాజేంద్రప్రసాద్?
సిద్దార్ధ హీరోగా రాంబాబు దర్శకత్వంలో ‘బావ’ అనే చిత్రాన్ని కుమార చౌదరి ఇటీవల ప్రారంభించారు. పూర్తి వినోదాత్మకంగా గోదావరి పల్లె వాతావరణంలో రూపొందే ఈ చిత్రంలో ’సిద్దార్ధ‘ తండ్రి పాత్రకు ప్రత్యేకత ఉంటుందని, దాన్ని ఓ ప్రముఖ హీరో చేస్తారని దర్శకుడు చెప్పారు. ఆ పాత్రను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ పోషిస్తారని తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
ఫిబ్రవరి 4న నాగార్జున ’కేడి‘ విడుదల
నాగార్జున - మమతామోహన్ దాస్ జంటగా కిరణ్ దర్శకత్వంలో శివ్రసాద్ రెడ్డి నిర్మించిన ’కేడి‘ ఫిబ్రవరి 4న విడుదలవుతోంది. నాగార్జున రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతాన్ని అందించారు. |
రానా ‘లీడర్‘లో శివాజీపై స్పెషల్ పాట
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రామానాయుడు మనవడు రానా హీరోగా పరిచయం అవుతున్న ’లీడర్‘ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే, ఈ చిత్రం బెటర్ మెంట్ కోసం ఇటీవల కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే, హీరో శివాజీపై ఓ పాటను కూడా చేయబోతున్నారు. ఈ చిత్రంలో ఉదయభానుపై ఖవ్వాలీ తరహాలో ఇంతకు ముందే ఓ పాట పెట్టారు. |
విజయకాంత్ ప్రారంభిస్తున్న ’కెప్టెన్‘ ఛానెల్
ప్రముఖ తమిళ నటుడు, డి.ఎం.డి.కె. పార్టీ స్థాపకుడైన విజయకాంత్ స్వంత టివి ఛానెల్ ను ప్రారంభిస్తున్నారు. ‘ కెప్టెన్’ ఛానెల్ పేరుతో ఉండే ఈ ఛానెల్ లో వినోద కార్యక్రమాలతో పాటు వార్తలు కూడా ప్రసారం చేస్తారు. ఇప్పటికే తమిళనాట ‘సన్’, ‘కలైంగర్’ (డి.ఎం.కె.), ‘జయ’(ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.), మక్కర్ (పి.ఎం.కె), కాంగ్రెస్ నేత వసంత్ కుమార్ ‘వసంత్‘ ఛానెల్ ఉన్నాయి. తెలుగులో చిరంజీవి, నాగార్జున ‘మాటివి’లో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. |
పూరిజగన్నాధ్ ’గోలీమార్‘లో ముమైత్ పాడింది
గోపీచంద్, ప్రియమణి జంటగా పూరిజగన్నాధ్ దర్శకత్వంలో ’గోలీమార్‘ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చ్రకి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ఓ పాట పాడటం విశేషం. చ్రకి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ఓ పాట పాడటం విశేషం. ’పోకిరి‘తో ముమైత్ ఖాన్ కు డాన్సర్ గా బ్రేక్ ఇచ్చిన పూరి జగన్నాధ్ ఇప్పుడు గాయనిగా కూడా పరిచయం చేస్తున్నారు.
|
వీరభద్ర చౌదరి దర్శకత్వంలో ’ఎం.ఎల్.ఎ‘గా నరేష్
ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వీరభద్ర చౌదరి దర్శత్వంలో అనిల్ సుంకర ఓ చిత్రం చేస్తున్నారు. నరేష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి ‘ఎం.ఎల్.ఎ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అని పేరు పెడుతున్నారు. గతంలో ఈ పేరు ఎన్టీఆర్ హీరోగా చేసే చిత్రానికి పెట్టాలని అనుకున్నారు. |
------------------------------------------------------ |
'పంచాక్షరి'లో మగ పాత్రలో అనుష్క?
'అరుంధతి'తో అగ్రస్థాయికి చేరిన అనుష్క ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రం 'పంచాక్షరి'లో చేస్తోంది. సముద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున మేకప్ మేన్ చంద్ర నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అనుష్క మగ పాత్రలో కనిపిస్తుందట. సినిమాలో దాదాపు సగభాగం ఆమె ఆ గెటప్లోనే ఉంటుందని అంటున్నారు.
|
వినాయక్ దర్శకత్వంలో పవన్కళ్యాణ్ చిత్రం?
'పులి'గా వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్కళ్యాణ్ '3 ఇడియట్స్' తెలుగులో అమీర్ఖాన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలొచ్చాయి. 'అదుర్స్' దర్శకుడు వినాయక్ సిద్ధం చేసిన ఓ కథ పవన్కళ్యాణ్కి నచ్చడంతో త్వరలో చేసేందుకు పవన్కళ్యాణ్ అంగీకరించారని అంటున్నారు. ఈ ఏడాది నుండి తను నటించే చిత్రాల వేగం, సంఖ్య పెంచాలని పవన్కళ్యాణ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
|
హోటల్ బిజినెస్లోకి త్రిష, అసిన్
డిమాండ్ ఉన్న హీరోయిన్లు త్రిష, అసిన్ ఇప్పుడు హోటల్ బిజినెస్లోకి అడుగిడుతున్నారు. తమ ఆదాయాన్ని ఎక్కడో పెట్టడం కన్నా, ఇష్టమైన హోటల్ బిజినెస్లో పెట్టడమే మంచిదని అనుకుంటున్నారు. త్రిష ఇప్పటికే హోటల్ నిర్మాణం ప్రారంభించిందని, అసిన్ చెన్నైలో హోటల్ పెట్టే పనిలో ఉందని తెలుస్తోంది, ఫిలింస్టార్స్ పెట్టే హోటల్కి సహజంగానే స్టార్ ఇమేజ్ ఉంటుంది.
|
చౌదరి దర్శకత్వంలో చిరు మేనల్లుడు తేజ
ఇటవల 'సలీమ్' అందించిన వై.వి.ఎస్.చౌదరి త్వరలో తమ 'బొమ్మరిల్లు' సంస్థపై ఓ చిత్రం ప్రారంభిస్తారు. ఇందులో చిరంజీవి మేనల్లుడు తేజ హీరోగా పరిచయం అవుతారని, భారీ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.
|
బాల చిత్రంలో విశాల్ సరసన వరలక్ష్మి
శరత్కుమార్ కుమార్తె వరలక్ష్మి త్వరలో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో చేయాలనుకున్నా అవి వర్కవుట్ కాలేదు. ఇప్పుడు 'నేను దేవుడిని' దర్శకుడు బాల దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో చేసేందుకు అంగీకరించింది. ఇందులో విశాల్, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. వినోదాత్మకంగా ఉండే ఈ చిత్రంలో హీరోల గెటప్లు కొత్తగా ఉంటాయట.
|
------------------------------------------------------ |
సురేందర్ 'మిస్టర్ పెర్ఫెక్ట్'లో 'పోకిరి' జంట
సూపర్హిట్ అయిన 'పోకిరి'లో మహేష్బాబు, ఇలియానాల జంట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ జంట త్వరలో మరోసారి తెరపై కనిపిస్తారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ నిర్మిస్తున్న 'మిస్టర్ పెర్ఫెక్ట్'లో మహేష్బాబు సరసన ఇలియానా నాయికగా చేస్తోంది. ఈ వేసవిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. |
కమల్హసన్తో పోటీపడుతున్న మమ్ముట్టి
కమల్హసన్తో తాను పోటీపడుతున్నట్లు మమ్ముట్టి ఇటీవల ఓ ఫంక్షన్లో మాట్లాడుతూ చెప్పారు. అయితే, ఇది ఆరోగ్యకరమైన పోటీ అని అన్నారు. ఈ ఇద్దరు నటులు చెరో మూడుసార్లు జాతీయ అవార్డులు పొందారు. ఈసారి ఎవరికి అవార్డు వస్తే, వారిదే అగ్రస్థానం అవుతుంది. ఈ విషయం కమల్తో కూడా చెప్పానని మమ్ముట్టి అంటున్నారు. మమ్ముట్టి ఇటీవల నటించిన 'పళజిరాజా' చిత్రంలో పాత్రకు మరోసారి అతనికి జాతీయ అవార్డు లభించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
|
ఆత్మకథ ఆల్బమ్ రూపకల్పనలో జాకీచాన్
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన చైనా యాక్షన్ హీరో జాకీచాన్ కొంతకాలం పాటు షూటింగ్లకు విరామం ఇస్తున్నారు. పోరాట సన్నివేశాలు చేసి చేసి అలసిపోయి ఇస్తున్న విరామం కాదట అది. తన జీవిత విశేషాలతో ఓ ఆల్బమ్ రూపొందించేందుకే జాకీచాన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.
|
ఫిబ్రవరి నుండి రవితేజ హీరోగా 'డాన్ శీను'
నూతన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఆర్.ఆర్.మూవీమేకర్స్ నిర్మిస్తున్న 'డాన్ శీను' ఫిబ్రవరి నుండి షూటింగ్ జరుపుకుంటుంది. రవితేజతో త్రిష జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. |
ఆర్కే లక్ష్మణ్ సామాన్యుడిగా అక్షయ్ కుమార్
ప్రముఖ రచయిత ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన సామాన్యుడు (కామన్ మ్యాన్, కార్టూన్ పాత్ర)గా ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఓ వాస్తవ అంశం ఆధారంగా ప్రియదర్శన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'కట్టా - మీటా'లోని తన పాత్ర ద్వారా అక్షయ్ సామాన్యుడి అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ఈ చిత్రంలో కొన్ని రాష్ట్రాల్లో కనిపించే 'రోడ్ మాఫియా'పై విసుర్లు ఉంటాయట.
|
------------------------------------------------------ |
'రాణి రుద్రమదేవి'గా పవర్ఫుల్ పాత్రలో విజయశాంతి
'ప్రతిఘటన', ఒసే రాములమ్మా' చిత్రాలతో పవర్ఫుల్ కథానాయికగా పేరు సంపాయించిన విజయశాంతి ఇప్పుడు 'రాణి రుద్రమదేవి'గా నటిస్తోంది. 'ఒసే రాములమ్మా' తర్వాత నుండి తెలంగాణ నాయకురాలైన విజయశాంతి ఈ ప్రాంత కథాంశంతో సినిమా చేయాలనుకుంటోంది. కాకతీయుల రాణి రుద్రమదేవి పాత్ర తనకు బాగుంటుందని భావించి నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు త్వరలో... |
ఫరా అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లోకి రామ్చరణ్?
రామ్చరణ్ చేసిన 'మగధీర' బాలీవుడ్ దర్శకుడు ఫరా అక్తర్కి చాలా బాగా నచ్చిందట. దాంతో హిందీలో రామ్చరణ్తో ఓ చిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. హిందీ , తమిళ్, తెలుగులో రితేష్ సిద్వానీ నిర్మించే ఈ చిత్రంలో దీపికా పదుకొనే నాయిక కావచ్చునంటున్నారు. ఫరా అక్తర్ 'దిల్ చాహ్తా హై', 'లక్ష్య', 'డాన్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏప్రిల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. |
తెలుగు '3 ఇడియట్స్'లో హీరోలు ఎవరు?
హిందీలో సూపర్ హిట్ అయిన అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' తెలుగు, తమిళ్ రీమేక్ రైట్స్ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు భారీ మొత్తానికి స్వంతం చేసుకున్నారు. ఈ చిత్రం తమిళ్ వెర్షన్లో అమీర్ఖాన్ పాత్రను సూర్య చేస్తారని వార్తలొస్తున్నాయి. తెలుగులో ఆ పాత్రను మహేష్బాబు, లేదా పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. త్వరలో దీని వివరాలు తెలుస్తాయి. |
మాట నిలుపుకున్న 'పంచాక్షరి' అనూష్క
సినిమారంగంలో మాటమీద నిలబడేవారిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. 'అరుంధతి' అనూష్కను కూడా ఆ కోవలో చేర్చవచ్చు. 'సూపర్'తో తెలుగు సినిమా రంగానికి పరిచయం అయిన అనూష్క, ఆ చిత్రానికి తొలిసారి మేకప్ మేన్గా పనిచేసిన చంద్రకు అప్పట్లోనే - 'భవిష్యత్లో ఓ చిత్రం చేసి పెడతానని'' మాటిచ్చింది. 'అరుంధతి' తర్వాత ఇప్పుడు ఎంత డిమాండ్ పెరిగినప్పటికీ చంద్ర కోసం 'పంచాక్షరి' అనే చిత్రం చేస్తోంది.
|
చెన్నైలో మహేష్ - త్రివిక్రమ్ల చిత్రం
రాజస్థాన్ నేపథ్యంలో హైదరాబాద్ పరిసరాల్లో వేసిన భారీ సెట్ను తెలంగాణ వాదులు ధ్వంసం చేయడంతో మహేష్బాబు చిత్రం షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు అదే సెట్ను చెన్నైలో వేసి తిరిగి షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్. |
------------------------------------------------------ |
పవన్కళ్యాణ్తో గణేష్ చిత్రం మార్చిలో ప్రారంభం
'పులి' పూర్తి చేస్తున్న పవన్కళ్యాణ్, 'ఆంజనేయులు' నిర్మించిన నటుడు గణేష్బాబు నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి 'షాక్' దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. మార్చి నుండి భారీ స్థాయిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
|
అభిమానులకు ఇళ్ళు కట్టిస్తున్న రజనీకాంత్
కోట్లు పారితోషికంగా తీసుకున్నా అభిమానులను పట్టించుకోని హీరోలను మనం చూస్తూనే ఉన్నాం. దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ మాత్రం అందుకు భిన్నమైన వ్యక్తిగా చాలాసార్లు నిరూపించుకున్నారు. 32 మంది అభిమానులకు రజనీ ఇళ్ళు కట్టించి ఇస్తున్నారు. చెన్నైలోని కేళంబాక్కంలోని రజనీ ఫామ్ హౌస్ సమీపంలోనే వీటిని నిర్మిస్తారు.
|
నాగార్జున 'కేడి'లో అక్కినేని 'ముద్దు పాట'
'అదృష్టవంతులు'లో అక్కినేని, విజయలలితలపై చిత్రీకరించిన ''ము.. ము.. ముద్దంటే చేదా'' పాట అప్పట్లో పెద్ద హిట్. ఆ పాటను అక్కినేని నాగార్జున నటిస్తున్న 'కేడి'లో రీమిక్స్ చేసి పెడుతున్నారు. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
|
17 రోజులకే 'అవతార్'కు బిలియన్ డాలర్లు
ఇటీవల విడుదలైన 'అవతార్' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అతి తక్కువ రోజుల్లోనే బిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో మొదటిస్థానాన్ని సంపాయించింది. ఈ చిత్రం మొదటి 17 రోజులకే బిలియన్ డాలర్లు (దాదాపు 4850 కోట్లు) వసూలు చేసింది. ఇంతకు ముందు 'టైటానిక్', 'ది లార్డ్ ఆఫ్ రింగ్స్' (ద రిటర్న్ ఆఫ్ ది కింగ్), 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' (డెడ్ మేన్స్ చెస్ట్), 'ది డార్క్ నైట్' చిత్రాలు ఈ రికార్డు సాధించాయి.
|
తెలుగు 'రాకెట్ సింగ్' అల్లరి నరేష్
ఇటీవల బాలీవుడ్లో విడుదలైన 'రాకెట్ సింగ్' మంచి విజయం సాధించింది. సిక్కు గెటప్లో మార్కెటింగ్ రిప్రజెంటెటివ్గా రణబీర్కపూర్ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అల్లరి నరేష్ ఇందులో హీరోగా చేస్తారు.
|
------------------------------------------------------ |
'లీడర్' రానా రెండవ చిత్రం హిందీలో?
రామానాయుడు మనవడు రానా 'లీడర్'తో హీరోగా చిత్రరంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలవుతోంది. దీని తర్వాత రానా చేసే చిత్రం బాలీవుడ్లో ఉంటుందని వార్తలొస్తున్నాయి. మంచి ఫిజిక్తో ఉండే రానా హిందీ సినిమాలో రాణించే అవకాశాలు బాగా ఉన్నాయని భావిస్తున్న అతని కుటుంబీకులు రోహన్ సిప్పీ దర్శకత్వంలో చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రోహన్ సిప్పీ గతంలో 'బ్లఫ్ మాస్టర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. |
రవితేజతో టాలీ టు హాలీ చిత్రం
'ఆ ఒక్కడు', 'ప్రవరాఖ్యుడు' చిత్రాలను నిర్మించిన టాలీ టు హాలీ పతాకంపై రవితేజ హీరోగా మూడవ చిత్రం చేస్తున్నారు. గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ బ్యానర్లో సునీల్ హీరోగా రచయితలు గోపీమోహన్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా ప్లానింగ్లో ఉంది.
|
నాగార్జునతో జంటగా మరోసారి అనూష్క
'సూపర్', 'డాన్' చిత్రాల్లో నాగార్జునతో నటించిన అనూష్క ఇప్పుడు మరోసారి చేయబోతోంది. మార్చి నుండి ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం అనూష్క తెలుగులో మహేష్బాబుతో త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ, 'పంచాక్షరి' అనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం సముద్ర దర్శకత్వంలోనూ చేస్తోంది.
|
రాజశేఖర్తో కళ్యాణి సోషియోఫాంటసీ చిత్రం
భర్త సూర్యకిరణ్ దర్శకత్వంలో నటి కళ్యాణి 'చాప్టర్ 6' అనే చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో కళ్యాణి డా||రాజశేఖర్ హీరోగా ఓ సోషియోఫాంటసీ థ్రిల్లర్ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి కూడా సూర్యకిరణ్ దర్శకత్వం వహిస్తారు. శ్రీనివాసరాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉంటారు. |
మణిరత్నం దర్శకత్వంలో 'మౌనరాగం-2'
మణిరత్నం దర్శకుడయిన కొత్తలో చేసిన 'మౌనరాగం' మంచి విజయాన్ని సాధించింది. మోహన్, కార్తీక్, రేవతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సీక్వెల్గా హిందీ, తమిళ భాషల్లో ఓ చిత్రం చేసే ఆలోచన మణిరత్నంకు ఉందని తెలుస్తోంది. ఇందులో కార్తీక్ కొడుకు గౌతమ్ హీరోగా పరిచయం అవుతాడు.
|
------------------------------------------------------ |
త్వరలో బచ్చన్ కుటుంబమంతా నటించే చిత్రం
అమితాబ్, జయ కాంబినేషన్ తర్వాత ఇటీవల అమితాబ్,అభిషేక్ల కాంబినేషన్లో చిత్రాలు వచ్చాయి. ఈ మధ్యనే విడుదలైన 'పా' అభినందనలు అందుకుంటోంది. అయితే - అమితాబ్, జయ, అభిషేక్, ఐశ్వర్య... నలుగురూ కలిసి నటించే చిత్రం త్వరలో రాబోతోంది. అందుకు తగిన కథ కోసం అన్వేషిస్తున్నారు. 2010లోనే ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు అభిషేక్ చెప్పారు. |
గౌతమి దర్శకత్వంలో బాలచందర్ చిత్రం?
కమల్హసన్ తన గురువు కె.బాలచందర్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారు. దానికి కమల్ దర్శకత్వం వహించాలనుకున్నారు. అయితే ఇప్పుడు కమల్ నిర్మాతగా, స్క్రిప్టు రచయితగా, గౌతమి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందే అవకాశం ఉంది. మాధవన్ ఓ ముఖ్యపాత్ర పోషించే ఈ చిత్రానికి శృతిహసన్ సంగీతం అందిస్తుంది. |
జి.వి. దర్శకత్వంలో 'రంగ ది దొంగ'గా శ్రీకాంత్
నితిన్ 'హీరో'తో దర్శకుడైన నటుడు జి.వి దర్శకత్వంలో, శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం ప్రారంభం అవుతోంది. శ్రీకాంత్తో 'మహాత్మ' నిర్మించిన మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. 'రంగ ది దొంగ' పేరుతో రూపొందించే ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తారు. |
రెస్పెక్ట్ క్రియేషన్స్ చిత్రానికి కొత్తవారు కావాలి?
పోర్ట్ లాండ్ (ఓరెగాన్)కి చెందిన అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి అందరూ కొత్తవారితో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. 'కిట్టు' చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న భార్గవతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో ప్రారంభం అవుతుంది. ఆసక్తి ఉన్న నటీనటులు Respectcreations@Gmail.comకి ఫోటోలు పంపాలి.
|
ఉదయ్కిరణ్ 'నువ్వెక్కడుంటే - నేనక్కడుంటా'
ఉదయ్కిరణ్ ఈ మధ్య తమిళ చిత్రరంగంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళ్ - తెలుగు ద్విభాషా చిత్రాలు కూడా చేశారు. ఇప్పుడు మరో చిత్రం చేస్తున్నారు. అందులో శ్వేతబసు ప్రసాద్ కథానాయిక. ఈ చిత్రానికి 'నువ్వెక్కడుంటే - నేనక్కడుంటా' అని పేరు పెడుతున్నారు. |
------------------------------------------------------ |
కృష్ణవంశీ ‘కందిరీగ’ కాదు ‘జెండాపై కపిరాజు’
శ్రీకాంత్ తో ‘మహాత్మ’ అందించిన కృష్ణవంశీ రవితేజతో ‘కందిరీగ’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని కారణాంతరాల వల్ల ‘కందిరీగ’ బదులు, కృష్ణవంశీ గతంలో సిద్ధం చేసుకున్న ‘జెండాపై కపిరాజు’ను చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత.
|
నలుగురు హీరోయిన్లతో విశాల్ ‘కిలాడి’
‘పందెం కోడి’ విశాల్ ఇటీవల చేసిన చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. అందుకని ఇప్పుడు పక్కా మాస్ మసాలాతో మరో చిత్రం చేస్తున్నాడు. ‘తీర్థ విలయాట్టు పిళ్ళై’ పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్నేహ, నీతూచంద్ర, సారాజాన్, తనుశ్రీదత్తా హీరోయిన్లుగా చేస్తున్నారు. ‘కాసనోవా’ (విలాసపురుషుడు) తరహా పాత్రలో విశాల్ కనిపించే ఈ చిత్రానికి ‘కిలాడి’ అని పేరు పెట్టాలనుకుంటున్నారు.
|
‘బిల్లా’ విష్ణువర్థన్ తో ప్రభాస్ చిత్రం
‘బిల్లా’ తమిళ వెర్షన్కు దర్శకత్వం వహించిన విష్ణువర్థన్ కు ఆ చిత్రం చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘బిల్లా’ను తెలుగులో చేసిన ప్రభాస్ కు విష్ణువర్థన్ పనితనం నచ్చి, అతనితో త్వరలో ఓ చిత్రం చేయాలనుకుంటున్నారు. దీనికోసం విష్ణువర్థన్ చక్కటి కమర్షియల్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు.
|
ప్రముఖ హీరోతో ఢి.ఎస్.రావు ‘బసవ’
నితిన్ తో ‘ద్రోణ’ చిత్రాన్ని నిర్మించిన డి.ఎస్.రావు ఇప్పుడు నిఖిల్ హీరోగా ‘కళావర్ కింగ్’ తీస్తున్నారు. త్వరలో డి.ఎస్.రావు ‘బసవ’ పేరుతో ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఓ ప్రముఖ హీరో నటిస్తారు.
|
నందమూరి, చిరు చిత్రాలపై ప్రత్యేక ప్రభావం
ప్రత్యేక తెలంగాణ, సమైక్య ఆంధ్ర ఉద్యమాల ప్రభావం సినిమా రంగంపైనా పడింది. ఇప్పటికే బంద్ ల వల్ల వసూళ్ళకి గండి పడింది. ఇప్పుడు చిరంజీవి సమైక్య ఆంధ్ర అనుకూల విధానానికి వ్యతిరేకంగా తెలంగాణలో ‘ఆర్య-2’, ‘మగధీర’ చిత్రాలను నిలిపివేస్తున్నారు.హరికృష్ణ సమైక్యాంధ్ర విధానానికి వ్యతిరేకంగా 25న విడుదలవుతున్న ఎన్టీఆర్ ‘అదుర్స్’ను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారులు ప్రకటించారు.
|
------------------------------------------------------ |
ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ గా నయనతార
దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార మరో పక్క ఐటమ్ సాంగ్స్ చేయడంలో కూడా రాణిస్తోంది. గతంలో ‘శివకాశి’ అనే తమిళ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన నయనతార, ఆ తర్వాత వచ్చిన రజనీకాంత్ ‘శివాజీ’లోనూ ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు స్నేహ హీరోయిన్ గా చేస్తున్న ‘గోవా’లో, హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ‘మా పిళ్ళై’లోనూ చేస్తోంది. మలయాళంలోనూ ఆర్టిస్టులు నిర్మించిన చిత్రంలో నయనతార ఐటమ్ సాంగ్ చేసింది. |
ప్రభుదేవా ‘ఇచ్’లో శృతిహసన్
‘లక్’తో బాలీవుడ్, ‘యోధ’తో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శృతిహసన్ మాతృభాష తమిళంలో త్వరలో ఓ చిత్రం చేస్తోంది. ‘వాంటెడ్’తో హిట్ కొట్టిన ప్రభుదేవా దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఇచ్’లో ఆమె కథానాయికగా అంగీకరించింది.
|
కమల్ హసన్ - కె.ఎస్.రవికుమార్ లతో తమన్నా
‘ఈనాడు’ తర్వాత కమల్ హసన్ మిస్కిన్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేశారు. అయితే, ఈలోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఇటీవల సూర్యతో భారీ చిత్రం చేసిన కరుణానిధి మనవడు ఉదయనిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తోంది.
|
రామ్ చరణ్ చిత్రంలో మరో నాయిక సుజానె?
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటోంది. జెనీలియా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ముంబాయి మోడల్ సుజానె ఓ హీరోయిన్ గా చేస్తోందని తెలుస్తోంది. బాలీవుడ్లో ఇప్పటికే ఓ చిత్రంలో నటించిన సుజానెతో పాటు మరికొందరు ఉప కథానాయికలు ఈ చిత్రంలో ఉంటారని తెలుస్తోంది. జనవరిలో ఈ చిత్రం షెడ్యూల్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. |
మమ్ముట్టితో మలయాళంలోకి శ్రియ
గ్లామర్ నటిగా దక్షిణాదిలో మంచి డిమాండ్ సంపాయించుకున్న శ్రియ తొలిసారి మలయాళ చిత్రం చేస్తోంది. మమ్ముట్టి, పృథ్వీరాజ్ సోదరులుగా నిర్మిస్తున్న పూర్తి మసాలా చిత్రం ‘పోకిరిరాజా’లో ఆమె నాయికగా చేస్తోంది. రెమ్యూనరేషన్ తక్కువగా వుండే మలయాళంలో ఎందుకు చేస్తున్నారని అడిగితే- కథ మొత్తం నా చుట్టే తిరుగుతుంది. అందుకనే అంగీకరించానని- శ్రియ చెబుతోంది.
|
------------------------------------------------------ |
బికినీ బ్యాచ్ లో స్నేహ, దీపిక పదుకొనె
హీరోయిన్లు రెచ్చిపోయి బికినీ సీన్స్ లో కనిపిస్తుండటంతో ఇక తప్పదంటూ- సంసారపక్షంగా అనిపించే స్నేహ, దీపికపదుకొనె కూడా ‘బికినీ బ్యాచ్’లో చేరారు. త్వరలో రానున్న తమిళ చిత్రం ‘గోవా’లో స్నేహ, నిర్మాణంలో వున్న బాలీవుడ్ చిత్రం ‘హౌస్ ఫుల్’లో దీపిక బికినీలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. |
వంశీ - అల్లరి నరేష్ తో కుమార చౌదరి చిత్రం
‘ఢాన్’ నిర్మించిన కుమారచౌదరి సిద్దార్థ హీరోగా ‘బావ’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రబవరి నుండి కుమారచౌదరి వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ హీరోగా నటిస్తాడు. ‘గోపి..గోపిక...గోదావరి’ చేసిన వంశీ, ‘బెండు అప్పారావు’ చేసిన నరేష్ విజయవంతమైన కాంబినేషన్లో ఈ చిత్రం మరో మంచి విజయం సాధిస్తుందని కుమారచౌదరి అన్నారు.దీనికి చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు. |
‘ముద్దుకి సిద్ధమంటూ’ ప్రియమణి ప్రకటన
ప్రియమణి తన మార్కెట్ను పదిలపరచుకోవడానికి ఎప్పటికప్పుడు తాజా చిట్కాలు ప్రయోగించడంలో నేర్పరి. ఆ మధ్య ఓ చిత్రంలో బికినీ ధరించి ప్రేక్షకులను ఊరించింది. ఇప్పుడు ‘కథ, సన్నివేశాల ప్రకారం అవసరం అయితే ముద్దుకు సిద్ధం’ అంటూ ప్రకటించింది. పెద్ద హీరోల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రియమణి ‘ప్రవరాఖ్యుడు’ కాంబినేషన్ జగపతిబాబుతోతో మరో చిత్రం చేస్తోంది. |
రామ్ గోపాల్ వర్మ ‘రక్ష’కి కొనసాగింపు ‘ఆవహం’
హిందీలో ‘పుకార్’, తెలుగులో ‘రక్ష’ పేరుతో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన చిత్రాలకు కొనసాగింపుగా హిందీలో మరో చిత్రం తీశారు. దాన్ని తెలుగులో ‘గాలి’ పేరుతో డబ్ చేయాలనుకున్నారు. అయితే, ఆ టైటిల్ దొరకని కారణంగా దానికి ‘ఆవాహం’ అని పేరు పెట్టారు. ఫిబ్రవరిలో విడుదలయ్యే ఈ చిత్రానికి నిర్మాత బుర్రా ప్రశాంత్.
|
అద్భుతమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు భూమిక
‘నాకిప్పటికీ మంచి అవకాశాలు వస్తున్నాయంటే, దర్శకులకు నా మీద వున్న నమ్మకమే కారణం. నా సినిమా భవిష్యత్ వాళ్ళ చేతుల్లోనే వుంది.‘యాగం’ తర్వాత మూడు నెలలకు విశ్రాంతి తీసుకుంటాను.ఆ తర్వాత ఓ అద్భుతమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. చూడండి’ అని అంటోంది భూమిక. |
------------------------------------------------------ |
జనవరి 11నుండి ఎన్టీఆర్ - ఇలియానాల ‘శక్తి’
‘కంత్రి’ కాంబినేషన్ ఎన్టీఆర్ -మెహర్ రమేష్ - అశ్వనీదత్ ల మరో చిత్రం జనవరి 11నుండి ప్రారంభమవుతుంది. ఇలియానా హీరోయిన్గా నటించే ఈ చిత్రానికి ‘శక్తి’ అని పేరు పెడుతున్నారు. ఉత్తర భారతదేశంలోను, విదేశాల్లోనూ ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం జరుగుతుంది.
|
ఏంజెలినా జోలికి 67.5కోట్ల పారితోషికం
హాలీవుడ్ అందాల నటి ఏంజెలినా జోలి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచారు. వినోదరంగంలో అత్యధిక సంపాదనాపరులైన 100మంది మహిళల జాబితాను హాలీవుడ్ రిపోర్టర్స్ రూపొందించింది. ఇందులో ఓఫ్రా విన్ ఫ్రే మొదటి స్థానంలో, ఏంజెలినా 24వ స్థానంలో నిలిచారు. ఏంజెలినా ఓ చిత్రానికి 67.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
|
వరుణ్ సందేష్ - తమన్నాలతో సుకుమార్ చిత్రం
‘ఆర్య-2’తో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న సుకుమార్ త్వరలో మరో చిత్రం ప్రారంభిస్తున్నారు. వరుణ్ సందేష్, తమన్నా జంటగా నటించే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి తర్వాత నుండి షూటింగ్ జరుపుకుంటుంది.
|
రాజకీయాల్లోకి శృంగార నటి భువనేశ్వరి
నదులన్నీ సముద్రంలో కలిసినట్లు అన్ని రంగాల వారూ రాజకీయ రంగంలోకి రావడానికే మొగ్గుచూపుతున్నారు. పైగా రాజకీయ అండతో తమ అరాజకీయాలకు అడ్డంలేకుండా పోతుందని కూడా వారి ఆలోచన. ఇటీవల వ్యభిచార వ్యవహార వివాదంలో ఇరుక్కున్న సెక్సీనటి భువనేశ్వరి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తుందట. ఓ చిన్న రాజకీయ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు.
|
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో విష్ణు చిత్రం
చాలా కాలం విరామం తర్వాత ‘సలీమ్’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విష్ణు, తదుపరి చిత్రం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేస్తారు. హిందీలో ‘ఫ్లాట్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ తో ఓ అద్భుతమైన కథతో ఈ చిత్రం వుంటుందని విష్ణు చెప్పారు.
|
------------------------------------------------------ |
హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న రెహమాన్
ఆస్కార్ స్థాయికి ఎదిగిన మన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ త్వరలో నటుడిగా ఓ హాలీవుడ్ చిత్రంలో చేస్తున్నాడు. ప్రముఖ గాయకుడు, రచయిత, నిర్మాత, గ్రామీ అవార్డ్ విజేత పి.జె.మోర్టాన్ జీవిత కథతో ‘సన్ ఆఫ్ ఎ ప్రీచర్ మ్యాన్’ పేరుతో చేస్తున్న చిత్రంలో మోర్టాన్ కొడుకుగా రెహమాన్ నటిస్తున్నాడు. |
నాగార్జునతో శ్రీనాగ్ కార్పొరేషన్ చిత్రం
నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా ‘కాళిదాసు’, ‘కరెంట్’ చిత్రాలను నిర్మించిన శ్రీనాగ్ కారొ్పరేషన్ త్వరలో నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రం చేయాలనుకుంటోంది. నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించే ఈ చిత్రం వివరాలు త్వరలో తెలుస్తాయి.
|
అమీర్ ఖాన్ నిర్మిస్తున్నమూడు చిత్రాలు
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘త్రీ ఇడియట్స్’త్వరలో విడుదలవుతుంది. దీని తర్వాత అమీర్ ఖాన్ బయట చిత్రాలు అంగీకరించకుండా, స్వంతంగా మూడు చిత్రాలు నిర్మిస్తున్నాడు. అభయ్ డియో దర్శకత్వంలో ‘ఢిల్లీ బెల్లీ’, అనుష్క రిజ్వీ దర్శకత్వంలో ‘ది ఫాలింగ్’, భార్య కిరణ్ రావు దర్శకత్వంలో ‘దోబీ ఘాట్’ చిత్రాలు చేసేందుకు అమీర్ ఖాన్ ప్లాన్ చేశాడు.
|
కన్నడలో ‘చంద్రముఖి-2’ సిద్ధమయ్యింది
తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ‘చంద్రముఖి’ కొనసాగింపు ‘చంద్రముఖి-2’ను కన్నడలో పి.వాసు తీస్తున్నారు. మొదటి చిత్రంపేరు ‘ఆప్తమిత్ర’ అయితే రెండవ చిత్రం పేరు ‘ఆపద్ రక్షక’. విష్ణువర్థన్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. త్వరలో దీన్ని కూడా మనవాళ్ళు రీమేక్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. |
నాలుగు చిత్రాలకు ‘విస్తార్ రెలిగేర్’ ఫైనాన్స్
గత ఏడాది సెబి అనుమతి పొందిన ‘విస్తార్ రెలిగేర్’ త్వరలో మూడు బాలీవుడ్, ఒక హాలీవుడ్ చిత్రానికి ఫైనాన్స్ చేస్తోంది. సినిమాల్లో పెట్టుబడిని 200కోట్ల కార్పస్ ఫండ్ తో ఏర్పడ్డ ఈ సంస్థ ఇప్పటికే 13 సినిమాలకు 112కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఆ చిత్రాలు 2010 చివరిలోగా విడుదలకానున్నాయి.
|
------------------------------------------------------ |
వెంకటేష్ ‘గంగ’లో కొత్త హీరోయిన్
‘నమో వెంకటేశ’ చేస్తున్న వెంకటేష్ త్వరలో అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ‘గంగ’ అనే చిత్రం చేస్తారు. మాఫియా డాన్ ‘గంగ’ పాత్రలో వెంకటేష్ నటిస్తున్న ఈ చిత్రంలో అతని సరసన నూతన కథానాయికను పరిచయం చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత. |
‘సింహా’ బాలకృష్ణ సరసన నయనతార
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘సింహా చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ప్రధాన నాయికగా ఇప్పుడు నయనతారను ఎంపిక చేశారు. ‘అదుర్స్’లో చేస్తున్న నయనతార త్వరలో ‘సింహా’ షూటింగ్ లో పాల్గొంటుంది. |
జగపతిబాబుతో వర్మ ‘గాయం-2’
పదిహేనేళ్ళ కిందట జగపతిబాబుతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘గాయం’ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘గాయం-2’ రాబోతోంది. జగపతిబాబు హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించే ఈ చిత్రానికి ప్రవీణ్ దర్శకత్వం వహిస్తారు. |
తేజ ‘అటు-ఇటు’ కోసం హీరో కావాలి!
జయం మూవీస్ పతాకంపై తేజ ‘అటు- ఇటు’ అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో 40మంది కొత్తవారిని తేజ పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా చేసేందుకు అమాయకంగా కనిపించే 18ఏళ్ళ యువకుడు కోసం అన్వేషిస్తున్నారు. ఆసక్తి వున్నవారు ఫొటోలతో- 224/A, రోడ్ నెం. 17, జూబ్లీహిల్స్ లోని వారి ఆఫీస్ లో సంప్రదించవచ్చు.
|
రాంబాబు దర్శకత్వంలో ‘బావ’గా సిద్దార్థ
‘ఓయ్’ తర్వాత ‘బావ’గా సిద్దార్థ ఓ చిత్రం చేస్తున్నారు. రాంబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కుమారచౌదరి నిర్మిస్తున్నారు. జనవరి 20నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలోని తన పాత్ర కొత్తగా వుంటుందని, ఈ చిత్రం యూనిట్ లోని అందరికీ మంచి ఫలితాన్ని ఇస్తుందని- సిద్దార్థ చెబుతున్నారు. |
------------------------------------------------------ |
నాగచైతన్య చిత్రానికి అజయ్ భూయాన్ దర్శకత్వం?
చంద్రసిద్దార్థ నిర్మించిన ‘హౌస్ ఫుల్’ చిత్రానికి అజయ్ భూయాన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కారణాంతరాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదల కాకపోయినా, అతనికి మంచి పేరే పరిశ్రమలో వచ్చింది. నాగచైతన్య మూడవ చిత్రం కామాక్షి కళా మూవీస్ పతాంకపై శివ ప్రసాద్ రెడ్డి ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తున్నారు. దీనికి అజయ్ భూయాన్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.
|
గోపీమోహన్ దర్శకత్వంలో హీరోగా సునీల్
ప్రముఖ హాస్యనటుడు సునీల్ ‘అందాలరాముడు’తో హీరోగా మారాడు. ఇప్పుడు ‘మగధీర’ రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాదరామన్న’లో మళ్ళీ హీరోగా చేస్తున్నారు. ‘ప్రవరాఖ్యుడు’ నిర్మించిన టాలీ టు హాలీ సంస్థ నిర్మించే మూడవ చిత్రంలో సునీల్ హీరోగా తన మూడవ చిత్రం చేస్తారని తెలుస్తోంది. దీనికి రచయితలు గోపీ మోహన్ లు దర్శకత్వం వహిస్తారు.
|
బ్రాడ్ పిట్ హీరోగా రిలయన్స్ ‘బిగ్ పిక్చర్’
రిలయన్స్ ‘బిగ్ పిక్చర్స్’ బ్యానర్ తో హాలీవుడ్ లో చిత్ర నిర్మాణం ప్రారంభించింది. స్రముఖ హీరో బ్రాడ్ పిట్ తో ‘డార్క్ వాయిడ్’ అనే చిత్రం చేస్తోంది. ఓ వీడియో గేమ్ ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో వీడియో గేమింగ్ సంస్థ ‘క్యాప్ కామ్’, బ్రాడ్ పిట్ సంస్థ ‘ప్లాన్ బి’ కూడా పాల్గొంటాయి.
|
‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో ‘కరెంట్’ సుశాంత్?
‘కాళిదాసు’, ‘కరెంట్’ చిత్రాల్లో చేసిన యువహీరో, నాగార్జున మేనల్లుడు సుశాంత్ మరో మంచి చిత్రంలో చేసేందుకు కథా చర్చల్లో ఉన్నారు. ‘అనసూయ’, ‘నచ్చావులే’ వంటి విజయవంతమైన చిత్రాలు చేసి త్వరలో ‘అమరావతి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఓ చిత్రం వచ్చే అవకాశం ఉంది. దీన్ని శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తారు.
|
వంశీ దర్శకత్వంలో ‘ఆయ్... మాది రాజమండ్రి’
సృజనాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా ఉన్న వంశీ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘గోపి..గోపిక... గోదావరి’ ఆర్థిక విజయాన్ని సాధించింది. త్వరలో వంశీ నరేష్ హీరోగా ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. గోదావరిని ఎంతో గొప్పగా చూపించే వంశీ తను దర్శకత్వం వహించే ఓ చిత్రానికి ‘ఆయ్... మాది రాజమండ్రి’ అని పేరు పెట్టాలనుకుంటున్నారు.
|
------------------------------------------------------ |
శరవేగంగా నాగచైతన్య - గౌతమ్ మీనన్ చిత్రం
నాగచైతన్య హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మంజుల నిర్మిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శింబు, త్రిష జంటగా తమిళంలో గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న ‘నిన్నైతొండి వరువాయా’ చిత్రం తెలుగు రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రధానభాగం చెన్నైలోనే జరిగింది. దీనికి ‘నాతో..రా’ అనే పేరు పరిశీలనలో వుంది. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించడం విశేషం. |
కళ్యాణ్ రామ్ ‘హరే రామ - హరే కృష్ణ’
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఇటీవల ‘జయీభవ’ నిర్మించిన నందమూరి కళ్యాణ్ రామ్ మరో చిత్రం ప్రారంభిస్తున్నారు. మల్లి దర్శకత్వం వహించే ఈ చిత్రం మంచి కమర్షియల్ కథాంశంతో వుంటుందని, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీనికి ‘హరే రామ - హరే కృష్ణ’ అని పేరు పెడుతున్నారు.
|
డిసెంబర్ 2 నుండి అనూష్క ‘పంచాక్షరి’
‘అరుంధతి’గా పవర్ ఫుల్ పాత్రలో నటించి, నటిగా తన ఇమేజ్ ను పదింతలు పెంచుకున్న అనూష్క ఇప్పుడు మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తోంది. నాగార్జున మేకప్ మేన్ చంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘పంచాక్షరి’ పేరుతో నిర్మిస్తున్న ఈ సోషియోఫాంటసీ, గ్రాఫిక్స్ చిత్రం షూటింగ్ డిసెంబర్ 2నుండి జరుగుతుంది.
|
దక్షిణాది చిత్రాలకు తమిళ దర్శకుల అవార్డులు
‘తమిళ సినీ దర్శకుల సంఘం’ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుండి దక్షిణాది భాషా చిత్రాలకు అవార్డులు ప్రదానం చేస్తారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషా చిత్రాలకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడుతోపాటు ప్రధాన సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు బహూకరిస్తామని- తమిళ దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్కే సెల్వమణి చెప్పారు. |
సాయిరామ్ శంకర్ తో పూరి జగన్నాథ్ మరో చిత్రం
ఇటీవల సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా పూరి జగన్నాథ్ నిర్మించిన ‘బంపర్ ఆఫర్’ విజయవంతం అయ్యింది. ఇందులో రఘు కుంచె అందించిన సంగీతం ప్రతే్యక ఆకర్షణ అయ్యింది. సాయిరామ్ తో పూరి జగన్నాథ్ మరో చిత్రం ప్రారంభిస్తున్నారు. దీనికి కూడా రఘు కుంచ సంగీతాన్ని అందిస్తారు. ఓ నూతన దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తారు.
|
------------------------------------------------------ |
దర్శకుడిగా హాలీవుడ్లోకి ఆర్పీ పట్నాయక్
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నటుడిగా ‘శీను-వాసంతి-లక్ష్మి’లో చేశారు. దర్శకుడిగా ఇటీవల ‘అందమైన మనసు’ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా ‘అమీ’ అనే హాలీవుడ్ చిత్రం చేస్తున్నారు. క్రిస్టోఫర్ ఆట్కిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జెస్సికా డిజియోవాన్నీ, కర్ట్ పీటర్సన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంగీతం కూడా ఆర్పీ సమకూర్చడం విశేషం. |
పూరి జగన్నాథ్ ‘గోలీమార్’కి చక్రి సంగీతం
గోపీచంద్ హీరోగా హన్సిక హీరోయిన్ గా పూరి జగన్నాథ్ స్వంత బ్యానర్ పై ‘గోలీమార్’ అనే చిత్రం డిసెంబర్లో ప్రారంభిస్తున్నారు. ‘ఎన్ కౌంటర్’ స్పెషలిస్టు పోలీసు అధికారిగా గోపీచంద్ నటిస్తున్న ఈ చిత్రానికి మొదట రఘు కుంచె సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ, గతంలో పూరి జగన్నాథ్ చేసిన పలు చిత్రాలకు సంగీతం అందించిన చక్రినే ఇప్పుడు ఫైనలైజ్ చేశారు. |
మూడు భాషల్లో నాగార్జున - రాధామోహన్ ల ‘పయనం’
‘ఆకాశమంత’ చిత్రాన్ని అందించిన రాధామోహన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘పయనం’ అనే చిత్రం త్వరలో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మిస్తున్నారు. దీనికి తెలుగులో దిల్ రాజు, తమిళంలో ప్రకాష్ రాజ్, హిందీలో బోనీకపూర్ నిర్మాతలు. |
అనూష్కను అందుకోవడానికి హైహీల్స్ తో సూర్య
తమిళ హీరో సూర్య మామూలుగా హైహీల్స్ ఎక్కువగా వాడరు. అయితే, ఇప్పుడు ఆ అవసరం వచ్చిందట. హరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సింగం’లో అతని సరసన అనూష్క నటిస్తోంది. పొడగరి అయిన అనూష్కతో సమానంగా కనిపించడం కోసం సూర్య హైహీల్స్ ను ఆశ్రయించక తప్పలేదు.
|
రెహమాన్ సంగీతంలో కత్రినా పాట
కత్రినా కైఫ్ త్వరలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో గాయకురాలు రాబోతున్నారు. పిల్లలు పాడుకునే రైమ్స్ తో ఉండే ఈ ఆల్బమ్ కోసం ఆమె హిందీలో పాడాలి. హిందీ అంతగా రాని కత్రినా ఈ ఆల్బమ్ కోసం ప్రత్యేకంగా హిందీలో ప్రాక్టీస్ ప్రారంభించింది. |
------------------------------------------------------ |
ప్రభుదేవా - నయనతారల పెళ్ళి జనవరిలో?
దక్షిణాది ప్రముఖ నటి నయనతార, నృత్య దర్శకుడు ప్రభుదేవాల మధ్య ప్రేమాయణం నడుస్తోందని వస్తున్న వార్తలు ఒక కొలిక్కి వస్తున్నాయి. వీరి పెళ్ళి జనవరిలో జరుగుతుందని తెలుస్తోంది. ‘మా మధ్య మంచి అనుబంధం వుంది. ఆ విషయాన్ని కాదనను’ - అంటూ ఇటీవల నయనతార మీడియా ముందు అంగీకరించింది. ప్రభుదేవా తన భార్య రమ్ లత్ తో రాజీ ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు.
|
రాజకీయ నాయకుడిగా కమల్ హసన్
విభిన్న పాత్రలకి ప్రాణం పోసే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హసన్ ఇప్పుడు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో స్వంత సంస్థపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రత్యేకత కలిగిన కథాంశంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా చేస్తోంది.
|
రామ్, ఇలియానాతో స్రవంతి రవికిషోర్ చిత్రం
‘దేవదాసు’ కాంబినేషన్ రామ్, ఇలియానా జంటగా ‘స్రవంతి’ రవికిషోర్ ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. దీనికి ‘కిక్’తో మంచి విజయాన్ని అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు.
|
స్పీల్ బర్గ్ నే భయపెట్టిన ‘పారా నార్మల్ యాక్టివిటీ’
విభిన్న చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న స్టీవెన్ స్పీల్ బర్గ్ ను ఇటీవల విడుదలైన ఓ హాలీవుడ్ చిత్రం భయపెట్టిందట. ఓరెన్ పెలి దర్శకత్వంలో అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ‘పారా నార్మల్ యాక్టివిటీ’ చూసి స్పీల్ బర్గ్ కూడా భయపడ్డారట. ఈ చిత్రం భారీ చిత్రాలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్ళు చేస్తోంది.
|
శృతి, హన్సిక, పద్మప్రియల కొత్త చిత్రాలు
కమల్ కుమార్తె శృతి హసన్ రామ్ చరణ్ ‘ఆరెంజ్’లో జెనీలియాతో పాటు మరో హీరోయిన్ గా చేస్తోంది. పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ‘గోలీమార్’లో గోపీచంద్ సరసన హన్సిక ఎంపికయ్యింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నరేష్ హీరోగా చేస్తున్న ‘సుమధురం’లో పద్మప్రియ కథానాయిక. ‘బృందావనం’లో ఎన్టీఆర్ సరసన కాజల్ కథానాయికగా ఖాయం అయ్యింది.
|
------------------------------------------------------ |
మొయినాబాద్లో 'దాసరి అవుట్డోర్ స్టూడియో'
'దర్శకరత్న' దాసరి నారాయణరావు హైదరాబాద్లో అవుట్ డోర్ స్టూడియో నిర్మాణం చేస్తున్నారు. మొయినాబాద్ నుండి చేవెళ్ళకు వెళ్ళే మార్గంలో 18 ఎకరాల స్థలంలో దాసరి ఈ స్టూడియో నిర్మిస్తున్నారు. నానక్రామ్గూడలోని 'రామానాయుడు సినీ విలేజ్' తరహాలో ఉండే దాసరి స్టూడియోలో ఒక ఫ్లోర్తో పాటు, షూటింగ్లకి ఉపయోగపడే వివిధ అవుట్డోర్ సెట్స్ ఉంటాయి. |
నిర్మాతగా మారుతున్న కత్రీనా కైఫ్
క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనాకైఫ్ త్వరలో నిర్మాతగా మారాలనుకుంటున్నారు. గతంలో ఆమె ఓ ఫ్రెంచ్ చిత్రం కొని హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. అయితే, అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు 'వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగాస్' అనే హాలీవుడ్ చిత్రాన్ని కొని, తనే హీరోయిన్గా కత్రీనా బాలీవుడ్ చిత్రం చేస్తుందట. ఇందులో ప్రముఖ హీరో నటిస్తారు.
|
'యాత్ర'పై 10 చిత్రాలతో 'కేరళ కేఫ్'
'యాత్ర' అనే అంశంతో పదిమంది నిర్మించిన 10 లఘు చిత్రాలను కలిపి 'కేరళ కేఫ్' పేరుతో ప్రయోగాత్మకంగా విడుదల చేశారు. పద్మకుమార్, షాజీ కైలాస్, ఉదయ్ అనంతన్, అన్వర్ రషీద్, ఉన్నికృష్ణన్, శ్యామ్ప్రసాద్, రేవతి, అంజలి మీనన్, లాల్ జోస్, శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో మమ్ముట్టి, దిలీప్, సురేష్ గోపి, పృధ్వీరాజ్ మొదలైన ప్రముఖులు నటించడం విశేషం.
|
హోటల్ బిజినెస్లోకి మలైకా అరోరా
'ఛయ్య ఛయ్య ఛయ్య' అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ సెక్సీనటి మలైకా అరోరా ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు మందగించడంతో హోటల్ బిజినెస్లోకి మారాలనుకుంటోంది. త్వరలో ముంబాయ్లో తొలి రెస్టారెంట్ ప్రారంభించాలనుకుంటున్న మలైక, అనుభవం కోసం లండన్లోని ఓ ప్రముఖ శిక్షణాసంస్థలో పాకశాస్త్రం నేర్చుకుంటోంది. |
దర్శకుడితో అందాల గాయని మళ్ళీ పెళ్ళి
మధురంగా పాడే ఓ అందాల గాయని త్వరలో ఓ దర్శకుడిని పెళ్ళి చేసుకునే పనిలో ఉందట. వీరిద్దరూ ఇటీవల ఓ చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. ఇద్దరూ వివాహితులే కావడం వల్ల విడాకులు తీసుకుని, ఆపై పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఫిలింనగర్ భోగట్టా.
|
------------------------------------------------------ |
సురేందర్ రెడ్డి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మహేష్ బాబు
‘కిక్’తో సూపర్ హిట్ అందించిన సురేందర్ రెడి్డ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ పేరుతో ఓ ప్రాజెక్టు సిద్ధం చేశారు. దాన్ని ప్రభాస్ తో చేస్తారని అప్పట్లో అనుకున్నారు. అయితే, ఆ సబ్జెక్ట్ ను మహేష్ బాబు ఓకె చేశారని 40కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం చేయబోతున్నారని వార్తలొచ్చాయి. ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ పేరు రిజిస్టర్ చేసిన ఆర్.ఆర్. మూవీమేకర్స్ బ్యానర్ పైనే ఈ చిత్రం నిర్మిస్తారని తెలుస్తోంది. |
223 కేంద్రాల్లో ‘మగధీర’కు 66కోట్లు
రామ్ చరణ్ - రాజమౌళి కాంబినేషన్ లో ‘మగధీర’ బాక్సాఫీస్ వసూళ్ళలో కొత్త చరిత్ర రాసింది. 30కోట్ల పైచిలుకు బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వంద రోజులకు 66కోట్లు వసూలు చేసింది. 302కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం, 223 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం త్వరలో తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ కానుంది. |
ద్విపాత్రల్లో ముమైత్ ఖాన్ తమిళ చిత్రం
‘మైసమ్మ’తో సహా కథానాయికగా చేసిన అన్ని చిత్రాలు పరాజయం పాలయ్యి, ఐటెమ్ సాంగ్స్ లో కూడా ఇటీవల రాణించలేకపోయిన ముమైత్ ఖాన్ కు ఓ మంచి అవకాశం వచ్చింది. తమిళంలో ఆమె హీరోయిన్ గా ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో ముమైత్ ఖాన్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. |
‘అదుర్స్’ డిసెంబర్ 18 విడుదల
వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - నయనతార జంటగా నిర్మిస్తున్న ‘అదుర్స్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు.
|
భారీ వసూళ్ళతో ‘ఏక్ నిరంజన్’ జైత్రయాత్ర
ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘ఏక్ నిరంజన్’ మొదటివారం భారీగా వసూళ్ళు రాబట్టి విజయపథంలో నడుస్తోంది. ఈ చిత్రం మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా 20కోట్లకుపైగా వసూలు చేసి, రెండవ వారంలో కూడా టాప్ పొజిషన్లో కొనసాగడం విశేషం. |
------------------------------------------------------ |
ఎన్టీఆర్ ‘శక్తి’ డిసెంబర్ 10న ప్రారంభం
'కంత్రి’ బ్యాచ్ తో మరో చిత్రం రాబోతోంది. అశ్వనీదత్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం డిసెంబర్ 10నుండి షూటింగ్ జరుపుకుంటుంది. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ‘శక్తి’ అని పేరు పెడుతున్నారు.
|
చిత్ర పరిశ్రమ సహాయ ‘స్పందన’కు 3.5కోట్లు
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదలకు సర్వం కోల్పోయినవారిని ఆదుకోవడానికి దాసరి ఆధ్వర్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా ‘స్పందన’ కార్యక్రమం తలపెట్టింది. దీని లైవ్ టెలీకాస్ట్ హక్కులను ‘టీవి-9’ స్వంతం చేసుకుంది. ఇందుకోసం వారు మూడున్నర కోట్లు మినిమం గ్యారంటీగా ఇవ్వడం అభినందనీయం.
|
ఈనెల 28నుండి రాజమౌళి ‘మర్యాద రామన్న’
‘మగధీర’ వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి సునీల్ హీరోగా ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. ‘మర్యాద రామన్న’ పేరుతో రూపొందించే ఈ చిత్రం ఈ నెల 28నుండి షూటింగ్ జరుపుకుంటుంది. దీని తర్వాత ప్రభాస్ హీరోగా కె.రాఘవేంద్రరావు బ్యానర్పై రాజమౌళి ‘విశ్వామిత్ర’ చేస్తారు.
|
ఎం.ఎస్.రాజు చిత్రంలో ‘చండి’గా కాజల్
‘అరుంధతి’ స్ఫూర్తితో ఎం.ఎస్.రాజు కోడి రామకృష్ణతో మరో గ్రాఫిక్స్ చిత్రం డిసెంబరులో ప్రారంభిస్తున్నారు. ‘చండి’ పేరుతో హీరోయిన్ ఓరియంటెడ్ గా నిర్మించే ఈ చిత్రంలో మొదట నాయికగా నయనతారను, ఆ తర్వాత హన్సికను అనుకున్నారు. అయితే, ఇప్పుడు కాజల్ ను ఖాయం చేశారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం సోషియోఫాంటసీ కథాంశంతో రూపొందిస్తారు.
|
'షేర్ ఖాన్’లో హీరోగా అలీ
‘మగధీర’లో శ్రీహరి షేర్ ఖాన్ పాత్ర ఎంత పాపులర్ అయ్యిందీ మీకు తెలిసిందే. ‘షేర్ ఖాన్’ పేరుతో ఇప్పుడు ఓ చిత్రం రానుంది. ఇందులో షేర్ ఖాన్ గా ప్రధాన పాత్రను అలీ పోషిస్తున్నారు. గతంలో ‘కాంచనమాల కేబుల్ టీవి’ చేసిన పార్థసారథి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదలవుతుంది.
|
------------------------------------------------------ |
ప్రేక్షకుల ‘డ్రీమ్స్’ కోసం బికినీకి అసిన్ ఓకె!
బాలీవుడ్లో ‘గజిని’తో ఘన విజయం, ‘లండన్ డ్రీమ్స్’తో విజయం సాధించిన అసిన్ ఇప్పుడు చాలా హ్యాపీ మూడ్లో వుంది. బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తోటి హీరోయిన్లనుండి ‘అందాల పోటీ’ని తట్టుకోవడానికి బికినీలో నటించడానికి ‘ఓకె’ చెప్పింది. అయితే, సన్నివేశం డిమాండ్ మేరకే చేసా్తనని తెలివిగా షరతు కూడా పెట్టింది. |
రానా ‘లీడర్’లో ఉదయభాను ఐటెమ్ సాంగ్
టివి యాంకర్ గా ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్లో వున్న ఉదయభాను గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, ప్రధాన పాత్రధారిగా చేసింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. తిరిగి ఇప్పుడు దగ్గుబాటి రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘లీడర్’లో ఉదయభాను ఓ ఐటెమ్ సాంగ్ చేస్తోంది. ఈపాటే ఇందులో మాస్కు మంచి మసాలా అవుతుందని భావిస్తున్నారు.
|
భూమికతో టీవిలో గేమింగ్ షో
ప్రముఖ నటీమణులు చాలామంది ఇప్పుడు టీవిలో ప్రెజెంటర్స్ గా పని చేస్తున్నారు. ఆ బాటలో ఇప్పుడు భూమిక కూడా చేరింది. ఒక ప్రముఖ ఛానెల్ త్వరలో రూపొందిస్తున్న ‘గేమింగ్ షో’కు భూమిక ప్రెజెంటర్ గా చేస్తోంది. సినిమాల్లో జోరు తగ్గడంతో, చాలామంది తారలు బుల్లితెరకు దిగివస్తున్నారు.
|
అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో నవదీప్ ‘లెవన్’
నవదీప్, కిమ్ శర్మ, భూమికలతో ‘యుగం’, జగపతిబాబుతో ‘మా నాన్న చిరంజీవి’ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న అరుణ్ ప్రసాద్ త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ‘లెవెన్’ (పదకొండు) అనే చిత్రం ప్రారంభిస్తున్నారు. ఇందులో నవదీప్, శ్రీరామ్ హీరోలుగా చేస్తారు. |
పాత రాగాలకు ఇళయరాజా కొత్త మెరుగులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎంత గొప్ప రాగాలు అందించారో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల కొంత విరామం తర్వాత ఇళయరాజా తిరిగి సినిమాలకు సంగీతాన్ని అందించడం మొదలు పెట్టారు. అయితే, పూర్వం అంత గొప్పగా అతని పాటలు వుండటంలేదని అంతా భావిస్తున్నారు. అందుకని, గతంలో ఇళయరాజా చేసిన మంచి పాటలనే కొన్నింటిని ఆధునీకరించి ఇప్పటి సినిమాల్లో వాడితే బాగుంటుందని ఆయనకు సలహా ఇచ్చారు. దాంతో ఇళయరాజా ఇప్పుడు తన పాత పాటలను రీమిక్స్ చేసే పనిలో పడ్డారు.
|
------------------------------------------------------ |
| |