|
| |
ఆకర్షణీయమయిన సినిమా వాళ్ళలో మహేష్... కరీనా కపూర్
మహేష్ బాబు అత్యంత ఆకర్షణీయమయిన మగవాళ్ళలో 5వ స్థానం లో నిలిచారు . ఈ పోల్ ని 'టైమ్స్ అఫ్ ఇండియా'
నిర్వహించారు. టాప్ 50 లో నిలిచిన దక్షణాది నటులలో ఈయన ఒకరు. మిగిలిన ఇద్దరు రానా దగ్గుబాటి మరియు సిద్దార్థ్.
దూకుడు మరియు బిజినెస్ మాన్ చిత్రాలతో తన ఖ్యాతి ని పెంచుకున్న మహేష్ బాబు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించిన
ఈ పోల్ లో ఐదవ స్థానం లో నిలవడం ఆసక్తికరం
ఒక జాతీయ దిన పత్రిక 2011లో అత్యంత ఆకర్షణీయమయిన మహిళ అనే పోల్ నిర్వహించింది. ఈ ఆన్ లైన్ పోల్ కి
అద్బుతమయిన స్పందన కనిపించింది మొత్తం 3.74 లక్షల వోట్ లు పోల్ అయ్యాయి. దేశం లో జరిగిన అత్యంత పెద్ద సర్వే
ఇద్ది ఈ లిస్టు లో కరీనా కపూర్ అగ్ర స్థానం లో నిలువగా కత్రిన కైఫ్, దీపిక పడుకొనే, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ తరువాతి
నాలుగు స్థానాల్లో నిలిచారు. ఐశ్వర్య రాయ్ ఆసక్తి కరంగా పదవ స్థానంకి పడిపోయింది. మొత్తం బాలివుడ్ తారల ఆదిపత్యం
ఉన్నా దక్షణాది తారలు కూడా వారి ఉనికిని చూపించారు. జెనిలియా 12వ స్థానం లో నిలువగా శ్రియ శరణ్ 15వ స్థానంలో
నిలిచారు. శృతి హాసన్ , అసిన్ , ఏమి జాక్సన్, త్రిష మరియు ఇలియానా చివరి ఐదు స్థానాలలో నిలిచారు. |
తమన్నా డేట్స్ కోసం నానా ఇబ్బందులూ పడ్డారు
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యేవరకు మరో సినిమా ఒప్పుకోనని ఇటీవలే తన నిర్మాతలకు వాగ్ధానం చేసిన మిల్కీ
బ్యూటీ తమన్నా తన వాగ్ధానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. మహేశ్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్న
సినిమాలో ఆమె హీరోయిన్గా సంతకం చేయబోతున్నదనే ప్రచారం ఇందుకు మూలం.తమన్నా డేట్స్ సమస్య వల్లే రాంచరణ్
'రచ్చ' సినిమా నెలకు పైగా ఆగి మళ్లీ దారికొచ్చింది. రాం హీరోగా చేస్తున్న 'ఎందుకంటే ప్రేమంట' చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్
సైతం ఆమె డేట్స్ సర్దుబాటు కాక నానా ఇబ్బందులూ పడ్డారు.ఇప్పుడు మహేశ్ సినిమాని ఒప్పుకోవడం ద్వారా ఆమె మళ్లీ
ఇబ్బందుల్లో చిక్కుకోబోతున్నదని వినిపిస్తోంది. అయితే మహేశ్ సినిమాకి ఆమె సంతకం చేయలేదని తమన్నా సన్నిహిత
వర్గాలు తెలిపాయి.సమస్యంతా నిర్మాతల మధ్యే ఉంది తప్ప తమన్నా చేతుల్లో ఏమీలేదనీ, ఏ నిర్మాతకైనా అదనపు డేట్స్
కావాలనుకున్నప్పుడే సమస్యంతా వస్తోందనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అన్ని ఇబ్బందుల్నీ తమన్నా
పరిష్కరించుకుందనీ, కొత్త సినిమాలకు సంతకం చేయడానికి ఎలాంటి ఆటంకమూ లేదనీ అంటున్నారు.
|
'రాక్' కు హిందీ సినిమాలపై మనసు మళ్లింది
రెజ్లర్గా కెరీర్ను ప్రారంభించి హాలీవుడ్ యాక్షన్ హీరోగా మారిన డ్వేన్ డగ్లస్ జాన్సన్ రాక్గా అందరికీ సుపరిచితుడు. ది
స్కార్పియన్ కింగ్, ది గేమ్ ప్లాన్, రేస్ టు విచ్ మౌంటెయిన్ వంటి అంతర్జాతీయస్థాయి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా
పేరుతెచ్చుకున్న ఈ భారీకాయుడికి హిందీ సినిమాలపై మనసు మళ్లింది. బాలీవుడ్ సినిమాలను ఎంత గానో ఇష్టపడుతానని,
హిందీ పాటలు, డ్యాన్సులు చాలా బాగుంటాయని మెచ్చుకున్నాడు. ‘చాలా హిందీ సినిమాలు చూశాను. నాకు ఎక్కువగా
నచ్చేవి మాత్రం డ్యాన్సులే. ఇలాంటి సినిమాల్లో అవకాశం వస్తే అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది’ అని రాక్ అన్నాడు.
భారత్లో శుక్రవారం విడుదలయ్యే డిజిటల్ 3డీ సినిమా జర్నీ2: ది మిస్టీరియస్ ఐలండ్లోనూ ఇతడు
అదరగొట్టనున్నాడు.2008లో వచ్చిన 'జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్'కు ఇది సీక్వెల్. అమెరికాలో ఇది వారం తరువాత
ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ‘కేవలం ధృడకాయుడు అనే పేరును తొలగించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. రెజ్లర్ను
ప్రజలందరూ ధృడకాయుడిగా మాత్రమే చూస్తారు. నాపై నమ్మకం ఉంచి కామెడీ పాత్రల పోషణకు కూడా అవకాశం ఇచ్చిన
దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆ పాత్రలు ప్రేక్షకులకు నిరాశకు గురిచేయకపోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అన్ని
రకాల పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి’ అని రాక్ చెప్పుకొచ్చాడు. జర్నీ2లో రాక్తోపాటు మైఖేల్ కేన్, జాష్ హచర్సన్,
వనెస్సా హడ్గెన్లు నటిస్తున్నారు. కేన్, మైఖేల్తో పనిచేయడం ఎంతో సరదాగా ఉంటుందని రాక్ చెప్పాడు. చరిత్రాత్మక నటుల్లో
మైఖేల్ ఒకడని ప్రశంసించాడు. జర్నీ కథ, దీని చిత్రీకరణకు వాడిన సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా ఉన్నాయని రాక్
వివరించాడు
|
ఈ ఏడాది సమంతాదే అని చెప్పక తప్పదు
గతేడాది చివర్లో ‘దూకుడు’తో కథానాయికగా దూకుడు మొదలు పెట్టిన సమంతా ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో
నటించడానికి అంగీకరించింది. రాజమౌళి ‘ఈగ’, గౌతమ్ మీనన్ చిత్రం, నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’, మహేష్తో ‘సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు’, రామ్చరణ్తో ‘ఎవడు’, సిద్దార్థ్తో ఓ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ నెల 11 నుంచి
మణిరత్నం రూపొందించనున్న ‘కడల్’ చిత్రం షూటింగ్లో 10 రోజుల పాటు పాల్గొంటుందట. ఈ చిత్రాన్ని ‘కడలి’ అనే పేరుతో
తెలుగులో అనువదించే అవకాశం వుందని చెన్నై సమాచారం. ఈ చిత్రం ద్వారా హీరో కార్తీక్ తనయుడు గౌతమ్
కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. అత్యధిక చిత్రాల్లో నటిస్తూ ఆల్ మోస్ట్ కథానాయికగా నెంబర్ వన్ స్థానానికి
చేరువలో వుంది సమంతా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- ‘ భారతీయ నటీనటుల్లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా మణిరత్నం
చిత్రంలో నటించే అవకాశం కోసం కలలుకంటుంటారు. అలాంటి అవకాశం అనుకోకుండా తక్కువ సమయంలోనే నాకు
లభించడం, మణిరత్నం దర్శకత్వంలో నటించాలన్న నాకల ఇంత త్వరగా సాకారం కావడం మర్చిపోలేని అనుభూతిని
కలిగిస్తోంది. నా కెరీర్లో ఈ ఏడాది మర్చిపోలేనిది’ అని తెలిపింది.
|
‘రౌడీరాథోర్’ లో కరిష్మాకపూర్ ప్రత్యేక గీతం
బాలీవుడ్ తెరపై 15 ఏళ్ల కెరీర్లో తన కంటూ ప్రత్యేకతను సంతరించుకున్న భామ కరీష్మా కపూర్. 2006లో వచ్చిన ‘జమానత్’
చిత్రంతో నటనకు స్వస్తిపలికిన ఈ ముద్దుగుమ్మ విక్రమ్ భట్ తెరకెక్కిస్తున్న ‘డేంజరస్ ఇష్క్’ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో నటిస్తున్న కరిష్మా మరో చిత్రంలోనూ నటించడానికి అంగీకరించిందని సమాచారం. తెలుగులో రవితేజ హీరోగా
నటించిన ‘విక్షికమార్కుడు’ చిత్రాన్ని అక్షయ్కుమార్తో ప్రభుదేవా ‘రౌడీరాథోర్’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోని
ఓ ప్రత్యేక గీతంలో కరిష్మాకపూర్ నటించనుందని ముంబై సమాచారం. ప్రస్తుతం ఈ ప్రత్యేక గీతం కోసం కరిష్మాతో దర్శకుడు
ప్రభుదేవా చర్చిస్తున్నాడని, కరిష్మా తన అంగీకారం తెలిపితే వచ్చే నెలలోనే ఆమెపై చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది.
మున్నీ, షీలాకీ జవానీ, చిక్నీ చమేలి పాటలకు ప్రేక్షకుల్లో పెరిగిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ గీతానికి ప్రభుదేవా
ప్రత్యేకంగా నృత్యరీతులు సమకూరుస్తున్నాడని తెలుస్తోంది.
|
|
ఇక వరుసగా నయనతార సినిమాలు
‘‘ఇన్నాళ్లు ఒకరకమైన ఇబ్బందికర స్థితిలో నా జీవితం సాగింది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. అందుకే సినిమాలు
ఒప్పుకుంటున్నాను’’ అంటున్నారు నయనతార. ‘శ్రీరామరాజ్యం’ ఈ మలబార్ బ్యూటీకి చివరి చిత్రం అని చర్చలు జరిగిన
నేపథ్యంలో.. నాగార్జునతో సినిమా చేయడానికి అంగీకరించారు నయనతార. ఇక వరుసగా సినిమాలు చేయాలని నయనతార
నిర్ణయించుకున్నారట. ఇటు తెలుగు, అటు తమిళ్ భాషల్లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట. దానికి గల కారణాన్ని
నయనతార చెబుతూ -‘‘తమిళ పరిశ్రమ నాకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. తెలుగు పరిశ్రమ దాన్ని రెట్టింపు చేసింది. అందుకే ఈ
రెండు భాషల్లోనూ నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. కన్నడంలో కూడా ఆమె ఓ సినిమా చేశారు. కన్నడ
సినిమాలు, టెక్నాలజీ కూడా నచ్చాయని ఆమె పేర్కొన్నారు. నాగార్జునతో ఈ బ్యూటీ చేయబోతున్నది రొమాంటిక్ ఎంటర్టైనర్
మూవీ అట. ఇదిలా ఉంటే... ఇటీవలే తమిళంలో అజిత్ సరసన ఓ చిత్రంలో నటించడానికి నయనతార అంగీకరించారనే వార్త
కోలీవుడ్లో హల్చల్ చేస్తోంది. విష్ణువర్థన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. గతంలో అజిత్ సరసన బిల్లా,
ఏగన్ చిత్రాల్లో నటించారామె.ఇప్పుడు మూడోసారి ముచ్చటగా జతకట్టబోతున్నారనమాట. ఇటీవల ఈ చిత్రకథ, పాత్ర గురించి
నయనతార దగ్గర విష్ణువర్థన్ చెప్పారని సమాచారం. నయనతార ఇందులో నటించడానికి సుముఖంగానే ఉన్నారట. త్వరలో
అధికారికంగా సైన్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడానికిగాను నయనతార తీసుకోబోతున్న పారితోషికం కోటిన్నరకు
కాస్త తక్కువ అని కోలీవుడ్వారు అంటున్నారు. మరికొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట.
|
అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ పెంచబోతున్నారు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ భారీగా పెంచబోతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్
టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వీరు నలుగురు దాదాపు 11 కోట్ల నుండి
13 కోట్ల రూపాయల వరకు పెంచబోతున్నారు. గత సంవత్సరం తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీ విజయాలు సొంతం
చేసుకోవడం, కలెక్షన్లు కూడా భారీగా వసూలు చేస్తుండటంతో వీరు కూడా అమాంతం పెంచేసారు.ఒక నిర్మాత మాట్లాడుతూ-
తెలుగు ఇండస్ట్రీ లోకి కార్పోరేట్ సంస్థలు వస్తుండటంతో కొత్తగా భారీ మార్కెట్ పెరిగి నెంబర్ గేమ్స్ మారాయని అన్నారు. బాక్స్
ఆఫీస్ కలెక్షన్స్ కూడా పెరగడం. ఒక యావరేజ్ సినిమా కూడా 30 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అగ్ర హీరోలు 11 నుండి
13 కోట్లు రేమ్యురేషణ్ తీసుకుంటూ 95 రోజులు కాల్షీట్లు ఇస్తున్నారు. మరో ఐదు రోజులు గ్రేస్ పీరియడ్ గా ఇస్తున్నారు.
మొత్తంగా 100 రోజులు కాల్షీట్లు ఇస్తూ, ఈ సమయంలోపు సినిమా తీయలేకపోతే ఒక రోజు అదనంగా 15 లక్షల రూపాయల
వరకు అదనంగా వసూలు చేస్తారు.
|
తమ్ముడి కోసం చిరంజీవి ... జేమ్స్బాండ్ ఎన్టీఆర్ ?
పవర్స్టార్ పవన్కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి చిత్రాలలో గెస్ట్గా మెరిశారు. అయితే పవన్ సినిమాలో ఇంతవరకూ చిరంజీవి
ఎక్కడా నటించలేదు. అభిమానులకు అదో వెలితి ఉండిపోయింది. ఇప్పుడు ఆ లోటు పూడ్చటానికి...మెగా అభిమానులను
ఆనందడోలికలలో ముంచెత్తేందుకు మెగాస్టార్ చిరంజీవి పవన్కళ్యాణ్ నటించిన ‘గబ్బర్సింగ్’ చిత్రంలో ఓ ప్రత్యేక రోల్
చేయబోతున్నట్లు తాజా సమాచారం. హిందీ చిత్రం ‘దబాంగ్’కు రీమేక్ చిత్రం అయిన ‘గబ్బర్సింగ్’ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు నిర్మాతలు. కాగా చిరంజీవి నటించే సన్నివేశాన్ని సినిమా
విడుదలయ్యేదాకా గోప్యంగా ఉంచాలనేది నిర్మాతల ప్లానింగ్. వరస ఫ్లాపులు వచ్చినా పవన్ నటించే లేటెస్ట్ మూవీ ‘గబ్బర్సింగ్’
చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిరంజీవి లేటెస్ట్గా రామ్చరణ్ చిత్రం ‘మగధీర’లో నటించారు. చిత్రంలో మెగాస్టార్
కనిపించిన సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు.
ఎన్టీఆర్ జేమ్స్బాండ్ పాత్రలో నటించనున్నారా? ..అంటే అవుననే తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్
నిర్మిస్తున్న చిత్రంలో జూనియర్ ఆ తరహా పాత్రలో నటిస్తారని విశ్వసనీయంగా వెల్లడైంది. పూర్తిగా అమెరికా నేపథ్యంలో సినిమా
తెరకెక్కనుందని, బాండ్ సినిమాల తరహాలో యాక్షన్ కథాంశాన్ని పూరి ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారం. ఎన్టీఆర్ గతంలో
ఎన్నడూ కనిపించని కొత్త లుక్తో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి ప్రీప్రొడక్షన్ పనులు
నడుస్తున్నాయి.
|
‘రచ్చ’కు బ్రేక్.... ‘రేస్’ నుండి దీపిక తప్పు కుంది
రామ్చరణ్ ‘రచ్చ’కు బ్రేక్ పడిందని సమాచారం! ..వివరాల్లోకి వెళితే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని పెరియార్ టైగర్
రిజర్వ్ (పిటిఆర్) వద్ద జరుగుతోంది. నాయకానాయికలపై సరస్సులో ఓ పాట చిత్రీకరించాలని యూనిట్ అంతా సిద్ధం చేసింది.
రామ్ చరణ్-తమన్నాలపై రొమాంటిక్ గీతం తెరకెక్కించడానికి అంతా సిద్ధమైన వేళ హఠాత్తుగా అక్కడికి ఓ అటవీశాఖ డిప్యూటి
డైరెక్టర్ ఊడిపడ్డాడు. లైఫ్ జాకెట్స్ లేనిదే షూటింగ్ కుదరదని చెప్పారు. రొమాన్స్ పండించాల్సిన పాటలో యువజంట లైఫ్
జాకెట్స్ ధరించి కనిపిస్తే అందులో గ‘మ్మత్తు’ ఏముంటుందని భావించిన దర్శకుడు సంపత్ నంది వెంటనే షూటింగ్ నిలిపేశారట.
బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘రేస్’ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘రేస్ 2’
తెరకెక్కుతోంది. సైఫ్అలీఖాన్, జాన్అవూబహమ్, అనిల్కపూర్లు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. అమీషాప జాక్వలిన్
ఫెర్నాండేజ్లు కథానాయికలు. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి దీపికాను ఎంపికచేశారు. ఇటీవలే నాలుగు
రోజులు పాటు దీపికాపై కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ సినిమా షెడ్యూల్ విషయంలో అసంతృప్తిగా వున్న దీపికా
ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ‘లవ్ ఆజ్కల్’ చిత్రంతో దీపికా, సైఫ్లు హిట్ పెయిర్ అనే ముద్రపడిపోయింది.
దాంతో సెంటిమెంట్ పరంగా ఈ చిత్రంలో దీపికాను కథానాయికగా తీసుకున్నారు. ఇప్పుడు దీపికా తప్పుకోవడంతో ఈ స్థానాన్ని
ఎవరూ భర్తీ చేయలేరనే భావనలో నిర్మాతలు వున్నట్లు తెలిసింది. సైఫ్ అలీఖాన్ వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని కూడా దీపికా
సున్నితంగా తిరస్కరించిందట. డేట్స్ సమస్య వల్ల సినిమాలో నటించలేకపోతున్నానని చెబుతున్నా ఈ సుందరి నిష్ర్కమణ
వెనక వేరే కారణం వుందంటున్నారు చిత్ర వర్గాలు. తన పాత్ర కంటే సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ పాత్రకు ప్రాధాన్యత
ఎక్కువగా వుందని దీపికా దర్శకులు అబ్బాస్ -మస్తాన్ల దగ్గర కంప్లైంట్ చేసిందట. స్క్రిప్ట్లో మార్పులు చేయాల్సిందిగా
సూచించిందట. అందుకు వారు నిరాకరించడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా తప్పుకుందని తెలిసింది.
|
చిత్ర పరిశ్రమను విడదీయవద్దంటోంది శ్రియ
సినిమాలకు ప్రాంతీయ విభేదాలను అంటగట్ట వద్దని దక్షిణాది తార శ్రీయ సరణ్ కోరింది. అన్నింటినీ కేవలం భారతీయ
చిత్రాలుగా మాత్రమే చూడాలని సూచిం చింది. ‘సినిమాలను సాంస్కృతిక వారధులుగా వినియోగించవచ్చు. ఉత్తర, దక్షిణ,
తూర్పు, పశ్చిమ సినిమా అంటూ వర్గీకరించడం అర్థరహితం. చిత్ర పరిశ్రమను విడదీయవద్దు. మనది భారతీయ సినిమా.
అందరం ఒక కుటుంబంలా ఉందాం’ అంటూ హితవచనాలు పలికిన ఈ 29 ఏళ్ల హాట్బ్యూటీ ఇది వరకే హిందీ, తమిళం, తెలుగు,
కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. వివిధ భాషలు, సంస్కృతులను తెలుసుకోవడం వల్ల మన జీవితం మరింత పరిణతి
చెందుతుం దని అభిప్రాయపడింది. ఇప్పుడు తనకు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషలు వచ్చని, తన దృష్టిలో ప్రతీ
భాష గొప్పదేనని, ఒక్కోదానికి ఒక్కో విశిష్టత ఉంటుందని చెప్పింది. చిత్ర పరిశ్రమకు కూడా ఈ సూత్రం వర్తిసుందని తెలిపింది.
శ్రీయ 2001లో 'ఇష్టం 'అనే తెలుగు సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది. తదనంతరం ఈమె నటించిన పలు తెలుగు
సినిమాలు హిట్ కొట్టాయి. శివాజీలో రజనీకాంత్ సరసన నటించే చాన్స్ రావడం శ్రీయ కెరీర్ను మలుపు తిప్పింది. ఇక 2007లో
బాలీవుడ్లో 'ఆవారపన్' ద్వారా ప్రవేశించింది. మిషన్ ఇస్తాంబుల్, న ఘర్ కె నా ఘాట్ కేలోనూ కనిపించింది. తాజాగా' గలీ గలీ
చోర్ హై 'లో శ్రీయ అక్షయ్ఖన్నా సరసన నటిస్తోంది. రుమీ జాఫ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ భార్యగా, టీచర్గా
పనిచేస్తుంది. ‘గలీ గలీ సినిమా చూసిన ప్రతి ఒక్కరిపైనా దీని ప్రభావం ఉంటుంది. సామాన్యులను వ్యవస్థ ఎలా
బలితీసుకుంటుందో చక్కగా చూపిస్తుంది. మంచి హాస్యం ఉంటుంది’ అని వివరించింది
|
|
జెనీలియా - రితేష్ దేశ్ముఖ్ ఓ ఇంటివారయ్యారు
‘హాసిని’ జెనీలియా డిసౌజా (24), బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ (32) ఓ ఇంటివారయ్యారు. తమ ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రేమకు
పెళ్లితో ఫుల్స్టాప్ పెట్టారు. మరాఠీ సంప్రదాయ పద్ధతిలో శుక్రవారం మధ్యాహ్నం ముంబైలోని గ్రాండ్ హయాత్ ఫైవ్స్టార్
హోటల్లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. తెల్లటి షేర్వానీ, తలపై ఎర్రటి తలపాగాతో అశ్వాన్ని
అధిరోహించిన రితేష్ గానాభజానాల మధ్య ఊరేగింపుగా గ్రాండ్ హ్యాట్ హోటల్కు చేరుకున్నారు. పెళ్లిలో జెనీలియా ఎరుపు,
పసిడి వర్ణాలతో తయారుచేసిన దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోయింది. ఫ్యాషన్ డిజైనర్ రీతూకుమార్ వీటిని డిజైన్ చేశారు.
అలాగే రితేష్ తండ్రి కేంద్ర మంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ బూడిదరంగు షేర్వానీ ధరించారు. ఈ వివాహ వేడుకలకు రాజకీయ
దిగ్గజాలతోపాటు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్పవార్, మరో కేంద్ర మంత్రి
సుశీల్కుమార్ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, సుబోధ్కాంత్ సహాయ్, రాజ్
థాకరే, ఆదిత్య థాకరే, కృపాశంకర్ సింగ్, హర్షవర్థన్పాటిల్ తదితర నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ దంపతులు, అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, కాజోల్, అజయ్దేవ్గన్, అక్షయ్కుమార్,
కరణ్జోహార్, షాహిద్ కపూర్, సాజిద్ నడియావాలా, అసిన్, అశుతోష్ గోవారికర్ తదితరులు హాజరయ్యారు.రితేష్, జెనీలియా
పెళ్లి సందర్భంగా ట్విట్టర్లో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సందేశాలు పంపిన వారిలో పలువురు బాలీవుడ్
ప్రముఖులు, వారి స్నేహితులు ఉన్నారు. |
హజారే శ్రీయను మెచ్చుకున్నారు... చిరంజీవితో సినిమా లేదు
అవినీతిపై ఎడతెగని ఉద్యమం చేస్తున్న అన్నాహజారే ..రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ శ్రీయను మెచ్చుకున్నారు. ఈ
విషయాన్ని శ్రీయ స్వయంగా మీడియాకు తెలియచేసింది. ఆమె మాట్లాడుతూ..నేను నటించిన గలీ గలీ మే చోర్ హై చిత్రం
లంచగొండితనం మీద తీసింది. ఈ చిత్రాన్ని ఆయనకు ప్రత్యేకంగా చూపి మేము కూడా అవినీతికి వ్యతిరేకంగా పొరాడుతున్నాం
అని చెప్పాలనుకున్నాం. అందుకోసం ఆయన గ్రామం వెళ్లటం జరిగింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది..ఆ ఊళ్లో
స్క్రీనింగ్ వేయటానికి ధియోటర్స్ లేవని. దాంతో మేము ఓపెన్ ఆడిటోరియంలో ఎల్ సిడీ వాల్ స్క్రీన్ పైన వేసి ఆయనకు
చూపించాం అంది. అలాగే ఆయన ఈ చిత్రం చూసి చాలా మెచ్చుకున్నారు. నేను ఆయనతో మాట్లాడాను-
చిరంజీవితో ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ సినిమా తీయనున్నట్లు గతంలో వదంతులు వచ్చాయి. అలాంటి ఉద్దేశమేమీ లేదని
దర్శకుడు శంకర్ స్పష్టం చేశారు. అలాగే తాను రీమేక్ చిత్రాలు చేయబోనని కూడా ఆయన ప్రకటించారు. స్ట్రెయిట్ చిత్రాలకు
మాత్రమే దర్శకత్వం వహిస్తానని తెలిపారు.
|
జాతీయ అవార్డులకు రికార్డు ఎంట్రీలు ....బెర్లిన్ కు 'పంచభూత'
2011 సంవత్సరానికి సంబంధించి యాభై తొమ్మిదవ జాతీయ సినిమా అవార్డుల కోసం చలనచిత్ర (ఫీచర్ ఫిల్మ్) విభాగంలో
ఏకంగా 185 ఎంట్రీలు వచ్చాయి. సంఖ్యాపరంగా ఇది రికార్డు. ఇదే విభాగంలో 2010 సంవత్సరానికి వచ్చిన ఎంట్రీలు 161. తెలుగు
నుంచి 18 సినిమాలు పోటీకి వచ్చాయి. ఈ విషయంలో 37 ఎంట్రీలతో హిందీ చిత్రసీమ ప్రథమ స్థానంలో నిలవగా, ఆ తర్వాత
తమిళం నుంచి 27, మలయాళం నుంచి 25 చిత్రాలు పోటీ పడుతున్నాయి. బెంగాలీ, కన్నడ, మరాఠీ నుంచి ఒక్కో భాషలో 17
సినిమాలు ఎంట్రీలుగా వచ్చాయి. తొలిసారిగా బ్యారీ భాష నుంచి ఓ చిత్రం అవార్డు కోసం రావడం గమనార్హం. అలాగే ఈ
అవార్డుల కోసం ఈసారి 19 భాషా చిత్రాలు పోటీకి నిలుస్తున్నాయనీ, ఇది కూడా ఓ రికార్డనీ అధికారులు తెలిపారు. నాన్ ఫీచర్
ఫిల్మ్ విభాగంలోనూ ఈసారి అత్యధిక సంఖ్యలో ఎంట్రీలు వచ్చాయి. గత ఏడాది ఈ విభాగంలో 118 ఎంట్రీలు రాగా, ఇప్పుడు వాటి
సంఖ్య 141కి పెరిగింది. అలాగే ఉత్తమ సినిమా రచన విభాగానికి 51 ఎంట్రీలు వచ్చాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆధ్వర్యంలో మే 3న అవార్డుల ప్రదానం జరగనున్నది.
ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మోహన్కుమార్ వలసాల చిత్రీకరించిన డాక్యుమెంటరీ 'పంచభూత' రెండు దేశాలలో
నిర్వహిస్తున్న అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైంది. బెర్లిన్, ఫిన్లాండ్ చిత్రోత్సవాల కమిటీలు ఈ మేరకు ప్రకటించాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన మోహన్కుమార్.. కోల్కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్
ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్-స్క్రీన్ ప్లే విభాగంలో ప్రస్తుతం డిప్లమో చేస్తున్నాడు.భిన్నమైన సామాజిక అంశాలను ఎంచుకుని
ఇదివరకే నాలుగు డాక్యుమెంటరీలను రూపొందించాడు. బెర్లిన్లో జరగనున్న 62వ ఫిల్మ్ఫెస్టివల్కు పంపిన పంచభూత
డాక్యుమెంటరీ 22 దేశాలకు చెందిన 27 షార్ట్ఫిల్మ్లలో స్థానం సంపాదించుకుంది. ఇంగ్లిషులో ఫైవ్ ఎలిమెంట్స్ పేరుతో చిత్రించిన
ఈ డాక్యుమెంటరీలో ఎలాంటి డైలాగులు లేకపోవడం విశేషం.
|
ప్రభుదేవాతో హన్సిక రొమాన్స్- అంటూ మీడియా హంగామా
ముద్దుగుమ్మ హన్సిక సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ప్రభుదేవా, నయనతారల ప్రేమ వ్యవహారం నడుమ ఈ భామ పేరు
ఒక్కసారిగా తెరమీదికొచ్చింది. ప్రభుదేవా, నయనతారల మధ్య విభేదాలు వచ్చాయని, వారిద్దరూ విడిపోదామని
నిర్ణయించుకున్నట్లు ఇటీవల తమిళ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. వారిద్దరి మనస్పర్థలకు హన్సిక కారణమని
సదరు ఛానల్స్ వార్తల్ని ప్రసారం చేశాయి. ఈ మధ్యకాలంలో హన్సికతో ప్రభుదేవా చాలా సన్నిహితంగా వుంటున్నాడని దీంతో
నయనతార మనస్థాపానికి గురైందని ఆ కథనాల సారాంశం. ఈ కథనాల్ని తెలుసుకున్న హన్సిక మీడియాపై విరుచుకుపడింది.
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ మీడియా అభూతకల్పనలని కొట్టిపారేసింది. సినిమా పరిక్షిశమలో తనకు వృత్తిగత
సంబంధం తప్ప ఎవరితో వ్యక్తిగత సంబంధం లేదని, ప్రభుదేవా తనకు అన్నలాంటి వాడని వివరణ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
గతంలో ఈ సుందరి ప్రభుదేవా దర్శకత్వంలో ‘ఎంజియుమ్ కాదల్’ అనే తమిళ చిత్రంలో నటించింది. ప్రభుదేవాతో హన్సిక
రొమాన్స్ అంటూ మీడియా చేస్తోన్న హంగామా ఇప్పుడు చైన్నైలో హాట్టాపిక్లా మారింది.
|
విజయకాంత్ కుమారుడు హీరోగా తెరంగేట్రానికి సన్నాహాలు
ప్రస్తుతం తమిళ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఇంతకుముందు హీరోగా
చిత్రరంగంలో విజయ విహారం చేశారు. ఇప్పుడు ఆయన రెండో కుమారుడు షణ్ముగపాండియన్ హీరోగా తెరంగేట్రానికి
సన్నాహాలు జరుగుతున్నాయి. విజయకాంత్కు ఇద్దరు కొడుకులు. మొదటి కొడుకు విజయ్ ప్రభాకరన్. చెన్నైలోని ఎస్ ఆర్
ఎం యూనివర్సిటీలో బీఈ చదువుతున్నారు. రెండో కొడుకు షణ్ముగపాండియన్ లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్
ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈయన ఇప్పుడు తన తండ్రికి వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
దీని గురించి విజయకాంత్ మాట్లాడుతూ తన రెండో కుమారుడు నటుడవ్వాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడన్నారు.
షణ్ముగపాండియన్కు కుటుంబ సభ్యు ల ప్రోత్సాహం లభించడంతో డాన్స్, ఫైట్స్ల లో శిక్షణ పొందుతున్నాడని తెలిపారు.
దీంతో తన కొడుకు హీరోగా సొంతంగా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు కథలు సిద్ధంగా
ఉన్నాయని వాటిలో ఒకటి ఎంపిక చేసి త్వరలో చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కథ, డిమాండ్ చేస్తే, దర్శకుడు కోరితే
ఆ చిత్రంలో తాను ఒక ముఖ్య భూమికను పోషిస్తానని అ న్నారు. అదేవిధంగా షణ్ముగపాండియన్ బయ ట నిర్మాతకు కూడా
ఒక చిత్రం చేయనున్నారని దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు విజయకాంత్ తెలిపారు.
|
|
‘భట్టి విక్రమార్క’గా బాలకృష్ణ ?... జర్నలిస్టుగా పవన్ కళ్యాణ్?
బేతాళుడు-విక్రమార్కుడు కథల గురించి మన చిన్నప్పుడు చందమామపుస్త్తకాల్లో చదువుకు న్నాం. ఎన్నో ట్విస్టులతో
ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగే ఈ కథలను పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. తాజా సమాచారం ప్రకారం
నందమూరి బాలకృష్ణ త్వరలో ఓ సోషియా ఫాంటసీ చిత్రంలో నటించబోతున్నారని, ఈ చిత్రం బేతాళ-విక్రమార్క కథల ఆధారంగా
ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం 1960లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ సినిమా ‘భట్టి విక్రమార్క’ సినిమాను పోలి ఉంటుందని
అంటున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అప్పట్లో వచ్చిన
రామారావు సినిమా భట్టి విక్రమార్క సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ రాజా విక్రమార్క పాత్రలో,
కాంతారావు భట్టి పాత్రలో, ఎస్వీ రంగారావు మాంత్రికుడి పాత్రలో, అంజలిదేవి ప్రభావతిదేవి పాత్రలో నటించారు. ఈ చిత్రం రీమేక్
ఆధారంగానే బాలయ్య సినిమా ఉంటుందని, ఈ చిత్రాన్ని' శ్రీరామరాజ్యం 'నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మించ
నున్నారని ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్
జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉంటుందనే వార్తలు
కూడా వినిపిస్తున్నాయి. మీడియా మాఫియా నేపథ్యంలో సినిమా స్టోరీలైన్ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది.
గతంలో ‘బంగారం’ సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్
మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్
గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది. పవన్
కళ్యాణ్ ఇందులో కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ చిత్రం హిందీలో
హిట్టయిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్ సంగతి విదితమే.
|
సిద్దార్థకు గుడ్బై చెప్పిన దీపిక రణభీర్కు దగ్గరవుతోంది
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే తన ప్రేమ వ్యవహారంలో ఇద్దరం పరాజితులమే అనే కొత్త స్టేట్మెంట్ ఇస్తోంది.
వివరాల్లోకి వెళితే.. సిద్దార్థమాల్యాతో ఈ భామ ప్రేమ వ్యవహారం క్లైమాక్స్కు చేరుకుందని ముంబై సినీ వర్గాలు ప్రచారం
చేస్తున్నాయి. సిద్దార్థకు గుడ్బై చెప్పిన ఈ సుందరి తిరిగి మాజీ ప్రియుడు రణభీర్కపూర్కు దగ్గరవుతోందని ఆమె
సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల సిద్ధార్థమాల్యా కూడా విఫల ప్రేమగురించి ట్విట్టర్లో నిర్వేదం వ్యక్తం చేశాడు. ఇప్పుడు
దీపికా పదుకునే కూడా అదే స్టైయిల్లో స్పందించింది. తను వాడుతున్న బ్లాక్బెర్రీ మెసేంజర్ స్టాటస్ ను ‘ద గేమ్ ఈజ్ ఓవర్
(ఆట పూర్తయింది) అనే సందేశంతో మార్చుకుందట. ఇద్దరం ఓడిపోయాం- అంటూ సన్నిహితులకు సందేశాలు పంపించిందట.
అంతేకాదు, అందులో తన ఫోటోను నలుపు రంగులోకి మార్చి అస్పష్టంగా కనిపించేలా చేసిందట. దీపికా సందేశాలపై ఆమె
సన్నిహితులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తన విఫల ప్రేమ గురించే పరోక్షంగా దీపికా అందిస్తున్న సంకేతాలవని
వారు మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రియుడు సిద్దార్థ కూడా తమ ప్రేమ సవ్యంగా సాగటం లేదని, అసలు ఎటువైపు వెళుతుందో
అర్థం కావడంలేదని సన్నిహితులు వద్ద వాపోయాడట. అయితే బ్లాక్బెర్రీ అప్డేట్స్ గురించి స్పందించడానికి దీపికా
నిరాకరించింది. నా కామెంట్స్ను మీరెలాగ భావించుకున్న నాకభ్యంతరం లేదంటూ అసలు నిజాన్ని చెప్పకనే చెబుతోంది .
|
తొందర పడనంటున్న రిచా...అమల ఓవర్ యాక్షన్
మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని నటి రిచాగంగోపాధ్యాయ అంటున్నారు. ఆమె ఇప్పటికే రెండు తమిళ చిత్రాల్లో
నటించారు. అందులో ఒకటి ధనుష్ సరసన నటించిన 'మయక్కమ్ ఎన్న', రెండవది శింబు నటించిన' ఒస్తి'. ఈ రెండు చిత్రాలు
తనను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేశాయని ఈ అమ్మడు అంటున్నారు. మయక్కమ్ ఎన్నలో నెడువేలి నటనకు అవకాశం
ఉన్న బలమైన పాత్ర ద్వారా కోలీవుడ్కు పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఒస్తి లాంటి మాస్ చిత్రం ద్వారా
కమర్షియల్ హీరోయిన్గాను మెప్పించానన్నారు. ఈ రెండు చిత్రాలతో కోలీవుడ్లో మంచి రికార్డే పొందానని, అందువలన పలు
అవకాశాలు వస్తున్నా తొందరపడి ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పేరును మరింత పెంచే విధంగా మంచి
అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. కొన్ని చిత్రాల గురించి చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే గుడ్న్యూస్
చెబుతానని రిచా గంగోపాధ్యాయపేర్కొన్నారు.
నటి అమలాపాల్కు ఇటీవల గట్టిషాక్ తగిలిందట. అందుకు ఆమె ప్రవర్తన కారణం అంటున్నారు. ఊహించని విధంగా వరుస
విజయాలతో అందలం ఎక్కిన ఈ కేరళకుట్టికి చిత్రాల అవకాశాలు రావడంతో ఓవర్ యాక్షన్ చేస్తోందట. తాజాగా సూర్యకు
జంటగా నటించే అవకాశం వచ్చిందట. హరి దర్శకత్వం వహించనున్న సింగం-2 చిత్రంలో సూర్య సరసన అనుష్క హీరోయిన్గా
ఎంపికయ్యారు. ఇందులో మరో హీరోయిన్ పాత్రకు అమలాపాల్ను సంప్రదించగా ఆమె తొలుత నటిస్తానని ఆ తరువాత
కాల్షీట్స్ సర్దుబాటు కావడం లేదని చెప్పింది. దీంతో సింగం-2 చిత్ర దర్శక నిర్మాతలు ఆమెను పక్కన పెట్టి నటి హన్సికను
ఎంపిక చేశారని తెలిసింది. కోలీవుడ్లో పలువురి అసంతృప్తికి గురైన అమలాపాల్కు ఇది గట్టి షాకే అనికోడంబాక్కమ్ వర్గాల
మాట. ప్రస్తుతం నటిస్తున్న ముప్పొళుదుమ్ ఉన్ కర్పణైగళ్, కాదలిల్ సొదప్పువదు ఎప్పడి చిత్రాలు మినహా అమలాపాల్కు
ఇప్పుడు కొత్త చిత్రాలేవీ లేవని, ఇక తన ప్రవర్తనను మార్చుకోకపోతే ఇతర భాషల్లో అవకాశాలు వెతుక్కోవలసి వస్తుందని
కోలీవుడ్ సినీ పండితుల ఉవాచ.
|
గాయనిగా మారాలని ఏడేళ్ల నుంచి అనుకుంటున్నా
అప్పుడప్పుడు టీవీ, సినిమా తెరపై తళుక్మంటున్న జుహీచావ్లా త్వరలో తన సొంతగొంతుతో సుమధుర సంగీతం వినిపించే
అవకాశాలున్నాయి. ఆమే స్వయంగా ఈ విషయం చెప్పింది. ‘గాయనిగా మారాలని ఏడేళ్ల నుంచి అనుకుంటున్నా. సాధన
కూడా చేస్తున్నాను. భవిష్యత్లో తప్పకుండా పాడతాను’ అని తెలిపింది. గత కొన్నేళ్లలో ఈమె-' మై బ్రదర్ నిఖిల్',' ఝంకార్
బీట్స్',' 3 దీవారే 'సినిమాల్లో మాత్రమే కనిపించింది. గత ఏడాది విడుదలైన 'అయామ్'లో జుహీ నటనకు విమర్శకుల ప్రశంసలు
దొరికాయి. ఈ సినిమాకు కూడా మంచి పేరే వచ్చినా అవార్డులను మాత్రం అందుకోలేకపోయింది. మంచి పాత్రలు దొరికితే
చాలని, అవార్డులు రాకున్నా ఫర్వాలేదని ఈ 44 ఏళ్ల తారమణి తెలిపింది. ‘అయామ్ సినిమాను ఎక్కడ ప్రదర్శించినా ప్రేక్షకుల
నుంచి విశేష స్పందన కనిపిస్తుంది. అప్పుడు నా ఆనందానికి హద్దే ఉండదు. ఇది లోబడ్జెట్ సినిమా. అయితే మేం సరిగ్గా
ప్రచారం చేయలేకపోయాం. నాకు అన్నింటికంటే అందులోని కథే ముఖ్యం. అవార్డులు వచ్చినా రాకున్నా ప్రేక్షకుల మెప్పు
పొందితే చాలు. ఈ సినిమా గొప్పతనం మెల్లిగా అయినా అందరికీ తెలుస్తుంది’ అని ఈ సినిమా సహ నిర్మాత కూడా అయిన
జుహీ వివరించింది. లూథియానాకు చెందిన ఈ మాజీ మిస్ ఇండియా ప్రస్తుతం 'సన్ ఆఫ్ సర్దార్' అనే సినిమాలో పంజాబీ
మహిళగా నటిస్తోంది. ‘టైటిల్లో చెప్పినట్టే ఇది పంజాబీ కుటుంబానికి సంబంధించిన సినిమా. పొలాల మధ్య ఇళ్లు నిర్మించుకొని
జీవించే ఒక అమాయకపు కుటుంబం కథ. ఇందులో చక్కటి హాస్యం ఉంటుంది’ అని చెప్పింది జూహీ చావ్లా. హీరో
అక్షయ్కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్వనీధిర్ దర్శకుడు. అజయ్ దేవ్గన్, సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.
జుహీకి జోడీగా సంజయ్దత్ నటిస్తాడు. సంజుతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంటుందని జుహీచావ్లా చెప్పింది
|
‘ది బెస్ట్ థింగ్ ఎబౌట్ యు ఈజ్ యు’ నన్ను మార్చింది
అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుల్లో అనుపమ్ ఖేర్ అగ్రభాగాన
నిలుస్తారు. బాలీవుడ్లో తగిన గుర్తింపు వచ్చిన మాట నిజమే అయినా తాను కొన్ని చెత్త పాత్రలు చేసిన మాట వాస్తవమేనని
వినమ్రంగా అంగీకరిస్తారాయన. ఆయనలో ఒక చక్కటి వ్యక్తిత్వ నిపుణుడు కూడా ఉన్నాడు. ‘ది బెస్ట్ థింగ్ ఎబౌట్ యు ఈజ్
యు’ పేరుతో అనుపమ్ రాసిన పుస్తకం విడుదలయింది. ‘మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన నేను ఇప్పుడు వెనక్కి
చూసుకుంటే వైఫల్యాలు లేకుండా ఈస్థాయికి రాలేదని గ్రహించాను. పరాజయలు ఎదురైనప్పుడల్లా మా తండ్రి మాటలను గుర్తు
తెచ్చుకుంటాను. వైఫల్యాలనూ విజయాలుగా భావించి వేడుక చేసుకోవాలని నా బాల్యంలో చెప్పేవారాయన. సరైన దృక్పథంతో
ఆలోచిస్తే పరాజయాలు శాశ్వతం కాదని తెలుసుకోవచ్చని ఈ పుస్తకం బోధిస్తుంది’ అని అనుపమ్ వివరించారు.' కుచ్ భీ హో
సక్తా హై' నాటకం తన జీవితాన్ని మార్చేసిందని ఈ సీనియర్ నటుడు ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. ‘దాదాపుగా దివాళా తీసే
స్థాయికి చేరుకున్నప్పుడు ఈ నాటకం వేశాను. అప్పుడు నేను నటించిన నాలుగు సీరియల్స్ ప్రసారమవుతున్నాయి కానీ పెద్దగా
ఆదరణ లేదు.' ఓం జై జగదీశ్ 'కూడా పరాజయం బాట పట్టింది. అప్పుడే నేను ఈ పుస్తకం రాయగా నా పరాజయాలు,
వైఫల్యాలు ఏమిటో తెలిసి నవ్వుకున్నాను. అది నాలో ఆశావహ దృక్పథాన్ని పెంచింది. మన వైఫల్యాలపై ఆందోళన
చెందకుంటే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టేనని అర్థమయింది. ఆ పుస్తకం నన్ను వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మార్చింది. ఎన్నో
ఐఐటీ, ఐఐఎంలలో నేను ఉపన్యాసాలు ఇచ్చాను. పలు రచనలు చేశాను’ అని విశదీకరించారు. ఈతరం నటుల్లో నిజాయతీ,
కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటే -కచ్చితంగా రాణిస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మన లక్ష్యం కంటే
ప్రయాణమే ముఖ్యం కాబట్టే తాను రకరకాల అన్ని రకాల పాత్రలు ఎంచుకుంటానని చెప్పారు
|
|
‘తలాష్’ తో అమీర్ఖాన్ సరికొత్త రికార్డు
బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ఖాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అమీర్ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తలాష్’. కరీనాకపూర్, రాణిముఖర్జీ కథానాయికలు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన థియేరిటికల్ హక్కుల్ని రిలయన్స్ సంస్థ 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. గతంలో షారూక్ఖాన్ ‘డాన్2’ చిత్రానికి ఇవే హక్కుల క్రింద 80 కోట్లు లభించాయి. బాలీవుడ్ ట్రేడ్ రికార్డ్ల విషయంలో షారూక్, అమీర్లు పోటాపోటీగా తలపడుతున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ‘త్రీ ఇడియట్స్’తో ఆల్టైమ్ బాలీవుడ్ కలెక్షన్స్ రికార్డు సాధించారు అమీర్. అయితే ‘డాన్ 2’ చిత్రంతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు షారూక్. తాజాగా ‘తలాష్’ చిత్ర హక్కుల రికార్డుతో అమీర్ఖాన్ బాలీవుడ్ బాద్షా షారూక్ఖాన్ను అధిగమించాడని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
|
కమల్హాసన్ దర్శకత్వంలో మరో హీరోగా రవితేజ
మల్టీస్టారర్ చిత్రాలు మళ్లీ ఊపందుకుంటున్న తరుణంలో విలక్షణ నటుడు కమల్హాసన్ స్వీయదర్శకత్వంలో నటిస్తూ...రవితేజ మరో హీరోగా ఓ చిత్రం శ్రీకారం చుట్టుకోనుంది. కాగా అవినీతి, లంచగొండితనం మూలకథగా ఈ చిత్ర కథాంశం ఉండబోతోంది. ‘అమర్హై’గా ఈ చిత్రం టైటిల్ ఉండబోతోందంటూ తమిళమీడియాలో ప్రచారం జరుగుతోంది. దక్షిణాది భాషలతోబాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని తీస్తారు. అయితే ఒక్కో ప్రాంతీయ భాషలో అదే ప్రాంతానికి చెందిన హీరో నటిస్తారు. మలయాళంలో మమ్ముట్టి, తమిళంలో అజిత్, తెలుగులో రవితేజలకు ఎంపికచేసినట్లు తాజా సమాచారం. గతంలో కమల్హాసన్ నటించిన భారతీయుడు చిత్రంలో లంచాలను హైలెట్గా చూపించడం జరిగింది. అయితే ప్రస్తుత కథలో వర్తమాన రాజకీయ అంశాలను పవర్ఫుల్గా చూపిస్తారని సమాచారం. ప్రస్తుతం కమల్హాసన్ తమిళంలో ‘విశ్వరూబం’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత ‘అమర్హై’ చిత్రం ఉంటుందంటున్నారు.
|
జూన్ 13న రామ్చరణ్ పెళ్లి ...‘అగ్నిపథ్’లో రామ్చరణ్?
చిరంజీవి కుమారుడు రామ్చరణ్, 'అపోలో' ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసన వివాహానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 13న హైదరాబాద్లో కల్యాణం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయాన్ని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మీడియాకు వెల్లడించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో పెళ్లి ముచ్చట్లు పంచుకున్నారు. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాదులో చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. " వివాహ విందు తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చిరంజీవి చెప్పారు. అందుకని మా స్వగ్రామమైన అరగొండలోని ఆంజనేయస్వామి సన్నిధిలో తదుపరి రిసెప్షన్ ఉంటుంది'' అని చెప్పారు.
ఒకపక్క తెలుగు సినిమా రీమేకుల కోసం బాలీవుడ్ పరిశ్రమ పోటీపడుతుంటే లేటెస్ట్గా విడుదలై బాలీవుడ్ పాత రికార్డులను తిరగరాస్తున్న ‘అగ్నిపథ్’ చిత్రంపై తెలుగు నిర్మాతల దృష్టి పడింది. హృతిక్రోషన్, సంజయ్దత్లు నటించిన ‘అగ్నిపథ్’ తొలిరోజే రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి స్టడీ కలెక్షన్లతో రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం చూసినవెంటనే హీరో రామ్చరణ్తేజ తన ట్విట్టర్లో- ఈ మధ్యకాలంలో ఇటువంటి చిత్రాన్ని తాను చూసివుండలేదంటూ ‘అగ్నిపథ్’ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు ఏకంగా రామ్చరణ్నే హీరోగా పెట్టి ‘అగ్నిపథ్’ తెలుగు రీమేక్గా తీసేందుకు ఓ ప్రముఖ నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
|
యాక్షన్ విన్యాసాలకు సిద్ధమంటోంది కత్రికాకైఫ్
సల్మాన్ఖాన్తో సమానంగా రొమాంచిత యాక్షన్ విన్యాసాలకు సిద్ధమంటోంది హాట్గాళ్ కత్రికాకైఫ్. మత్తెక్కించే ఐటమ్సాంగ్స్ను పక్కనబెట్టి మతిపోగొట్టే యాక్షన్ విన్యాసాలకు సై అంటోంది. కథానాయకులతో సమానంగా రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్లో నటించడానికి ఇటీవల కాలంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఉవ్విళ్లూరుతున్నారు. జేమ్స్బాండ్ సినిమాల కథానాయికల ఇమేజ్ కోసం తారామణులంతా తాపవూతయపడుతున్నారు. తాజాగా కత్రినా ఈ బాట పట్టింది. సల్మాన్ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏక్తా టైగర్’ చిత్రంలో కత్రికా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిసానో యాక్షన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సల్మాన్ఖాన్తో పోటీపడి కత్రినా చేస్తున్న యాక్షన్ విన్యాసాలు యూనిట్ సభ్యుల్ని ఆశ్యర్యపరుస్తున్నాయట. ‘యాక్షన్ సీన్స్ చేయాలంటే నాకు భయంగా లేదు. సరదాగా అనిపిస్తుంది. ఎప్పటికీ కథానాయికగా సుతిమెత్తని పాత్రలు చేస్తే మజా ఏముంటుంది? కెరీర్లో గుర్తుండిపోయేలా ఈ సినిమాలో స్టంట్స్ చేశాను. సల్మాన్తో సమానంగా నా యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయి’ అని మురిసిపోతుంది కత్రినా. ఎటువంటి ఆధారం లేకుండా గాలి మధ్యలో ఊగులాడుతూ ఈ భామ చేస్తున్న యాక్షన్ సినిమాకు ప్రధానాకర్షణ అవుతాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
|
హన్సిక ‘జాక్పాట్’ .... 'ది గర్ల్ విత్ డ్రాగన్' బ్యాన్
బబ్లీ బ్యూటీ హన్సికను కోలీవుడ్వారు ముద్దుగా ‘చిన్న ఖుష్బూ’ అని పిల్చుకుంటారు. గత ఏడాది ‘మాపిళ్లయ్’ చిత్రం ద్వారా తమిళ తెరపై కనిపించి, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తర్వాత చేసిన 'ఎంగేయుమ్ కాదల్', 'వేలాయుధం' చిత్రాలు కూడా హన్సిక ప్రతిభను నిరూపించాయి. అందంతో పాటు అభినయం ఉన్న తారగా తమిళ ప్రేక్షకులు ఆమెకు మంచి మార్కులు వేశారు. అందుకే హన్సిక క్రేజీ హీరోయిన్ అయ్యారు. ఇప్పుడామె ‘ఓకెఓకె, వేట్టయ్ మన్నన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో విష్ణు సరసన ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమెకు తమిళంలో మరో అవకాశం వచ్చింది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇది ‘జాక్పాట్’లాంటి అవకాశం అని కోలీవుడ్వారు అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన' ఆరు', 'వేల్',' సింగమ్' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ మూడు చిత్రాల హిట్తో సూర్య, హరిలది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనే అభిప్రాయం ఏర్పడింది. వీరి కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రంలో అవకాశం సంపాదించడంతో హన్సిక కెరీర్ మరింత ఉన్నత స్థాయికి వెళుతుందని పరిశీలకులు అంటున్నారు.
హాలీవుడ్ రీమేక్ 'ది గర్ల్ విత్ డ్రాగన్'ను భారత్లో ప్రదర్శించే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక సెన్సార్ అధికారులు ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలను సెన్సార్ చేయాల్సిందిగా సూచించారు. ఆయా దృశ్యాలను బ్లర్ చేయాల్సిందిగా వారు చెప్పినట్లు సమాచారం. ఇందుకు సోనీ పిక్చర్స్ అంగీకరించడం లేదు. సినిమాలోని దృశ్యాలపై రాజీ పడదల్చుకోలేదని స్పష్టం చేసింది. డానియల్ క్రెగ్, రూనీ మారా ఈ చిత్రంలో నటించారు. స్టీగ్ లార్సన్ బెస్ట్ సెల్లింగ్ థ్రిల్లర్ రచన ఆధారంగా దీన్ని నిర్మించారు. ఓ హత్య, అవినీతి, కుటుంబ రహస్యాలు తదితర అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలాంటి వాటిని భారత్లో ప్రదర్శనకు అనుమతించలేమని సెన్సార్ అధికారులు తెలిపారు.
|
|
100కోట్ల బడ్జెట్తో కమల్హాసన్ మరో ప్రయోగం ‘విశ్వరూపం’
విలక్షణ నటుడు కమల్హాసన్ చేస్తున్న మరో ప్రయోగం ‘విశ్వరూపం’. ఈ సారి ప్రయోగం మరింత ఆసక్తికరం, వైవిధ్యం. పూర్తి వాణిజ్య పంథాలో భారీ ప్రణాళికతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కమల్కి డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు రూ.100కోట్ల బడ్జెట్తో రాజ్కమల్ ఇంటర్నేషనల్, పివిపి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పతాక సన్నివేశాలు మినహా సినిమా సాంతం పూర్తయింది. త్వరలో ఢిల్లీలో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారు.కమల్ శైలి విన్యాసాలతో అలరించనున్న ఈ సినిమాలో..కథక్ నృత్యం సినిమాకే హైలైట్గా నిలిచేలా చిత్రీకరించారట. తెరపై ఎన్నడూ చూడని రీతిలో ఈ గీతానికి ప్రత్యేక నృత్య భంగిమలను ప్రఖ్యాత కథక్ కళాకారుడు బిర్జు మహరాజ్ కంపోజ్ చేశారు. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ భీకర విలన్గా నటిస్తున్నారు. ఆండ్రియా జెరోమి, పూజా కుమార్, ఇషా శర్వాణి తమ అందచందాలతో కనువిందు చేయనున్నారు. శేఖర్ కపూర్ ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారు. సినిమా పతాక సన్నివేశాలు భారీ యాక్షన్తో విజువల్ గ్రాండియర్ అనే పదానికి అర్థం చెప్పేలా ఉంటాయిట. తమిళ్, హిందీలో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులోనూ అనువాదమై రిలీజ్ కానుంది. |
ఇద్దరు సూపర్స్టార్లతో చేయడం పూరీ కి ఛాలెంజ్
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్బచ్చన్, తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారు. 28 ఏళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. గతంలో వీరిద్దరు కలిసి 'హమ్', 'అం«ధాకానూన్', 'గిరఫ్తార్' చిత్రాల్లో నటించారు. త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే ఓ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని రూపొందించాలని చాలా రోజులుగా పూరి జగన్నాథ్ వేచి చూస్తున్నాడట. చివరకు వీరికోసం స్క్రిప్టుని తయారుచేసుకుని ఇటీవలే రజినీకాంత్కి వినిపించాడట. కథ నచ్చడంతో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నారట రజినీకాంత్. దీనిపై పూరి స్పందిస్తూ- "ఇటీవలే చెన్నైలో రజినీకాంత్ని కలిశా. చాలా కాలం నుంచి ఆయనతో పనిచేయాలని ఉంది. సరైన కథ లేక ఇన్నాళ్ళు ఆయనను కలవడానికి ధైర్యం చేయలేకపోయా. అమితాబ్, రజినీకాంత్ని కలిపి డైరెక్ట్ చేయాలనేది నా జీవితాశయం'' అన్నారు. చాలా కాలం తరువాత మా ఇద్దరితో సినిమా చేయాలనే ఆలోచన పూరికి రావడం చాలా సంతోషంగా ఉందని రజినీ, అమితాబ్ అన్నారు. వీరిద్దరి క్యారెక్టర్లను సమర్థవంతంగా తెరపై ఆవిష్కరించే సత్తా ఒక్క పూరికే సాధ్యమని వారు భావిస్తున్నారట. ఇద్దరు సూపర్స్టార్లతో సినిమా చేయడం తనకు ఓ ఛాలెంజ్ అంటున్నారు పూరి.
|
పూరి జగన్నాథ్ - పవన్కల్యాణ్ చిత్రంలో కాజల్
‘బిజినెస్మేన్’ సక్సెస్తో మేఘాల్లో తేలిపోతోంది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. గ్లామర్తో పాటు చక్కటి అభినయం కలబోసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయని మురిసిపోతోంది ఈ వయ్యారి. అయితే యాక్షన్ సినిమాల కంటే తనకు స్వతహాగా కామెడీ సినిమాలంటే ఇష్టమని, ఫుల్పూంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా నటించాలన్నది తన చిరకాల కోరికని సెలవిస్తోంది కాజల్ అగర్వాల్. ‘చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే అస్సలు ఇష్టం వుండదు. అంతేందుకు టీవీ చూస్తున్నప్పుడు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ వస్తే వెంటనే ఛానల్ మార్చేస్తా. అయితే సినిమాల్లోకి వచ్చాక యాక్షన్ సినిమాలకు తప్పనిసరిగా అలవాటు పడిపోవాల్సి వచ్చింది.రాబోయే రోజుల్లో కామెడీ సినిమాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నాను. హాస్యరస పాత్రల్లో నటించి మెప్పించడం అంత సులువు కాదు..ఎవరికైనా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్కల్యాణ్ నటించే చిత్రంలో ఈ సుందరిని కథానాయికగా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత పూరి-పవన్ కలయికలో వస్తోన్న ఈ చిత్రం మేలో సెట్స్పైకి వెళ్లనుంది. తొలుత ఈ చిత్రానికి బాలీవుడ్ భామను కథానాయికగా అనుకున్నా ‘బిజినెస్మేన్’ సక్సెస్తో పూరి చేత లక్కీగాళ్ అనిపించుకున్న ఈ భామనే హీరోయిన్గా ఓకే చేయనున్నట్లు సమాచారం.
|
కార్తిక టైం మెరుగవుతున్నట్లే కనిపిస్తోంది
ఒకప్పుడు ఎనభయ్యవ దశకంలో కుర్రకారు గుండెల్లో గుబులురేపిన బ్యూటీక్వీన్ రాధ హీరో చిరంజీవితో కలిసి హిట్పెయిర్గా అనేక చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఆమె కూతురు కార్తికను తెలుగులో నాగచైతన్య హీరోగా ‘జోష్’ సినిమాతో తెరంగేట్రం చేయించినా ఆ చిత్రంతో సరైన బ్రేక్ రాలేదు. తెలుగులో అవకాశాలే లేని పరిస్థితికి ఈ అమ్మడు చేరుకుంది. తమిళంలో హీరో జీవాతో కలిసి నటించిన ‘కో’ చిత్రం కార్తీక లైఫ్ స్టయిల్నే ఒక్కసారిగా మార్చేసింది. వెనువెంటనే ఈ కుర్ర భామకు మూడు భాషల్లో హీరోయిన్గా అవకాశాలు వెల్లువెత్తాయి.' కో 'చిత్రం తెలుగులో రంగం పేరిట విడుదలై ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా కార్తిక లేటెస్ట్గా ‘దమ్ము’ చిత్రంలో రెండో హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇదేగాక బాలీవుడ్లో ‘కో’ చిత్రం రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో హీరో అక్షయ్కుమార్ సరసన నటించనున్నట్లు సమాచారం. ఇదేగాక మలయాళంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. కాగా తెలుగులో ‘దమ్ము’ చిత్రం తర్వాత మరికొన్ని చిత్రాలలో కార్తికకు అవకాశం దక్కే ఛాన్సుంది. ఏదేమైనా.. కార్తిక టైం మెరుగవుతున్నట్లే కనిపిస్తోంది
|
విద్యాబాలన్ ఐటం సాంగులో మసాలా ఉండదట
బాలీవుడ్ సినిమాల ఐటం సాంగుల్లో ఈ మధ్య హీరోయిన్ల జోరు పెరిగి పోయిన విషయం తెసిందే. కత్రినా, కరీనా లాంటి టాప్ హీరోయిన్లు హాట్ హాట్గా అందాలు ఆరబోస్తూ థియేటర్లను షేక్ చేస్తున్నారు. కత్రినాకైఫ్ నటించిన షీలాకీ జవానీ, చికినీ చమేలీ పాటలు ఆయా సినిమాలకు భారీ పాపులరిటీని సంపాదించి పెట్టాయి కూడా. డర్టీ పిక్చర్ సినిమా ద్వారా సెక్సీ యాక్టర్గా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ కూడా త్వరలో ఐటం సాంగులో మెరవబోతోంది. ‘ఫెరారీ కి సవారీ’ చిత్రానికి గాను విద్యాను ఐటం గర్ల్గా ఎంపిక చేశారు. రాజేష్ మస్సూకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విధు వినోద్ చోప్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శర్మాన్ జోషి, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే విద్యా నటించే ఈ పాటలో రొటీన్ ఐటం పాటల మాదిరిగా ఎక్స్పోజింగ్, అంగాంగ ప్రదర్శన, బూతు సాహిత్యం లాంటి మసాలా ఉండదట
|
|
ప్రసాద్ ప్రొడక్షన్స్ ‘ఋషి’ లోగో ఆవిష్కరణ
ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఋషి’. రాజ్ మాదిరాజ్ దర్శకత్వం వహించారు. అరింద్కృష్ణ, సుప్రియా
శైలజ హీరోహీరోయిన్లు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అమల
అక్కినేని, రమేష్ప్రసాద్, డాక్టర్ గోఖలేరెడ్డి, డా.రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. నటి అమల అక్కినేని ఈ చిత్రం లోగోను
ఆవిష్కరించారు. అలాగే ఇదే కార్యక్రమంలో భాగంగా మోహన్ ఫౌండేషన్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్ సంస్థల
ఎండి రమేష్ప్రసాద్ మాట్లాడుతూ- ‘చాలా సంవత్సరాల తర్వాత మా సంస్థద్వారా అందరికీ అవగాహన కల్పించే స్ఫూర్తినిచ్చి,
మెప్పించే కథనం తెరకెక్కిస్తున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి
ప్రయత్నిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్ర కథానాయకుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ‘ఒక మంచి పాత్రను ఈ చిత్రంలో పోషించినందు
కు చాలా ఆనందంగా ఉంది. ఈ ఋషి అందరినీ ఆకట్టుకుంటాడని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ చిత్ర దర్శకుడు రాజ్ మాదిరాజ్
మాట్లాడుతూ -‘నిర్మాణానంతర పనులు శరనవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నాం. ఒక మంచి
సందేశాన్నిచ్చే సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’ అన్నారు. అనంతరం మోహన్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో
అవయవదానం ప్రాధాన్యత...దానికి సంబంధించిన అవగాహనను కల్పించేవిధంగా పలువురు వైద్య ప్రముఖులు ప్రసంగించారు. ఈ
సందర్భంగా అక్కినేని అమల మాట్లాడుతూ- మనం మరణించిన మన అవయవాలు వేరొకరికి వెలుగునిస్తాయని అన్నారు. |
పూర్తిగా తెలుగు సినిమాలపై దృష్టిపెడతాను
తమిళ నిర్మాతలకు మిల్క్బ్యూటీ తమన్నా డేట్స్ దొరకడం కష్టమైపోతోంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా వుండటంతో ఈ
సంవత్సరం తమిళ సినిమాల్లో నటించలేనని నిస్సహాయతను వ్యక్తం చేసింది ఈ సుందరి. గత సంవతర్సం తమన్నా నటించిన
తమిళ చిత్రాలు' అయన్', 'పయ్యా' పెద్ద విజయం సాధించాయి. తాజాగా జీవా హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో తమన్నా
సెకండ్ లీడ్ హీరోయిన్గా నటించబోతోందని, త్రిష మెయిన్లీడ్ హీరోయిన్ అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఖండించింది
తమన్నా. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ- ‘జీవా సినిమాలో కథానాయికగా నటించమని నిర్మాతలు నన్ను అడిగిన మాట
వాస్తవమే. అయితే మెయిన్ హీరోయిన్గా నటించమని మాత్రమే అడిగారు. సెకండ్లీడ్లో అన్న వార్త అవాస్తవం. తెలుగు చిత్రాల్లో
బిజీగా వుండటం వల్ల తమిళ చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేసుకోలేకపోతున్నాను. ఈ సంవత్సరం పూర్తిగా తెలుగు సినిమాలపై
దృష్టిపెడతాను’ అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో రచ్చ, రెబల్, ఎందుకంటే ప్రేమంటే చిత్రాల్లో నటిస్తోంది.
|
జగన్తో రవితేజ చేసే ఐదో సినిమా 'దేవుడు చేసిన మనుషులు'
రవితేజ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి,వి,ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే 'దేవుడు చేసిన
మనుషులు' చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 17న ప్రారంభమవుతుంది. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ 'జగన్తో నేను చేసే ఐదో
సినిమా ఇది. మా కాంబినేషన్లో ఎక్స్పెక్ట్ చేసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. మా ప్రసాద్గారి బేనరులో ఈ
సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది' అన్నారు.దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ' రవితేజతో చేస్తున్న మంచి కమర్షియల్
ఫిలిం ఇది. అతని కేరెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పూర్తి వినోదంతో అందరినీ అలరించే సినిమా అవుతుంది'
అన్నారు.'గతంలో వచ్చిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రానికీ, మా సినిమాకి టైటిల్పరంగా తప్పితే మరే పోలిక లేదు. ఇది
హండ్రెడ్ పర్సెంట్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. రవితేజ సరసన ఇలియానా నటిస్తుంది. ఫిబ్రవరి 17న షూటింగ్ ప్రారంభిస్తాం.
మార్చి ఒకటి నుంచి ఏకధాటిగా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. జూన్లో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.ఈ చిత్రానికి
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: రఘు కుంచె, ఫైట్స్: విజయ్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు,
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
|
3డీ మ్యాగజైన్పై మల్లికా... వారి ఇమేజ్ ఆశిస్తున్న సమీరా
బాలీవుడ్లో తన అందాలతో కుర్రకారుకి మతిపోగొట్టిన సెక్సీ భామ మల్లికా శెరావత్. ఈ ముద్దు గుమ్మ త్వరలో ‘ఎ’ అనే పేరుతో
వెలువడే హాలీవుడ్ 3డీ మ్యాగజైన్పై మెరవనుందట. ఈ మ్యాగజైన్ కోసం మల్లిక ఇటీవలే ఫోటోషూట్లో పాల్గొందని బాలీవుడ్
వర్గాల సమాచారం. ఈ విషయంపై మల్లిక స్పందిస్తూ ‘ తొలిసారిగా హాలీవుడ్లో వెలువడుతున్న ‘ఎ’ 3డీ మ్యాగజైన్పై మరింత
అందంగా కనిపించబోతున్నాను. దీని కోసం ఇండియాకు చెందిన నేను అయితేనే బాగుంటుందని నిర్వహకులు నన్ను
సంప్రదించారు. ఇటీవలే ఫోటోషూట్ పూర్తయింది. 3డీ గ్లాసెస్8 ద్వారా ఈ మ్యాగజైన్లోని అందాలను ఆస్వాదించొచ్చు’ అని తెలిపింది.
సిమ్రాన్, జ్యోతిక కోలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని పొందారని, వారిలాంటి ఇమేజ్ను తాను ఆశిస్తున్నట్లు నటి సమీరా రెడ్డి
వ్యాఖ్యానించారు. వారణం ఆయిరం చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగిడిన ఈ ఉత్తరాది భామ ప్రస్తుతం తమిళం, తెలుగు,
హిందీ భాషా చిత్రాల్లో నటిస్తూ ప్రముఖ హీరోయిన్ల పట్టికలో స్థానం సంపాదించింది. ఇటీవల విడుదలయిన వేట్టై చిత్రం ఈ
ముద్దుగుమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టిందట. దీనిపై సమీరా మాట్లాడుతూ వేట్టై చిత్రంలో లంగాఓణిలో అచ్చ తమిళ అమ్మాయిగా
నటించానని తెలిపారు. అదే సమయంలో హిందీలో అనిల్ కపూర్ అజయ్ దేవగన్లతో కలిసి తేజ్ చిత్రంలో మోడ్రన్ యువతిగా
నటించానని చెప్పారు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు.
|
వివాహిత పాత్రను సవాల్గా తీసుకున్నాను
'జస్సీ జైసీ కోయీ నహీ' ఫేం మోనాసింగ్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ కుటుంబ కథల సీరియళ్లవైపు దృష్టి పెట్టింది. ఇక
నుంచి ఏక్తాకపూర్ కొత్త సీరియల్ ‘క్యా హువా తేరా వాదా’తో ఇంటిల్లిపాదినీ అలరించనుంది. వివాహిత పాత్ర పోషించాలనగానే
మొదట కాస్త భయపడ్డానని మోనా చెప్పింది. ఈ 31 ఏళ్ల నటి 2003లో తన టీవీ కెరీర్ను మొదలుపెట్టింది. జస్సీ..లో అందరి
సమస్యలను పరిష్కరించే అమ్మాయిగా గృహిణులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘ఏక్తా.. క్యా హువా తేరావాదా స్క్రిప్టు వివరించినప్పుడు
అందులోని గృహిణి పాత్రలో నన్ను ఊహించుకోలేకపోయాను. నేను ఇప్పటి వరకు రియాలిటీ షోల ద్వారానే అందరికీ తెలుసు. ఈ
సమయంలో ఒక రోజు ఏక్తా హఠాత్తుగా ఫోన్ చేసి తన సీరియల్కు పని చేయాలని అడిగింది. సీరియళ్ల షూటింగ్లకు వెళ్లడం
మొదలైన తరువాత ఇక ఏ షోలోనూ పాల్గొనం లేం కాబట్టి ఇందులో నటించడానికి మొదట జంకాను. ‘నిన్నే దృష్టిలో ఉంచుకొని
స్క్రిప్టును రాశానం’టూ ఏక్తా బలవంతపెట్టింది. లేకపోతే షూటింగ్ను రద్దు చేసుకుంటానని చెప్పింది. అందుకే నేను
కాదనలేకపోయాను. వివాహిత పాత్రను సవాల్గా తీసుకున్నాను’ అని మోనా వివరించింది. 'క్యా హువా తేరా వాదా'లో మోనా
ముగ్గురు పిల్లల తల్లిగా కనిపించాలి. ఇందుకోసం ఈమె తెగ వ్యాయామాలు చేసి ఎనిమిది కిలోల బరువు తగ్గింది. సంసార జీవితం
గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రులు, ఇతర దంపతుల ప్రవర్తనను నిశితంగా గమనించింది. తన పాత్ర రూపురేఖల విషయంలో
ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని మోనా కోరుకుంటుంది. అందుకే జస్సీ జైసీ కోయీ నహీలో విభిన్న వేషధారణతో కనిపించింది.
ఇందులో వివాహితనే అయినా తగిన గ్లామర్కు కొదవేమీ ఉండబోదని మోనా భరోసా ఇస్తోంది. క్యా హువా తేరా వాదా ఈ నెల 30
నుంచి సోనీ చానెల్లో ప్రసారమవుతుంది
|
|
'ఏజెంట్ వినోద్' కోసం యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది
అందం, ఆకర్షణ ఉండే పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతానని, యాక్షన్ తన వల్ల కాదని కరీనా కపూర్ ఎప్పుడూ చెబుతుంది.
అయితే తన ప్రియుడి తాజా సినిమా' ఏజెంట్ వినోద్ 'కోసం ఈ అమ్మడు గ్లామర్ను కాస్త పక్కనబెట్టి యాక్షన్ సన్నివేశాల్లో
అదరగొట్టింది. పలు స్టంట్లు కూడా చేసింది. ఇలాంటివి చేయడానికి బెబో మొదట సంకోచించిందని, తరువాత ఒప్పుకొని అద్భుతమైన
స్టంట్లు చేసిందంటూ సైఫ్ సంబరపడిపోయాడు. ఈ గూఢచారి సినిమా అంతా సైఫ్ చుట్టే తిరుగుతుంది. ‘ఇది యాక్షన్ సినిమా కాబట్టి
స్టంట్లు తప్పనిసరి. ప్రచార వీడియోల్లో కూడా కార్లు, బైకుల స్టంట్లు, చేజింగ్ సన్నివేశాలు కనిపిస్తాయి. కరీనా మొదట్లో కాస్త
వెనకాడినా తరువాత చాలా బాగా స్టంట్లు చేసింది. చక్కటి హావభావాలు ప్రదర్శిం చింది కూడా’ అంటూ సైఫ్ ప్రియురాలిని ఆకాశానికి
ఎత్తేశాడు. గత ఏడాది ఢిల్లీలో ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల షూటింగ్ సదర్భంగా కరీనాకు గాయాల య్యాయి. చోటే నవాబ్
కూడాగాయాలపాలయ్యాడు. ‘ఫైట్లు చేయడం సరదా అనుకున్నాను కానీ గాయాల వల్ల నా శరీరం రూపు మొత్తం మారిపోయింది.
ఇలా ఎప్పుడూ జరగలేదు’- అని జాతీయ అవార్డుగ్రహీత కూడా అయిన సైఫ్ అన్నాడు. గూఢచారి సినిమాల్లో హీరోయిన్లు
సాధారణంగా అందాలు ఆరబోయడానికే పరిమితమవుతారు. ఈ సినిమాలో మాత్రం సైఫ్ తన ప్రేయసి పాత్ర అసాధారణంగా ఉండేలా
జాగ్రత్త తీసుకున్నాడు. కరీనా తన పాత్రకు వందశాతం న్యాయం చేసిందని, ఆ పాత్ర ఆమెకూ న్యాయం చేసిందని ఈ 41 ఏళ్ల నటుడు
చమత్కరించాడు. మరో విశేషమేమంటే -ఇందులో కరీనా ముజ్రా అనే మధ్యయుగాల నాటి సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించింది. ఇది
దాదాపు ఐటెంసాంగ్లా ఉంటుందని సైఫ్ అన్నాడు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ వినోద్ మార్చి 23న థియేటర్లపై
దాడి చేస్తున్నాడు
|
గాయకుడిగా ప్రభుదేవా ...బాలీవుడ్లో ‘జర్నీ’
భారతీయ మైకేల్ జాక్సన్ గా పేరొందిన కొత్త పాత్ర పోషించబోతున్నారు. తను నృత్యం చెయ్యబోతున్న పాటలు తనే
పాడుకోబోతున్నారు. ఈ ఆల్బం ని 7డి కెమరా తో చిత్రీకరించబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని ముంబై లో
జరగబోతుంది. నృత్య దర్శకుడు నుండి దర్శకుడిగా మారిన ఈ నటుడు అంతర్జాతీయ ఆల్బం మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది.
ప్రస్తుతం హిందీ “విక్రమార్కుడు” “రౌడీ రాథోర్” రేమో దర్శకత్వం లో వస్తున్న మొదటి 3డి చిత్రం లో కూడా నటిస్తున్నారు.
శర్వానంద్,అంజలి, జై, అనన్య ప్రధాన పాత్రల్లో ఎ.ఆర్. మురుగదాస్8 తమిళంలో నిర్మించిన చిత్రం ‘ఎంగెయుం ఎప్పోదుమ్’. శరవణన్
దర్శకుడు. ఇదే చిత్రం తెలుగులో ‘జర్నీ’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారని సమాచారం.
తమిళంలో ఈ చిత్రం ఇప్పటికి 130 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మురుగదాస్8 మాట్లాడుతూ ‘ ‘గజిని’ తర్వాత కొంత
గ్యాప్ తీసుకున్న నేను ‘ఎంగెయుమ్ ఎప్పోదుమ్’ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాను. కథే హీరోగా నమ్మి చేసిన చిత్రమిది. ఫ్యాక్స్
స్టార్ స్టూడియోస్8 సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇందులో నటించే నటీనటులు ఎవరు తదితర
వివరాలు త్వరలో తెలియజేస్తాను’ అన్నారు.
|
‘గ్రేట్ జర్నీ ఆఫ్ పద్మశ్రీ డి.వి.ఎస్.రాజు’ డాక్యుమెంటరీ
పద్మశ్రీ డివిఎస్ రాజు తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రవేసి...నిస్వార్థానికి మారుపేరుగా, నిరాడంబరంగా బతికారు. తెలుగు
సినిమా రంగానకి ఎనలేని సేవలందించిన ఆయన సేవలను గుర్తించి రాష్ట్రప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య అవార్డుతో,
భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును, భీష్మ అవార్డును ఇచ్చి గౌరవించాయి. రాజుగారి వ్యక్తిత్వానికి దర్పణంగా ‘గ్రేట్ జర్నీ ఆఫ్ పద్మశ్రీ
డి.వి.ఎస్.రాజు’ అనే ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని సీడీరూపంలో కేంద్ర మానవ వనరుల
సహాయ మంత్రి డా.దగ్గుపాటి పురందేశ్వరి గురువారం ఆవిష్కరించారు. డా.డి.రామానాయుడు, రమేష్ప్రసాద్, కె.ఎల్.నారాయణ, అల్లు
అరవింద్, డివిబి రాజు, కె.ఎస్.రామారావు మరియు డివిఎస్ రాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సాంకేతిక
సలహాదారుడిగా వి.వి.రాజు వ్యవహరించారు. గురువారం జరిగిన ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి
పురందేశ్వరి మాట్లాడుతూ- ‘5 దశాబ్దాల అనుబంధం మాది అని చెప్పడానికి నేను ఎన్నడూ వెనకాడను. ఎందుకంటే నేను ఆయన
ఒడిలోనే పెరిగాను. నాకు ఆయన పితృసమానులు. ఆయనతో నాకు ఆత్మ సంబంధం ఉంది. ఈ రోజు ఆయనపై చేసిన
డాక్యుమెంటరీని నేను ఆవిష్కరించడం నా అదృష్టం గా భావిస్తున్నాను’ అన్నారు. డా.రామానాయుడు ప్రసంగిస్తూ- తనకు
రాజుగారితో 47 సంవత్సరాల పరిచయమున్నదని, ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉండేవారమని గుర్తుచేసుకున్నారు. నిర్మాత అల్లు
అరవింద్ మాట్లాడుతూ- మూడు దశాబ్దాల పరిచయం తమది అన్నారు. ఆయనను తాను ఎప్పుడూ గురువులా భావిస్తానన్నారు.
|
హాట్ ప్రాపర్టీ గా ఏమి జాక్సన్... అందగత్తెల లిస్ట్ లో శృతి హసన్
ప్రస్తుతం బాలివుడ్ లో ఏమి జాక్సన్ హాట్ ప్రాపర్టీ గా మారారు జియోర్జియో అర్మని ప్రపంచ ప్రముఖ ఫాషన్ లేబల్స్ లో నూతన
ముఖంగా ఎంపిక అయ్యారు. భారత దేశం తరుపున ఈ భామ అప్పుడే ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారు. ఏమి జాక్సన్ ప్రస్తుతం
క్వాన్ టాలెంట్ ఏజెన్సి తరుపునచేస్తున్నారు . ఈ సంస్థే మహేష్ బాబు,జెనిలియా,శ్రుతి హసన్,రన్బీర్ కపూర్ అంటి ప్రముఖుల
డేట్స్ ని చూసుకుంటున్నారు. ఏమి జాక్సన్ మొదట తమిళ చిత్రం “మద్రాసి పట్టినం ” చిత్రం తో తెరకు పరిచయం అయ్యారు.
ప్రస్తుతం బాలివుడ్ లో ఏ మాయ చేసావే రీమేక్ “ఏక దీవన థా” చిత్రం లో ప్రతీక్ బబ్బర్ సరసన నటించారు. రామ్ చరణ్ మరియు
సమంతలు ప్రధాన పాత్రలలో వస్తున్న ” ఎవడు” చిత్రం లో కూడా ఒక పాత్ర చేస్తుంది. మద్రాసి పట్టినం దర్శకుడు ఏ ఎల్ విజయ్
కుమార్ దర్శకత్వం లో వస్తున్న “తాండవం” చిత్రం లో కూడా ఒక పాత్ర చేస్తున్నారు.
'ఫెమినా 'మ్యాగజైన్ వారు ఇండియా వ్యాప్తంగా అందగత్తెల లిస్ట్ తాయారు చేయగా శృతి హసన్ అందులో చోటు దక్కించుకుంది.
ఫెమినా మ్యాగజైన్ వారు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఇండియా నుండి 50 మంది అందగత్తెల లిస్ట్ తాయారు చేస్తారు. అందులో
మొదటి చోటు దీపిక పడుకొనే దక్కించుకుంది. సౌత్ ఇండియా నుండి శృతి హసన్ ఎంపికయింది. వీరే కాకుండా జెనీలియా డిసౌజా,
ఫ్రిదా పింటో, నర్గిస్ ఫఖ్రి, కల్కి కోచ్లిన్,అమృత పూరి, మోనికా డోగ్ర మరియు ప్రీతీ దేశాయ్ వీరు కూడా ఈ లిస్ట్ లో చోటు
దక్కించుకున్నారు. ప్రస్తుతం శృతి హసన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్లో పాల్గొంటుంది.
|
మా పెళ్లి వాయిదా పడిందన్న వార్తల్లో వాస్తవం లేదు
అందాల భామ స్నేహ పెళ్లికి ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు ప్రసన్నను ఈ సుందరి త్వరలో పెళ్లాడనుంది.
మేలో పెళ్లికి ముహూర్తం ఖరారు చేసినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే పెళ్లి తర్వాత స్నేహ సినిమాలకు గుడ్బై
చెప్పనుందనే విషయం ఈ స్మైలీ బ్యూటీ అభిమానుల్ని కలవరపెడుతోంది. పెళ్లి తర్వాత స్నేహ సినిమాల్లో నటించడం ప్రియుడు
ప్రసన్నకు ఇష్టం లేదని, దాంతో వివాహాన్ని వాయిదా వేసుకునే ఆలోచనలో ఈ జంట వుందని తమిళ పత్రికల్లో వార్తలు
వెలువడ్డాయి. దీంతో కలవరపడ్డ ప్రసన్న ఇటీవల చైన్నైలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ‘మా పెళ్లి
వాయిదా పడిందన్న వార్తల్లో వాస్తవం లేదు. అనుకున్న సమయం ప్రకారం మా పెళ్లి జరుగుతుంది. పెళ్లయ్యాక కూడా స్నేహ
సినిమాల్లో నటించాలన్నదే నా అభిమతం. స్నేహ చాలా టాలెంటెడ్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకెంతో మంది
అభిమానులున్నారు. నటిగా ఆమో అభివూపాయాల్ని గౌరవిస్తాను. ఆమె సినిమాల్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.
సినిమా కెరీర్ విషయాల్లో నా ఆమెప్పుడు నా సపోర్ట్ వుంటుందని’ ప్రసన్న మీడియాకు తెలిపాడు. వివాహానంతరం సినిమాల్లో
నటిస్తానని, ప్రసన్నలాంటి అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లాడబోవటం తన అదృష్టమని స్నేహ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం
ఈ సుందరి రజనీకాంత్ ‘కొచ్చాయడన్’, శరత్కుమార్ ‘విధి’ చిత్రాల్లో నటిస్తోంది.
|
|
వేడుకగా జరిగిన ‘మా మ్యూజికల్ అవార్డ్స్’ ఫంక్షన్
‘మా మ్యూజికల్ అవార్డ్స్’ఫంక్షన్ లో మంజులారామస్వామి టీమ్ చేసిన క్లాసికల్ డాన్స్, దేవిశ్రీప్రసాద్ ఆటా పాటా,
అనిరుధ్ పాడిన ‘కొలవెరి...’ పాట, శ్రీకృష్ణ-సునీతలు పాడిన వేటూరి క్లాసిక్స్, గీతామాధురి, ప్రణవి, శ్రీకృష్ణ, మాళవికలు
పాడిన సిరివెన్నెల పాటలు ఆహూతులను ఆకట్టుకోగా, ఛార్మి డాన్స్, ‘డియాలో డియాలో...’ పాటకు మరియమ్
జకారియా వేసిన స్టెప్పులు హుషారు పెంచాయి.
‘సార్ వస్తారొస్తారా...’ అంటూ స్వాతి ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. బాబా సెహగల్ తన పాటలతో
ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ వేదికపై ‘శ్రీరామరాజ్యం’ యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు.
నందమూరి బాలకృష్ణ, నయనతార, బాపు, యలమంచిలి సాయిబాబు, జొన్నవిత్తుల, సమీర్ను కె.రాఘవేంద్రరావు,
డా. డి. రామానాయుడు, పి.సుశీల, మా టీవీ ఛైర్మన్ ఎన్. ప్రసాద్లు సత్కరించారు. సాహిత్య ప్రపంచంలో తనదైన
శైలిలో రాణిస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రికి ‘జీవితకాల సాఫల్య పురస్కారాన్ని’ అందజేశారు. ఉత్తమ నేపథ్య
సంగీతానికిగాను ఇళయారాజా తరఫున యలమంచిలి సాయిబాబు అందుకున్నారు. ఉత్తమ రచయితగా
జొన్నవిత్తుల, పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్గా దేవిశ్రీప్రసాద్, సంగీత దర్శకుడిగా తమన్ ఎన్నికయ్యారు. మ్యూజికల్
ఫిలిం ఆఫ్ ది ఇయర్కి గాను ‘దూకుడు’ నిర్మాతలు, డాన్స్ నంబర్ కొరియోగ్రాఫర్గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ సింగింగ్
సెన్సేషన్గా స్వాతి, బెస్ట్ ఇన్స్పిరేషన్ సాంగ్ రచయితగా సుద్దాల అశోక్తేజ అవార్డులు స్వీకరించారు. ఈ వేడుకలో
కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, కె.అచ్చిరెడ్డి, గుణ్ణం గంగరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, నందినీరెడ్డి, మణిశర్మ, చంద్రబోస్, అమల,
సుమంత్, అల్లు అర్జున్, రామ్చరణ్, నాగచైతన్య, వరుణ్ సందేశ్, పుల్లెల గోపిచంద్ తదితరులు కూడా పాల్గొన్నారు.
‘మా గోల్డ్’ చానల్ను ఇదే వేదికపై ప్రారంభించారు |
దానికోసం చాలా విషయాల్ని త్యాగం చేస్తున్నాను
చక్కనమ్మ చిక్కితేనే అందం. ‘దేశముదురు’ చిత్రంతో నాజూకు సుందరిగా తెలుగు ప్రేక్షకులకు
పరిచయమైందిముంబయ్ ముద్దుగుమ్మ హన్సిక. ఈ సుందరి ఈ మధ్య కాస్త బొద్దుగా తయారైన విషయం తెలిసిందే.
తొలి చిత్రం ‘దేశముదురు’ నుంచి నిన్నటి ‘ఓ మై ఫ్రెండ్’ వరకు 14 కేజీలబరువు పెరిగిందట హన్సిక. తను బొద్దుగా
మారడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి హన్సిక మాట్లాడుతూ ‘ నా తొలి చిత్రానికి ఇప్పటికీ పోల్చి చూస్తే
చాలా బరువు పెరిగాను. దాని వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా
పడుతున్నాను. బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తున్నాను. రోజూ ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను. ఎంత
కష్టమైనా సరే మళ్లీ నా శరీరాకృతిని నాజూకుగా మార్చుకోవాలనుకుంటున్నాను. దీని కోసం నాకిష్టమైన ఆహారాన్ని
పక్కన పెట్టాను. స్లిమ్గా కావడానికి చాలా విషయాల్ని త్యాగం చేస్తున్నాను. రాబోయే అన్ని చిత్రాల్లో నాజూకుగా
కనిపిస్తాను. ప్రస్తుతం విష్ణుతో ఓ చిత్రంలో నటిస్తున్నాను. అతనిలాగానే నేనూ ఈ చిత్రంలో స్లిమ్గా
కనిపించాలనుకుంటున్నాను అని తెలిపింది హన్సిక.
|
చిన్న సినిమాలకు వీలుగా నిర్మాతల మండలి నిర్ణయించింది
తమిళనాడులో ‘నిర్మాతల మండలి’ శక్తివంతంగా పనిచేస్తుంది. ఒకసారి ఆ సంస్థ శాసనం చేస్తే అందుకు
తిరుగుండదు. ధనుష్ ‘3’, కార్తీ ‘సగుని’ చిత్రాల విడుదల తాజాగా వాయిదా పడటానికి కారణం అదే. ఫిబ్రవరి 3న
రిలీజు కావలసిన ‘3’ సినిమా, ఫిబ్రవరి 17న విడుదల కావలసిన ‘సగుని’ చిత్రం విడుదల విషయంలో నిర్మాతల
మండలి ఆదేశానుసారం ‘తమిళుల కొత్త సంవత్సరం’ అయిన ఏప్రిల్ 13న విడుదల చేయడానికి ఆయా చిత్రాల
నిర్మాతలు విధిలేక అంగీకరించినట్లు సమాచారం.సంక్రాంతి, తమిళ ఏడాది, మేడే, స్వాతంత్య్ర దినోత్సవం, దీపావళి
వంటి సందర్భాలను పెద్ద హీరోల సినిమాల విడుదలకు ‘పండగ రోజులు’గా అక్కడి నిర్మాతల మండలి
నిర్ణయించింది. మిగతా సమయాల్లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరికేందుకు వీలుగా నిర్మాతల మండలి ఈ
రకమైన నిర్ణయాన్ని గైకొంది. తెలుగు పరిశ్రమలో కూడా ఇటువంటి నిర్ణయాలను నిర్మాతల మండలి తీసుకుంటే
చిన్న సినిమాల మనుగడకు అవకాశం ఉంటుందని పలువురు బడ్జెట్ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
|
ధనుష్ బాలీవుడ్ రంగ ప్రవేశం ఖరారయింది
వైదిస్ కొలెవైరిడి.. అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన యువ నటుడు ధనుష్ మరో సంచలనానికి
నాంది పలికారు. కోలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యువ హీరో ఇప్పుడు బాలీవుడ్లో తన
అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన బాలీవుడ్ రంగ ప్రవేశం ఖరారయింది. 'తనూ వెడ్స్
మను' చిత్రంతో బాలీవుడ్లో హిట్ కొట్టిన దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో ధనుష్
హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి 'రాజ్హ్నా' అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ విషయం గురించి దర్శకుడు
ఆనంద్ వెల్లడిస్తూ ఈ చిత్రం కోసం గత ఆరు నెలలుగా సింపుల్ బాయ్ కోసం అన్వేషిస్తున్నారన్నారు. ఎప్పుడయితే
తమిళ చిత్రం 'ఆడుగళం'లో ధనుష్ నటనను చూశానో అప్పుడే ఈయన తన చిత్ర హీరో అని ఫిక్స్
అయిపోయానన్నారు. నటుడు ధనుష్ మాట్లాడుతూ- తనకు హిందీ భాష తెలియదన్నారు. అందువల్ల ముందుగా
అక్కడి ఆచార వ్యవహారాలను తెలుసుకుంటున్నానని తెలిపారు. హిందీ భాష నేర్చుకునే ప్రయత్నం కూడా
చేస్తున్నానని అన్నారు. రాజ్హ్నా చిత్రం తను వెడ్స్ మను చిత్రం తరహాలోనే విభిన్న ప్రేమ కథా చిత్రంగా
ఉంటుందని, చిత్ర షూటింగ్ను ఢిల్లీ, పంజాబ్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
ప్రస్తుతం 3చిత్రంలో నటిస్తున్న ధనుష్ తదుపరి బాలీవుడ్ చిత్రాన్నే చేయనున్నట్లు సమాచారం
|
భరత్ పారేపల్లి దర్శకత్వంలో ‘ఇష్టసఖి’
వరుణ్, భాస్కర్, శ్రీరామ్, అనుసృ్మతి ప్రధాన పాత్రధారులుగా భరత్ పారేపల్లి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న
చిత్రం ‘ఇష్టసఖి’. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దాసరి
నారాయణరావు క్లాప్ నివ్వగా హీరో శ్రీహరి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో
సాగే అందమైన ప్రేమకథ ఇది. ఇందులో ముగ్గురు హీరోలు. సింగర్, ఒకరు రచయిత, మరొకరు చిత్రకారుడు. ఈ
ముగ్గురి జీవితాల్లో సంభంవించిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఇందులో అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ వైజాగ్లో మొదలవుతుంది. అక్కడే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు
మూడు పాటలు చిత్రీకరిస్తాం. మిగతా భాగం అంతా హైదరాబాతద్లో పూర్తి చేస్తాం. ఏప్రిల్లో చిత్రాన్ని విడుదల
చేయాలనుకుంటున్నాం’ అన్నారు. బ్రహ్మానందం, రఘుబాబు, అలీ, వేణుమాధవ్, జి.గోపాల్, మధు భాయ్,
తిరుమలరావు, సత్యనారాయణ రెడ్డి, పరశురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: లలిత్ సురేష్,
మాటలు: మరుధూరి రాజా, కెమెరా: శంకర్ కంతేటి, ఎడిటింగ్: బి.కృష్ణంరాజు, పాటలు: పెద్దాడ మూర్తి.
|
|
జెనీలియా నటనకీ, పెళ్లికీ సంబంధం లేదనీ తేల్చి చెప్పింది
బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్ ని ఫిబ్రవరి 3న పెళ్లాడబోతున్న చిరునవ్వుల సుందరి జెనీలియా పెళ్లి తర్వాత
కూడా నటిస్తాననీ, నటనకీ, పెళ్లికీ సంబంధం లేదనీ తేల్చి చెప్పింది. వారితో సినిమాలు తీస్తున్న నిర్మాతలు వారి పెళ్లి
కారణంగా తమ సినిమాల షెడ్యూళ్లలో మార్పులు చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఓ నెల వరకు వాళ్లు
షూటింగులకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్లున్న సన్నివేశాల్ని నెల తర్వాత ప్లాన్ చేస్తున్నారు.జెనీలియా మాత్రం
పెళ్లి వల్ల తన సినిమాలకు ఎలాంటి ఆటంకం కలగడం లేదని చెబుతోంది. నిజానికి ఆమె హీరోయిన్ గా ఎంపికైన 'రాక్
ద షాది' సినిమా 2011 నవంబర్ లోనే మొదలు కావాల్సి ఉన్నా, ఆమె పెళ్లి వల్ల వాయిదా పడిందనే వార్తలు
వచ్చాయి. అయితే ఆ సినిమా ఔట్ డోర్ షూటింగ్ కి పర్మిషన్ లభించక పోవడంవల్లే ఆలస్యం జరిగిందే తప్ప, తన
పెళ్లి వల్ల కాదనీ, ఏమైనా ఆ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరులో మొదలవుతుందనీ తెలిపింది జెనీలియా.తమ
పెళ్లి కుటుంబ వ్యవహారంగానే జరగబోతోందనీ,సినిమా రంగానికి చెందినవాళ్లు కొద్దిమందే దానికి హాజరవుతారనీ
ఆమె చెప్పింది. సినిమా కెరీర్ సంగతేమిటనే ప్రశ్నకు పెళ్లయ్యాక కూడా నేను నటిస్తా. అయితే ఎప్పటిదాకా అనేది
మాత్రం చెప్పలేను" అని తెలిపింది. రితీశ్ తోటే ప్రస్తుతం 'తేరే నాళ్ లవ్ హో గయా' చేస్తున్న ఆమె తెలుగులో రానా
జోడీగా 'నా ఇష్టం' చేస్తోంది.
|
ఆస్కార్ అవార్డులలో అనిల్ అంబానీ చిత్రాలకు 11 నామినేషన్స్
అనిల్ అంబానీ సంస్థ అయిన రిలయన్స్ డ్రీం వర్క్స్ ఆస్కార్ అవార్డులలో మొత్తం మూడు చిత్రాలు “వార్ హార్స్”
,”ది హెల్ప్” మరియు “రియల్ స్టీల్” కు గాను 11 నామినషన్లను సొంతం చేసుకుంది. ఇంత భారి స్థాయిలో ఒక
భారతీయ సంస్థ నామినేషన్లు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఉత్తమ చిత్రం కేటగిరి లో – వార్ హార్స్ మరియు ది
హెల్ప్ ఉన్నాయి.స్పీల్ బెర్గ్ దర్శకత్వం వహించిన వార్ హార్స్ చిత్రం ఉత్తమ చిత్రం,సౌండ్ ఎడిటింగ్,సౌండ్ మిక్సింగ్,
ఒరిజినల్ స్కోర్(జాన్ విలియమ్స్),ఆర్ట్ డైరెక్షన్ మరియు సినిమాటోగ్రఫీ వంటి ఆరు కేటగిరిలలో ఉంది. ఈ చిత్రం
ఫిబ్రవరి 10న ఇండియా లో విడుదల కానుంది. “ది హెల్ప్” చిత్రం ఉత్తమ చిత్రం, ఉతమ నటి(వియోల డేవిస్), ఉత్తమ
సహాయ నటి (జెస్సికా చస్తియన్ మరియు ఆక్టావియా స్పెన్సర్), హుగ్ జాక్ మాన్ నటించిన “రియల్ స్టీల్” చిత్రం
విజువల్ ఎఫ్ఫెక్ట్స్ విభాగం లో ఎంపికయ్యింది.
|
త్రిష లో పెద్దరికం ఛాయలు కనిపిస్తున్నాయంటున్నారు
'బాడీగార్డ్'ను చూసివాళ్లలో ఎక్కువ మంది త్రిష పెద్దదిగా కనిపిస్తున్నదనే అంటున్నారు. కేవలం ఎనిమిదేళ్ల క్రితమే 'నీ
మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగులో అడుగు పెట్టినప్పటికీ ఆమె పట్ల ఇలాంటి అభిప్రాయం వ్యక్తం
అవుతుండటం గమనార్హం. మన హీరోలు ఏకంగా మూడు నాలుగు దశాబ్దాల పాటు హీరోలుగా చలామణీ కాగలరు
కానీ హీరోయిన్లు పట్టుమని పదేళ్లు కెరీర్ కొనసాగించడం చాలా కష్టం.ఇప్పటి రోజుల్లో ఓ హీరోయిన్ ఐదారు ఏళ్ల కంటే
ఎక్కువ కాలం స్టార్ డంను నిలబెట్టుకోలేకపోతోంది. అనుష్క, ఇలియానా, కాజల్, తమన్నా, సమంత వంటి తారలు
వచ్చాక త్రిష ప్రాభవం తెలుగులో తగ్గింది. పైగా మరీ బక్క పలచగా ఉండటం కూడా ఆమెకి మైనస్ గా మారి,
మొహంలో పెద్దరికం ఛాయలు కనిపిస్తున్నాయనేది విశ్లేషకుల మాట. 'బాడీగార్డ్' సినిమాలో ప్రకాశ్ రాజ్ కుమార్తెగా
త్రిష ప్రేక్షకుల్ని ఏమంతగా అలరించలేకపోయింది.'బాడీగార్డ్'గా సీనియర్ హీరో వెంకటేశ్ ను యాక్సెప్ట్ చేస్తున్న జనం,
ఆయన వయసులో దాదాపు సగం వయసే ఉన్న త్రిషను మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోవడం చిత్రమే. త్రిష పట్ల
ఇప్పుడే ఇలాంటి అభిప్రాయం వస్తే- రేపు జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దమ్ము'లో ఆమెని ఎలా చూస్తారనే సందేహం
రాక మానదు.
|
సూర్య ఐదు విభిన్న పాత్రల్లో కనిపించే 'మేట్రాన్'
మురుగదాస్ దర్శకత్వంలో సూర్య నటించిన 'సెవెన్త్ సెన్స్' సినిమా అనూహ్యమైన అంచనాలతో వెలువడి ఆశించిన
విజయాన్ని పొందలేకపోయిన సంగతి తెలిసిందే. తెలుగులో ఓ మోస్తరగానైనా ఆడిన ఆ సినిమా తమిళ ఒరిజినల్
వెర్షన్ 'ఏళాం అరివు' ఫ్లాపయింది. అయినప్పటికీ సూర్య ప్రస్తుతం నటిస్తున్న 'మేట్రాన్'పై అంచనాలు ఏమాత్రం
తగ్గలేదు. కారణం ఆ సినిమాని కె.వి. ఆనంద్ డైరెక్ట్ చేస్తుండటం.సినిమాటోగ్రాఫర్ గా ఎంతో పేరుపొందిన కె.వి. ఆనంద్
డైరెక్టర్ గానూ గొప్పగా రాణిస్తున్నాడు. జీవా హీరోగా అతను తీసిన మునుపటి సినిమా 'రంగం' తెలుగులో ఎంత పెద్ద
హిట్టో మనకు తెలుసు. సూర్యతో అతను ఇదివరకు తీసిన 'అయన్' కూడా బాగా ఆడింది. ఇప్పుడు అదే కాంబినేషన్
లో వస్తున్న 'మేట్రాన్' కూడా సూపర్ హిట్టవుతుందని కోలీవుడ్ వర్గాలు గట్టి నమ్మకాన్ని వ్యక్తం
చేస్తున్నాయి.ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తాప్సీ, సమంత, సోనాక్షి సిన్ హా, అనుష్క శర్మ
వంటి వాళ్లను దాటుకొని ఈ ఆఫర్ కాజల్ ను వరించింది. పాకిస్తాన్ బోర్డర్ లో తొలి షెడ్యూల్ జరుపుకొన్న ఈ
సినిమా షూటింగ్ రష్యా, క్రొయేషియా, సెర్బియా, అల్బేనియా, మెసడోనియా వంటి దేశాల్లో జరుగుతుండటం విశేషం.
సూర్య ఈ సినిమాలో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనుండటం మరో విశేషం.తెలుగులోనూ సూర్యకు స్టార్ హీరో
ఇమేజ్ ఉన్నందున ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. అయితే ఇప్పటికే వాటిని బెల్లంకొండ
సురేశ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల 'కాంచన', 'గేంబ్లర్' వంటి డబ్బింగ్ సినిమాలతో హిట్లు కొట్టిన ఆయన మరోసారి
ఈ సినిమాతో దాన్ని రిపీట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి.
|
మా జీవితాలను ఎందుకు ఆస్వాదించకూడదు?
సినీ ప్రముఖులూ మామూలు మనుషులేనని, వారికి సంతోషాలు, బాధలూ ఉంటాయని షాహిద్ కపూర్
అంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే- ఇటీవల ముంబైలో సినీతారలు పార్టీ చేసుకుంటుండగా పోలీసులు
వచ్చి అడ్డుకున్నారు. అధికారుల తీరుపై షాహిద్ మండిపడుతున్నాడు. యువత అంతా పార్టీలను ఇష్టపడుతుందని,
వారి మాదిరిగానే తామూ చేసుకుంటే లక్ష నిబంధనలను చూపి అడ్డుకుంటున్నారని మండిపడ్డాడు. అంతర్జాతీయ
టీవీ నటి ఓప్రా విన్ఫ్రే ఇటీవల ముంబై వచ్చిన సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు భారీ పార్టీ ఏర్పాటు చేశారు.
ఇక్కడ చెవుల పగిలిపోయే భారీ సంగీతం వినిపించడంతో ఇరుగు పొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు
పార్టీని మధ్యలోనే నిలిపివేశారు. షాహిద్ సహా అంతా డీలా పడ్డారు. గతంలోనే ఇలాంటి ఫిర్యాదుల వల్ల సినీతారల
పార్టీలు నిలిచిపోయాయి. ఎప్పుడూ సినిమావాళ్లపైనే దృష్టి సారించడం సరికాదని షాహిద్ అన్నాడు. ‘సరదా కోసమే
పార్టీలు. ఇటీవల ముంబై పార్టీపై వచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదు. ఎవరైనా నటుడి పార్టీలో కాస్త చప్పుళ్లు వినిపిస్తే
చాలు.. అందరి దృష్టీ దీనిపైనే ఉంటుంది. ప్రజలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం కాదు. మేమంతా యువ తీ
యువకులం. మా జీవితాలను ఎందుకు ఆస్వాదించకూడదు ?’ అని నిలదీశాడు షాహిద్. మంచి పద్ధతిలోనే తనకు
నచ్చినట్టు జీవితాన్ని ఆస్వాదించే అవకాశంలేకపోవడమంటే అది తన స్వేచ్ఛకు భంగమేనని అభిప్రాయపడ్డాడు.
రోజంతా కష్టపడే నటులు సాయంత్రం కాస్త సరదాగా గడపడం తప్పెలా అవుతుందని ప్రశ్నించాడు. షాహిద్ కపూర్
తాజా సినిమా' తెరీ మేరీ కహానీ' షూటింగ్ ఇటీవలే ముగిసింది. ఇంకో సంగతే మంటే- మకావోలో ఇటీవల
నిర్వహించిన జీ సినీ అవార్డుల వేడుకల్లో షాహిద్ రణ్బీర్తో కలిసి స్టెప్పులేశాడు
|
|
అవినీతిపై కమల్హసన్ ‘అమర్ హై’
విలక్షణ నటుడు కమల్హసన్ అవినీతిపై ‘అమర్ హై’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు. గతంలో ఆయన
అవినీతి కథావస్తువుగా తెరకెక్కిన ‘భారతీయుడు’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వంద కోట్ల
వ్యయంతో ‘విశ్వరూపం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కమల్హసన్. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘అమర్ హై’ చిత్రాన్ని
తమిళ, హిందీ భాషల్లో రూపొందించడానికి సన్నాహాలు చేసున్నారాయన. కమల్హాసన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ
‘‘మీందుకు రాజకీయాల్లోకి రాలేదు? సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే డబ్బు బాగా సంపాదించొచ్చు కదా? అని చాలా
మంది నన్ను అడుగుతుంటారు. రాజకీయం అంటే డబ్బు సంపాందించే సాధనంగానే సామాన్య ప్రజలు
భావిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సమాజంలో, రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి అంశాల ఆధారంగా ‘అమర్
హై’ చిత్రం వుంటుంది. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న
మోసాల్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తాం. విశ్వరూపం క్లెమాక్స్ చిత్రీకరించాల్సివుంది. ఇటీవలే న్యూయార్క్లో
నెలరోజుల పాటు షూటింగ్ జరిపాం. ఆ సినిమా పూర్తయిన వెంటనే ‘అమర్హై’ చిత్రాన్ని ప్రారంభిస్తాం’ అన్నారు. |
సునీల్- ఇషాచావ్లా చిత్రానికి దేవి ప్రసాద్ దర్శకత్వం
నటుడు సునీల్ పట్టుదలతో తన బొద్దయిన శరీరాన్ని సిక్స్ప్యాక్గా మార్చి పరిశ్రమలోనే కాక బయట కూడా
చాలామందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం సునీల్ నటించిన ‘పూలరంగడు’ సినిమా కోసం యూత్ అంతా
చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పూలరంగడు’ తర్వాత సునీల్ ఏ సినిమా చేయబోతున్నారు? అనేది
చర్చనీయాంశమైన విషయం అయ్యింది. దానికి సమాధానంగా ఓ వార్త ఫిలిం నగర్లో షికారు చేస్తోంది. సూపర్గుడ్
సంస్థ నిర్మించే చిత్రంలో సునీల్ నటించనున్నారనీ, ‘పూలరంగడు’లో సునీల్ సరసన నటించిన ఇషాచావ్లానే ఈ
సినిమాలో కూడా సునీల్తో జతకట్టనున్నారనీ, దేవి ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ఆ వార్త పూర్తి
సారాంశం. సూపర్గుడ్ సంస్థ నిర్మించిన ‘అందాలరాముడు’ చిత్రం ద్వారానే సునీల్ హీరోగా మారారు. మళ్లీ ఆయన
కథానాయకుడిగా అదే సంస్థలో సినిమా అంటే... ఆ సినిమాపై అంచనాలు పెద్ద ఎత్తునే ఉంటాయని ప్రత్యేకంగా
చెప్పాలా!
|
150 కోట్ల భారీ వ్యయంతో షారూఖ్ఖాన్ మహాభారతం
బాలీవుడ్ బాద్షా షారూఖ్ఖాన్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. మహాభారతం ఆధారంగా అంతర్జాతీయ
స్థాయిలో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు 150 కోట్ల భారీ
వ్యయంతో షారూఖ్ ఇటీవలే ‘రా.వన్’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే మహాభారతం ఆధారంగా
నిర్మించబోయే చిత్రాన్ని రా.వన్ ను మించిన బడ్జెట్తో రూపొందించాలనే ఆలోచనలో షారూఖ్ ఉన్నట్లు ఆయన
సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో షారూక్ ఈ
విషయాన్ని వెల్లడించాడని సమాచారం. మహాభారతం ఆధారంగా నిర్మించే చిత్రానికి సంబంధించి అంతర్జాతీయ
నిర్మాణ సంస్థలతో షారూఖ్ చర్చలు జరుపుతున్నాడని, అవతార్, లార్డ్ ఆఫ్ రింగ్స్ వంటి హాలీవుడ్ చిత్రాల్ని
తలదన్నే స్థాయిలో ఈ చిత్ర నిర్మాణాన్ని జరపడానికి షారూక్ సిద్ధమవుతున్నాడని ముంబై సినీ వర్గాలు
చెబుతున్నాయి.
|
బ్లాక్ బ్యూటీ పట్ల ఆకర్షితుడయ్యాడు మాధవన్
జాన్ అబ్రహాంతో అనుబంధం తెగిపోయాక ఒంటరిగా ఉంటోన్న బ్లాక్ బ్యూటీ పట్ల మరో నటుడు ఆకర్షితుడయ్యాడు.
అతను మాధవన్. 'తను వెడ్స్ మను' సినిమాతో దేశవ్యాప్త అభిమానుల్ని సంపాదించుకున్న మాధవన్ ఇప్పుడు
'జోడీ బ్రేకర్స్' సినిమాలో బిపాషా జోడీగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి అశ్వనీ చౌదరి దర్శకుడు. "తెరమీద కెమెస్ట్రీ
అవసరం ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ఆకర్షితులం కావాల్సిందే. అంటే ఓ వ్యక్తిగా బిపాషా పట్ల నేను
ఆకర్షితుడనయ్యానని కచ్చితంగా చెబుతాను.ఆమె ఓ అద్భుతమైన నటి, వ్యక్తి. ఇద్దరి మధ్యా కెమెస్ట్రీ అనేది లేకపోతే,
తెరమీద రొమాన్స్ను అభినయించడం కష్టం'' ్డఅని స్పష్టం చేశాడు మాధవన్. ఇతరులతో అనుబంధాలు
తెగిపోయిన ఇద్దరు యువతీ యువకులు పరస్పరం ప్రేమలో పడటం ఈ చిత్ర కథాంశం. "బిపాషా చాలా అందమైంది.
సెట్స్ మీద మా మధ్య అనుబంధం ఎలా ఉండిందో నాకైతే తెలీదు. తను పెద్ద స్టార్ అనే భావనని ఎన్నడూ ఆమె
నాలో కలిగించలేదు'' అని చెప్పాడు మాధవన్.
|
నచ్చకపోయినా ...అవి చెడ్డ చిత్రాలు మాత్రం కాదు
ఎన్నో భారీ హిట్లను తన ఖాతాలో జమ చేసుకున్న ప్రముఖ దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ 67వ పుట్టినరోజు
జరుపుకుంటున్నారు. ఆరు పదుల వయసు దాటినా మానసికంగా తాను 31 ఏళ్ల వాడినని ఆయన అంటారు.
సౌదాగర్, రామ్లఖన్, కర్మ వంటి అద్భుత చిత్రాలు నిర్మించిన సుభాష్ బాలీవుడ్ ‘షోమ్యాన్’గా ప్రసిద్ధుడు. ‘నేనిప్పుడు
67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను కానీ నన్ను నేను ముసలివాడిలా భావించుకోను. నా హృదయం, నా
ఆలోచనలపరంగా 30 ఏళ్ల వాడినే. నేను ఇంకా పెరుగుతూనే ఉన్నాను. నేర్చుకుంటున్నాను’ అని సుభాష్ అన్నారు.
1945 జనవరి 24న ఆయన నాగ్పూర్లో జన్మించారు. మొదట్లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టి తక్దీర్, ఆరాధన,
ఉమంగ్ వంటి సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆడలేదు. దీంతో దర్శకుడి మారి శత్రుఘన్ సిన్హా సిఫార్సుతో
1976లో కాళిచరణ్ను రూపొందించారు. ఇది భారీ హిట్ కొట్టడంతో ఇక తిరుగు లేకపోయింది. 2000లో ముక్తా ఆర్ట్స్
ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన సల్మాన్తో
తీసిన యువరాజ్, అనిల్ కపూర్తో రూపొందించిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి.
‘పరాజయాలకు కారణమేంటో నాకు తెలుసు. సినిమాలు ఆడకుంటే సహజంగానే బాధపడతాను. కొన్నిసార్లు
దర్శకుడు ఎంతో కష్టపడి వైవిధ్యభరిత కథాంశంతో సినిమా తీసినా ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు ఉంటాయి.
మంచి సినిమాలు వేరు.. హిట్ సినిమాలు వేరు’ అని సుభాష్ ఘాయ్ అన్నారు. కిస్నా, యువరాజ్ వంటి సినిమాలు
నేటితరం వారికి నచ్చని మాట నిజమే అయినా.. అవి చెడ్డ సినిమాలు మాత్రం కాదని స్పష్టం చేశారు. సుభాష్ ఈ
ఏడాదిలో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. ఒక భారీ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు
|
|
ఫ్యాక్షన్-పోలీస్ ఆఫీసర్గా ఎన్టీఆర్ ...‘పార్ట్నర్’గా అల్లు అర్జున్
గతంలో ఎన్టీఆర్ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ చిత్రంలో ఫ్యాక్షన్ తరహా పాత్రను అవలీలగా పోషించి
అందరిమెప్పూ పొందాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ తరహా హీరోగా కనిపించనున్నట్లు తాజా సమాచారం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దమ్ము’ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాక్షన్ హీరోగానేగాక మరో పవర్ఫుల్
పోలీస్ ఆఫీసర్గా దమ్ము చూపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో డైలాగులు కడప బాంబుల్లా
పేలతాయంటున్నారు అభిమానులు. ‘ఆది’ చిత్రంలో అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ ఎంతగా ఫేమస్
అయిందో విదితమే. బోయపాటి శ్రీను చిత్రాలలో డైలాగులు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ‘సింహా’, ‘తులసి’, ‘భద్ర’
చిత్రాలే నిదర్శనం. దీనికి తోడు ఓ పవర్ఫుల్ హీరోతో అంతకన్నా పవర్ డైలాగులు చెప్పిస్తే ఇక థియేటర్లో
విజిల్స్...చప్పట్లే .... తప్పకుండా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడం ఖాయం అని అంటున్నారు అభిమానులు.
అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్షికమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతున్న
విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా పతాకంపై డివీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం
షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రం కోసం రెయిన్ ఎఫెక్ట్లో ఓ యాక్షన్ దృశ్యాన్ని
చిత్రీకరించారు. ఈ చిత్రానికి ‘హనీ’ అనే టైటిల్ని దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే
ఆ టైటిల్ని కాకుండా ఈ చిత్రానికి ‘పార్ట్నర్’ అనే టైటిల్ని ఖరారు చేసే ఆలోచనలో దర్శకుడు త్రివిక్షికమ్ శ్రీనివాస్
వున్నట్లు తాజా సమాచారం.
|
‘సూపర్బ్’ అనిపించే అవకాశం ఏదీ అక్కడ్నుంచి రాలేదు
సల్మాన్ ‘రెడీ’ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం 'హౌస్ఫుల్2',
'బోల్ బచ్చన్' చిత్రాల్లో అసిన్ నటిస్తున్నారు. ఇదిలావుంటే... బాలీవుడ్ మీడియాలో ఆసిన్పై ఓ గాసిప్ హల్చల్
చేస్తోంది. త్వరలో ఈ కేరళకుట్టి పెళ్లిపీటలెక్కనున్నారని, సినిమాలు తగ్గడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని,
తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరుగనుందని ఆ గాసిప్ పూర్తి సారాంశం. దీనిపై
అసిన్ స్పందిస్తూ- ‘‘నేను సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నా వయసు కేవలం 26 మాత్రమే. మరో ఏడేళ్ల దాకా
పెళ్లి గురించి ఆలోచించదలుచుకోలేదు. ఆ టైమ్ వచ్చినప్పుడు నేనే చెబుతాను. దయచేసి లేనిపోనివి క్రియేట్ చేసి
ఇబ్బందులు పెట్టొద్దు’’ అని వాపోయారు.తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ- ‘‘సౌత్లో లాగా ఒక హిట్ రాగానే
కుప్పలుతెప్పలుగా బాలీవుడ్లో అవకాశాలు రావు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే...
ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఇక్కడ టాప్ హీరోయిన్గా ఎదగొచ్చు. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నానన్న
బెంగ నాకు లేదు. ఈ ఏడాది నేను నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఇక సౌత్లో చేయడం
లేదంటే దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు. నాకు ‘సూపర్బ్’ అనిపించే అవకాశం ఏదీ ఇప్పటివరకూ అక్కడ్నుంచి
రాలేదు. వస్తే తప్పకుండా చేస్తా. అందరూ బాగా చిక్కిపోయాను అంటున్నారు. వారందరికీ త్వరలోనే సమాధానం
చెబుతా’’ అని చెప్పారు అసిన్
|
హాటెస్ట్ వెజిటేరియన్ సెలెబ్రెటీస్....డ్రామాలెక్కువంటున్నసమీరా
పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియా ‘హాటెస్ట్ వెజిటేరియన్ సెలెబ్రెటీస్’ టైటిల్ను
బాలీవుడ్ హాటీ మల్లికా షెరావత్, కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ సొంతం చేసుకున్నారు. ఈ టైటిల్ను పొందేందుకు
విద్యాబాలన్ కూడా పోటీపడ్డా ఆమెకు నిరాశనే ఎదురైంది. విజేతలను ఖరారు చేసేందుకు వేలాది మంది పెటా
అభిమానులు ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేక్ ఒబెరాయ్, సోనుసూద్, షాహిద్ కపూర్, అమితాబ్ బచన్,
హేమామాలిని, కరీనా కపూర్ కూడా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ- ‘శాకాహారిగా ఉండడం
నన్నెంతో ఆరోగ్యంగా ఉంచుతోంది. శాకాహారం తీసుకోవడం ద్వారా నేను పర్యావరణానికి మేలు చేస్తున్నాను.
శాకాహారిగా ఉండడం నాకెంతో గర్వకారణం. గో పెటా..గో గ్రీన్’ అన్నారు.
నిజజీవితంలో సినిమా వాళ్ల కంటే క్రికెటర్లలోనే డ్రామాలెక్కువ ఉంటాయంటున్నారు పొడుగు కాళ్ల సుందరి
సమీరారెడ్డి. ‘‘నేను క్రికెట్కి పెద్ద ఫాన్ని. చిన్నప్పుడు నాన్నతో కలిసి 5రోజుల టెస్ట్ మ్యాచ్లు చూసేదాన్ని. ఆ తర్వాత
క్రమేణా వన్డే మ్యాచ్లకు అలవాటు పడ్డా. ఇప్పుడో ..20-20మ్యాచ్లు వీక్షించడం నిత్యకృత్యం అయిపోయింది.
అంతేకాదు బయట అంతా మా సినిమావాళ్ల జీవితాలే పెద్ద డ్రామా బతుకులు అని దెప్పి పొడుస్తుంటారు. నిజానికి
క్రిెటర్లతో పోల్చితే మాకే చాలా తక్కువ’’ అన్నారు. అలాగే సినిమా రంగంలోని సుందరాంగులంతా ఆటగాళ్లకి ఇట్టే
పడిపోతారని అంటోందీ భామ. ఆటను ఆస్వాధించే క్రమంలో సదరు మెరుపులు మెరిపించే కుర్ర ఆటగాడితో ఊరకే
ప్రేమలో పడిపోతారని సెలవిచ్చింది ఈ రింగుల జుట్టు చిన్నది. ఏదేమైనా సమీరా క్రికెట్తోనే కాదు క్రికెటర్లతోనూ
ప్రేమలో ఉందన్నమాట!
|
నేనే డబ్బింగ్ చెప్పుకుని నాలో కొత్తకోణాన్ని చూపిస్తా
నటనలోనే కాదు. గొంతులో భావాలను పలికిస్తా. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుని నాలో కొత్తకోణాన్ని
చూపిస్తానంటూ మదరాసీ ముద్దుగుమ్మ త్రిష డిసైడైపోయినట్టుంది. ‘సమరన్’లో స్వీట్ వాయిస్ వినిపిస్తానంటూ
అభిమానులను ఊరిస్తోందట. ముప్పైవ పడిలో పడ్డా చెక్కుచెదరని అందంతో అభిమానులను అలరిస్తున్న తమిళ
పొన్ను త్రిష తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానంటోందట. ఇప్పటికే అల్టిమేట్ స్టార్ అజిత్ 50 చిత్రం
‘మంగాత్త’లో తొలిసారిగా తన గొంతును వినిపించిన ఈ భామ తాజాగా తాను నటిస్తున్న ‘సమరన్’ చిత్రంలోనూ
డబ్బింగ్ చెప్పేందుకు సై అంటోందని సమాచారం. ఇటీవలే ఆమె తెలుగులో వెంకటేష్ సరసన నటించిన బాడీగార్డ్
చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న త్రిష సమరన్ కోసం తీవ్రంగా
శ్రమిస్తున్నారని తెలిసింది. స్టార్ క్రేజ్ నిలబెట్టుకోవాలంటే గొంతులోనూ భావాలు పలికించాలంటూ కొత్త ముచ్చట్లు
చెబుతున్న త్రిష తమిళమ్మాయే కావడంతో భాషా సమస్య రాదని నిర్మాతలు ధైర్యం చేస్తున్నారట. ఏదేమైనా
తనకంటూ ఓ గుర్తింపు వచ్చినప్పటికీ, ప్రత్యేకత చాటుకునేందుకు డబ్బింగ్ చెప్పడంపై దృష్టి సారిస్తున్న త్రిషకు
మాత్రం సహచరుల నుంచి ప్రశంసలు అందుతున్నాయని కోలీవుడ్ వర్గాల భోగట్టా.
|
బెస్ట్ డాక్యుమెంటరీ మూవీగా ‘ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్’
కోట్లు కుమ్మరించి నిర్మిస్తున్న చిత్రాలకే అవార్డులు రావడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ
సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్’ ఏకంగా 'యుఎస్ఏ
హోస్టన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్'లో బెస్ట్ డాక్యుమెంటరీ మూవీగా నిలవడం విశేషం. పెద్దపెద్ద ప్రొడక్షన్ కంపెనీలు
సైతం నిర్మించలేని విధంగా సందేశాత్మక డాక్యుమెంటరీ చిత్రాన్ని హైదరాబాద్కు చెందిన యువకుడు
రూపొందించాడు. హైదరాబాద్కు చెందిన రూపమ్ సర్మా ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. అలాగే 'ఆస్కార్
రేస్ ఫర్ ఒరిజినల్ మ్యూజిక్' కేటగిరీలో సైతం ఇది నిలిచింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కవితా శ్రీనివాసన్, బాబు
రామ్ సైకాలు నటించారు. అమెరికా యువతి కవిత స్పిరుచువల్ జర్నీతో దీనిని చిత్రీకరించారు. గత 20
సంవత్సరాలుగా రూపమ్ సర్మా ఎన్నో ఫీచర్ఫిల్మ్లకు దర్శకత్వం వహించడంతోపాటు సంగీతాన్ని కూడా
అందించారు.' ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్' ఆడియోను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన కార్య క్రమంలో
ఆవిష్కరించారు. ఐ స్పేస్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ సవీన్, భూషణ్, మల్టీ డైమన్షన్ వాసు తదితరులు ఈ
కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ- యుఎస్లో బెస్ట్ డాక్యుమెంటరీగా ఈ చిత్రం
నిలవడం అభినందనీయమన్నారు. సౌత్లో కూడా మంచి డాక్యుమెంట రీలు రావాల్సిన అవసరం ఉందని,
కమర్షియల్వి కూడా చేయాలని, తన సంగీతాన్ని సౌత్లోనూ రూపమ్ సర్మా వినిపించాలని ఆకాంక్షించారు.
|
|
ఫిబ్రవరి 3న వెండితెర అందాల హాసిని పెళ్లి
వెండితెర అందాల హాసిని త్వరలో పెళ్లి పీటపూక్కబోతోంది. నచ్చిన చెలికాడు రితేష్దేశ్ముఖ్తో ఈ సొగసరి మూడు
ముళ్లు వేయించుకోవడానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. సుదీర్ఘకాలంగా ఈ భామ రితేష్దేశ్ముఖ్తో
ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయంపై ఎలాంటి పుకార్లు
వినిపించినా వాటిని పట్టించు కోకుండా దాటవేస్తూ వచ్చింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 3న
వీరి పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. రితేష్ కుటుంబ సభ్యులు దాదాపు నాలుగురోజుల పాటు అంగరంగ వైభవంగా
వివాహ వేడుకల్ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. ముందు ఈ నెల 31న ముంబైలోని గ్రాండ్స్ ల్యాండ్
హోటల్లో సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 3న
హోటల్ గ్రాండ్ హయత్లో వివాహం జరుగుతుంది. ఇరుకుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు,
బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్షికమానికి హాజరు కానున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట నెలరోజుల పాటు
హానీమూన్కు కేటాయించాలనుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. |
ఈ కథను దక్షిణాదికి చూపించాలని అప్పుడే అనుకున్నాను
‘నేను తొలిసారి రీమేక్ చిత్రం చేయడానికి కారణం వుంది. ‘రోబో’ చిత్రం కోసం కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాల
చిత్రీకరణ పూనేలో చేస్తున్నాం. ఆ టైమ్లోనే ‘త్రీ ఇడియట్స్’ చిత్రం విడుదలైంది. ఇదే సమయంలో రైల్వే శాఖ
అనుమతి లభించక ‘రోబో’ షూటింగ్ ఆగిపోయింది. దీంతో చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడే యూనిట్ సభ్యులతో కలిసి
పూనే సమీపంలోని లోనావాలాలో ‘త్రీఇడియట్స్’ చిత్రం కోసం ఓ థియేటర్కు వెళ్లాను. నేను జరగాల్సిన షూటింగ్
గురించి ఆలోచిస్తుంటే హాల్లో జనమంతా సినిమా చూస్తూ నవ్వుకుంటున్నారు. అది గమనించి నేనూ కథలో లీనమై
ఆనందించాను. బైటకు వచ్చాక నా బాధంతా మర్చిపోయాను.ఈ కథను దక్షిణాదికి చూపించాలని అప్పుడే
అనుకున్నాను. అందుకే రీమేక్ చేశాను’ అన్నారు దర్శకుడు శంకర్. ‘నా గత చిత్రాలని మర్చిపోయి ఈ చిత్రం
చూడండి. ఎందుకంటే ఇందులో యాక్షన్ సన్నివేశాలు లేవు.గ్రాఫిక్స్ మాయాజాలం లేదు. మంచి కథ వుంది.
మాతృకలో రెండు పాటలు మాత్రమే వున్నాయి. మేం కొన్ని జోడించాం. వాటికి హారిష్ జైరాజ్ చక్కటి బాణీలు
అందించారు. రజనీకాంత్ తర్వాత చెప్పిన సమయానికి వచ్చే హీరో విజయ్’ అన్నారు.ఆయన దర్శకత్వం వహించిన
తమిళ చిత్రం ‘నన్బన్’. విజయ్, ఇలియానా జంటగా నటించారు. జీవా, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.
తెలుగులో ‘స్నేహితుడు’ పేరుతో అనువదించారు. ఈ చిత్ర గీతాలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. రామ్చరణ్
ఆడియో విడుదల చేసి ‘త్రీ ఇడియట్స్’ నిర్మాత విదు వినోద్ చోప్రాకు అందజేశారు.
|
ఇందులో రామ్చరణ్ సరసన ఇద్దరు నాయికలుంటారు
రామ్చరణ్ కథానాయకుడిగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఎవడు’. వంశీపైడిపల్లి దర్శకత్వం
వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో సమంతా ఓ నాయికగా నటిస్తుండగా మరో నాయికగా అమీ
జాక్సన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 23 నుంచి
మొదలవుతుంది. ఇందులో రామ్చరణ్ సరసన ఇద్దరు నాయికలుంటారు. సమంతా ఓ నాయికగా నటిస్తుండగా మరో
నాయికగా ‘మదరాసిపట్టణం’ ఫేమ్ అమీ జాక్సన్ను ఎంపిక చేశాం. వైవిద్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రంతో మా సంస్థలో వంశీ హాట్రిక్ విజయాన్ని అందుకొనే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
దేవిశ్రీవూపసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. యాక్షన్తో పాటు వినోదాన్నీ సమపాళ్లలో అందించే ఈ
చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీవూపసాద్, మాటలు: అబ్బూరి
రవి, కథ: వక్కంతం వంశీ, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.
|
'అగ్నిపథ్'లో మాత్రం అత్యంత దుర్మార్గుడిని
రాజకీయాల ప్రస్తావన తెస్తే చాలు సంజయ్దత్ చిర్రుబుర్రులాడుతున్నాడు. వాటికి దూరంగా ఉండాలని బలంగా
నిర్ణయించుకున్నానని ప్రకటించాడు. ఆ రొంపిలోకి మళ్లీ తనను లాగవద్దని జర్నలిస్టులను కోరుతున్నాడు.
‘ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. నేను కొన్నేళ్లే రాజకీయాల్లో ఉండి చేదు అనుభవాలు
మిగుల్చుకున్నాను. అదొక గుణపాఠం వంటిది. వాటి నుంచి బయటపడ్డందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని
సంజుబాబా అన్నాడు. ఇక నుంచి కుటుంబం, సినిమాల చుట్టే తన జీవితం తిరుగుతుందని చెప్పాడు.‘నాకు
చూడచక్కని పిల్లలు ఇద్దరు ఉన్నారు. కూతురు ఇక్రా, కొడుకు షహ్రాన్. బయటికి వెళ్లినప్పుడల్లా వారి సాన్నిహిత్యానికి
దూరమవుతున్నాను’ అంటూ సంజయ్ బాధపడ్డాడు. వారిద్దరికి ఏడాది వయసు రావడం వల్ల ఇంకా
ముద్దొస్తున్నారని చెప్పాడు. రోజంతా పిల్లలతోనే గడపాలని ఉన్నా.. పనిభారం వల్ల కుదరడం లేదని తెలిపాడు. వీలు
చిక్కినప్పుడల్లా సమయమంతా వారితోనే గడుపుతున్నానని వివరించాడు. తన తాజా సినిమా 'అగ్నిపథ్'లో వేసిన
పాత్ర గురించి మాట్లాడుతూ- ‘విలన్గా నటించడం ఇదే మొదటిసారి. అత్యంత క్రూరుడు ఇతడు. అయితే ఈ పాత్ర
అద్భుతంగా ఉంటుంది. ఖల్నాయక్, వాస్తవ్లో నేను విలన్ను అని చాలా మంది అంటారు కానీ.. నిజానికి వాటిలో
నేను హీరోనే! అగ్నిపథ్లో మాత్రం అత్యంత దుర్మార్గుడిని’ అని సంజయ్ వివరించాడు. యూపీలోని కాన్పూర్లో
మంగళవారం ఏర్పాటు చేసిన అగ్నిపథ్ ప్రచార కార్యక్రమాల్లో ఇతడు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని తరువాత పవర్,
హమ్ హై రాహీ కార్ కే, రేస్ 2లో నటిస్తున్నాడు. అగ్నిపథ్లో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలు
పోషిస్తున్న సంగతి తెలిసిందే.
|
గూగుల్, యాహూ సెర్చ్లో సన్నీలియోన్ టాప్ రేంజ్
కెనడియన్ భామ సన్నీలియోన్ 'బిగ్ బాస్' షోలో అడుపెట్టినప్పటి నుంచి...ఆ రియాల్టీ షోకు ఎక్కడ లేని పాపులారిటీ
వచ్చి పడింది. సన్నీ రాకతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం ఇంటర్ నెట్ సెర్చ్లో వెనకబడిపోయారు. గతంలో
గూగుల్, యాహూ సెర్చ్లో టాప్ రేంజ్ దక్కించుకున్న క్రతినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి
హీరోయిన్లు...ఈ ఏడాది వెనకబడి పోయారు. ఇంటర్నెట్లో అందాల కోసం వెతుకులాడే కుర్రకారంతా...సన్నీకి
సంబంధించిన న్యూడ్ ఫోటోలు, ఫోర్న్ వీడియోలను తెగ చూస్తున్నారు. సన్నీ మత్తులో పడి బాలీవుడ్ స్టార్
హీరోయిన్లను పట్టించుకోవడమే మానేశారు. సన్నిపై యూత్ ఇంత క్రేజ్ పెంచుకోవడంపై విస్మయానికి గురైన
బాలీవుడ్ తార కరీనాకపూర్.....‘ఆవిడ ఫోటోలు, వీడియోలు అంత అందంగా ఉన్నాయా’ అంటూ తన
స్నేహితురాలితో కలిసి సన్నీలియోన్ వ్యక్తిగత ఫోర్న్ సైట్ ఓపెన్ చేసిందని, అందులో సన్నీ నటించిన రియల్
బ్లూఫిల్మ్ దర్శనం ఇవ్వడంతో బిత్తరపోయి వెంటనే కంప్యూటర్ ఆఫ్ చేసిందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
కరీనాకపూర్ ప్రస్తుతం తన ప్రియుడు సైఫ్ అలీఖాన్ నిర్మిస్తున్న ఏజెంట్ వినోద్ చిత్రంతో పాటు, మాధుర్ బండార్కర్
రూపొందిస్తున్న హీరోయిన్ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. సన్నీలియోస్
మహేష్ భట్ నిర్మిస్తున్న జిస్మ్2 చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.
|
|
ప్రేక్షకులను వందశాతం ఎంటర్ టైన్ చేసే 'దరువు'
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దరువు' (సౌండ్ ఆఫ్ మాస్) ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో
జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్ వేశారు. శ్రీవెంకటేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శివ
దర్శకత్వంలో నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత
మాట్లాడుతూ..ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో రవితేజ, సత్యనారాయణ, ప్రభు, ఎంఎస్ నారాయణ, ఎల్ బి
శ్రీరామ్,అశోక్ లతో పది రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి 2 వరకూ షెడ్యూల్ జరుగుతుంది. ఆ తర్వాత
విదేశాల్లో మూడు పాటల్ని చిత్రీకరిస్తాం. అనంతరం మార్చి 10 వరకూ కంటిన్యూగా హైదరాబాద్ లో షూటింగ్
జరుగుతుంది. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది. రవితేజకు మాస్ లో ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అతని బాడీ
లాంగ్వేజ్ కి తగినట్లుగా అతని కోసమే చేసిన సబ్జెక్ట్ ఇది. ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకునే ప్రేక్షకులను వందశాతం
ఎంటర్ టైన్ చేసే చిత్రమిది అన్నారు.రవితేజ సరసన మరోసారి తాప్సీ నటిస్తోంది. బ్రహ్మానందం, షాయాజీ షిండే,
రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, సన, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక
పాత్రలో ప్రభు నటిస్తున్నారు.
|
తాప్సీ బైక్ రైడింగ్... బిపాసాబసు రిక్షా సవారీ
ఆ మధ్య 'మిస్టర్ పర్ఫెక్ట్'లో పవర్బైక్ రైడింగ్ చేసి ఎంతో ఆకట్టుకుంది తాప్సీ. ఇప్పుడు మరో ఉత్తరాది భామ సమీరా
కూడా ఇలాంటి బైక్ రైడింగ్తో అలరించనుందట. ఇందుకోసం వేగంగా బైక్ని నడపటం నేర్చుకొంటోందట ఈ
ముద్దుగుమ్మ. తను నూతనంగా నటించబోయే 'సాల్ట్' అనే చిత్రంలో ఈ ఫీట్ చేయడానికి రెడీ అవుతోందట ఈ
బొద్దుగుమ్మ. ఇందులో హీరోయిన్ వేగంగా బైక్ రైడింగ్ చేసుకుంటూ ప్రమాదానికి గురవుతుంది. అది కూడా తనకు
తానుగా ఈ ప్రమాదానికి గురికావాల్సిన సీన్ ఇది. అందుకే తప్పని సరిగా స్క్రిప్టు ప్రకారం హీరోయిన్ బైక్ను
నడపాల్సిన పరిస్థితి. దాంతో బైక్ని ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నా అంటోంది. ఏంజిలీనా జోలీ హాలీవుడ్లో ఇలాంటి
తరహా క్యారెక్టర్లో నటించిందట. ఆమె ఇన్స్పిరేషన్తోనే ఈ చిత్రంలో బైక్ నడుపుతున్నా అంటోంది సమీరా.
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు రీసెంట్గా ముంబయి నగరంలో రిక్షా సవారీ చేసింది. ఈ విషయంపై ఆమె ట్వీట్
చేస్తూ..‘మోడల్గా ఉన్న రోజుల్లోనే రిక్షాలోనే తిరిగేదాన్ని. ఇప్పుడు ఆ రోజులు గుర్తుకొ చ్చాయి’ అని అంది. ఇంతకీ
ఆమె రిక్షా ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే. ఇటీవల బాగా పొద్దుపోయే వరకూ ఆమె షూటింగ్లో పాల్గొందట.
ఉదయం అయిదు గంటలకు జిమ్ (వ్యాయామశాల)కు వెళ్లడం బిపాసాకు అలవాటు. ఆ సమయానికి డ్రెవర్ కారు
తీసుకొని రాలేదు. సమయానికి కారు అందుబాటులో లేకపోవడంతో మరో దారి లేక అందుబాటులో ఉన్న రిక్షా ఎక్కి
జిమ్కి వెళ్లింది.ఇక ప్రస్తుతం ఆమె మాధవన్తో కలిసి ‘జోడీ బ్రేకర్స్’ చిత్రం చేస్తోంది. అయితే మాధవన్, బిపాసాబసు
కలిసి నటించటంపై అందరూ వింతగా చెప్పుకుం టున్న తరుణంలో మాధవన్ మాత్రం తమ జోడీ తెరపై మెరుపులు
కురిపిస్తుందని చెప్పుకుం టున్నా డు. ‘బిపా సా, నేను వెండితెరపై మంచి కెమిస్ట్రీ పండిస్తామని భావిస్తున్నా’ అని
తెలిపాడు.రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జోడీ బ్రేకర్స్’కు అశ్వనీ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. జంటలను
విడగొట్టడమే పనిగా పెట్టుకునే మాధవన్, బిపాసా చివరకు ఎలా ప్రేమలో పడ్డారనేది చిత్ర కథ.
|
'మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్' పాటలు విడుదలయ్యాయి
నాగసిద్ధార్థ్, రాధిక జంటగా వి.యన్.యస్.కె.క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తున్న చిత్రం 'మా అబ్బాయి ఇంజనీరింగ్
స్టూడెంట్'. శాయి సద్యోజాత పిక్చర్స్ పతాకంపై నిర్మితమైంది. శ్రీనివాస్ గుత్తుల దర్శకుడు. డి.వి.చలం, దంటు వెంకట
గోపాలరావు నిర్మాతలు. చిన్ని చరణ్ సంగీతాన్ని సమకూర్చారు. హైదరాబాద్లో పాటల్ని విడుదల చేశారు. రమేష్
ప్రసాద్ తొలి సీడీని ఆవిష్కరించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. సినిమా
విజయవంతం కావాలని రమేష్ ప్రసాద్ అభిలషించారు. మంచి సినిమా చేశానని నాగ సిద్ధార్థ్ చెప్పారు. పాటలు
ఆదిత్య ద్వారా విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో వి.సాగర్, వి.యన్.ఆదిత్య, కాశీ విశ్వనాథ్, భరత్ భూషణ్, రాధిక,
నాగినీడు, కొండవలస, జ్యోతి, నాగయ్య, చిన్నిచరణ్ తదితరులు పాల్గొన్నారు.
|
రజనీకాంత్ చిత్రంలో నటీనటుల జాబితా పెరిగిపోతుంది
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కొచ్చడయ్యాన్'లో నటించే నటీనటుల జాబితా రోజు రోజుకు పెరిగిపోతుంది.
తాజాగా ఈ జాబితాలోకి నటి శోభన కూడా చేరింది. గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన దళపతి చిత్రంలో
రజనీ ప్రేయసిగా ఆమె నటించింది. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న శోభన మళ్లీ ఈ సినిమా ద్వారా రీ
ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఆమె భరతనాట్యం ప్రదర్శనలతో చాలా బిజీగా ఉంటోంది. అయితే రజనీతో నటించే అవకాశం
రావటంతో శోభన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఈ చిత్రం ప్రకటించిన దగ్గరి నుండి ప్రాజెక్ట్ పై భారీ
అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రానికి
సంబంధించి నటీనటుల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఈచిత్రంలో యువ హీరో ఆది, నటి
స్నేహ, శరత్ కుమార్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కె. ఎస్ రవికుమార్
స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. కొచ్చడయ్యాన్ చిత్రానికి
ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు.
|
సినీ విమర్శకురాలు నిఖత్ కజ్మి కన్నుమూశారు
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ సినీ విమర్శకురాలు నిఖత్ కజ్మి శుక్రవారం ఉదయం ముంబై కన్నుమూశారు. ఆమె
వయస్సు 53 సంవత్సరాలు. 1987 సంవత్సరం నుంచి' టైమ్స్ ఆఫ్ ఇండియా' దిన పత్రికలో సినిమాలను
సమీక్షిస్తున్నారు.' చాలీస్ చౌరాసీ',' సదా అడ్డా', హాలీవుడ్ చిత్రం' ఘోస్ట్' చిత్రంపై గతవారమే సమీక్షను అందించారు.
కజ్మి మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కజ్మి మరణవార్త తనను ఎంతో కలిచి
వేసిందని సినీ దర్శకుడు కరణ్ జోహార్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. 'రెఫ్యూజీ' చిత్ర రివ్యూను మొట్టమొదటిసారిగా
చదివానని.. తనలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు తెలియచేసేదని అభిషేక్ బచ్చన్ అన్నారు.
|
|
ఐటెం సాంగ్లో విద్యాబాలన్... బాలీవుడ్ బాటలో విమలా రామన్
'ద డర్టీ పిక్చర్' చిత్రం విజయంతో మంచి ఊపుమీదున్న విద్యాబాలన్ త్వరలో ఓ ఐటెం సాంగ్లో నటించనుందట.
సిల్క్ పాత్రలో తన అందచందాలను ప్రదర్శించి ప్రేక్షకులను వెర్రెత్తించిన విద్యా ఇక ఐటెం సాంగుతోనూ కుర్రకారును
ఉర్రూతలూగించనుందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఈ అమ్మడుకి ఇప్పుడున్న క్రేజ్ని సొమ్ము చేసుకోవడానికి ఈ
ప్రత్యేక నృత్యాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. విధు వినోద్ చోప్రా
నిర్మించనున్న 'ఫెరారీ కి సవారీ' చిత్రంలో ఐటెం సాంగ్ని ప్లాన్ చేస్తున్నాడట. విద్య ఐటెంసాంగ్ చేయడం కూడా ఇదే
తొలిసారి. గతంలో వినోద్ నిర్మించిన 'ప్రరిణిత' చిత్రంలోనూ విద్య నటించింది. అందుకే ఈ నిర్మాత ఐటెంసాంగ్
చేయాలని అడగడంతో కాదనలేకపోయిందట ఈ కేరళ కుట్టి. మరి విద్యాబాలన్ ఐటెంసాంగ్ కాసులు కురిపిస్తుందో
లేదో వేచి చూడాలి.
దక్షిణాది కథానాయికలకు బాలీవుడ్ డ్రీమ్స్ ఈ మధ్యన ఎక్కువైపోయాయి. దక్షిణాదిన అగ్రస్థానంలో దూసుకెళ్లిన
త్రిష, అసిన్లు హిందీ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలియానా కూడా ‘బర్ఫీ’
చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ చాలు తమ దశ తిరిగిపోయిన దక్షిణాది కథానాయికలందరూ
ఆశపడుతున్నారు. తాజాగా విమలారామన్ కూడా బాలీవుడ్ బాట పట్టనుంది. సునీల్శెట్టి, గోవింద ప్రధాన పాత్రల్లో
నటించనున్న ‘అఫ్రా టఫ్రీ’ చిత్రంలో ఈ సుందరి కథానాయికగా ఖరారైంది. హాదీ అలీ అబ్రార్ దర్శకుడు. త్వరలో ఈ
చిత్రం సెట్స్మీదకు వెళ్లనుందని బాలీవుడ్ సమాచారం. గత సంవత్సరం ‘డ్యామ్ 999’ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా
ఈ సుందరి నటించింది. ప్రస్తుతం తెలుగులో ‘కులుమనాలి’ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్లో అవకాశం రావడం పట్ల
విమలారామన్ పట్టరాని ఆనందంతో వుంది. బాలీవుడ్ ఎంట్రీ తన కెరీర్కు బ్రేక్నిస్తుందనే ఆశతో వుంది ఈ
ముద్దుగుమ్మ. |
'హోసన్నా'... పాటతో వివాదంలో చిక్కుకున్న రెహ్మాన్
ఏఆర్ రెహ్మాన్ ఓ పాట విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. 'ఏక్ దివానా థా' చిత్రంలో ఆయన సమకూర్చిన
హోసన్నా... అనే పాట ఈ వివాదానికి దారి తీసింది. ఇందులో ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తూ 'హోసన్నా' అనే
పదాన్ని ఉపయోగించడం క్రైస్తవులు తప్పు పడుతున్నారు. 'హోసన్నా' పాట రాసిన జావేద్ అక్తర్, సంగీత దర్శకుడు
రెహమాన్ క్షమాపణ చెప్పాలని మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు. "హోసన్నా అనే మాట యూదులకు,
క్రైస్తవులకు ఎంతో పవిత్రమైనది...దేవుణ్ణి 'హోసన్నా' అని సంబోధిస్తూ ఉంటాం. అలాంటి పదాన్ని ఎలా పడితే అలా
ఉపయోగించడం క్షంతవ్యం కాదని క్రిస్టియన్ సెక్యులర్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శి జోసెఫ్ డయాస్ అన్నారు.
'హోసన్నా' అనే పదాన్ని తొలగించి, రెహమాన్, జావేద్ క్షమాపణ చెప్పాలని సీఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇది
జరగని పక్షంలో 'ఏక్ దీవానా థా' చిత్రాన్ని నిర్మించిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఆడియోను విడుదల చేసిన సోనీ
మ్యూజిక్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ఎఫ్ హెచ్చరించింది.
|
పవర్ ఫుల్ రివెంజ్ డ్రామాగా ఎన్టీఆర్ ‘దమ్ము’?
ఎన్టీఆర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మాకు అందిన సమాచారం
ప్రకారం ఈ చిత్రం పవర్ ఫుల్ రివెంజ్ డ్రామా గా తెరకేక్కుతున్నట్లు సమాచారం. అలాగే చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్
అనుకోని మలుపులతో సాగుతుందని సమాచారం.ఎన్టీఆర్ పలు విభిన్నమైన గెటప్ లతో కనిపించబోతుండగా త్రిషా
మరియు కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శీను పలు జాగ్రత్తలు తీసుకొని ఎన్టీఅర్
కారెక్టర్ ని డిజైన్ చేసినట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తుండగా వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'దమ్ము'
చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. ఎన్టీఅర్ ఫ్యాన్స్ అంచనాలకు ఈ చిత్రం చేరుకుంటుందని యూనిట్
వర్గాలు చెప్తున్నాయి.
|
త్వరలోనే చిరంజీవి 150వ చిత్రం... అజయ్ దేవ్గన్ ‘మిరపకాయ్’
రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి తిరిగి నటిస్తాడో లేదో అనే సందేహంతో సతమతమైపోతున్న ఆయన అభిమానులకు
ఈ వార్త ఊరటనీ..ఉత్సాహాన్ని ఇస్తుందనే చెప్పాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో
కలిసి బెంగుళూరులోని గెస్ట్హౌస్కి వెళ్లారు. అక్కడ 'కర్ణాటకాంధ్ర మెగాస్టార్ బ్లడ్ బ్రదర్స్ సేవా సమితి' తరుఫున
అభిమానులు ఆయనని కలిశారు. ఈ సందర్భంగా వాళ్లతో ఆయన మాట్లాడుతూ...తాను మళ్లీ సినిమాలలో
నటిస్తానని, త్వరలోనే తన 150వ చిత్రం ఉంటుందని చిరంజీవి చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులు
జరుగుతున్నాయని, రామ్చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
బాలీవుడ్ కథానాయకులంతా ఈ మధ్య దక్షిణాదిలో విజయవంతమైన చిత్రాలపై కన్నేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల తమిళంలో సూర్య నటించిన ‘సింగం’ చిత్రాన్ని అదే పేరుతో అజయ్ దేవ్గన్ హీరోగా రోహిత్ షెట్టి హిందీలో
రీమేక్ చేశారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. త్వరలో అజయ్ ఓ తెలుగు చిత్రం
రీమేక్లో నటించనున్నాడని తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా హరీష్శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం
‘మిరపకాయ్’. ఈ చిత్రం రీమేక్ హక్కులని అజయ్ దేవ్గన్ సొంతం చేసుకొన్నాడని, ఈ రీమేక్ ద్వారా బాలీవుడ్కు
దర్శకుడు హరీష్శంకర్ను పరిచయం చేయాలనుకుంటున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన
మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
|
'ఆల్ ది బెస్ట్' 23 నుంచి రెండో షెడ్యూల్
శ్రీకాంత్, జేడీ చక్రవర్తి కలిసి 'ఆల్ ది బెస్ట్' చత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేడీ చక్రవర్తే దర్శకత్వం వహిస్తున్న
విషయం తెలిసిందే. సుధా సినిమా పతాకంపై జె సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.... 'కథ, ఆసక్తిని గొలిపే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా అన్ని
వర్గాలకూ నచ్చే సినిమా అవుతుంది. టైటిల్ కి తగ్గట్టుగా సినిమా సాగుతుంది. డిసెంబర్ 26 నుంచి ఈనెల 6వరకూ
జరిగిన కీలక సన్నివేశాల చిత్రీకరణతో తొలి షెడ్యూల్ పూర్తయింది.ఈ నెల 23 నుంచి రెండో షెడ్యూల్
మొదలవుతుంది. నటుడిగా శ్రీకాంత్ కు, దర్శకుడిగా జేడీకి ఈ సినిమా ఓ మేలిమలుపుగా నిలుస్తుందని మా
నమ్మకం' అన్నారు. లక్కీశర్మ కథానాయికగా పరిచయం అవుతున్న ఈచిత్రంలో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు,
బ్రహ్మానందం, రఘుబాబు, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, రావు రమేష్, రంగనాథ్, జీవా, సుత్తివేలు
తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : కృష్ణమోహన్ చల్లా, సంగీతం : హేమచంద్ర.
|
|
దర్శకుడిగా అనిల్ సుంకర ...త్రిష సంక్రాంతి సంతోషం
బిందాస్, ఆహనా పెళ్లంట, నమో వెంకటేశ, దూకుడు’ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర దర్శకుడుగా మారుతున్నారు.
నలుగురు యువ హీరోలతో అనిల్ దర్శకత్వంలో ఓ భారీ 3డి చిత్రం తెరకెక్కనుందని సమాచారం.మహేష్-సుకుమార్
కాంబినేషన్లో ‘దూకుడు’ నిర్మాతలు రామ్, గోపి, అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించే చిత్రం మార్చి
నుంచి సెట్స్కెళుతుంది.
‘ నేను నటించిన ‘వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ, నమో వెంక చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి
విజయాన్ని సాధించాయి. తాజా చిత్రం ‘బాడీగార్డ్’ కూడా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించి నాలో
కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది’ అని తెలిపింది త్రిష. ఇంకా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ‘ ‘బాడీగార్డ్’ చిత్రంతో
నాకున్న సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి నిజమైనందుకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం తర్వాత తారక్తో
‘దమ్ము’ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో మా ఇద్దరిపై ఓ ఎక్స్ట్రార్దినరి సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఇది ఈ
చిత్రానికే హైలైట్గా నిలుస్తుంది. తమిళంలో విశాల్ హీరోగా తిరు దర్శకత్వంలో ‘సమరం’ చిత్రంలో నటిస్తున్నాను.
విశాల్ కాంబినేషన్లో ఇది నా తొలి చిత్రం. ఇందులో నా పాత్ర చాలా క్యూట్గా వుంటుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం
బ్యాంకాక్ వెళుతున్నాను. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రం కూడా నాకు మంచి
విజయాన్ని అందిస్తుంది’ అని చెప్పింది.
|
ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయాను
నసీరుద్దీన్ షా ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్ని రకాల పాత్రలు, వేషధారణల్లో 100 శాతం
మార్కులు సంపాదించుకునే నటుడాయన. అలాంటి అద్భుత వ్యక్తితో పనిచేసిన భోజ్పురి హీరో రవికిషన్
ఆనందానికి హద్దే లేదు. ' చాలిస్ చౌరాసి 'లో షాతో కలిసి పనిచేయడంపై మాట్లాడుతూ- ‘ఆయనే ఒక వ్యవస్థ.
నటనలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న షాతో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయనకు
పెద్ద అభిమానిగా మారిపోయాను’ అని రవికిషన్ వివరించాడు. వృత్తిపై ఎంతో నిబద్ధతతో వ్యవహరించే షాలో
నిజాయతీ, నిరాడంబరత కనిపిస్తాయని, డబ్బే సర్వస్వం కాదని భావిస్తారని ప్రశంసించాడు. షాతో కలిసి
నటించడమంటే మళ్లీ పాఠశాలకు వెళ్లడమేనని అన్నాడు.' చాలిస్ చౌరాసి' గురించి మాట్లాడుకుంటే పంకజ్ సురి
ఎలియాస్ సర్ (షా), అల్బర్ట్ పింటో ఎలియాస్ పింటో (కేకే మీనన్), భాస్కర్ సర్దేశాయి ఎలియాస్ బాబీ (అతుల్
కులకర్ణి), శక్తి చినప్పా ఎలియాస్ శక్తి (రవికిషన్) అనే నలుగురి పోలీసుల కథ ఇది. ఈ నలుగురికి అప్పగించిన ఒక
బాధ్యత వల్ల వీళ్ల జీవితాలు అనూహ్యంగా మలుపు తిరుగుతాయి. రవి ఇది వరకే భోజ్పురిలో 160కి పైగా సినిమాల్లో
నటించాడు. అయితే బాలీవుడ్లో మాత్రం ఇప్పటికీ తగిన స్థానం సంపాదించుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం
తనకు దక్కుతున్న గుర్తింపుపై సంతృప్తిగానే ఉందన్నాడు.
|
అనుభవం పెరిగేకొద్ది ప్రయోగాత్మక చిత్రాలు చేయాలి
‘నాకు నెగెటివ్ రోల్స్ అంటేనే ఇష్టం. కథానాయికగా ఎప్పుడూ మంచి అమ్మాయి అనిపించే పాత్రలో కనిపించడం రొటీన్
అయిపోయింది. నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలు చేయడం ఛాలెంజింగ్ అంటారు కానీ...అలాంటి పాత్రలు చేయడం నాకు
మాత్రం భలే సరదాగా అనిపిస్తుంది’ అని అంటోంది ప్రియాంకచోప్రా. గత సంవత్సరం ‘సాత్ఖూన్మాఫ్’ చిత్రంలో
నెగెటివ్ పాత్రలో కనిపించి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది ఈ భామ. ‘నా దృష్టిలో చిన్న పాత్ర
చేసినా దాని ప్రభావం సినిమాపై పెద్దగా వుండాలి. ఎంత పెద్ద పాత్ర చేసినా అందులో విషయం లేకపోతే నటిగా మన
ప్రయత్నమంతా వృథా అయినట్లే. అనుభవం పెరిగేకొద్ది ప్రయోగాత్మక చిత్రాలు చేయడం అలవాటు చేసుకోవాలి.
హీరోయిన్ అంటే సుకుమారిగా సినిమాల్లో చూపించే ట్రెండ్కు నా మనస్తత్వం పూర్తి భిన్నంగా వుంటుంది. అందుకే
మున్ముందు హీరోయిన్ పాత్రలే కాకుండా పవర్ఫుల్ నెగెటివ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను’ అని చెబుతోంది
ప్రియాంక.' డాన్ 2 'చిత్ర విజయంతో మంచి ఊపుమీదున్న ఈ సుందరి ప్రస్తుతం అగ్నిపథ్, తేరే మేరే కహాని, బర్ఫీ,
క్రిష్ 3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది.
|
‘శకుని’ బెస్ట్ అంటున్నప్రణీత.... మార్షల్ ఆర్ట్స్ వేపు బాలీవుడ్
కన్నడ సుందరి ప్రణీత సిద్దార్థ్ నటించిన ‘బావ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రం తర్వాత ‘ఏంపిల్లో
ఏంపిల్లడో..’ చిత్రంలో నటించినా ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఈ అమ్మడు కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న
‘శకుని చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఈ సందర్భంగా ప్రణీత చిత్ర విశేషాలు వివరిస్తూ- ‘
శకుని’ చిత్రంలో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. కానీ ఆ సన్నివేశాలు అంతగా రాలేదని వాటిని
మల్లీ రీషూట్ చేస్తున్నారని, ఈ చిత్రీకరణ కోసం నేను డేట్స్ సర్దుబాటు చేయకుండా దర్శకుడు శంకర్ దయాల్ను
ఇబ్బందికి గురిచేస్తున్నానని కొత మంది పుకార్లు పుట్టిస్తున్నారు. వాటిలో ఏ మాత్రం నిజంలేదు. ఈ చిత్రం కోసం వేరే
ఏ సినిమా అంగీకరించ కుండా నా డేట్స్ అన్నీ ఈ కేటాయించాను. నా గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్రకు
చాలా ప్రాముఖ్యత వుంటుంది. చాలా అందంగా కనిపిస్తాను కూడా. నా కెరీర్లోనే ‘శకుని’ బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది.
నటిగా నా సత్తా ఏంటో ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చింది.
రికెట్, మోటార్ స్పోర్ట్స్ వంటి క్రీడల్లో భాగస్వామ్యమవుతున్న బాలీవుడ్ ఇక మార్షల్ ఆర్ట్స్ వైపు దృష్టి సారించింది.
అంతర్జాతీయ క్రీడాకారులతో స్థానిక ఫైటర్లు పోటీ పడే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ను పలు నగరాల్లో నిర్వహించేందుకు
సన్నాహాలు జరుపుతోంది. ఇందుకు సంజయ్ దత్, పారిశ్రామికవేత్త రాజ్కుంద్రాలు కలిసి ఒక సూపర్ ఫైట్ లీగ్ను
ప్రారంభించనున్నారు.న్యూఢిల్లీతో పాటు ముంబై, చండీగఢ్ నగరాల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు
చేస్తున్నారు. మొదటి పోటీ ముంబై నగరంలో మార్చి 11న జరగనుంది. ఈ పోటీల్లో మాజీ కిక్బాక్సర్, మిక్స్డ్ మార్షల్
ఆర్ట్స్ స్పెషలిస్ట్ బాబ్, ఇంగ్లిష్ ఫైటర్ జేమ్స్ థాంప్సన్ పాల్గొననున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్
యజమాని, సినీ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్కుంద్రా, తమ లీగ్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఎంఏ
ఫైటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. వారు స్థానిక ఫైటర్లతో పోటీ పడతారని అన్నారు. తనకు
అన్ని క్రీడలూ ఇష్టమేనని, ఫుట్బాల్, క్రికెట్ను ఎంజాయ్ చేస్తానని చెప్పారు. గత ఐదేళ్లుగా మార్షల్స్ ఆర్ట్స్కూడా
చూస్తున్నాని చెప్పారు. కుస్తీలు, మల్లయుద్ధం వంటి పోటీల ద్వారా భారత్లో ఆర్థికంగా లాభాలు ఉండవని, అయితే
దీర్ఘకాలంలో ఫలితాలు ఉండవచ్చని అన్నారు. నెలకు 10, 20, 30 సినిమాలు విడుదలవుతాయని, అయితే తమ
పోటీలు నెలకోసారి మాత్రమే జరుగుతాయని చెప్పారు.
|
చక్కటి సక్సెస్ కోసం చూస్తోంది శ్వేతబసు ప్రసాద్
'కొత్తబంగారు లోకం' సినిమాతో తెలుగువారికి పరిచయమైన క్యూట్ బేబీ శ్వేతబసు ప్రసాద్. ఉదయ కిరణ్తో చేసిన
'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా', వరుణ్ సందేశ్తో 'ప్రియుడు' సినిమాలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా
'ఆనందం' ఫేం ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న 'యుగానికి ఒక్క ప్రేమికుడు' సినిమాపై భారీ ఆశలు
పెట్టుకుంది.'ఎకడా..ఎపుడు...' అంటూ ఓ ప్రత్యేకశైలిలో పలికి అప్పటి కుర్రకారుని అలరించిన శ్వేతాబసుకు టాలీవుడ్లో
కాలం కలిసిరాలేదనే చెప్పొచ్చు. కాలేజ్ కథలకే సూటయ్యేట్టు ఉన్న చైల్డ్ ఫేస్కు ఆమెకు కొంత మైనస్ పాయింట్గా
మారిందనేఅనాలి. పొగరు..ఓవర్కాన్ఫిడెన్స్...మొదలైన లక్షణాలు చూపాల్సి ఉంటుంది కాబట్టి, గ్లామరస్ హీరోయిన్గా
తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ముందుకు రాకపోడానికి కారణం. దీంతో కాలేజ్ లవ్స్టోరీ బ్యాక్గ్రౌండలో ఉన్న ఏ
సినిమా అయినా శ్వేతా ఒప్పేసుకుంది. ప్రస్తుతం ఓ చక్కటి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.
|
|
'దాదా సాహెబ్ ఫాల్కే' రామానాయుడుకు పద్మ అవార్డు ?
ప్రముఖ సినీ నిర్మాత, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దగ్గుబాటి రామానాయుడు, తిరుపతిలోని రాస్ సేవా
సంస్థ సంస్థాపక కార్యదర్శి గుత్తా మునిరత్నంనాయుడు, హైదరాబాద్లోని ఇన్ఫోటెక్ సంస్థ చైర్మన్ బి.వి.ఆర్ మోహన్
రెడ్డిలకు ఈ ఏడాది పద్మ అవార్డులు లభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రముఖ గజల్ గాయకుడు
గజల్ శ్రీనివాస్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేర్లు కూడా పరిగణనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ
ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కనీసం 35 మంది ప్రముఖుల పేర్లను పద్మ అవార్డులకోసం సిఫారసు చేసింది. అందులో..
ఇద్దరికి పద్మవిభూషణ్, ముగ్గురికి పద్మభూషణ్, మిగతా వారికి పద్మశ్రీ అవార్డులు బహూకరించాలని కోరినట్లు
తెలిసింది.రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, కూచిపూడి నర్తకులు రాజా,
రాధారెడ్డి, ప్రముఖ దర్శకుడు బాపు, ప్రముఖ రచయిత ప్రొ.శివ్ కె.కుమార్, నేత్ర వైద్యుడు సాయిబాబా గౌడ్, ప్రముఖ
రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ సామల వేణు, బ్యాడ్మింటన్ కోచ్ ఆరిఫ్, నర్తకి దీపికా రెడ్డి, సురభి
వేణుగోపాల్, సామాజిక కార్యకర్త పుచ్చలపల్లి సంధ్య తదితరుల పేర్లు ఉన్నట్లు సమాచారం.
|
'టాక్ షో క్వీన్' ఓఫ్రా విన్ఫ్రేను కలిసేందుకు ‘క్యూ’ లో బాలీవుడ్
అమెరికా టెలివిజన్ మొఘల్, టాక్ షో క్వీన్ ఓఫ్రా విన్ఫ్రేను కలిసేందుకు బాలీవుడ్ తారలంతా ‘క్యూ’ కట్టారు.
తొలిసారి భారత పర్యటనకు వచ్చిన విన్ఫ్రేకు పరమేశ్వర్ గోద్రేజ్ విలాసవంతమైన విందును ముంబైలో ఏర్పాటు
చేశారు. విన్ఫ్రే పార్టీకి బాలీవుడ్ తారలు అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ఖాన్, ప్రియాంక చోప్రా, ప్రీతి
జింటా, లారా దత్తా, శిల్పశెట్టి, అనిల్ కపూర్, ఇమ్రాన్ ఖాన్, నేహా దూపియా, సమీరారెడ్డి, డినో మారియా, ప్రముఖ
రచయిత్రి శోభా డే, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ ఆలీలు హాజరయ్యారు. ఆరంజ్ రంగు చీరను ధరించి విన్ఫ్రే పార్టీలో
హల్చల్ చేశారు. విన్ఫ్రేను కలుసుకోవడంపై పలువురు బాలీవుడ్ నటులు ట్విట్టర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ముంబైలో అడుగుపెట్టిన ఓఫ్రా విన్ఫ్రే ముందుగా.. అమితాబ్ కుటంబాన్ని కలుసుకున్నారు. తమ ఇంటిని విన్ఫ్రే
సందర్శించిందని.. ఐశ్వర్య కూతుర్ని దీవించిందని.. చీరలో ఓఫ్రా చాలా అందంగా ఉందని అమితాబ్ ట్విట్టర్లో
ప్రశంసల్ని కురిపించాడు.
|
'షాడో' గా 'బాడీగార్డ్' వెంకటేష్ ...నటుడిగా బాలు బిజీ
'బాడీగార్డ్' గా ప్రేక్షకుల్ని అలరించిన హీరో వెంకటేష్ తాజాగా 'షాడో'గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వెంకీ కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. యునైటెడ్
మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ డాన్ పాత్రలో కనిపించనున్నట్లు
సమాచారం.స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి 'షాడో' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని
తెలిసింది. వెంకీ సరసన రిచా గంగోపాధ్యాయ నటించనుంది. హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ
చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం
అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.
గాయకుడిగా, నటుడిగా అలరించే ప్రయత్నాన్ని యస్.పి. బాలసుబ్రహ్మణ్యం వేగవంతం చేశారనిపిస్తోంది. తమిళ,
తెలుగు చిత్రాల్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్ట్గా, మెయిన్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఇటీవల 'దేవస్థానం' అనే
సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బాలు, తాజాగా మరో తెలుగు సినిమాలో లీడ్ రోల్ చేయబోతున్నారు. చిత్రం పేరు
'మిథునం'. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందుతోంది. శ్రీరమణ ఈ కథను రాశారు.
ఇందులో సీనియర్ నటి లక్ష్మి బాలు పక్కన నటిస్తున్నారు.
|
నయతారను తన పారితోషికాన్ని రెండింతలు చేసిందా?
'శ్రీ రామరాజ్యం' చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో అద్భుతాభినయాన్ని కనబర్చి విమర్శకుల ప్రశంసలు పొందింది
నయనతార. ప్రభుదేవాతో ప్రేమాయణం నడుపుతున్న ఈ భామ త్వరలోప్రభుదేవాను పెళ్లి చేసుబోతున్న విషయం
తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ సుందరి నటనకు గుడ్బై చెప్పనుందని, వివాహానంతరం నయనతార
నటించడం ప్రభుదేవాకు ఇష్టం లేదనే వార్తలు కూడా వెలువడ్డాయి. నయనతార కూడా ఓ సందర్భంలో తన చివరి
చిత్రం ‘శ్రీరామరాజ్యం’ కావొచ్చని ప్రకటించింది. పెళ్లికి సిద్ధపడుతున్నా తెలుగు ప్రేక్షకుల్లో ఈ సుందరికున్న క్రేజ్ ఏ
మాత్రం తగ్గలేదు. చాలా మంది నిర్మాతలు నయనతారను తిరిగి నటింపజేసే ప్రయత్నాల్లో వున్నట్లు తెలిసింది.
అయితే ఈ భామ మాత్రం పారితోషికాన్ని రెండింతలుగా పెంచి డిమాండ్ చేస్తుందని ఫిల్మ్ నగర్లో గుసగుసలు
వినిపిస్తున్నాయి. ఓ అగ్ర హీరో సరసన కథానాయికగా నటించమని ఇటీవల ఓ నిర్మాత నయతారను అడిగినట్టు
తెలిసింది. అందుకు ఈ భామ తన పారితోషికాన్ని రెండింతలు చేసి చెప్పిందని, దాంతో సదరు నిర్మాత ప్రయత్నాన్ని
విరమించుకున్నాడని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే పరిక్షిశమలోని కొన్ని వర్గాలు మాత్రం ఇకపై సినిమాల్లో
నటించడం నయనతారకు ఇష్టంలేదని, ఆ విషయాన్ని నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పలేకనే నయనతార
పారితోషికాన్ని డబుల్ చేసి చెబుతోందని అంటున్నారు. నయనతార మనసులోని మాట తెలియక ఆమెను
నటింపజేయాలనుకున్న నిర్మాతలందరూ కొద్దిగా నిరుత్సాహపడ్డారట!
|
దేహాన్ని ప్రదర్శించడం అసౌకర్యంగా ఉంటుంది
సినీ పరిశ్రమలో మంచి ‘ఫిగర్’లేని నటిని తానేనని అనేకమార్లు అంగీకరించిన సోనమ్ కపూర్ తాను వేసుకునే
దుస్తుల వల్లనే అందంగా కనిపిస్తానని చెప్పింది. బయటకు సన్నగా కనిపిస్తున్నా, లోపల తాను లావేనని, తనకు
అందమైన శరీరం లేదని తెలిపింది. దుస్తుల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తానని, వాటి కారణంగానే తాను సన్నగా
కనిపిస్తానని చెప్పింది. ఇష్టమైన భోజన పదార్థాలను మితంగా తినేందుకు ప్రయత్నిస్తానని అన్న సోనమ్-
వేషధారణలో తనకు నప్పే తరహా, స్టయిల్, రంగులను మాత్రమే ఎంపిక చేసుకుంటానంది. రాబోయే ఓ సినిమాలో
బికినీలో కనిపించబోతున్నానని ఇటీవల ప్రకటించిన సోనమ్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపింది. తన
శరీరంపై తనకు విశ్వాసం లేనందునే తెరపై బికినీలో కనిపించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ‘‘బికినీలో
అందంగా కనిపించనని తెలుసు. అంతేకాకుండా దేహాన్ని ప్రదర్శించడం అసౌకర్యంగా ఉంటుంది. బయటకు నేను
సన్నగా కనిపించినా, నిజానికి నేను లావు అమ్మాయిని’’ అని ఈ ‘ఢిల్లీ6’ హీరోయిన్ వెల్లడించింది. చివరిసారిగా
అభిషేక్ బచ్చన్తో కలిసి ‘ప్లేయర్స్’ సినిమాలో కనిపించిన అనిల్కపూర్ గారాలపట్టి బాలీవుడ్లో ప్రవేశించడానికి
ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు చెప్పింది. తాను చేసే పని కారణంగానే ఈ ఆకృతిలో
ఉండగలుగుతున్నానని తెలిపింది. ప్రేక్షకులు డబ్బు పెట్టి సినిమా చూస్తారని, అందువల్ల ఈ వృత్తిలో అందంగా
కనిపించడం అవసరమని పేర్కొంది. 19 ఏళ్ల వయస్సులోనే 81 కిలోల బరువున్న సోనమ్ ‘సావరియా’ సినిమా కోసం
పూర్తిగా సన్నబడ్డానని చెప్పింది
|
|
సేవా పన్ను ఆలోచన చిత్రసీమకు గొడ్డలిపెట్టు
ఇప్పటికే ప్రభుత్వాలు విధించిన వినోదపు పన్ను, వ్యాట్లను కట్టేందుకే సినీ
పరిశ్రమ సతమతమవుతూ ఉంటే, తాజాగా సర్వీస్ టాక్స్ను కూడా విధించడం
చావుదెబ్బలాంటిదని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవేదన వ్యక్తం
చేసింది. ఈ నెల 9న ఈ అంశంపై దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలకు
చెందిన సంఘాలు చెన్నైలో సమావేశమై సర్వీస్ టాక్స్ని తొలగించాలని
ఏకగ్రీవంగా తీర్మానించాయనీ, ఇదే సంగతిని కేంద్ర ఆర్థిక మంత్రికి
విజ్ఞప్తిచేశాయనీ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఫిల్మ్చాంబర్
అధ్యక్ష, కార్యదర్శులు డి. సురేశ్బాబు, కె. అశోక్కుమార్ తెలిపారు. గత పదేళ్లుగా
దేశంలోని చిత్ర పరిశ్రమ కేవలం 7 నుంచి 8 శాతం మాత్రమే విజయాల్ని
చవిచూసిందనీ, వాటివల్ల కూడా నిర్మాతలకు వచ్చిన లాభం స్వల్పమేననీ,
మిగతా 92 నుంచి 93 శాతం సినిమాలు రకరకాల కారణాల వల్ల ఫ్లాపయి,
నిర్మాతలకూ, వాటిపై పెట్టుబడులు పెట్టిన వారికీ భారీ నష్టాల్ని తెచ్చాయనీ ఆ
ప్రకటనలో పేర్కొన్నారు. "ప్రతి యేటా చిత్రసీమలో విజయాల శాతం పడిపోతూ
వస్తోంది. బాక్సాఫీసు వద్ద వసూళ్లు సాధించని, ఫ్లాపయిన సినిమాల గురించి
ప్రభుత్వం దృష్టికి రాదు. ఈ పరిస్థితుల్లో సేవా పన్నును విధించాలనే కేంద్ర
ప్రభుత్వ ఆలోచన చిత్రసీమకు గొడ్డలిపెట్టు వంటిది. సాధారణంగా సేవా
పన్నును ఆ రంగానికి చెందిన వినియోగదారుడి మీదే వేస్తారు.
దురదృష్టవశాత్తూ ఇక్కడ ప్రేక్షకుడే వినియోగదారుడు. కానీ సేవా పన్నును
విధిస్తోంది మాత్రం నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ మీద. దీన్ని భరించే శక్తి
మాకు లేదు. అందువల్ల దీన్ని మేం అంగీకరించలేం. ఇప్పటికే వివిధ రాష్ట్ర
ప్రభుత్వాలు ఆయా భాషల చిత్రసీమల నుంచి వినోదపు పన్ను, వ్యాట్ వసూలు
చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు పొందకుండానే
ఈ రకంగా అత్యధిక పన్నులు చెల్లిస్తున్నది దేశం మొత్తం మీద సినీ పరిశ్రమే.
సేవా పన్నే గనుక కట్టాల్సి వస్తే భారతీయ సినీ పరిశ్రమకు కాలం చెల్లినట్లే
అవుతుంది. మొత్తం సినీ పరిశ్రమను బలవంతంగా మూసేసుకోవడం తప్ప
మరో దారి లేదు'' అని వారు తెలిపారు. |
అందమైన ప్రేమకథా చిత్రం 'హీరోయిన్'
మాథుర్ భండర్కార్ తాజా సినిమా 'హీరోయిన్' కథంతా కరీనా కపూర్ పాత్ర
చుట్టూ తిరుగుతుందనే మనకు తెలుసు. అర్జున్ రాంపాల్ మాత్రం ఒక కొత్త
సంగతిని బయటపెట్టాడు. ఇదొక అందమైన ప్రేమకథా చిత్రమని స్టేట్మెంట్
ఇచ్చాడు. ఎలాగో ఇలా వివరించాడు. ‘ఇందులో బెబో (కరీనా ముద్దుపేరు) పాత్రే
ఎక్కువగా కనిపిస్తుంది. ఒకే వృత్తిలో ఉండే ఇద్దరి మధ్య కొనసాగే అద్భుతమైన
ప్రేమకథ ఇది. ప్రేమికులను కలపాల్సిన వ్యక్తులే అపార్థాలకు కారణం కావడం
వల్ల ఏర్పడే ఇబ్బందులను మాథుర్ అద్భుతంగా చూపిస్తున్నాడు’ అని అర్జున్
చెప్పాడు. కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదిగి చివరికి పతనాన్ని చవిచూసే హీరోయిన్
మహిఖన్నాగా ఇందులో బెబో కనిపిస్తుంది. మరి నీ పాత్ర ఏంటన్న ప్రశ్నకు
అర్జున్ బదులిస్తూ- ‘ఇది మాథుర్ సినిమా. ఎన్నో వాస్తవిక సంఘటనల
మలుపులు ఉంటాయి. ఇందులో నాది ఇలాంటి పాత్రే. వాస్తవ అంశాల
ఆధారంగా మలిచిన పాత్రలే నన్ను వరిస్తుండడం సంతోషంగా ఉంది. ఈ
అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని పాత్రకు న్యాయం చేయడానికి
ప్రయత్నిస్తాను’ అని వివరించాడు.2001లో విడుదలైన ప్యార్ ఇష్క్ ఔర్
మొహబ్బత్తో అర్జున్ హిందీ సినిమాల్లో కాలుపెట్టాడు. అయితే విజయాల
కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. 2006లో విడుదలైన' డాన్'
సినిమాలో ఇతడు చేసిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుంచి
ఎక్కువగా నెగెటివ్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు.' రాకాన్','
ఓంశాంతిఓం',' రాజ్నీతి' సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
|
శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో శ్రియ
'లీడర్' తర్వాత కొంత గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమా
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. కాలేజీ అనంతర కాలపు జీవితం ఎలా ఉంటుందో ఈ
సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు శేఖర్. ఇందులో హీరోయిన్ గా
శ్రియ నటిస్తుండటం విశేషం. నిజానికి ఇందులో మొదట హీరో హీరోయిన్లుగా
కొత్తవాళ్లనే ఎంచుకున్నాడు శేఖర్. కొంత షూటింగ్ జరిగిన తర్వాత ప్రధాన
హీరోయిన్ గా నటిస్తున్న అమ్మాయి ఈ సినిమా కంటే తన చదువుకే
ప్రాధాన్యమిచ్చి అమెరికాకు వెళ్లిపోయింది. దాంతో షూటింగ్ కు కొంత ఆటంకం
ఏర్పడింది. మరో కొత్తమ్మాయిని తీసుకొని, ఆమెకి నటనలో శిక్షణనిచ్చి,
షూటింగుకి రెడీ చేసేసరికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో శ్రియను
సంప్రదించాడు శేఖర్. కథా, అందులో తనకు ఆఫర్ చేసిన పాత్రా బాగా
నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది శ్రియ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్
రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ తర్వాత బొబ్బిలిలో
షూటింగ్ జరపడానికి ప్లాన్ చేస్తున్నాడు శేఖర్. ఇప్పటికే అల్లరి నరేశ్,
శర్వానంద్ తో కలిసి మరో సినిమా కూడా శ్రియ చేస్తున్న సంగతి తెలిసిందే.
|
'బిజినెస్ మేన్' హిట్ తో కథానాయికి కాజల్ సంతోషం
'బిజినెస్ మేన్' చిత్రం హిట్ టాక్ తో ఆ చిత్ర కథానాయికి కాజల్ సంతోషంగా
ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- సినిమా విడుదలకు ముందు చాలా
టెన్షన్ పడ్డాను. అయితే ఏడుకొండలవాడి దర్శనం అనంతరం ఆ టెన్షన్ అంతా
పోయింది. ఇక బిజినెస్ మేన్ రిజల్ట్ తెలిశాక మనసంతా తేలికయిపోయింది అని
తెలిపింది .ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు 'బిజినెస్ మేన్' అందించిన
విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పింది. ఈ చిత్రానికి 'సారొస్తారు...' పాట
ప్రధాన ఆకర్షణగా నిలిచిందని తెలిపింది. మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో
నటిస్తున్న 'తుపాకి' గురించి మాట్లాడుతూ- మురుగదాస్ దర్శకత్వంలో
నటించాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఆ కోరిక
తీరుతున్నందుకు ఆనందంగా వుంది. అతనితో మళ్లీ మళ్లీ సినిమాలు
చేయాలనిపిస్తుంది. ఇందులో నా పాత్ర చాలా జాలీగా వుంటుంది. పక్కాగా
చెప్పాలంటే నా నిజజీవితానికి దగ్గరగా వుంటుందని చెప్పొచ్చు.మురుగదాస్
చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుందన్న విషయం
తెలిసిందే. ఆయన గత చిత్రాల్లాగే ఈ చిత్రంలోనూ హీరోయిన్ పాత్రకు చాలా
ప్రాధాన్యత వుంటుంది. ఇదొక కమర్షియల్ ఎంటర్ టైనర్. ఈ చిత్రంతో పాటు
సూర్య-కె.వి.ఆనంద్ ల కాంబినేషన్ లో 'మావూటన్' చేస్తున్నాను. ఈ చిత్రం
షూటింగ్ ఈ నెలలోనే పూర్తవుతుంది. ఈ ఏడాది మంచి హిట్ తో నాకు
శుభారంభం కావడం ఆనందంగా వుందంటూ కాజల్ ఫుల్ ఖుషీ అవుతోంది.
|
బాలీవుడ్ లో ఇషా చావ్లా ...హిందీ లో పవన్ 'బద్రి'
తెలుగులో సక్సెస్ అందుకోగానే కథానాయికల చూపు బాలీవుడ్ వైపు
మరలుతోంది. జాతీయ స్థాయిలో మార్కెట్ను విస్తరించుకోవడానికి వారికి హిందీ
సినిమాలు చక్కటి వేదికగా మారుతున్నాయి. త్రిష, అసిన్..తాజాగా తాప్సీ
కూడా బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఈ
జాబితాలో పంజాబీ ముద్దుగుమ్మ ఇషాచావ్లా చేరింది. ‘ప్రేమకావాలి’ చిత్రంతో
తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ సుందరి అందంతో పాటు చక్కటి అభినయంతో
ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ వయ్యారి సునీల్ సరసన ‘పూలరంగడు’
చిత్రంలో నటిస్తోంది. ఈ భామకు ఓ హిందీ చిత్రంలో నటించే అవకాశం దొరికింది.
రణదీప్ హుడా హీరోగా నటించనున్న ఈ చిత్రానికి అహీసర్ సలోమోర్
దర్శకత్వం వహిస్తాడు. హిందీ చిత్రంలో అవకాశం రావడం పట్ల ఈ సుందరి
పట్టరాని ఆనందంతో వుంది. బాలీవుడ్ ఎంట్రీ కెరీర్కు మంచి బ్రేక్నిస్తుందని
వ్యాఖ్యానించింది. తెలుగులో ‘పూలరంగడు’ తర్వాత మరోసారి సునీల్తో జోడిగా
ఈ సుందరి నటించనుంది. బాలీవుడ్ హిట్ చిత్రం ‘తనూ వెడ్స్ మను’
ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవీ ప్రసాద్ దర్శకత్వం
వహించనున్నాడు.
దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్టయిన సినిమాలను బాలీవుడ్లో
రీమేక్ చేస్తూ ఈ మధ్య తెగ హిట్లు కొడుతున్నారు . సల్మాన్ఖాన్, అమీర్ఖాన్,
అజయ్దేవగన్, అక్షయ్కుమార్ లాంటి పెద్ద స్టార్లు ఇక్కడ విజయవంతం
అయిన సినిమాలపై చాలా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అందిన
సమాచారం ప్రకారం అప్పట్లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పవన్
కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘బద్రి’ రీమేక్ హక్కులను దక్కించుకోవడానికి
బాలీవుడ్ బిగ్ హీరోల్లో ఒకరైన సంజయ్దత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
పవన్కళ్యాణ్ పోషించిన పాత్రలో సంజయ్దత్ ఏం సెట్టవుతాడు అని
ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకునేది ఆయన
నటించేందుకు కాదు, తన స్నేహితుడైన అజయ్దేవగన్కు గిఫ్ట్గా ఇవ్వడానికే
అని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది.
|
|
“ఒక్కడినే” అంటున్న నార రోహిత్ ...29 నుండి బాలకృష్ణ చిత్రం
శ్రీనివాస రాగ దర్శకత్వం లో నార రోహిత్ నటిస్తున్న చిత్రానికి “ఒక్కడినే” అనే
పేరు ని ఖరారు చేసారు ఈ చిత్రాన్ని గులాబీ మూవీస్ బ్యానర్ మీద సి.వి.రెడ్డి
నిర్మిస్తున్నారు. నిత్య మీనన్ నారా రోహిత్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ
మధ్యనే హైదరాబాద్ లో మొదలు అయ్యి జనవరి 9 కి మొదటి షెడ్యూల్ పూర్తి
చేసుకుంది.తరువాత షెడ్యూల్ అరకు లో ఫిబ్రవరి 15 నుండి ఉండబోతుంది.
ఒక్కడినే మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్తున్నారు కుటుంభ కథా చిత్రం
అంటున్నారు. ఐ ఆండ్రివ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా ‘సామాన్యుడు’ ఫేం రవికుమార్ చావలి
దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మించే సినిమా ఈ నెల
29న ప్రారంభం కానుంది. పార్వతి మెల్టన్ ఈ చిత్రంలో కథానాయిక. మరో
నాయిక కూడా నటిస్తారు. సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. నాగార్జున
కథానాయకుడిగా దశరథ్ దర్శకత్వంలోని సినిమా మార్చిలో ప్రారంభం
కానుంది. కామాక్షి ఎంటర్ప్రైజెస్ పతాకంపై డి.శివప్రసాద్రెడ్డి ఈ చిత్రాన్ని
నిర్మిస్తారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఇతర నటీనటులు,
సాంకేతికనిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.నిపవన్ కళ్యాణ్ ‘గబ్బర్సింగ్’
ఏప్రిల్ 27న విడుదల కానుందని సమాచారం. ‘దబాంగ్’ రీమేక్గా
తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మిరపకాయ్’ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వం
వహిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
|
కొత్తగా గమ్మత్తుగా అసిన్... బొద్దుగా కనిపించాలని సమంత
అందాల భామ అసిన్ కొత్తగా గమ్మత్తుగా కనిపిస్తూ జనాన్ని ఆకట్టుకుంటోంది.
ఈ మళయాళ భామ బాలీవుడ్లో పాగా వేసి నంబర్ వన్ గా రాణించాలని ఇంకా
కలలు కంటూనే ఉంది. అందులో భాగంగానే మునుపటి కంటే మరింత నాజూగ్గా
అసిన్ తయారైంది. ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన దుస్తులు ధరించి ఆమె
కనిపిస్తున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ న్యూ లుక్ తోనే రాబోయే "బోల్
బచ్చన్, హౌస్ఫుల్-2" చిత్రాల్లోనూ అసిన్ అలరించనుంది. బాలీవుడ్ లో తన
అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే మరోవైపు బుల్లితెరపై కూడా మెరవబోతుంది.
అంతే కాకుండా మంచి అవకాశం వస్తే కోలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు తాను
సిద్ధమేనని చెబుతోంది ముద్దుగుమ్మ.
వరుస విజయాలతో యమ బిజీగా వున్న భామ సమంత. ‘దూకుడు’తో మంచి
దూకుడు మీదున్న సమంత చేతిలో ప్రస్తుతం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో
మొత్తం ఎనిమిది భారీ చిత్రాలున్నాయి. ఇందులో రామ్చరణ్ కథానాయకుడిగా
వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ఒకటి. ‘ ఎవడు’ అనే
టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో
కనిపించనున్న విషయం తెలిసిందే. తన గత చిత్రాలకు భిన్నంగా రామ్చరణ్
కనిపించనున్న ఈ చిత్రంలో సమంత కూడా భిన్నంగా కనిపించనునందని
తెలుస్తోంది. ఈ చిత్రం చిత్రీకరణ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. నాజూకు
అందాల సుందరిగా పేరు తెచ్చుకున్న సమంతని ఈ చిత్రం కోసం రామ్చరణ్
కొంచెం బొద్దుగా కనిపించమని కోరాడని, అందుకు తగ్గట్టుగానే సమంత కొంత
బొద్దుగా కనిపించడానికి కసరత్తులు మొదలు పెట్టేసిందని తెలుస్తోంది. ఈ
విషయం గురించి సమంత స్పందిస్తూ నటి అంటే ఎలాంటి పాత్ర చెయ్యడానికైనా
సిద్దపడాలి. అలా చేసినప్పుడే కొత్త పాత్రలు, కొత్త కథలు పుట్టు కొస్తాయి. నేను
ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను అని గిరి గీసుకు కూర్చుంటే కాలంతో పాటు
నడవలేం కదా’ అని తెలిపింది..
|
కోలీవుడ్ లోనూ అందరి ప్రశంసలందుకుంటున్న అనుష్క
ఏ హీరోయిన్ని తీసుకున్నా నెగటివ్ ప్రచారమే వినిపించడం సాధారణం. కానీ
బెంగళూరు బ్యూటీ అనుష్క విషయం అలా కాదు. తను ఎక్కడ పనిచేస్తే అక్కడ
మంచి పేరు తెచ్చుకోవడం ఆమెకే చెల్లింది. ఇప్పటికే టాలీవుడ్ లో తన
ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకొన్న ఆమె ఇప్పుడు కోలీవుడ్ లోనూ అందరి
ప్రశంసలూ పొందుతోంది. అక్కడ ఆమెతో పనిచేసిన, పనిచేస్తున్న దర్శకులంతా
ఆమెని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.షూటింగ్ సెట్స్ కి కరెక్ట్ టైంకి రావడమే
గాక, తన స్నేహపూర్వక ప్రవర్తనతో ఎంతో మంది అభిమానుల్ని చెన్నైలో
సంపాదించేసింది అనుష్క. సెట్స్ మీదకు ఉదయం 7 గంటలకల్లా మేకప్ తో
వచ్చే ఆమె ఒక్కసారి కూడా షూటింగుకి లేటుగా రాని హీరోయిన్ గా క్లీన్
ఇమేజ్ పొందింది. టైంకి రాలేని స్థితి ఉంటే ఆ సినిమానే ఆమె ఒప్పుకోవడం
లేదు.ప్రస్తుతం అనుష్క వైజాగ్ లో హీరో కార్తీ సరసన ఓ తమిళ సినిమా
షూటింగులో పాల్గొంటోంది. అక్కడి యూనిట్ సభ్యుల్లో ఎవర్ని కదిపినా
అనుష్కని ఆకాశానికెత్తేసే వారే.ఆ సినిమా దర్శకుడు సూరజ్ మాట్లాడుతూ
"అనుష్క సమయాన్ని ఎంత కచ్చితంగా పాటిస్తుందో. అందరికంటే ముందే
షూటింగుకి రెడీ అయిపోతుంది. ఒక్కసారి కూడా తన కోసం వెయిట్ చేసే
అవకాశాన్ని మాకివ్వలేదు. సాధారణంగా పాటల్ని షూట్ చేసేప్పుడు హీరోయిన్లు
జుట్టు లేదా మేకప్ సరిచేసుకోవడానికి చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ
అనుష్క విషయంలో ఆ సీన్ మనకి కనిపించదు" అని మెచ్చుకున్నాడు.
|
సినిమా 'వెబ్సైటు' చెప్పినంత సులువు కాదు
మంచి సినిమాను రూపొందించడం ఎంత ముఖ్యమో దానిని అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మార్కెట్లోకి పంపించడం అంతకంటే
ముఖ్యం. ఈ విషయం తెలుసు కాబట్టే చిత్ర నిర్మాణ సంస్థలన్నీ తమ కొత్త
సినిమాను ప్రకటించగానే దానికంటూ ఒక ప్రత్యేక వెబ్సైటును తయారు
చేసుకుంటాయి. అయితే ఇది చెప్పినంత సులువు కాదు. త్వరలో థియేటర్లకు
రానున్న ‘కిస్మత్ లవ్ పైసా ఢిల్లీ’ నిర్మాత అమిత్ చంద్ర పరిస్థితే ఇందుకు
ఉదాహరణ. ఈ సినిమా టైటిల్ పేరుతోనే సైట్ రూపొం దించడానికి ఆయన
ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అప్పటికే ఆ టైటిల్ పేరుతో మరో సైట్
ఉన్నట్టు తెలిసి అమిత్ అవాక్కయ్యారు. అదే టైటిల్ కావాలని సదరు సైటు
యజమానిని కోరితే అతడు భారీ మొత్తం డిమాండ్ చేశారు. దీంతో చంద్ర మరో
పేరుతో సైటును రూపొందించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.'.......' పేరుతో ఒక
సైట్ ఇది వరకే కొనసాగుతున్నట్టు మాకు తెలిసింది. ఇది వార్తలను పోస్ట్
చేస్తుంది. మా సినిమాను ప్రకటించిన వెంటనే ఈ సైట్ను మొదలుపెట్టినట్టు
తెలిసింది. ఈ పేరును అమిత్కు ఇవ్వడానికి సైట్ యజమాని రూ.10 లక్షలు
డిమాండ్ చేశాడు. ఇతని కి తలొగ్గకూడదని నిర్ణయించుకున్న అమిత్ '.........'
పేరును ఎంచుకున్నారు’ అని యూనిట్ వర్గాలు తెలిపాయి. షారుఖ్ హీరోగా
రూపొందించిన' ఓం శాంతి ఓం' నిర్మాత ఫర్హాన్ అఖ్తర్కు కూడా ఇదే సమస్య
ఎదురయింది. ఈ పేరుతో ఎవరో ఒక సైటును నిర్వహిస్తున్నట్టు తేలడంతో
ఫర్హాన్ తలపట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్లోని మరికొన్ని సినిమాలకు కూడా
ఇదే పరిస్థితి ఎదురయింది
|
'బ్యాట్మ్యాన్' చిత్రాల్లోని జోకర్ లా వివేక్ ఒబెరాయ్
2011లో వివేక్ ఒబెరాయ్ సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ఈ ఏడాది ఇతడు
నటించిన ‘జిలా ఘజియాబాద్’, ‘కిస్మత్, లవ్, పైసా, డిల్లీ’లు
విడుదలవుతున్నాయి. 2013లో విడుదలయ్యే' క్రిష్ 2'లోనూ ముఖ్యపాత్ర
పోషిస్తున్నాడు. ‘జిలా ఘజియాబాద్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
సంజయ్దత్ వంటి పెద్ద నటుడితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.
ఇందులో మూడుపాత్రలూ (అర్షద్ వార్సీ కూడా) ముఖ్యమైనవే’ అని ఇతడు
చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ‘షూటౌట్ ఎట్
లోఖండ్వాలా’లో దత్ పోలీసు అధికారిగా, వివేక్ గ్యాంగ్స్టర్గా నటించారు.
'జిఘజియాబాద్'లోనూ వీరిద్దరూ ఇవే పాత్రల్లో మళ్లీ కనిపిస్తారు. ‘వాస్తవం,
కల్పనల కలయికే ఈ సినిమా. షూటింగ్ కోసం నిర్మించిన సెట్టింగులు
అద్భుతంగా ఉన్నాయి. దీని కథ విన్నప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఈ పాత్రలో
నటించడం మొదలు పెట్టగానే వింతగా అనిపించింది’ అని వివేక్ వివరించాడు.
ఇక క్రిష్లో హృతిక్ హీరో కాగా, వివేక్ విలన్గా కనిపిస్తాడు. ఇతని పాత్ర
బ్యాట్మ్యాన్ చిత్రాల్లోని జోకర్ మాదిరిగా ఉంటుంది. ఆ సినిమాలో హృతిక్,
ఆయన తండ్రి రాకేశ్ రోషన్ నటించడం వల్ల తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని
వివేక్ అంటున్నాడు. హీరోను శక్తిమంతంగా చూపించాలంటే విలన్నూ దీటుగా
చూపించడం తప్పనిసరని అన్నాడు. కిస్మత్, లవ్, పైసా, డిల్లీకి సంజయ్
ఖండూరీ దర్శకుడు. అదృష్టవశాత్తూ ఈ ఏడాది తనకు అన్నీ మంచి కథలే
దొరుకుతున్నాయని వివేక్ అన్నాడు. 2002లో విడుదలైన కంపెనీ సినిమాతో
వివేక్ తన బాలీవుడ్ కెరీర్లోకి ప్రవేశించాడు. ఈ సినిమా హిట్ కావడమే కాదు..
వివేక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తదనంతరం కూడా కెరీర్ సాఫీగానే
సాగింది. ఐశ్వర్యారాయ్ కోసం సల్మాన్ తనను వేధిస్తున్నాడని ఆరోపించడంతో
వివేక్ కొన్నాళ్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు
|
|
'డైరెక్టర్స్ స్పెషల్' పేరిట కేవలం దర్శకులే పాల్గొనే స్టేజి షో
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇవాళ 1700 మంది వరకు సభ్యులున్నారు.
దీని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. పెరిగిన టెక్నాలజీని
ఉపయోగించుకోవడం చాలామందికి తెలీడం లేదు. అది తెలుసుకోవడానికి ఓ
ప్రయోగశాల ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్లకు
అనుభవం కోసం కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఈలోగా సంఘానికి సొంత
భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి కావాల్సిన నిధుల కోసం 'డైరెక్టర్స్ స్పెషల్'
పేరిట కేవలం దర్శకులే పాల్గొనే స్టేజి షోను నిర్వహించబోతున్నాం. దానిలో
భాగస్వాములు కావడానికి ఇవాళ లైమ్లైట్లో ఉన్న దర్శకులతో పాటు అందరూ
ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా తెర వెనుక ఉండే దర్శకులు తెర మీదకు వచ్చి
దీన్ని చేయబోతున్నారు. దాన్ని సక్సెస్ చేయించడానికి అందరూ కృషి చేయాలి.
రెండు నెలల్లో ఇది జరగబోతోంది'' అనిడాక్టర్ దాసరి నారాయణరావు
చెప్పారు.ఆంధ్రప్రదేశ్ దర్శకల సంఘ సమావేశంలో సంఘం ప్రచురించిన ప్రత్యేక
కేలండర్ను ఆవిష్కరించిన ఆయన తొలి ప్రతిని మరో సీనియర్ డైరెక్టర్ కె.
రాఘవేంద్రరావుకు అందజేశారు. |
విశాల్ భరద్వాజ్ ‘దేఢ్ ఇష్కియా’లో మాధురి దీక్షిత్
విశాల్ భరద్వాజ్ చిత్రం ‘ఇష్కియా’కు సీక్వెల్గా రూపుదిద్దుకోనున్న చిత్రంలో
మాధురి దీక్షిత్ నటించనుందనే వార్త బాలీవుడ్లో షికారు చేస్తోంది. ‘దేఢ్ ఇష్కియా’
పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కూడా అభిషేక్ చౌబే దర్శకత్వం
వహించనున్నారు. చిత్రంలోని నటీనటుల విషయమై చౌబే మాట్లాడుతూ...
‘ఇష్కియా సీక్వెల్ ఇంకా స్క్రిప్ట్ తయారీ దశలోనే ఉంది. అయితే మాధురిని దృష్టిలో
ఉంచుకొని స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక నిర్మాణ సంస్థతో మాట్లాడి
నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మాధురిని సంప్రదిస్తాం. ఈ
విషయంలో ఎటువంటి కొత్త నిర్ణయం తీసుకున్నా వెంటనే అందరికీ తెలియజేస్తాన’ని
చెప్పారు. ఇక మాధురి మాట్లాడుతూ... ‘చిత్ర బృందం ఇంకా స్క్రిప్ట్ తయారీలోనే
బిజీగా ఉన్నట్లు తెలిసింది. ఇష్కియా సీక్వెల్లో నటించాల్సిందిగా నిర్మాణ సంస్థ
నుంచి కానీ, ప్రతినిధుల నుంచి కానీ, దర్శకుడి నుంచి కానీ ఎటువంటి సమాచారం
అందలేదు. వారు సంప్రదించాక నటించడంపై నిర్ణయం తీసుకుంటాన’ని చెప్పింది.
‘ఆజా నాచ్లే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన అమ్మడు పది సంవత్సరాల తర్వాత
ఇండియాకు వచ్చింది. పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడిన మాధురి ఇటీవలే
ఇండియాకు వచ్చింది. ఇక్కడే స్థిరపడనున్నట్లు ప్రకటించడంద్వారా బాలీవుడ్లో మళ్లీ
నటించేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పింది. పిల్లలిద్దరు బడికెళ్తున్నారని, కుటుంబం
ఇండియాలో ఇక పూర్తిగా స్థిరపడినట్లేనని, ప్రస్తుతం తాను సంతోషంగా, ప్రశాంతంగా
ఉన్నానని చెప్పింది. వివిధ వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ బిజీగా
ఉన్న మాధురి ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్ సినిమాలపై కేంద్రీకరించిందని, పెద్ద
నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వస్తే ఫుల్టైమ్ కేటాయించేందుకు కూడా రెడీగా
ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
|
రియాలిటీ కోసం అక్షయ్ తపించడం వల్లే ఈ ప్రమాదాలు
తెలుగులో విజయవంతమైన ‘విక్ర మార్కుడు’ చిత్రం ఆధారంగా హిందీలో ‘రౌడీ
రాథోడ్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అక్షయ్కుమార్ హీరోగా
నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు
సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరణ ముంబైలో జరిగింది. ఓ పాడుబడ్డ బిల్డింగ్పై నుంచి
దూకే యాక్షన్ సన్నివేశంలో అక్షయ్కుమార్ అదుపుతప్పి క్రింద పడటంతో ఆయన
భుజానికి తీవ్రంగా గాయమైందని చిత్ర వర్గాలు తెలియజేశాయి. గాయంలో కూడా
అక్షయ్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు షూటింగ్ను పూర్తిచేశాడట. మరుసటి రోజు నొప్పి
తీవ్రమవడంతో డాక్టర్ల సలహా మేరకు కొన్ని రోజులు షూటింగ్ను వాయిదా
వేసుకున్నాడు. దీంతో బెంగుళూరులో జరగాల్సిన ఈ సినిమా షూటింగ్ వారం
రోజులు వాయిదాపడిందని తెలిసింది. గతంలో కూడా ఇదే సినిమా చిత్రీకరణ
సమయంలో అక్షయ్కుమార్ రెండు సందర్భాల్లో గాయపడ్డాడు. స్టంట్మాస్టర్లను
ఉపయోగించకుండా రియాలిటీ కోసం అక్షయ్ తపించడం వల్లే ఈ ప్రమాదాలు
జరుగుతున్నాయని చిత్ర వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
|
లక్కీ గర్ల్ ఎవరంటే టక్కున చెప్పే పేరు అమలాపాల్
ప్రస్తుతం లక్కీ గర్ల్ ఎవరంటే టక్కున చెప్పే పేరు అమలాపాల్. ఈ మైనా ముద్దు
గుమ్మ ముంగిట తాజాగా మరో భారీ అవకాశం వాలినట్లు సమాచారం. అల్టిమేట్ స్టార్
అజిత్తో రొమాన్స్ చేయడానికి అమలాపాల్ సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్.
నిర్మాత ఏఎం.రత్నం సుదీర్ఘ విరామం తరువాత అజిత్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని
నిర్మించనున్నారు. ఈ చిత్రానికి బిల్లా ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నారు.
ఇందులో హీరోయిన్గా అనుష్కను ఎంపిక చేయాలని చిత్ర దర్శక నిర్మాతలు
భావించారు.ఆమె ఆసక్తి చూపినా కాల్షీట్స్ కేటాయించలేకపోయారని తెలిసింది.
ఆమె స్థానం లో అమలాపాల్ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దీనిపై దర్శకు
డు విష్ణువర్ధన్ను అడగ్గా ప్రస్తుతానికి అజిత్ మాత్రమే ఈ చిత్రానికి సంబంధించి
ఒప్పందంలో సంతకం చేశారని స్పష్టం చేశారు. హీరోయిన్, ఇతర తారాగణం,
సాంకేతిక వర్గం ఎవరనేది త్వరలో తేలిపోతుందన్నారు.తాజాగా అమలాపాల్ తన
స్వస్థలం కొచ్చీలో ఓ ఇల్లు కడుతోంది. 'డ్రీం హౌస్ కట్టకోవాలని ఎప్పటినుంచో ప్లాన్
చేస్తున్నాను. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. నా అభిరుచికి అనుగుణంగా ఆ
ఇల్లు నిర్మించుకుంటున్నాను' అని అమలా చెబుతోంది.
|
‘డమరుకం’ పై చాలా ఆశలే పెట్టుకుంది అనుష్క
గత సంవత్సరం అనుష్కకు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. టాలీవుడ్లో అసలు ఏ
చిత్రం చెయ్యలేదు. తమిళంలో మాత్రం ‘వానం’, ‘దైవతిరుమగల్’ చిత్రాలు ఆమెకు
నటనలో మంచి మార్కులు వేయించాయి. తమిళ విమర్శకులు సైతం అనుష్క
నటనకు నీరాజనాలు పలికారు. ఆ ఊపులోనే మరికొన్ని తమిళ చిత్రాల ఆఫర్లు
వెల్లువెత్తాయి. అయితే టాలీవుడ్లో మాత్రం అనుష్క పరిస్థితి అంతగా ఆశాజనకంగా
లేదు. ఈ సంవత్సరం మాత్రం నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో వస్తున్న
‘డమరుకం’ చిత్రంపై మంచి ఆశలే పెట్టుకుంది అనుష్క. ఈ చిత్రంలో అనుష్క పాత్ర
‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రంలో శ్రీదేవి పోషించిన దేవకన్యలాంటి పాత్ర
అంటున్నారంతా. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ కథానాయకుడుగా నటించబోయే ‘సారథి’
చిత్రంలో నటిస్తోంది. అయితే ఆ చిత్రానికి సారథి కేవలం వర్కింగ్ టైటిల్గానే
అనుకుంటున్నారంతా. ఈ రెండు చిత్రాలు ఇదే సంవత్సరంలో విడుదలయ్యే
అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుష్క ‘రంపచోడవరం’ అనే ఓ చారిత్రాత్మక
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది. అయితే ఈ సంవత్సరం
విడుదలయ్యే ‘డమరుకం’, ‘సారధి’ చిత్రాల ద్వారా మళ్లీ తన పాత వైభవం
చూపిస్తానంటోంది. ‘అరుంధతి’ చిత్రం తర్వాత అనుష్కకు బాలీవుడ్లో అవకాశం
‘సింగమ్’ ద్వారా వచ్చినా ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించింది. మళ్లీ
ఎందుకో అనుష్కకు బాలీవుడ్ అవకాశమే దక్కలేదు. ఈ సారి మాత్రం అవకాశం వస్తే
వదులుకోనని అంటోంది ఈ స్వీటీ
|
|
గుడ్న్యూస్ చెబుతానని కమల్ అంటున్నాడు
కమల్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ల్యాండ్ మార్క్ అనేట్టు
సినిమాను తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఎన్ని కోట్లయినా
వెనకాడరు... అనడానికి ఉదాహరణ 'మరుదనాయగం'. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్
అయిన ఈ సినిమా గురించి చర్చ తమిళ పరిశ్రమలో జరుగుతోంది. ఎందుకంటే
కమల్ ప్రస్తుతం తీస్తున్న 'విశ్వరూపం' సినిమా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కిస్తున్నాడు. ఈ సమయంలో ఆగిపోయిన 'మరుదనాయగం' సినిమాను పలు
సార్లు కమల్ గుర్తుచేసుకున్నాడట ! ఆ సినిమాను తీయాలనే ప్రయత్నం ఇంకా
పూర్తిగా ఆగిపోలేదని మీడియా ప్రస్తావిస్తే చెప్పారట. అంటే కమల్ మదిలో
'మరుదనాయగం' ఇంకా ఉంది.పదిహేనేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భారీ ప్రాజెక్ట్ విలువ
50 కోట్ల రూపాయలు. తన స్వీయ దర్శకత్వంలో కమల్ తెరకెక్కించా
లునుకున్నాడు. అందుకు తగ్గట్టే సినిమా ప్రారంభోత్సవాన్నీ అత్యంత భారీగా
జరిపాడు. సినిమా షూటింగ్ కొంత వరకు జరిగింది కూడా. అప్పట్లోనే ఆ సినిమాకి
ఏకంగా ఇరవై కోట్ల రూపాయలదాకా ఖర్చుపెట్టినప్పటికీ, మధ్యలోనే ఆగిపోయింది.
చాన్నాళ్లగా 'మరుదనాయగం' సినిమా గురించి కమల్ మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారట.
ప్రాజెక్ట్ గురించిన ప్రశ్నలు మాత్రం మీడియా నుంచి వెంటాడుతూనే ఉన్నాయి. అడపా
దడపా ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదు...అని చెబుతూ వస్తోన్న కమల్ తాజాగా ఓ
ఇంటర్వ్యూలో, 'మరుదనాయగం' సినిమా విషయమై ఈసారి సీరియస్గా
ఆలోచిస్తున్నాడట.ఇండియన్ సినిమా రేంజ్ పెరిగింది...హాలీవుడ్ స్థాయికి
వెళ్లింది..ఇదే మంచి టైం...'మరుదనాయగం' సినిమాకి ఆర్థికంగా అండదండలు
అందించేవారికోసం చూస్తున్నా... త్వరలోనే అందుకు సంబంధించిన గుడ్న్యూస్
చెబుతానని కమల్ అంటున్నాడు. ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 200 కోట్లకుపైగా
ఆ సినిమాకి బడ్జెట్ అవుతుందనేది ఓ అంచనా. ఇంత భారీ ప్రాజెక్ట్ను మార్కెట్ చేస్తే
తగిన రాబడి ఉంటుందా అని పలు సంస్థలు వెనకాముందు ఆలోచిస్తున్నాయి. పైగా
మన దక్షణాది మార్కెట్ ఎంత విస్తరించినప్పటికీ...దానికుండే పరిమితులు
దానికున్నాయిఉదాహరణగా...'యుగానికొక్కడు' సినిమానే చూపిస్తున్నారు.
దర్శకుడు సెల్వరాఘవన్ ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి,సంవత్సరాలపాటు
నిర్మాణం జరిపాడు. రెండు సంవత్సరాల అనంతరం పలుభాషల్లో విడుదల చేశారు.
కేవలం తెలుగులో మాత్రమే లాభాలు అందుకొని, మిగతా చోట్ల అనుకున్న సక్సెస్
పొందలేదు. దీంతో భారీ ప్రాజెక్ట్ అంటేనే పలు నిర్మాణ సంస్థలు వెనకడుగు
వేస్తున్నాయి.
|
ప్రియాంక దృష్టిలో షాహిద్ రియల్ హీరో అయ్యాడు
మాజీ ప్రియురాలు ప్రియాంకకోసం షాహిద్కపూర్ బాగానే రిస్క్ చేశాడట. ప్రియాంకను
చూడటానికి వచ్చిన వేల మంది అభిమానుల మధ్య ప్రియాంక ఉక్కిరిబిక్కిరి
కావడంతో షాహిద్ కల్పించుకుని సురక్షితంగా రక్షించాడట. వీరిద్దరూ కలిసి 'తేరీ మేరీ
కహానీ' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ఔరంగాబాద్లోని
దౌలతాబాద్ ఫోర్ట్లో జరిగింది. భారీ జనాల మధ్య షూటింగ్ జరపాలని దర్శకుడు
కునాల్ కొహ్లీ భావించాడట.దీంతో సెట్లోనే పదివేలకు మందికి పైగా ఉన్నారట. వీరికి
తోడు మరో ముప్పైవేల మంది షూటింగ్ స్పాట్కి టిక్కెట్టు చెల్లించి మరీ వచ్చారట.
తమ అభిమాన తార ప్రియాంక చోప్రాను దగ్గరగా చూడటానికి వారు పోటీలు పడ్డారట.
దీంతో ఒక్కసారిగా ప్రియాంక భయంతో వణికిపోయింది. దీనిని గమనించిన షాహిద్
వెంటనే ప్రియాంకను భారీ జనాల మధ్య నుంచి పక్కకు తీసుకురావడానికి
అష్టకష్టాలు పడ్డాడట. ఇందుకు ప్రైవేటు సెక్యూరిటీ, స్థానిక పోలీసులు
సహకరించడంతో ప్రియాంక సురక్షితంగా బయటపడిందట. ఇలా ఆమెను రక్షించి
ప్రియాంక దృష్టిలో షాహిద్ రియల్ హీరో అయ్యాడు
|
రజనీ తో యానిమేటెడ్ మూవీలో కత్రినాకైఫ్
సౌత్ సినిమాల్లో నటించనని, అంత తీరిక లేదని ఈ మధ్యే ఓ సందర్భంలో స్పష్టం
చేసిన బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్, ఇందుకు భిన్నంగా ఓ దక్షిణాది సినిమాకు కమిట్
అయ్యిందట ! అదీ రజనీకాంత్ కోసమేనట !రజనీకాంత్ ప్రధాన పాత్రలో
తెరకెక్కుతున్న 'కొచడియాన్' సినిమాలో కత్రినాకైఫ్ ఓ ఐటమ్ సాంగ్లో
కన్పించబోతోంది. యానిమేటెడ్ మూవీ కావడంతో...ఆమె పెద్దగా ఈ సినిమా కోసం
కష్టపడాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఆమె బాడీ లాంగ్వేజ్ని క్యాప్చర్ చేసి, టెక్నాలజీని
వాడుకుని..ఆమెలాంటి ఇమేజ్ని చేస్తారంతే.ఈ సినిమా కోసం రజనీకాంత్
హావబావాల్ని కూడా ఇలానే క్యాప్చర్ చేస్తారు. ఒకటీ అరా మూవ్మెంట్స్ మాత్రం
చేయాల్సి ఉంటుంది. రజినీ అయినా, కత్రినా అయినా చేయాల్సింది పెద్దగా ఇందులో
ఏమీ లేదు. అంతా క్యారెక్టర్ను డిజైన్ చేస్తున్న నిపుణులే చేస్తారు. వారి
సృజనాత్మకశైలే ఇక్కడ సినిమాను నిలబెడుతుంది. అయితే వారు చేసిన
పనితనాన్ని నలుగురికీ చూపాలంటే పెద్ద స్టార్ల అండ ఉండాల్సిందే కదా ! అందుకే
రజనీ, కత్రినాలను చేయమని రిక్వెస్ట్ చేశారట !తెలుగులో మల్లీశ్వరి, అల్లరిపిడుగు
వంటి చిత్రాల్లో నటించిన కత్రినాకైఫ్, ఇప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్
అవడం...బాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతూ సౌత్వైపు కత్రినాకైఫ్ చేసే పరిస్థితి లేదు.
అంతేగాక ఆమె అడిగే పారితోషికం భారీ లెవల్లో ఉంటుంది. అయితే తాము
చేయబోయే ఓ యానిమేటెడ్ మూవీలో చేయమని రజనీ అంతటివాడు అడిగేసరికి,
కత్రినా సంతోషంగా ఒప్పేసుకుందట
|
రాణీ ముఖర్జీకి మరోజాక్పాట్... బన్వరిదేవి ఎవరు?
‘నో వన్ కిల్డ్ జెసికా’ హిట్తో ఖుషీ ఖుషీగా ఉన్న రాణీ ముఖర్జీకి మరో జాక్పాట్
తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధూమ్ 3లో రాణి ముఖర్జీకి ఒక పాత్రను
అప్పగించాలని యశ్రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) అనుకుంటున్నట్లు వినిపిస్తోంది. ధూమ్
2లోని ఐశ్వర్యారాయ్ పాత్రకు ఇది దగ్గరగా ఉంటుందని సమాచారం. ‘3’లో
ఆమిర్ఖాన్ విలన్గా దుమ్ము రేపనుండగా, ఇతని ప్రియురాలిగా రాణి
అలరించనుంది. ఖాన్లందరిలో తాను ఆమిర్తోనే ఎక్కువ స్నేహంగా ఉంటానని రాణి
గతంలోనూ స్టేట్మెంట్ ఇచ్చింది. ధూమ్ 3 షూటింగ్ వచ్చే ఏడాది కాబట్టి ఈలోగా
రాణి తన దేహాన్ని ఆ పాత్రకు తగట్టు తీర్చిదిద్దుకునే వీలు చిక్కుతుంది. ‘వైఆర్ఎఫ్
ఇప్పటికే మూడు భారీ సినిమాలను ఆమిర్, సల్మాన్, షారుఖ్తో నిర్మిస్తోంది. వీటిలో
రెండు సినిమాల చిత్రీకరణ ఇది వరకే మొదలయింది. ధూమ్ 3లో కథానాయకి
పాత్రకు ఇంకా ఎవరూ ఎంపిక కాలేదు. రాణి కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతోంది.
త్వరలోనే ఆమెకు యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి ఆహ్వానం రావొచ్చు’ అని బాలీవుడ్
వర్గాలు వివరించాయి. ఆమిర్ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్చోప్రాలు
ధూమ్ 3లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతకుముందు ధూమ్ సినిమాలకు
కథ అందించిన విజయ్కృష్ణ మూడోదానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు.
బాలీవుడ్ సెక్స్ బాంబులు మల్లికా షెరావత్, బిపాసాబసు, విద్యాబాలన్లతో బాలీవుడ్
నిర్మాత మహేంద్ర దరివాల్ మంతనాలు జరుపుతున్నారట...అప్పట్లో సంచలనం
సృష్ట్టించిన నర్స్ బన్వరిదేవి హత్యపై, ఆమె జీవితంలోని ఆసక్తికర అంశాలపై సినిమా
తీసే ఆలోచనలో ఉన్నాడు ఈ నిర్మాత. ఈ చిత్రానికి ‘అజబ్ బన్వరికి గజబ్ కహాని’
అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇప్పటికే టైటిల్ రిజిస్టర్ చేయించారు. మరి
బన్వరిదేవి పాత్ర చేయడానికి ఈ ముగ్గురు భామల్లో ఎవరు ఒప్పుకుంటారనేది ఖరారు
కావాల్సి ఉంది. మహేంద్ర దరివాల్ గతంలో ‘మా తుజే సలాం’, ‘నహ్లె పె దెహ్లా’
చిత్రాలను నిర్మించారు. బిపాస ప్రస్తుతం ‘ప్రేయర్స్’, ‘జోడీ బ్రేకర్స్’, ‘రాజ్’ 3డి,
‘రేస్2’ చిత్రాల్లో నటిస్తోంది. డర్టీ పిక్చర్ ద్వారా ఇటీవలే భారీ విజయం సొంతం
చేసుకున్న విద్యాబాలన్ ప్రస్తుతం ‘కహాని’ అనే చిత్రంలో నటిస్తోంది. మార్చి 9న ఈ
చిత్రం విడుదల కానుంది. మల్లికా షెరావత్ వివేక్ ఒబెరాయ్తో జంటగా ‘కిస్మత్ లవ్
పైసా దిల్లి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు ఈ ముగ్గురు భామలలో హీరోయిన్
అవకాశం ఎవరికి లభిస్తుందో వేచి చూద్దాం...
|
ఇమ్రాన్ ఖాన్కు ఆంటీనేనని చెబుతోంది జుహీ చావ్లా
ఇమ్రాన్ ఖాన్కు తాను ఇప్పటికీ ఆంటీనేనని చెబుతోంది జుహీ చావ్లా. ఎందుకంటే
వీరిద్దరి మధ్య పరిచయం ఈనాటి కాదు. జుహీ, ఆమిర్ ఖాన్ నటించిన ఖయామత్
సే ఖయామత్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అతడు ఆరేళ్ల కుర్రాడు. ఈ షూటింగ్
సెట్పైనే జుహీ ఓసారి ఇమ్రాన్ బుగ్గలు గిల్లి ముద్దు చేసింది. ఈ ప్రస్తావన ఎందుకంటే
ఇమ్రాన్ ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. తన తాజా సినిమాలోని ఓ
పాటను జుహీకి అంకితం ఇస్తున్నాడు.' ఏక్ మై ఔర్ ఏక్ తూ'లోని ఆంటీజీ పాట
జుహీ కోసమేనని ప్రకటించాడు. తనకు ఈ పాట తెగనచ్చేసిందని జుహీ
మురిసిపోతోంది. ‘ఇమ్రాన్కు నేను ఇప్పటికీ ఆంటీజీనే! అతడు ఆరేళ్ల కుర్రాడిగా
ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. 'ఖయామత్' షూటింగ్ సమయంలో ఆమిర్ను
‘మామూ’ అని.. నన్ను ‘ఆంటీజీ’ అని పిలిచేవాడు. నన్ను ప్రేమిస్తున్నానని కూడా
ఓసారి చెప్పాడు. నేను నీకు ఆంటీజీని మాత్రమేనని చెప్పి పంపించాను’ అంటూ
జుహీ నవ్వేసింది. రాణి ముఖర్జీ సైతం తన తాజా సినిమా ‘అయ్యా’లోని ఒక పాటను
జుహీకి అంకితం ఇస్తోంది. ‘ఇటీవలే ఈ విషయం విన్నాను. నేను నటించిన' బోల్
రాధా బోల్'లోని ‘తు తు తు తారా’ పాటను తిరిగి స్వరపరుస్తోంది. ఆమె
అద్భుతంగా చేస్తుందన్న నమ్మకం ఉంది. పాత దానికంటే కొత్తది బాగుంటుంది’ అని
జుహీ నమ్మకంగా చెప్పింది. ఇద్దరికి తల్లి కూడా అయిన 44 ఏళ్ల జుహీ.. అజయ్
దేవ్గణ్ హీరోగా రూపొందుతున్న ‘సన్ ఆఫ్ సర్దార్’ షూటింగ్తో ప్రస్తుతం బిజీగా
ఉంది. ఆద్యంతం నవ్వించే మల్టీస్టారర్ సినిమా ఇదని చెప్పింది. గత ఏడాది
విడుదలైన 'జిందగీ నా మిలే దోబారా' చాలా బాగుందని ప్రశంసించింది.
|
|
'బిగ్బాస్-5' విజేత జుహి పర్మార్ ... మధుశాలిని సిగరెట్ల బాధ
వివాదాస్పద రియాలిటీ షో ' బిగ్బాస్'లో మరో సీసన్ ముగిసింది.14 వారాలపాటు కొనసాగిన 'బిగ్బాస్-5 ' కార్యక్రమంలో ప్రముఖ టీవీ నటి
జుహి పర్మార్ విజేతగా నిలిచారు. విజేతగా నిలిచిన పర్మార్కు కోటిరూపాయల నజరానా దక్కింది. 13 మంది మహిళలు, ఒక పురుష అభ్యర్థితో
మొదలైన ఈ ప్రోగ్రాంలో చివరకు జుహి పర్మార్ విజేతగా నిలిచారు. విజేతగా నిలిచినందుకు పర్మార్ సంతోషం వ్యక్తం చేసింది. సామాజిక
ఉద్యమవేత్త స్వామి అగ్నివేశ్, బాలీవుడ్ దర్శకుడు మహేశ్భట్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూసైమండ్స్ తదితర ప్రముఖులు 14 వారాల
ఈధారావాహికంలో గెస్టులుగా పాల్గొన్న సంగతి తెలిసిందే.
తెలుగు, ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో సెకండ్ గ్రేడ్ హీరోయిన్గా వెలుగొందుతున్న మధుశాలిని ‘కితకితలు’ చిత్రంలో నరేష్తో కలిసి నటించింది.
ఆ తర్వాత అంతగా గుర్తింపులేని పాత్రలలో నటించిన మధుశాలినికి అవకాశం అనుకోకుండా బాలీవుడ్ రూపంలో తట్టింది.దర్శకుడు రాంగోపాల్
వర్మ తాను బాలీవుడ్లో రూపొందిస్తున్న ‘డిపార్ట్మెంట్’ చిత్రంలో మధుశాలిని గ్యాంగ్స్టర్ పాత్రను పోషిస్తోంది. రౌడీ లేడీ ఆటిట్యూడ్తో సిగరెట్లు
తాగుతూ కనిపిస్తుంది మధుశాలిని. సినిమా షూటింగులో భాగంగా రోజుకు 20 సిగరెట్లు ఆమెతో తాగిస్తున్నాడట దర్శకుడు రాంగోపాల్వర్మ. ఈ
విషయమై మధుశాలిని మాట్లాడుతూ-..‘సిగరెట్ కంపు అంటే నాకు అస్సలు పడదు, కానీ షూటింగ్ సమయంలో పాత్ర డిమాండ్ మేరకు దాదాపు
20 సిగరెట్ల వరకు తాగాల్సి వస్తోంది. నటించడం కంటే ఇలా సిగరెట్లు తాగడమే చాలా కష్టంగా ఉంది’ అంటోంది మధుశాలిని. రామ్గోపాల్వర్మకు,
తనకు మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలను మధుశాలిని ఖడించారు. మా ప్రొఫెషన్లో భాగంగా సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఇలా ఎఫైర్
అంటగడతారా? అంటూ మండి పడుతోంది. ‘డిపార్టుమెంట్’ చిత్రంలో మధు శాలినితో పాటు, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి ముఖ్య పాత్రల్లో
కనిపించబోతున్నారు. సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు |
రాఖీ, సన్నీ లియోన్ల కార్యక్రమాలు చిరాకు పెట్టాయంట
చానల్ వీక్షకులు టీవీ తెరపై ఎవరిని చూడగానే చిర్రెత్తి పోతున్నారో తెలుసా?.. ఏ కార్యక్రమం చూడాలంటే ఇబ్బంది పడిపోతున్నారో చెప్పగలరా?..
ఈ ప్రశ్నకు మనమెందుకు, బీసీసీసీ ( బ్రాడ్కాస్ట్ కంటెంట్ కంప్లయింట్స్ కౌన్సిల్)కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులే సమాధానం చెబుతున్నాయి. ఈ
స్వీయ చానల్ నియంత్రణ మండలికి ఐటం బాంబ్ రాఖీ సావంత్ నిర్వహిస్తున్న కార్యక్రమంపైనే ఎక్కువగా ఫిర్యాదు అందాయట. చానల్స్ ప్రసారం
చేస్తున్న కార్యక్రమాలపై టీవీ వీక్షకుల ఫిర్యాదులను, అభ్యంతరాలను తెలుసుకునేందుకు గత ఏడాది జూన్లో ఈ మండలి ఏర్పడింది. ఇప్పటిదాకా
3,441 ఫిర్యాదులు బీసీసీసీకి అందాయి. రాఖీ, సన్నీ లియోన్లతో చేస్తున్న కార్యక్రమాలు చిరాకు పెట్టాయంటూ ఎక్కువమంది గోడు
వెళ్లబోసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. తమకు అందించిన మొత్తం 3,441 ఫిర్యాదుల్లో 1,883 దాకా సూచనలు ఇవ్వడానికి
పరిమితమయ్యాయట. వీటి విషయంలో తాము ఏమీ చేయలేమని సదరు ఫిర్యాదుదారులకు స్పష్టం చేసినట్టు ఈ వర్గాలు చెప్పాయి. 479
ఫిర్యాదులు మాత్రం సూటిగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయగలిగాయని, వాటిని పరిశీలనకు తీసుకొని తగిన చర్య తీసుకున్నట్టు
వివరించాయి.ఇమేజేస్ చానల్లో ప్రసారమవుతున్న రాఖీ 'గజబ్ దేశ్ కి అజబ్ కహానియా'ని 58 మంది తప్పుబట్టారు. కార్యక్రమం ఉద్దేశం కూడా
చెత్తగాఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రాఖీ తరువాత స్థానం అశ్లీల తార సన్నీ లియోన్ దక్కించుకుంది. కలర్స్ చానల్లో
ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ 5'లో లియోన్ అశ్లీల చేష్టలు, వ్యాఖ్యలను 36 మంది తప్పుబట్టారు. పిల్లల మనస్సుల్లో విష బీజాలు నాటే విధంగా
ఆ కార్యక్రమం ఉన్నదని మండిపడ్డారు. దీనిపై బీసీసీసీ పెద్దలు కూడా లియోన్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
|
తమన్నా సమస్య తీరింది ...నమిత ప్రేమలో పడింది
ఎట్టకేలకు మిల్కీ బ్యూటీ తమన్నా కాల్షీట్ల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఆమె కాల్షీట్లు సరిగా సర్దుబాటు కాకపోవడంతో తెలుగులో మూడు పెద్ద
సినిమాలు ఇబ్బందుల్లో పడ్డాయి. అవి రాంచరణ్ 'రచ్చ', ప్రభాస్ 'రెబల్', రాం 'ఎందుకంటే ప్రేమంట'. ఈ సినిమాల నిర్మాతలు తన మీద నిర్మాతల
మండలికి ఫిర్యాదు చేయడంతో పలుసార్లు మండలి ముందు హాజరైంది తమన్నా.ఈ సందర్భంగా- తను కావాలని ఆయా నిర్మాతలకు
ఇబ్బందులు కలిగించడం లేదనీ, ఆ ఉద్దేశం తనకు లేదనీ తెలిపిన తమన్నా తన కాల్షీట్ల డైరీని కూడా ఇటు నిర్మాతల మండలికీ, అటు 'మా'కీ
చూపించింది. ఆ డైరీని పరిశీలించిన నిర్మాతల మండలి, 'మా' రెండూ సంతృప్తిచెందాయి. ఆమె కాల్షీట్లను ఎలా సర్దుబాటు చేసుకోవాలో
పరిష్కరించుకొమ్మని ముగ్గురు నిర్మాతలకూ తెలిపాయి.దీంతో తన పనిమీద కాన్సన్ ట్రేట్ చేసుకొనే వెసులుబాటు కలిగింది తమన్నాకి. అయితే
మునుముందయినా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీదుంది.
బొద్దుగుమ్మ నమిత అభిమానులు త్వరలో ఓ శుభవార్త విననున్నారు! ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. నమిత ఇటీవల ఓ
యువ లాయర్తో ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం ఈ జంట డేటింగులో ఉన్నారని చెనై్న మీడియా కోడై కూస్తోంది. ముంబైలో విలువైన స్థిరాస్త్తుల
కొనుగోళ్ల వ్యవహారంలో నమితకు ఈ యువలాయర్ సాయం చేసేవారని, ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం..ప్రేమగా మారిందని తెలుస్తోంది.
అతడిలోని స్నేహస్వభావానికి బొద్దు సుందరి మనసు పారేసుకుందని ప్రచారం సాగుతోంది.
|
త్వరలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పవన్కళ్యాణ్
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పవన్కళ్యాణ్ నటించనున్నారా...అవుననే అంటోంది ఇండస్ట్రీ. ఈ మేరకు టాక్స్ జరగాయని, పవన్ ఓ స్టోరీ లైన్ ఓకే
చేసాడని చెప్తున్నారు. పూరి కెరీర్ ప్రారంభంలో ‘బద్రీ’ చిత్రాన్ని పవన్తో చేసారు. మళ్లీ అప్పటినుంచీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. మళ్లీ
ఇన్నాళ్లకు పవన్ ,పూరిలను నిర్మాత డివివి దానయ్య కలుపుతూ సినిమా చేస్తున్నారని సమాచారం. ఇక హీరోయిన్గా అనీల్కపూర్ కూతురు
సోనమ్కపూర్ నటించనుందని చెప్పుకుంటున్నారు.తన తదుపరి చిత్రంలో కొత్త గ్లామరస్ అమ్మాయిని తీసుకోవాలని పవన్ సూచించటంతో, సోనం
కపూర్ను ఎంపిక చేశారని తెలుస్తోంది. హిందీలో కెరీర్ అంతంత మాత్రంగానే ఉండటంతో సోనం ఈమధ్య సౌత్ మీద కన్నేసిందని, ఈ ఆఫర్
రావడంతో వెంటనే ఒప్పేసుకుందని సమాచారం. ప్రస్తుతం పవన్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్లో బిజిగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో
రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే పూరి దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన ‘బిజినెస్మేన్’ చిత్రం
విడుదలకు సిద్దంగా ఉంది. ఇక పూరి,పవన్ కాంబినేషన్ సినిమా అంటే ఓ రేంజి అంచనాలు ఉంటాయి. మరి ఈ సారి పవన్ని ఏ విధంగా
చూపెట్టబోతున్నాడో అని అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూడటంతో ఇది కూడా ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టుగా తయారయింది
|
ప్రియుడు సమూలంగా మార్చేసాడంటున్న పాయల్ రోహత్గీ
తన ప్రియుడు అందరిలాంటి సాదాసీదా మనిషి కాదని వివాదాస్పద తారామణి పాయల్ రోహత్గీ అంటోంది. తన వ్యక్తిత్వాన్ని సమూలంగా మార్చేసి
మంచి మనిషిగా తీర్చిదిద్దిన మనిషని చెప్పింది. పాయల్, ఈమె కొత్త ప్రియుడు సంగ్రామ్ సింగ్ వాలెంటైన్స్ నైట్ అనే సినిమాలోనూ
నటిస్తున్నారు. దర్శకుడు దిబాకర్ బెనర్జీ తనను లైంగికంగా వేధించాడంటూ గత ఏడాది పాయల్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
‘వివాదాలను పట్టించుకోకుండా సానుకూల దృక్పథంతో జీవించాలని నేను గ్రహించాను. నా జీవితంలో లభించిన అత్యుత్తమమైన వాటిలో సంగ్రామ్
ఒకడు. నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి. నా వ్యక్తిత్వాన్ని సమూలంగా తీర్చిదిద్దాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మా భవిష్యత్ను
అందంగా మలచుకుంటాం’ అని ఈ 39 ఏళ్ల నటి చెప్పింది. సామాజిక సంబంధాల సైట్ల కారణంగా ఏర్పడే ప్రేమాయణాల కథతో 'వాలెంటైన్స్ నైట్'
రూపుదిద్దుకుంటోంది. సంగ్రామ్ తన ప్రియుడేగాక మంచి నటుడని, ఈ సినిమా షూటింగ్ ఢిల్లీ, నోయిడాలో జరిగిందని వివరించింది. వాలెంటైన్స్
నైట్.. ప్రేమికుల దినమైన ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. బిగ్బాస్ రియాలిటీ షోలో రాహుల్ మహాజన్తో బాగా సన్నిహితంగా మెలిగిన పాయల్
అప్పుడు కూడా వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది. ఆ విషయాన్ని మీడియా పెద్దది చేసి చూపి, వివాదంగా మార్చివేసిందని మండిపడింది. ఇప్పుడు
ఇలాంటి విషయాలు తనను పెద్దగా బాధపెట్టడం లేదని చెప్పింది. మూడేళ్లుగా టీవీ తెరకు దూరంగా ఉన్న పాయల్.. త్వరలో స్టార్ప్లస్ చానల్లో
ప్రసారమయ్యే 'సర్వైవర్ ఇండియా'లో సందడి చేయనుంది. ఈ షోకు ప్రేక్షకుల ఎస్ఎంఎస్లు, వైల్డ్కార్డ్ ఎంట్రీలతో సంబంధం ఉండదు కాబట్టే దీనిని
ఎంచుకున్నానని చెప్పింది. అంతేకాదు ఇందులో పాయల్ మేకప్ లేకుండా నటిస్తుంది. ఎలాంటి సదుపాయాలు లేని ద్వీపంలో 21 మంది
పోటీదారులతో కలిసి మనుగడ సాగించడం ఈ షో ప్రధానాంశం
|
|
సంగీత దర్శకులు, గాయనీ, గాయకులకు 'జర్నీ' ప్రత్యేక షో
శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలుగా నటించిన 'జర్నీ' చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుంది. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్నాన్ని
తెలుగులో ఎస్ కె పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండొటి నిర్మించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో సంగీత దర్శకులతో పాటు గాయనీ, గాయకులకు
ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. ఆర్పీ పట్నాయక్, గజల్ శ్రీనివాస్, టాలీవుడ్ సింగర్స్ సమక్షంలో 25 రోజుల కేక్ ను కట్ చేసి వేడుకను వైభవంగా
జరుపుకున్నారు.ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.-.జర్నీ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ సంగీత దర్శకులు, గాయనీ
గాయకుల మధ్య జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇది 25 రోజుల సినిమా కాదు నూరు శాతం 225 రోజులు ఆడే సినిమా. ఖచ్చితంగా మీ
అందరికి నచ్చింది. చూడనివారు చూస్తే తప్పకుండా నచ్చుతుంది. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా గాయనీ,
గాయకులు, సంగీత దర్శకులు జర్నీ సినిమాపై తమ అనుభూతిని తెలియచేశారు.
|
జెనీలియా - సమంత రీసెంట్గా ఇలా ట్వీట్ చేసారు
జెనీలియా తాను చేస్తున్న ‘నా ఇష్టం’ చిత్రం దర్శకుడు ప్రకాష్ తోలేటిపై ఆమె పొగడ్తల వర్షం కురిపిస్తూ రీసెంట్గా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో .. ‘ప్రకాష్ అనే
టాలెంటెడ్ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను చాలా డెడికేటెడ్..అతని సినిమా అద్భుతంగా వస్తోంది. ఆయన సినిమాలో పనిచేయటం
అదృష్టంగా భావిస్తున్నాను’ అంది. ఇలా ట్వీట్ చేయటం ద్వారా ఈ చిత్రం కొద్ది మంది దృష్ట్టినైనా గ్యారెంటీగా ఆకర్షిస్తుందని ఆమె భావించి ఈ ట్వీట్ చేసిందం
టున్నారు. ఇక సుకుమార్ అసోసియేట్ అయిన ప్రకాష్ తోలేటి ఈ చిత్రాన్ని ఓ అద్బుతం జరగాలి అన్నట్లుగా చెక్కుతున్నాడని, గ్యారెంటీగా ఈ చిత్రం
బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు.ఈ చిత్రంలో దగ్గుపాటి రానా హీరోగా చేస్తున్నా డు. కాగా ‘దూకుడు’ చిత్రంతో పెద్ద
హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకున్న సమంత ఈ మధ్య కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తోందని తెగ ఫీలవుతూ ట్వీట్ చేసింది. ‘స్టార్డమ్
వచ్చాక ఏ హీరోయిన్కి అయినా ఇలాంటి పరిస్థితి తప్పనిసరి. ప్రస్తుతం నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను. వదులుకుంటున్న అవకా శాలపైనే నా టెన్షన్
అంతా. నేను వదిలేసిన సినిమా- మరో హీరోయిన్ చేసి, ఆ సినిమా ఊహించని విజయం సాధిస్తే ఇక ఆ బాధ వర్ణనాతీతం. కానీ తప్ప డంలేదు’ అంటోంది
సమంత
|
ఆకట్టుకున్న బిప్స్ బికిని... బెల్లంకొండ దక్కించుకున్న“వేట్టై”
అబ్బాస్- మస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్లేయర్స్’ పూర్తిస్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2003లో విడుదలైన
అమెరికన్ చిత్రం ‘ది ఇటాలియన్ జాబ్’కి రీమేక్ ఇది. బిపాసా బసు, అభిషేక్బచ్చన్, బాబీ డియోల్, సోనమ్కపూర్, నెయిల్ నితిన్ ముఖేష్, ఓమి విద్యా తదితరులు నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో నల్లకలువ బిపాసా ధరించిన బికినీ..ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ధూమ్2’ తర్వాత చాలా కాలం బికినీకి నేను దూరం అంటూ వచ్చిన బిప్స్..ఈ సినిమా కోసం నిబంధనలు సడలించింది. ఎర ఎర్రని బికినీలో కుర్రకారును తెగ వెర్రెత్తిస్తోంది.
“వేట్టై” చిత్ర తెలుగు విడుదల హక్కులను బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. 2011 లో “కాంచన” మరియు “కందిరీగ” వంటి విజయాలతో ఉన్న
బెల్లంకొండ సురేష్ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వం లో ఆర్య,మాధవన్,సమీర రెడ్డి మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని
సొంతం చేసుకున్నారు.. ఈ చిత్రం మీద భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలయిన ప్రచార చిత్రాలలో అమలా పాల్ మరియు సమీర రెడ్డి లు
ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం లో ఒకానొక సన్నివేశం కోసం సమీర రెడ్డి గాయపడింది. తెలుగు హక్కులు మంచి ధర పలికింది అని వర్గాలు
తెలుపుతున్నాయి. బెల్లంకొండ సురేష్ నిర్మాణం లో “బాడీ గార్డ్” విడుదలకు సిద్దమయ్యింది.
|
నాలుగు కోట్ల భారీ మొత్తానికి సన్నీ లియాన్ ఒకే
'బిగ్ బాస్-5' రియాల్టీ షో ద్వారా పేరు తెచ్చుకున్న ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియాన్ బాలీవుడ్లో పాగా వేసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు
చేస్తోంది. అలా అని ఎంతకంటే అంతకు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేదంటే సన్నీ కాన్ఫిడెన్స్ ఏంటో ఆమెకు లేదా ఆమె వీరాభిమానులకే తెలియాలి. బి
గ్రేడ్ సెక్స్ మూవీస్ తీసే నిర్మాతలు ఆమె ముందు క్యూ కడుతున్నారు. తాజాగా ఆమె' జిస్మ్-2 'సినిమాలో నటించడానికి నాలుగు కోట్ల భారీ మొత్తానికి
ఒకే చెప్పేసిందట ఈ పోర్న్ తార.బిగ్ బాస్ కోసం ఇండియా వచ్చిన ఈమె మూడు సినిమాలకు ఓకే చేసుకుని తన సొంత దేశానికి పయనమయ్యింది.
మళ్ళీ ఈ సినిమా షూటింగ్ కోసం ఇండియాకు రానుంది. ‘జిస్మ్- 2’ సినిమా 2003 లో వచ్చిన జాన్ అబ్రహాం, బిపాసాబసు సినిమాకు సీక్వెల్. ఆ
చిత్రంలోని హాట్ సన్నివేశాలను మించి ఈ తాజా సీక్వెల్లో హాట్హాట్గా రూపొందించనున్నట్లు సమాచారం. సన్నీలియాన్ గతంలో తనకు కండలవీరుడు
సల్మాన్ఖాన్ అంటే బాగా ఇష్టం అని స్టేట్మెంట్ ఇచ్చి ఊదరగొట్టేసింది
|
పోలీసు వార్షిక వేడుకల్లో స్పృహతప్పిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ మరియు ప్రస్తుత తరం హీరోయిన్లలో బిజీ షెడ్యుల్ తో ఉండే ప్రియాంక చోప్రా స్పృహతప్పి పడిపోయారు. ఇటీవల ముంబైలో జరిగిన
పోలీసు వార్షిక వేడుకల్లో ప్రియాంక చోప్రా ప్రదర్శన ఉండగా ఆమె మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన నిర్వాహకులు
వెంటనే ఆమె పర్సనల్ వ్యాన్ కి తరలించి చికిత్స చేసారు.రక్తపోటు పడిపోవడం వల్ల ఆమె అనారోగ్యానికి గురైనట్లు డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి
పీల్చుకున్నారు. భారీ బిజీ షెడ్యుల్ మరియు సమయానికి తగ్గట్లు సరైన ఆహరం తీసుకోకపోవడం వలన ,విశ్రాంతి లేకపోవడం వల్ల తారలు ఇలా
అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ప్రియాంక చోప్రా 2009 లో అశోతోష్ గోవారికర్ డైరెక్షన్లో వచ్చిన ‘వాట్స్ యువర్ రాశీ’ చిత్ర షూటింగ్
సమయంలో కూడా ఇలాగె స్పృహ తప్పి పడిపోయారు. ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.
|
|
2014లో బాలయ్య రాజకీయ ఆరంగేట్రం.. ఆ ఫై మోక్షజ్ఞ తెరంగేట్రం
బాలయ్య తొడగొట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు సై అన్నారు. 'ఎనీ సెంటర్.. రెడీ' అని చెప్పారు. 2014లో తన రాజకీయ ఆరంగేట్రం.. మరో
రెండేళ్లకు తన కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటాయని ప్రకటించారు. కోస్తా.. రాయలసీమ.. తెలంగాణలలో ఎక్క డినుంచైనా పోటీచేస్తానని,
అదే సమయంలో పార్టీ ప్రచార బాధ్యతను కూడా చేపడతానని చెప్పారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం బాలకృష్ణ
విజయవాడ వచ్చారు. అతి త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తానని
చెప్పారు. తమ కుటుం బం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని.. రాకూడదని ఎవరిపైనా ఒత్తిడి చేసేదిలేదని స్పష్టం
చేశారు. టీడీపీ ఒక్కటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమని, ప్రజలు కూడా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ విషయంలో పార్టీ వైఖరే తన వైఖరని చెప్పారు. |
ఘనంగా నాగిరెడ్డి శతజయంతి ఉత్సవాలు
వినోదానికి పెద్ద పీట వేస్తూ, జనరంజకమైన చిత్రాల్లో విజయా సంస్థది అగ్రస్థానం. ఆ చిత్రాల విజయం వెనుక ఉన్న సంస్థ అధినేతలు నాగిరెడ్డి
వ్యవహారదక్షత, చక్రపాణి ప్రతిభ గురించి ప్రశంసించనివారూండరు. తెలుగుతో పాటు తమిళంలో కూడా చిత్రాలు నిర్మించి రెండు భాషల్లోనూ
అజరామరమైన కీర్తిని సంపాదించుకుంది విజయా సంస్థ. ముఖ్యంగా 'విజయ' పథికుడు బి.నాగిరెడ్డి భారతీయ చలన చిత్రపరిశ్రమకు
అందించిన సేవలు, పేదవారిని ఆదుకోవడానికి చేపట్టిన చర్చలు మరువలేనివి. అందుకే ఆయన శత జయంతి సందర్బంగా విజయ మెడికల్ ,
ఎడ్యుకేషనల్ ట్రస్ట్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది.ఇందులో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో తయారైన
వినోదభరిత చిత్రాలను ఎంపిక చేసి, బి.నాగిరెడ్డి మెమోరియల్ అవార్డ్తో సత్కరించాలని ట్రస్ట్ నిర్ణయించింది. గత ఏడాది విడుదలైన చిత్రాల
నిర్మాతల నుంచి ఎంట్రీలు కోరుతూ, ఫిబ్రవరి 15 లోగా వాటిని పంపించాలని ట్రస్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది. తెలుగు, తమిళ భాషలకు చెందిన
ప్రముఖ నటులు, దర్శకులతో కూడిన ఓ కమిటీ వినోదాత్మక చిత్రాన్ని ఎంపిక చేస్తుందని ట్రస్ట్ పేర్కొంది. ఏప్రిల్ 7న హైదరాబాద్లో, మే ఒకటిన
చెన్నయ్లో అవార్డ్ ఫంక్షన్ జరుగుతుందని తెలిపింది
|
‘బ్యాడ్బాయ్’ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి
'బిగ్బాస్ 5 'నుంచి ఇటీవలే బయటికి వచ్చేసిన పూజాబేడీ ఈ షో గెస్ట్ సల్లూభాయ్ పేరెత్తితేనే మండిపడుతోంది. శనివారం జరగాల్సిన బిగ్బాస్
5 గ్రాండ్ ఫినాలే వేడుకలకు బేడీని అనుమతించకపోవడంతో ఈమె కోపం కట్టలు తెంచుకుంది. బిగ్బాస్లో కుట్రలు జరుగుతున్నాయంటూ తన
బాధలను ట్విటర్లో ఏకరువు పెట్టింది. ‘బ్యాడ్బాయ్’ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని మొత్తుకుంది. ‘బిగ్బాస్ పోటీదారులను
సల్మాన్ బెదిరించడం సరైంది కాదు. మహెక్ చహల్ గెలుపు కోసం ఇతరులను నిరాశకు గురిచేస్తున్నాడు’ అని చెప్పింది. మహెక్ మాత్రం ఈ
ఆరోపణలపై గతంలోనే వివరణ ఇచ్చింది. గతంలో తాను ఆయన సినిమాల్లో నటించినందు వల్ల సల్మాన్తో తనకు పరిచయం ఉందని
అంగీకరించింది. అంతమాత్రాన ఆయన తనకు సహాయం చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. పూజ మాత్రం ఆమె వాదనను నమ్మడం
లేదు. గ్రాండ్ ఫినాలేకు రాకుండా తనను ఎందుకు అడ్డుకున్నావంటూ సల్మాన్ సెల్కు ఎస్ఎంఎస్ పంపింది. అయితే సల్లూభాయ్ నుంచి
ప్రతిస్పందన రాలేదట. తనపై నిషేధానికి నువ్వే కారణమని కూడా సల్మాన్కు పూజ స్పష్టంగా చెప్పింది. ‘గ్రాండ్ ఫినాలేకు ఎవరిని
ఆహ్వానించాలన్నది చానల్కు సంబంధించిన సంగతి. సల్మాన్ ఎప్పుడూ బిజీగా ఉండే మనిషి. అతనికి ఎన్నో పనులుంటాయి.
గ్రాండ్ ఫినాలేకు రావడానికి పూజకు అనుమతి నిరాకరించిన విషయం కూడా సల్మాన్కు తెలియకపోవచ్చు. పూజాబేడీనో.. పూజామిశ్రానో
రానంత మాత్రాన అతనికి వచ్చే నష్టమేమీ ఉండదు’ అని కలర్స్ చానల్స్ వర్గాలు పేర్కొన్నాయి.
|
ఆ సినిమాలో గ్లామర్ డోస్ పెరిగిన మాట నిజం
‘మొగుడు’ సినిమాతో ‘బికినీ’ భామగా పేరు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్. దానికి తగ్గట్టుగా ఈ ముద్దుగుమ్మపై మీడియాలో ఓ వింత గాసిప్
షికారు చేస్తోంది. తాను నటించే ప్రతి సినిమాలో బికినీ సన్నివేశం ఉండేలా శ్రద్ధాదాస్ చూసుకుంటున్నారని, దర్శక, నిర్మాతలను అడిగిమరీ
బికినీ సన్నివేశంలో నటిస్తున్నారని ఆ గాసిప్ సారాంశం. ఈ విషయాన్ని శ్రద్ధ ముందు ప్రస్తావిస్తే -‘‘ఇంతకు మించిన కామెడీ మరొకటి
ఉండదు. అనవసరంగా అలాంటి సన్నివేశం చొప్పించడానికి దర్శక, నిర్మాతలు పిచ్చివాళ్లా? స్కిన్ షో మూలంగా అవకాశాలు పెరుగుతాయని
భావించే పిచ్చిదాన్ని కాదు నేను. ‘మొగుడు’లో గ్లామర్ డోస్ పెరిగిన మాట నిజం. ఆ సినిమాలో నా పాత్ర తీరుతెన్నులు బట్టి నేను
నడుచుకున్నాను. అలాగే దర్శకుడు చెప్పినట్టు చేయడం నటిగా నా బాధ్యత. అందుకే అలా నటించాను. అంతేకానీ కావాలని చేసింది కాదు.ప్ర
స్తుతం నేను చేస్తుంది రెండు సినిమాలు. అందులో ఒకటి వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రేయ్’, రెండోది శివకుమార్
దర్శకత్వంలో కన్నడంలో ‘హోసా ప్రేమ పురాణా’. ఈ రెండు సినిమాలకు సంబంధించిన దర్శక, నిర్మాతలను అడగండి. ఈ గాసిప్పులో ఎంత
నిజం ఉందో వాళ్లే చెబుతారు’’ అంటూ చిర్రుబుర్రు లాడారు
|
రాణా కు రామ్ చరణ్ , త్రిషలు ‘ 3 ఏ.ఎమ్. ఫ్రెండ్స్’
‘3 ఏ.ఎమ్. ఫ్రెండ్’...ఇదేదో వెరైటీ సినిమా టైటిల్ అనుకుంటే పొరపడినట్లే! ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యువ నాయకానాయికలు
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో, ఇంటర్వూల్లో తరచుగా ఉపయోగిస్తున్న సరికొత్త పదమిది. వివరాల్లోకి వెళితే... అందాల నాయిక త్రిష యువ
హీరో రానాతో చాలా సన్నిహితంగా మెదలుతోందని, వారిద్దరి మధ్య ‘ఏదో’ వుందని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ
ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో- త్రిష ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించగా- అవన్నీ అర్థం లేని రూమర్లని కొట్టిపారేసింది. ‘రానాతో
నాకు పది సంవత్సరాలుగా చక్కటి సాన్నిహిత్యముంది. అతను నాకు 3 ఏ.ఎమ్ ఫ్రెండ్’ అని చెప్పింది. ఆ ఇంటర్య్వూను చదివిన
పాఠకులందరూ ఇంతకీ 3 ఏ.ఎమ్. ఫ్రెండ్ అంటే? ఏమిటని ఆశ్యర్యం వెలిబుచ్చారట. ఇదిలా వుండగా రానా సైతం ఓ ఆంగ్ల పక్ష పత్రికకు
ఇచ్చిన ఇంటర్య్వూలో- ‘రామ్ చరణ్ నాకు 3 ఏ.ఎమ్. ఫ్రెండ్’ అని చెప్పాడు. అంతేకాదు ‘నువ్వునాకు 3ఏ.ఎమ్ఫెండ్...అర్ధమయిందా?’
అంటూ రామ్చరణ్ను ఉద్దేశించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సరికొత్త సాంకేతిక పదం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్టాపిక్గా మారింది.
|
|
ఫిట్నెస్లో పూర్వ స్థితికి సూపర్స్టార్ రజనీకాంత్
నటించడానికి తాను సిద్ధం అంటున్నారు సూపర్స్టార్ రజనీకాంత్. తన అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామాని తహతహ
లాడుతున్న రజని అభిమానులకు ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. గత ఏడాది ఏప్రిల్ 29న అనారోగ్యానికి గురైన రజనీకాంత్
సింగపూరులో చికిత్స అనంతరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నటించే రాణా చిత్రం సెప్టెంబర్లో ప్రారంభం అవుతుంది.
నవంబర్ మొదలవుతుందంటూ రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. చివరికి ఆ చిత్రం తెరకెక్కుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ముందుగా రజనీకాంత్ తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో కొచ్చడయాన్ చిత్రం చేయడానికి ముందుకొచ్చారు. కె ఎస్ రవికుమార్ క థ,
దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఫిట్నెస్లో పూర్వ స్థితికి చేరుకున్న సూపర్స్టార్ ఇప్పుడు ముఖానికి రంగేసుకోవడానికి
రెడీ అంటుండడంతో' కొచ్చడయాన్' చిత్ర నిర్మాణానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రజనీకాంత్తో జత కట్టే లక్కీ
హీరోయిన్ ఎవరనేది వెల్లడించకపోయినా ఆయన చెల్లెలిగా ముఖ్యపాత్రలో నటి స్నేహ నటించడానికి సమ్మతించారు. ఏఆర్ రెహ్మాన్ బాణీలు
కడుతున్నారు. వచ్చే నెల కొచ్చడయాన్ 3డీ యానిమేషన్ చిత్ర షూటింగ్ ముహూర్తం నిర్ణయమైనట్లు రజనీ సన్నిహిత వర్గాల సమాచారం.
|
రవితేజ ‘దరువు’లో ఐదు రకాల షేడ్స్ ఉంటాయి
రవితేజకు ‘మాస్ మహారాజా’ అనే పేరు ఉంది. దానికి తగ్గట్టుగా ‘శౌర్యం’ దర్శకుడు శివ... రవితేజతో చేస్తున్న చిత్రానికి ‘దరువు’ అనే
పేరును పెట్టారు. ‘సౌండ్ ఆఫ్ మాస్’ అనేది ఉపశీర్షిక. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది.
‘‘రవితేజకు మాస్లో ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆయన కోసమే తయారు చేసుకున్న కథ ఇది. ఆద్యంతం సరదాగా
సాగిపోతుందీ సినిమా. రవితేజ ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేస్తున్నారు. ఆయన పాత్రలో ఐదు రకాల షేడ్స్ ఉంటాయి. అది మేం
ఇప్పుడు చెప్పడం కంటే రేపు మీరు తెరమీద చూస్తేనే బావుంటుంది. నూరు శాతం ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే సినిమా ఇది. ముఖ్యంగా
బ్రహ్మానందం, రవితేజ పాత్రల నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. హైదరాబాద్, చెన్నయ్, బదామి,
బ్యాంకాక్లలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని శివ తెలిపారు. తాప్సీ
కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రభు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, ఎం.ఎస్.నారాయణ, ‘వెన్నెల’ కిషోర్, సన ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం: శివ,
ఆదినారాయణ, మాటలు: రమేష్గోపి, అనిల్ రావిపూడి, కెమెరా: వెట్రివేల్, సంగీతం: విజయ్ ఆంథోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి
శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి
|
అమలాపాల్ కొత్త భాష్యం ...విద్యాబాలన్ ఆచితూచి అడుగులు
హీరోయిన్ల ఉన్నతి స్థితిని చాటేది పుకార్లేనని కొత్త భాష్యం చెబుతోంది మైనా ముద్దుగుమ్మ అమలాపాల్. ఈ కేరళ కుట్టి మాట్లాడుతూ తనపై
తరచూ వస్తున్న పుకార్లపై చింతించడం లేదంది. కమర్షియల్ హీరోయిన్గా విజయం సాధించడం వల్ల తనపై పుకార్లు ఎక్కువవుతున్నాయని,
ఇలాంటి ప్రచారం ఎంత ఎక్కువగా జరిగితే తానంత ఉన్నత స్థితికి చేరుకుంటున్నట్లు భావిస్తానని చెప్పింది. లింగుస్వామి దర్శకత్వంలో నటించిన
వేట్టై చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నానని, ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానని తెలిపింది. వేట్టై చిత్రం తెలుగులోనూ అనువాదం
అవుతున్నందున అక్కడా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని అమలాపాల్ చెప్పింది.
'ద డర్టీ పిక్చర్' చిత్రంతో విద్యాబాలన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లెక్క లేనన్ని సినిమాల ఆఫర్లు ...అడిగినంత పారితోషికం ఇవ్వడానికి
నిర్మాతలు లైన్ కడుతున్నారు. అందుకే ఈ అమ్మడు నటించే తదుపరి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఏడాది
విద్యాబాలన్ నటించిన 'నో వన్ కిల్డ్ జెస్సికా', 'ద డర్టీ పిక్చర్' రెండు చిత్రాలు ఈ అమ్మడుకి మంచి పేరు తెచ్చాయి. అందుకే ఈ మలయాళీ
ముద్దుగుమ్మ ఇక నుంచి హీరోయిన్కి ప్రాధాన్యం వున్న పాత్రలను ఎంపిక చేసుకోవాలని భావిస్తోందట. తనవద్దకొచ్చే నిర్మాతలకు, దర్శకులకు
ఇదే విషయాన్ని తెగేసి చెబుతోందట .
|
రుచీ నరైన్తో కరణ్ జోహార్ ఆఫ్బీట్ సినిమా
కరణ్ జోహార్ సినిమాలంటే విదేశీ లొకేషన్లు, అప్సరసల్లాంటి హీరోయిన్లు, కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ, వినోదం.. అన్నీ
కలగలిసిన ఒక అద్భుత సినిమా. ఇలాంటి ప్రఖ్యాత దర్శకుడితో కలిసి పనిచేయాలంటే ఆ కళాకారుడికి తప్పకుండా అదృష్టం ఉండాలి. ఇప్పుడు
రుచీ నరైన్కు ఆ అవకాశం దక్కింది. కరణ్ రాబోయే సినిమా కోసం ఈమె తన కలానికి పదను పెడుతోంది. అయితే ఈ సినిమా కరణ్ గత
చిత్రాలకు విభిన్నంగా ఉంటుందట. ఇతని స్వీయనిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈసారి ఒక ఆఫ్బీట్ సినిమా తీయాలనే ఆలోచనలో
ఉంది.నిజానికి ధర్మ ప్రొడక్షన్స్ గతంలోనూ చాలా మంది కొత్త తారలకు అవకాశం కల్పించింది. కరణ్ గత సినిమాల మాదిరిగా ఇందులో
తళుకుబెళుకులు ఉండే అవకాశాలు లేవని బాలీవుడ్ వర్గాల సమాచారం. రుచి కేవలం రచయిత్రే కాదు ఒక సినిమాకు దర్శకత్వం కూడా
వహించింది.' హజారో క్వాహిషే ఐసీ', 'స్నిప్', 'కలకత్తా మెయిల్' వంటి సినిమాలకు రచయితగా పనిచేసింది. ఈమె దర్శకత్వం వహించిన'
కల్-యెస్టర్డే అండ్ టుమారో' సినిమా విమర్శకుల మెప్పును పొందింది. 2005లో విడుదలైన ఈ సినిమాలో షైనీ ఆహుజా, చిత్రాంగధ సింగ్
నటించారు. అప్పటి నుంచి రుచి పెద్దగా వెలుగులోకి రాలేదు. ఈ తాజా సినిమాలో రుచి సహా నటులు కూడా కొత్తవారే ఉంటారని సమాచారం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఎప్పుడూ ప్రేమకథ సినిమాలు తీసే కరణ్ కాల్తో తొలిసారిగా యాక్షన్ థ్రిల్లర్' కాల్' ను
రూపొందించాడు.
|
గ్లామర్ పెంచిన కాజల్ ...కూర్చోనంటున్న తమన్నా
విమర్శలను తట్టుకుని నిలబడటం కాజల్కి అలవాటైపోయింది. ఆ మధ్య రెండు వివాదాల్లో చిక్కుకుని వెంటనే తేరుకుంది ఈ పంజాబీ బొమ్మ.
ప్రస్తుతం ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్లో మంచి సినిమాలే చేస్తోంది కాజల్. మహేశ్ సరసన నటించిన
'బిజినెస్మేన్' చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య బికినీల్లోనూ, లిప్లాక్ సీన్లలోనూ చేయనని తెగేసి చెప్పింది ఈ
అమ్మడు. అయితే 'బిజినెస్మేన్' చిత్రంలో మహేశ్తో లిప్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో మునుపటి చిత్రాల్లోకంటే కాస్తంత
కురుచ దుస్తులను ధరించినట్లు కనిపిస్తోంది. అలాగే కోలీవుడ్లో నటిస్తున్న 'మాత్రాన్' చిత్రంలోనూ ఈ అమ్మడు హాట్ హాట్గా కనిపిస్తోందట.
ఇక మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సరసన 'తుపాకి' చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఆ మధ్య కురుచ దుస్తులతో ఫొటో
షూట్లో పాల్గొని కాస్తంత హీటే పుట్టించింది. త్వరలోనే ఎన్టీఆర్తో కలిసి మరో చిత్రంలోనూ నటిస్తున్న కాజల్...పరిశ్రమలో పోటీని
తట్టుకోవడానికి మనుముందు మరింత గ్లామర్గా కనిపించే క్రమం లో ఉందని అంటున్నారు.
"ఎవరైనా మంచి పని చేసినప్పుడు ప్రశంసించాలి. నా నైజం అదే'' అని అంటోంది తమన్నా. తెలుగులో చకచకా మాట్లాడేస్తూ అందర్నీ
ఆకట్టుకుంటున్న తమన్నా తన అలవాట్లను గురించి చెప్పుకొచ్చింది. "ఇంత స్లిమ్గా ఉండటానికి ఏం చేస్తుంటారు? అని చాలా మంది
అడుగుతుంటారు. నిజానికి నేను జంక్ ఫుడ్ లవర్ని. నచ్చినవన్నీ లాగించేస్తాను. కానీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు
నిర్విరామంగా పని చేస్తూనే ఉంటాను. డ్యాన్స్లని, యాక్షన్ అని, ఫొటో షూట్ అని... ఏదైతేనేం ప్రత్యేకంగా ఎక్కడా గంటల తరబడి కూర్చోను.
ప్రతి క్షణం ఏదో పని చేస్తూనే ఉంటే ఇక కొవ్వు ఎక్కడ చేరుతుంది? పైగా ఏ మాత్రం వీలున్నా లిఫ్ట్లు ఎక్కను. మెట్లు ఎక్కుతాను. నడకకు
ప్రాధాన్యం ఇస్తాను'' అని వివరించిందీ దక్షిణాది అగ్ర నాయిక .
|
|
మహేష్-క్రిష్ ల చిత్రం పేరు ‘శివం’?
‘పోకిరి’ తర్వాత ‘దూకుడు’ రూపంలో మరో సంచలన విజయాన్ని అందుకున్న కథానాయకుడు మహేష్బాబు ఇప్పుడు
కెరీర్లో వేగం పెంచాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ దూకుడుగా సాగుతున్న ఈ కథానాయకుడు నటించిన
‘బిజినెస్మేన్’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా 2012లో మహేష్ మూడు చిత్రాలకు గ్రీన్సిగ్నల్
ఇచ్చాడు. అందులో అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందనున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఈ నెల 18 నుంచి
సెట్స్ మీదకు వెళుతుండగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం కూడా ఈ సంవత్సరం మార్చి నెలలోనే
ప్రారంభం కానుంది. వీటితో పాటు మహేష్ ‘గమ్యం’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ చిత్రంలో నటించడానికి
పచ్చజెండా ఊపారు. విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్
నిర్మిస్తారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ‘శివం’ అనే టైటిల్ని నిర్ణయించారని తెలిసింది. |
నాకు తీపి జ్ఞాపకాలను 'డర్టీ పిక్చర్' మిగిల్చింది
బాలీవుడ్ నటి విద్యాబాలన్ మాత్రం న్యూఇయర్ సంబరాలతోపాటు పుట్టినరోజు వేడుకను కూడా జరుపుకుంటోంది.
ఎందుకంటే కొత్త సంవత్సరం అడుగుపెట్టేరోజే ఈ అమ్మడు కూడా భూమిమీద అడుగుపెట్టింది కాబట్టి. ఆదివారం తన
పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న విద్యాబాలన్ గడిచిన సంవత్సరం గురించి మాట్లాడుతూ... ‘నా జీవితంలో 2011
మరిచిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. ‘ద డర్టీ పిక్చర్’ సాధించిన విజయాన్ని నేను ఇప్పటికీ ఆస్వాదిస్తూనే
ఉన్నాను. ఏడాది మొత్తంలో విజయం సాధించిన కొన్ని చిత్రాల్లో నేను నటించిన సినిమా ఉండడం ఇప్పడు నాకు
ఆనందాన్ని కలిగిస్తున్నా షూటింగ్ సమయంలో మాత్రం ఆందోళన కలిగించింది. ఎందుకంటే అందులో నా పాత్ర అసభ్యతకు
దగ్గరగా ఉంది.స్మోకింగ్ చేస్తూ పలు దృశ్యాల్లో నటించాల్సి వచ్చింది. అయితే ఆ నటనను నా తల్లిదండ్రులు ఎలా
స్వీకరిస్తారనే ఆందోళన నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేసుకున్నాం. ఓ థియేటర్లో ‘ద డర్టీ
పిక్చర్’ను చూసిన నా తల్లిదండ్రులు నాతో మాట్లాడుతూ... చూస్తున్నంతసేపూ తెరపై కనిపిస్తున్నది మా కూతురనే
విషయాన్ని మర్చిపోయా’మన్నారు. ఆ మాటలు విన్నాక నాకు చాలా సంతోషమేసింది. నా జీవితంలో ఆ సంఘటన ఓ
మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. చిత్ర బృందం వందశాతం అంకితభావంతో పనిచేసిందని ప్రముఖ దర్శకనిర్మాత
మహేశ్భట్ మమ్మల్ని ప్రశంసించడం కూడా ఓ మధుర జ్ఞాపకమే. కథను చెప్పడంలో ఎటువంటి గిరి గీసుకోలేదని,
నటనకు హద్దులు లేవని 'డర్టీ పిక్చర్' మరోమారు నిరూపించిందని విమర్శకులు కూడా మెచ్చుకోవడంతో ఆ సినిమా
కోసం మేమంతా పడిన కష్టాన్ని మర్చిపోయాం. విడుదలై నెల గడిచిపోతున్నా ఇప్పటికీ స్నేహితులు, బంధువులు, సినీ
విమర్శకుల నుంచి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఏడాది మొత్తంలో నాకు తీపి జ్ఞాపకాలను డర్టీ పిక్చర్ మిగిల్చింది’ అని
పేర్కొంది
|
భారత పర్యటనకు ఓఫ్రా విన్ఫ్రే ...కాజల్ అగర్వాల్ సెంటిమెంట్
అమెరికా టెలివిజన్ మొఘల్, టాక్ షో క్వీన్ ఓఫ్రా విన్ఫ్రే తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు. ఓఫ్రా విన్ఫ్రే
నెట్వర్క్లో సరికొత్త కార్యక్రమం ‘నెక్ట్స్ చాప్టర్’ షూటింగ్ కోసం వచ్చే నెల భారత్లో పర్యటించనున్నారు. భారత పర్యటన
వివరాల్ని సోషల్ నెట్వర్కింగ్ ట్విటర్లో విన్ఫ్రే ధృవీకరించారు. నెక్ట్స్ చాప్టర్ కోసం భారత్, ఆఫ్రీకా ఖండాల్లో
పర్యటించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం కోసం సెలబ్రిటీలను, వార్తలో నిలిచిన ప్రముఖుల్ని, ఇతరులను విన్ఫ్రే
ఇంటర్వ్యూ చేయనున్నారు. భారత పర్యటనలో జైపూర్, ముంబై నగరాల్ని సందర్శించనున్నారు.
సినిమా పరిక్షిశమలో సెంటిమెంట్కు పెద్దపీట వేస్తారన్న విషయం తెలిసిందే. ఈ సెంటిమెంట్ను దర్శకనిర్మాతలే కాకుండా
హీరోలు, హీరోయిన్లు కూడా ఫాలో అవుతుంటారు. తెలుగు చిత్ర పరిక్షిశమలో క్రేజీ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న కాజల్
అగర్వాల్కు ఓ సెంటిమెంట్ వుందట. ఆమె నటించిన చిత్రంలోని తొలి సన్నివేశంలో తెలుపు రంగు దుస్తులు ధరిస్తే ఆ
చిత్రం పెద్ద హిట్టేనట. ఈ సెంటిమెంట్ గురించి కాజల్ మాట్లాడుతూ ‘ నేను తెలుపు రంగు దుస్తుల్లో కనిపించిన చిత్రాలు
‘మగధీర, మిస్టర్పర్ఫెక్ట్, బృందావనం మంచి విజయాలు సాధించి నాకున్న సెంటిమెంట్ను నిజం చేశాయి. అప్పటి
నుంచి నేను నటించే ప్రతి చిత్రంలోనూ నా పరిచయ సన్నివేశంలో తెల్లటి దుస్తువులు తప్పని సరిగా వుండేలా
చూసుకుంటున్నాను’ అని తెలిపింది.
|
ఎక్స్పోజింగ్ అభ్యంతరాలు లేవంటోంది షాజన్ పదమ్సీ
ఎక్స్పోజింగ్ చేయడానికి తనకేమీ అభ్యంతరాలు లేవంటూ బాలీవుడ్ నూతనతార షాజన్ పదమ్సీ సంచలన స్టేట్మెంట్
ఇచ్చేసింది. అందంగా చూపించగలిగితే ఎక్స్పోజింగ్ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపింది. తనకు హిందీ మసాలా
సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పింది. ప్రముఖ రంగస్థల కళాకారులు ఆలిక్ పదమ్సీ, షరోన్ ప్రభాకర్ల ముద్దుల కూతురే
షాజన్. తల్లిదండ్రుల మాదిరిగా నాటకరంగానికే పరిమితం కాకుండా వెండితెరను ఎంచుకున్న ఈ బ్యూటీకి.. మనసును
హత్తుకునే పాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే ఐటెంసాంగులు చేయడానికి మొహమాటం ఏమీ లేదని
చెప్పింది. ప్రదర్శించడానికి మంచి దేహం ఉండడం కూడా తప్పనిసరని స్పష్టం చేసింది. షాజన్ ఇది వరకే వందలాది
నాటకాల్లో కనిపించి శభాష్ అనిపించుకుంది. తన తండ్రి పదమ్సీ రచించిన అన్స్పోకెన్ డైలాగ్స్ అనే నాటకంలో పూర్తి
నిడివి గల పాత్రలో నటించింది. మీ తల్లిదండ్రులకు సినిమాలపై ఆసక్తి ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘లగాన్, బ్లాక్, సత్య
వంటి సినిమాలు వాళ్లకు ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఇంగ్లిష్ సినిమా చూసే నా దక్షిణ ముంబై స్నేహితులు కూడా ఇప్పుడు
ఐటెంసాంగులు, చిన్నబడ్జెట్ హిందీ సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు’ అని వివరించింది. షాజన్ బాల్యమంతా
రంగస్థల వేదికలపైనే గడిచింది. నాటకాల నిర్వహణలో తండ్రికి సాయపడడం ఎంతో సంతోషంగా అనిపించేదంటూ గత
అనుభవాలను గుర్తు తెచ్చుకుంది
|
సమీరారెడ్డి విచిత్రమైన తీర్మానం చేసుకుంది
నూతన సంవత్సరంలో అడుగిడుతూ కొత్త తీర్మానాల్ని చేసుకోవడం మామూలు విషయయే. అయితే బాలీవుడ్ నటి
సమీరారెడ్డి మాత్రం ఓ విచిత్రమైన తీర్మానం చేసుకుంది. ఇక ముందెప్పుడూ క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి ఆన్లైన్లో
షాపింగ్ చేయనని బలంగా నిర్ణయించుకుంది ఈ భామ. ఈ తీర్మానం వెనక సమీరాకు ఇటీవల ఎదురైన ఓ చేదు
అనుభవమే కారణమట. వివరాల్లోకి వెళితే.. సమీరాకు చెందిన క్రెడిట్ కార్డ్ను ఎవరో హ్యాక్ చేశారట. అంతేకాదు హ్యాకర్లు
ఏకంగా సమీరాకు ఫోన్ చేసి ‘మీ క్రెడిట్ కార్డ్ను హ్యాక్ చేశాం. ఒక్కసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండని’ ఓ ఉచిత సలహా
కూడా ఇచ్చారట. దీంతో ఖంగుతిన్న ఈ భామ అకౌంట్ను సరిచూసుకొని నాలుగు లక్షల రూపాయలు విత్డ్రా అయినట్లు
తెలుసుకుంది. ఈ తతంగం ఇంతటితో ఆగిపోలేదు... తిరిగిఫోన్ చేసిన సదరు హ్యాకర్ తను భారత సంతతికి చెందిన
అమెరికా వాసినని, సమీరా పేరు చూసి కథానాయిక అని గుర్తించానని, ఆమెపై వున్న అభిమానంతో ఓ లక్ష రూపాయలు
తిరిగి డిపాజిట్ చేస్తున్నానని చెప్పాడట. అంతేకాకుండా సేఫ్గా ఆన్లైన్ లావాదేవీలు ఎలా చేసుకోవాలో కొన్ని చిట్కాలు
కూడా సమీరాకు భోదించాడట. దీంతో ఏమీ పాలుపోని సమీరా పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై సమీరా రెడ్డి
స్పందిస్తూ ‘నా జీవితంలో నేను ఎదుర్కొన విచిత్రమైన అనుభవం ఇది. ఈ సంఘటనతో ఇంకెప్పుడూ ఆన్లైన్లో షాపింగ్
చేయకూడదని నిర్ణయించుకున్నాను. అయితే చెప్పిన ప్రకారం ఆ వ్యక్తి లక్ష రూపాయలు నా ఖాతాలో డిపాజిట్ చేయడం
ఆనందంగా వుంది’ అని సెలవిచ్చింది.
|
|
“డాన్” పాత్రలో వెంకటేష్ ...హీరోగా అల్లు శిరీష్
మెహెర్ రమేష్ తో వెంకటేష్ చేస్తున్న చిత్రం లో వెంకటేష్ “డాన్” పాత్రలో కనపడబోతునట్టు సమాచారం. వెంకటేష్ తొలి
సారి “డాన్” పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు పాత్ర చాలా కీలకమవుతుందని అంటున్నారు. ఈ చిత్ర
చిత్రీకరణ జనవరి చివర్లో మొదలు కానుంది. రిచా గంగోపాధ్యాయ కథానాయికగా చేస్తున్నారు. కథ,మాటలు కోన వెంకట్
మరియు గోపి కృష్ణ అందిస్తున్నారు. తన గత చిత్రం “శక్తీ” పరాజయం తరువాత ఈ చిత్రం మెహర్ రమేష్ కి చాలా
కీలకం కానుంది. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు మరియు అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా రాబోతున్నాడు . అతడు
నటించబోయే మొదటి చిత్రం తమిళం లో త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కోసం ఆయన పలు జాగ్రత్తలు
తీసుకున్నారు. మా విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం హిట్ సినిమాలు ప్రభాస్ నటించిన' మిస్టర్ పర్ఫెక్ట్ 'లేదా నాగ
చైతన్య నటించిన '100% లవ్' సినిమాలలో ఏదో ఒక చిత్రం చేయబోతున్నారు. దీని గురించి చర్చలు చివరి దశకు
చేరుకున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.. శిరీష్ సరసన కొత్త హీరోయిన్ ని పరిచయం
చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
|
సిల్క్స్మిత జీవితం ఆధారంగా తమిళంలో మరో చిత్రం
ఎనభైయ్యవ దశకంలో యువత కలల రాణిగా వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన తార సిల్క్స్మిత. ఆమె జీవిత గాథ
స్ఫూర్తిగా ఈ మధ్య విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ‘డర్టీపిక్చర్’ చిత్రం తెరపైకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం
సినీపరిక్షిశమలో ప్రత్యేక నృత్యాల్లో నర్తించే వారి జీవితాల నేపథ్యంలో రూపొందిన చిత్రమని, ఈ సినిమాకి సిల్క్స్మిత జీవిత
కథకు ఎలాంటి సంబంధం లేదని తమిళ దర్శకుడు వినుచక్రవర్తి చెబుతున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ -
‘ఏలూరులోని ఓ ఫ్లోర్మిల్లో సిల్క్స్మితను తొలిసారి చూశాను. సినిమాల్లో నటించాలన్న ఆమె ఆసక్తిని గమనించి,
తమిళ చిత్ర పరిశ్రమకి కి సిల్క్ అనే పేరుతో పరిచయం చేశాను. అలాంటి నేను ఆమె జీవితాన్నే తెరపై ఆవిష్కరిస్తానని
ఊహించలేదు. త్వరలోనే సిల్క్స్మిత జీవితంలో చోటుచేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా తమిళంలో ఓ చిత్రాన్ని
తెరకెక్కించనున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను’ అన్నారు.
|
2012పైనే దీపికా పదుకొణే ఆశలు పెట్టుకుంది
దీపికా పదుకొణే గురువారం తన 26వ జన్మదినం జరుపుకుంటోంది. 2012పై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఎందుకంటే కొత్త ఏడాదిలో ఆమెవి మూడు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ విజయవంతం కావాలని
కనిపించిన దేవుళ్లందరికీ మొక్కుకుంటోంది. 2011లో ఈమె నటించిన' ఆరక్షణ్', 'దేసీబాయ్స్'లు పెద్దగా
ఆకట్టుకోలేకపోయాయి. సైఫ్ అలీఖాన్తో కాక్టెయిల్, మాజీ ప్రియుడు రణ్బీర్తో 'యె జవానీ మై దివానీ', 'రేస్2'లు ఈ
ఏడాది దీపిక ఖాతాలో ఉన్న సినిమాలు.‘విజయం పూర్తిగా బాక్సాఫీసుకు సంబంధించిన విషయం. నేనూ సహజంగానే
హిట్ చిత్రాల్లోనే నటించాలనుకుంటున్నాను. వినోదం పంచే వాణిజ్య సినిమాలను ఎంచుకుంటాను. ఓం శాంతి ఓం, లవ్
ఆజ్కల్ వంటి ప్రాజెక్టులను ఎంచుకోవడానికి కూడా అభ్యంతరం లేదు’ అని దీపిక వివరించింది. ఆరక్షణ్, దేసీబాయ్స్లు
పెద్దగా ఆడకపోయినా గతేడాదే విడుదలైన' దమ్ మారో దమ్'లో చేసిన ఐటెంసాంగ్ దీపికకు బాగా పేరు తెచ్చిపెట్టింది.
మూడోసారి సైఫ్తో కలిసి నటించే అవకాశం రావడంతో ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపింది. ‘హోమి అడిజానియా
('బీయింగ్ సైరస్' దర్శకుడు) పని విధానం నాకెంతో ఇష్టం. అతడు సీన్లను వివరించే పద్ధతి, చిత్రీకరణ చాలా బాగుంటుంది.
'కాక్టెయిల్' ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తుంది.' యే జవానీ'.. షూటింగ్ మార్చి ఒకటిన మొదలవుతుంది. ఈ
ఏడాది ఆఖరులో విడుదల కావొచ్చు. అప్పుడే' రేస్ 2 'కూడా ఉండొచ్చు’ అని వివరించింది. రేస్కు కొనసాగింపుగా
రూపొందుతున్న' రేస్ 2'కు అబ్బాస్-మస్తాన్ ద్వయం దర్శకత్వం వహిస్తోంది.
|
సమంత ఆ సినిమా చేస్తోంది...షీలా కోలీవుడ్ కేసి చూస్తోంది
‘ఎదుగుతున్న వారిపై గాలి వార్తలు రావడం సినిమా ఇండవూస్టీలో సర్వ సాధారణమైపోయింది. ఈ మధ్య విజయాల
బాటలో పయనిస్తున్న నాపై ప్రస్తుతం కొన్ని గాలి వార్తలు పుట్టు కొస్తున్నాయి. అలాంటి వార్తలు విన్నప్పుడు వాటిని చూసి
తెగ నవ్వుకుంటాను’ అంటోంది సమంత. ఈ ముద్దుగుమ్మ త్వరలో సెట్స్పైకి రానున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
చిత్రంలో మహేష్కు జోడీగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటించడానికి సమంతకు డేట్స్ సర్ధుబాటు
కావడంలేదని వస్తున్న వార్తలపై సమంత తనదైన శైలిలో స్పందిస్తూ -‘ దిల్ రాజు నిర్మించనున్న ‘సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నేను నటించడంలేదని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదు. ఈ చిత్రంలో
నటించడానికి నాకు ఎలాంటి డేట్స్ సమస్యలు లేవు. ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటాను’
అంటోంది సమంత.
కోలీవుడ్లో సరైన అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్లోకి ప్రవేశించిన మలయాళి కుట్టి షీలా. తెలుగులో జూనియర్
ఎన్టీఆర్తో కలిసి 'అదుర్స్' చిత్రంలో అందాలు ఆరబోసినా ఈ అమ్మడికి అవకాశాలు మొహం చాటేశాయి. ఈ కారణంగా
తిరిగి సొంత గడ్డపై దృష్టి సారించింది. ఇప్పుడు మరోసారి కోలీవుడ్పై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళంలో
మంచి కథా చిత్రాలు వస్తున్నాయని ఈ ముద్దుగుమ్మ ఐస్ చేసే మాటలు చెబుతోంది. దీని గురించి షీలా మాట్లాడుతూ-
తమిళ చిత్రాల్లో నటించి మూడేళ్లు అయ్యిందని పేర్కొంది. తెలుగు, మలయాళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల తమిల
చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయానని తెలిపింది. అందువల్లే పలు అవకాశాలను వదులుకున్నాను కూడా అని
చెప్పింది.ప్రస్తుతం కోలీవుడ్లో మంచి కథా చిత్రాలు రూపొందుతున్నాయని అలాంటి చిత్రాల్లో నటించాలని ఆశ ఉందని
పేర్కొంది. ఈ ఏడాది కచ్చితంగా తమిళ చిత్రంలో నటిస్తానని అంటోంది. టాలీవుడ్లో మాదిరిగా కోలీవుడ్లోనూ తనకంటూ
ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటానని షీలా ధీమా వ్యక్తం చేస్తోంది.
|
దర్శకుడు ఇలియానా నటనకు ఫిదా అయిపోయాడట
‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోంది గోవా భామ ఇలియానా. దక్షిణాదిన ఒకప్పుడు స్టార్డమ్ను ఎంజాయ్
చేసిన ఈ సుందరి ఇటీవల కాలంలో రేసులో కొంచెం వెనకబడింది. సౌత్ సినిమాలో ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్కే
పరిమితమైన ఈ వయ్యారి హిందీ చిత్రం ‘బర్ఫీ’లో ఓ ఛాలెంజింగ్ పాత్రను చేస్తోంది. ఎలాంటి కమర్షియల్ అంశాలు
లేకుండా పక్కా ప్రయోగాత్మక చిత్రంగా దర్శకుడు అనురాగ్బసు ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రంలో
కథానాయకుడు రణభీర్ కపూర్ చెవుడు, మూగవానిగా నటిస్తున్నాడు. ఇక కథానాయికగా మెయిన్లీడ్లో నటిస్తున్న
ప్రియాంకచోప్రా మానసిన వైకల్యంతో బాధపడుతున్న యువతిగా నటిస్తోంది. ఇలియానా ఈ చిత్రంలో రణభీర్కపూర్ను
మార్గదర్శనం చేసే సహాయకురాలిగా నటిస్తోంది.ఇప్పటివరకూ కెరీర్లో ఇలియానా చేస్తున్న చాలా బరువైన పాత్ర
ఇదనీ...చెవుడు, మూగ వ్యక్తిని తన హావభావాలతో ముందుకు నడిపించే క్లిష్టమైన పాత్ర పోషించడం అంత తేలిక కాదని,
అయితే ఇలియానా ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు
సంబంధించిన ఓ సన్నివేశంలో ఇలియానా పెర్ఫ్మాన్స్ను చూసి యూనిట్ సభ్యులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారట!
దర్శకుడు అనురాగ్బసు కూడా ఇలియానా నటనకు ఫిదా అయిపోయాడని అందరూ అంటున్నారు. అంతేకాదు
మరికొందరైతే ఈ సినిమాతో ఇలియానా ఫిల్మ్ఫేర్ అవార్డ్ గెలుచుకోవడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. ‘బర్ఫీ’
చిత్రంలో తను చేస్తున్న పాత్ర పట్ల ముద్దుగుమ్మ ఇలియానా కూడా చాలా సంతోషంగా వుంది.
|
|
'సార్...ఒస్తారొస్తారా...'... ఎక్కడ విన్నా ఇదే పాట
సార్...ఒస్తారొస్తారా...ఈవేళ ఎక్కడ విన్నా ఇదే పాట. తెలుగువాళ్లను ఈ పాట ఊపేస్తోంది. రేడియోల్లో, టీవీల్లో, రింగ్
టోన్లలో ఎక్కడవిన్నా ఇదే ! ఆ పాటలో వున్న మత్తుకు కుర్రాళ్లు ఊగిపోతున్నారు. అంతలా ఈపాట ఇప్పుడందర్నీ పట్టి
లాగేస్తోంది. మహేష్బాబు, కాజల్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బిజినెస్మేన్' సినిమాలోనిదీ పాట.
ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్ కట్టిన బాణీ కన్నా గాయని సుచిత్ర పాడిన స్టయిలే, పాటకు అంతటి క్రేజ్ తెచ్చిందని
చెప్పాలి. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాట రాశారు. 'సార్ ఒస్తారొస్తారా...' అన్న మాటలు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమనే
ఇచ్చాడని గేయ రచయిత అంటున్నారు. ఎందుకంటే ప్రతీపాటకీ సంగీత దర్శకుడు 'తననాల'తో కూడిన ట్యూన్
ఇచ్చేటప్పుడు...ఒక్కోసారి డమ్మీ మాటలు కూడా వేస్తుంటాడు. ముఖ్యంగా కీరవాణి, కోటి ఇలాంటి పదాలతో ట్యూన్స్
కడుతుంటారు. |
పాఠకులు చదవడానికే 'మన్యంరాణి' రాశానంటున్న వంశీ
తాను రాసిన 'మన్యంరాణి' నవలను సీరియల్గా, సినిమాగా తీసే ఆలోచన లేదనీ, కేవలం పాఠకులు చదవడానికే నవలా
రూపంలో రాశానని దర్శకుడు వంశీ తెలియజేస్తున్నాడు. గతంలో ఆయన ఓ పత్రికలో రాసిన 'మన్యంరాణి' కథను నవలగా
ముద్రించారు. హైదరాబాద్ మాటీవీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నవలను విడుదల చేసి, మా టీవీ డైరెక్టర్
రామకృష్ణకు అంకితమిచ్చారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ...'బాపుగారు ఈ నవలకు అద్భుతమైన బొమ్మలు గీశారు. ఒకరకంగా చెప్పాలంటే..
బాపు బొమ్మల కోసం నేను పుస్తకం వేశాను. ఇంతకు ముందు ఇలా వేయలేదు. ఇకముందు వేయలేను అని బాపుగారు
చెప్పడమే... ఈ నవలకు దక్కిన కితాబు. ఈ నవలను సినిమాగా తీయడానికి ప్రయత్నించను. కేవలం చదువుకోవడానికే
వేశాను. గతంలో 'పసలపూడి కథలు' రాశాను. మా వూరు ప్రాధాన్యతతో కూడిన ఆ కథలకు ఎంతో పేరు వచ్చింది.
ఇప్పుడు ఈ నవల రాయడానికి రంపచోడవరం ఆ చుట్టుపక్కల పలు ప్రాంతాలను పర్యటించాను. మారుమూల ప్రాంతాలను
కూడా తిరిగాను. ఆ అడవి చూస్తుంటే..మన్యంరాణి స్పురించింది. చక్కటి పదాలతో నవలను తీర్చిదిద్దాను' అని
చెప్పారు.రామకృష్ణ మాట్లాడుతూ...'స్వాతి పుస్తకంలో ఈకథను చదివాను. ప్రకృతి జీవన విధానం మానవునిలో ఎలా
మిళితమైందే బహుచక్కగా వంశీగారు ఆవిష్కరించారు' అని పేర్కొన్నారు.
|
‘షిరిడి సాయి’లో శ్రీకాంత్... భరత్ బాలా తో ధనుష్
నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్రరావు ‘షిరిడి సాయి’ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం
రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుందని చిత్ర వర్గాల సమాచారం. సాయిబాబా జీవితకథ ఆధారంగా
రూపొందనున్న ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ఓ రాజు పాత్రలో కనిపించనున్నాడట. శ్రీకాంత్ గతంలో నాగార్జున నటించిన
ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, నిన్నే ప్రేమిస్తా వంటి తదతర చిత్రాల్లో నటించాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం
అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.యం.ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ పతాకంపై ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు.
ప్రముఖ దర్శక నిర్మాత భరత్ బాలా దర్శకత్వంలో యువ సంచలన నటుడు ధనుష్ హీరోగా నటించనున్నట్లు
సమాచారం. ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో భరత్బాలా రూపొందించిన' వందేమాతరం' మ్యూజిక్ ఆల్బమ్లో ధనుష్
నటించారు. ఇందులో కమలహాసన్ నటించాల్సి ఉంది. ఆయన 'విశ్వరూపం' చిత్రం రూపకల్పనలో బిజీగా ఉండడం వల్ల
కాల్షీట్స్ కేటాయించలేకపోయారట. అందువల్ల ఆ అవకాశం ధనుష్కు లభించింది. అదేవిధంగా 'వై దిస్ కొలవెరి డీ'
పాటను ఇటీవల ఏఆర్ రెహ్మాన్ విని వినూత్నంగా ఉందంటూ ధనుష్ను అభినందించారట. ధనుష్, భరత్బాలా, ఏఆర్
రెహ్మాన్ కాంబినేషన్లో త్వరలో ఈ భారీ తమిళ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. భరత్బాలా హిందీలో అజయ్ దేవగన్
హీరోగా' 19 స్టెప్స్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. . ఈ చిత్రాన్ని కమల్హాసన్ హీరోగా తమిళంలో రీమేక్ చేసే
ఆలోచనలో ఉన్న భరత్బాలా ఇప్పుడా చిత్రాన్ని ధనుష్తో తెరకెక్కించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇది
పూర్తిగా వాణిజ్య విలువలతో కూడిన యాక్షన్ కథా చిత్రమని సమాచారం.
|
భూకంప ప్రమాదం నుంచి తృటిలో తప్పుకున్న విద్యాబాలన్
‘డర్టీపిక్చర్’ విజయంతో మంచి ఊపుమీదున్న విద్యాబాలన్ ఇటీవల భూకంప ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.
ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం...నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవడానికి విద్యాబాలన్ ప్రియుడు
సిద్దార్థరాయ్కపూర్తో కలసి గత వారం న్యూజిలాండ్ వెళ్లింది. డిసెంబర్ 23న న్యూజిలాండ్లోని ప్రముఖ పట్టణం క్రైస్ట్చర్చ్
భూకంప తాకిడికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23న క్రైస్ట్చర్చ్లో
గడపాల్సివుందట. భూకంపం నగరాన్ని తాకే గంట మందు ఈ జంట అక్కడి నుంచి మరో పట్టణం క్వీన్స్టన్
చేరుకున్నారు. క్రైస్ట్చర్చ్లో భూకంపం విషయం తెలుసుకున్న వీరిద్దరూ అదృష్టం కొద్ది పెను ప్రమాదం నుంచి
బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ యుటీవి పిక్చర్స్ యజమాని అయిన
సిదార్థరాయ్కపూర్తో ముద్దుగుమ్మ విద్యాబాలన్ గత కొద్దిరోజులుగా ప్రేమాయణం నడుపుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి
చేసుకోబోతున్నారని ముంబాయ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. న్యూజిలాండ్లో వేకేషన్ తర్వాత ఈ జంట ఇటీవలే
ముంబయ్కి తిరిగివచ్చి అక్కడే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపున్నారు.
|
తాప్సీ అంచనాలన్నీ ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి
తాప్సీ భారీ అంచనాలు పెట్టుకున్న ‘మొగుడు’ చిత్రం ఆమెను నిరాశ పరిచింది. ఈ చిత్రం కోసం ఈ భామ తనే స్వయంగా
డబ్బింగ్ చెప్పుకుంది. ప్రస్తుతం తాప్సీ చేతిలో ఒకే ఒక్క తెలుగు చిత్రం వుంది. రవితేజ కథానాయకుడిగా ‘శౌర్యం’ ఫేమ్
శివ దర్శకత్వంలో బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన
చిత్రీకరణ బాదామిలో జరుగుతోందట. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ- ‘ ఇటీవల నేను నటించిన చిత్రాలు
అనూహ్యంగా నన్ను నిరాశకు గురిచేశాయి. ఆ సినిమాల విషయంలో నా అంచనాలన్నీ ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి.
అందుకే ఇకపై చేసే చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. ఓ సినిమా చేసే ముందు వినే
కథలు చాలా ఆసక్తికరంగా వుంటున్నాయి... తీరా తెరపైకొచ్చేసరికి చెప్పిన దానికి, చూసిన దానికి చాలా వ్యత్యాసం
కనిపిస్తోంది. ఇకపై ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని విషయయాల్లోనూ ఖచ్చితంగా వ్యవహరించాలను
కుంటున్నాను. నా పాత్రతో పాటు కథ, కథనాలు బాగుం ఆ చిత్రంలో నటించాలన్న నిర్ణయానికి వచ్చాను’ అని తెలిపింది.
ప్రస్తుతం ఈ సుందరి ‘గుండెల్లో గోదావరి’ చిత్రంలో నటిస్తోంది.
|
|
ఎంపికలో రామ్చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు
'ఆరెంజ్' ఇచ్చిన షాక్తో రామ్చరణ్ కథా ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేవలం లవర్బారుగా కనిపించటం
సరిపోదనే భావనకు వచ్చాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా నిలబడుతుందని నమ్ముతున్నాడు. దీంతో తాజా
చిత్రం 'రచ్చ'లో కావల్సినన్ని కమర్షియల్ అంశాలు చేర్చాడంట. దర్శకుడు సంపత్ నంది తగిన జాగ్రత్తలు తీసుకున్నాడట.
ఈ సినిమా తర్వాత చరన్ 'ఎవడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనే
ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగా చిరంజీవి హీరోగా నటించిన 'రౌడీ అల్లుడు'ను రీమేక్ చేయాలన్న ప్రతిపాదనను
చరణ్ ముందుకు వచ్చిందట. అలాగే 'జగదేక వీరుడు-అతిలోక సుందరి' సినిమాను కూడా చరణ్ను హీరోగా పెట్టి
తీయాలని నిర్మాత సి.అశ్వనీదత్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇవి కాకుండా గతం లో అమితాబ్ నటించిన'
జంజీర్' రీమిక్ తో రాంచరణ్ హిందీ చిత్ర రంగ ప్రవేశం చే స్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
|
ఈ చిత్రంలోనూ అలాగే చాలా అందంగా కనిపిస్తాను
తెలుగులో ఆల్మోస్ట్ టాప్ హీరోలందరితో నటించింది అందాల భామ త్రిష. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెంక ‘బాడీగార్డ్’,
ఎన్టీఆర్తో ‘దమ్ము’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో వెంకి నటించిన ‘బాడీగార్డ్’ ఈ సంక్రాంతికి సందడి
చేయనుంది. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ- ‘ నేను తమిళ చిత్రాలు అంగీకరించక పోవడంవల్ల కొంత మంది నేనంటే
గిట్టని వాళ్లు నాకు పెద్దగా అవకాశాలు రావడంలేదని, నాలో అందం తగ్గిందని ప్రచారం చేస్తున్నారు. ఆలాంటి పుకార్లును
నేను పట్టించుకోను. ఇంకా నా వయసు 29 ఏళ్లే. నాకు వయసు మీదపడుతోందంటూ ప్రచారం చేస్తున్న వాళ్లకు నేను
నటించిన తాజా చిత్రం ‘బాడీగార్డ్’ సరైన సమాధానం చెబుతుంది. ‘వర్షం’ చిత్రం సమయంలో ఎలా వున్నానో ఈ చిత్రంలో
అలాగే చాలా అందంగా కనిపిస్తాను. తెలుగు, తమిళ భాషల్లో నటిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ వుంది. నేను ఏ పాత్ర
చేసినా నా స్టైల్లో ఆ పాత్రని రక్తికట్టించడానికి ప్రయత్నిస్తానే కానీ ఎవరినో అనుకరించాల్సిన అవసరం నాకు లేదు’ అని
తెలిపింది త్రిష.
|
మహేష్ తో సినిమా ఎప్పుడెప్పుడా అంటున్న తమన్నా
తెలుగులో క్రేజీ స్టార్స్తో ప్రస్తుతం మూడు భారీ చిత్రాల్లో నటిస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా. రామ్చరణ్తో ‘రచ్చ’,
ప్రభాస్తో ‘రెబల్’, రామ్తో ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరో మహేష్బాబు హీరోగా
సుకుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ నటించనుంది. 2011లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100%
లవ్స్టోరీ’ చిత్రంలో మహాలక్ష్మీ పాత్రలో ప్రేక్షకుల ప్రశంసలందుకున్న తమన్నా మరోసారి సుకుమార్ దర్శకత్వంలో
నటించడానికి ఉవ్విళ్లూరుతోంది. ‘దూకుడు’ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర 14 రీల్స్
ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి
మిల్క్ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ ‘ సుకుమార్ రూపొందించిన ‘100% లవ్స్టోరీ’ చిత్రంలో మహాలక్ష్మీగా
కనిపించాను. ఈ పాత్రకు అందరి నుంచి మంచి స్పందన లభించింది. మళ్లీ ఆయన దర్శకత్వంలో మరో చిత్రం
చేస్తున్నాను. మహేష్తో నటించడం ఆనందంగా వుంది. ఆయనతో నటించే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా
అని ఎదురు చూస్తున్నాను’ అని తెలిపింది.
|
ఫ్రాన్సు పురస్కారానికి సల్మా హయక్ ... ‘నెల తక్కువోడు’ నరేష్
ఫ్రాన్సు అత్యున్నత పురస్కారానికి హాలీవుడ్ నటి సల్మా హయక్ ఎంపికయ్యారు. నెపోలియన్ 50 సంవత్సరాల క్రితం
నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక లిజియన్ డి హానర్ అవార్డును ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ చేతుల మీదుగా సల్మా
అందుకోనున్నారు. వివిధ రంగాలలో సేవలందించినందుకు దేశ, విదేశాల్లోని ప్రముఖ వ్యక్తులకు ఈ అవార్డును
బహుకరిస్తారు. గతంలో అవార్డును క్లింట్ ఈస్ట్పుడ్, రాబర్ట్ రెడ్ఫోర్ట్, రాబర్డ్ డీ నీరో, లెన్నీ క్రావిజ్లు అందుకున్నారు.
ఫ్రాన్స్కు చెందిన హెన్రీ ఫ్రాంకోయిస్ ఫినాల్ట్ను సల్మా హయక్ వివాహం చేసుకున్నారు.
కామెడీ హీరో అల్లరి నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
ఆయన సినిమాలు ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. తాజాగా ఆయన మరో కామెడీ సినిమా చేయబోతున్నారు.
ఈ చిత్రానికి ‘నెల తక్కువోడు’ అనే అనుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సత్తిబాబు డైరెక్ట్ చేయబోతుండగా చంటి
అడ్డాల నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రాలు పూర్తవగానే ఈ చిత్రం
ప్రారంభమవుతుంది.
|
బిందుమాధవి తెలుగులో కంటే తమిళంలోనే బిజీ
పదహారణాల తెలుగమ్మాయి బిందుమాధవి తెలుగులో కంటే తమిళంలోనే బిజీగా మారుతోంది. తెలుగులో ఆశించిన
రీతిలో మంచి సినిమాల అవకాశాలు రాకపోవడంతో ఒకింత నిరాశలో ఉన్న ఆమెలోని ప్రతిభని తమిళ సినిమా
గుర్తించినట్లే కనిపిస్తోంది. ఈ మధ్య నాని తమిళ సినిమా 'వెప్పం' (తెలుగులో 'సెగ')లో కనిపించిన బిందు నటించిన
తమిళ సినిమా 'కళగు' త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇందులో కృష్ణ హీరో.ఇక తాజాగా ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న 'నీర్
పరవై' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది బిందు. తెలుగులో వచ్చిన 'భీమిలి కబడ్డి జట్టు' ఒరిజినల్ తమిళ వెర్షన్
'వెన్నిల కబడి కుళు' ఫేం విష్ణు సరసన ఈ సినిమాలో ఆమె నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత శీను రంగసామి ఈ
సినిమా దర్శకుడు.ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కొంతమందికి ఆడిషన్ నిర్వహించా. బిందువి హావభావాల్ని చక్కగా
ప్రదర్శించే కళ్లు. ఆమె రూపం కూడా ఆ పాత్రకి అతికినట్లు సరిపోతుంది. అందుకే ఆమెను తీసుకున్నాం. ఇందులో ఆమె
క్రిస్టియన్ అమ్మాయిగా కనిపిస్తుంది అని చెప్పాడు శీను రంగసామి. తమిళనాడు కోస్తా తీరంలోని మత్స్యకారుల జీవితాల
నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
|
|
| |
|
|
| |
|