రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో ‘డియర్ జిందగీ’ ప్రారంభం! 

రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, నటీనటులుగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి లు నిర్మిస్తున్న చిత్రం “డియర్ జిందగి”.  ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీ వారి పిల్లల వలన  ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా కథే “డియర్ జిందగి”. ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది.  ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ నటుడు రాజా రవీంద్ర పై క్లాప్ ఇవ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు.
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ..  కొత్త కాన్సెప్ట్ తో ప్రస్తుతం సమాజంలో జరిగే సమస్యలు ఎత్తి చూపుతూ  తీస్తున్న ఈ సినిమాలో నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నాకు ముగ్గురు పిల్లలు ఉంటారు. వీరు చేసే పనులకు ఫ్రస్ట్రేట్ తెప్పించే ఫాదర్ గా చాలా రోజుల తరువాత ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది  అన్నారు.
నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన వి. వి. వినాయక్ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి ధన్యవాదములు. ఫ్రెండ్స్ తో కోలాబ్రేట్ అయ్యి ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాము. దండుపాళ్యం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన పండు చెప్పిన  కథ మా ఫ్రెండ్స్ కు కూడా నచ్చడంతో ఈ సినిమా తీస్తున్నాము. మాకు రాజా రవీంద్ర గారు కూడా సపోర్ట్ గా నిలవడమే కాకుండా ఇందులో తను నటించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ..ఈ కథ రాయడానికి ఒక సంవత్సరం పట్టింది.కల్ట్ వేలో రాసుకున్న ఈ కథ పర్ఫెక్ట్ అనుకున్న తరువాతే నిర్మాత శరత్ గారికి చెప్పడం జరిగింది. రాజా రవీంద్రగారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. తను ఫుల్ సపోర్ట్ చేశారు.  ఈ సినిమాకు మంచి నటీ, నటులు, టెక్నిషియన్స్ దొరకడంతో సినిమా బాగా వస్తునందని ఆశిస్తున్నాను అన్నారు.
లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ ..”కాంతారా” సినిమా తరువాత ఈ కథ నచ్చడంతో ఈ సినిమాకు అన్ని పాటలు రాయడం జరిగింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు మంచి పాటలు సెట్ అయ్యాయి అన్నారు.
ఇందులో రాజా రవీంద్ర,శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, మొయిన్, యశస్విని, మోహిత్, ఎల్. వి ప్రసాద్ తదితరులు నటీనటులు