నేనెప్పుడూ లెవెల్ చూపించను !

సాయిపల్లవి… ఒక్క చిత్రంతోనే తాను దేశ వ్యాప్తి చెందిన నటిని అని అంటోంది నటి సాయిపల్లవి. నిజమే ‘ప్రేమమ్‌’ అనే ఒక్క మలయాళ చిత్రంతోనే ఈ తమిళ పొన్నుచాలా పాపులర్‌ అయ్యింది. ఆ చిత్రం తరువాత తెలుగు, తమిళం భాషల్లోనూ నటించే అవకాశాలను అందుకుంటోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో తొలి చిత్రం ‘దయా’ కాస్త నిరాశ పరిచినా, ధనుష్‌తో రొమాన్స్‌ చేసిన మారి–2 కమర్షియల్‌గా ఓకే అనిపించుకోవడం సాయిపల్లవికి కాస్త ఊరటనిచ్చింది.ఆమె శర్వానంద్ తో చేసిన ‘పడి పడి లేచేమనసు’ పెద్దఫ్లాప్అయ్యింది. ఇప్పుడు సూర్యతో జత కడుతున్న ‘ఎన్‌జీకే’ చిత్రం కోసం చాలా ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సాయిపల్లవి గురించి వదంతులూ బాగానే ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి పద్ధతులను తట్టుకోలేకపోతున్నామని, ఆమెను కలిసి కథ వినిపించడం కష్టతరంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
దీనికి స్పందించిన సాయిపల్లవి…తాను ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయినని, సినీ వెలుగు అన్నది అనూహ్యంగా తనపై పడిందేనని చెప్పింది. ఒక్క చిత్రంతోనే నటిగా దేశ వ్యాప్తి చెందానని అంది. అయితే ఎప్పుడూ తాను లెవెల్ చూపలేదని చెప్పింది. అంతే కాదు గర్వం ప్రదర్శించిందే లేదని అంది. తాను లెవెల్ చూపితే రేపే మరో ప్రతిభావంతురాలైన నటి ఇతర నటీమణులను వెనక్కి నెట్టేస్తుందని పేర్కొంది. ఆ విషయం తెలిసిన నటిగా తానెప్పుడూ లెవెల్ చూపనని చెప్పింది. ఎవరైనా సరైన విధంగా తనను కలిసి మాట్లాడితే వారు చెప్పే కథలను విని తనకు నచ్చితే నటిస్తానని చెప్పింది. సినిమాకు సంబంధించినంత వరకూ ఏదీ శాశ్వతం కాదని అంది. ఈ రోజు సాధారణ యువతిగా ఉన్న వారు రేపు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని సాయిపల్లవి పేర్కొంది.