యాక్షన్ కింగ్ అర్జున్ ‘కురుక్షేత్రం’ టీజర్ రిలీజ్

ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కురుక్షేత్రం’. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఉమేష్‌, సుధాన్‌ సుందరం, జయరాం, అరుణ్‌ వైద్యనాథన్‌ నిర్మాతలు. తెలుగులో ఈ చిత్రాన్ని అరుల్‌ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ఆదివారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో విడుదలైంది.

హీరో అర్జున్‌ మాట్లాడుతూ – ”’జైహింద్‌ 2′ తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ‘కురుక్షేత్రం’. నేను చేస్తున్న 150వ సినిమా. ముందు ఈ చిత్రం నాకు 150వ చిత్రమని తెలియదు. తర్వాత షూటింగ్‌ టైంలో తెలిసింది. నేను సినిమా రంగంలోకి వచ్చి 36 సంవత్సరాలవుతుంది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌ చేసిన దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్‌ అందరికీ థాంక్స్‌. నేను ఇప్పటి వరు 20-30 సినిమాల్లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాను. కానీ ఆ సినిమాలో లేని ఎలిమెంట్స్‌ కురుక్షేత్రం సినిమాలో చూస్తారు. ప్రతి పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో మరో కోణం ఉంటుందని తెలియజేసే సినిమా ఇది. ముందు ఈ సినిమా చేయకూడదనే అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత నచ్చడంతో చేశాను. తెలుగు, తమిళం, కన్నడంలో సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుంది. అరవింద్‌ కృష్ణ సినిమాటోగ్రఫీ, నవీన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ అవుతాయి. మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేశాను. ఈ సినిమాలో ప్రసన్న చాలా కీలక పాత్ర చేశాడు. మంచి డేడికేషన్‌ ఉన్న నటుడు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా కీ రోల్‌ చేసింది. నిర్మాతలు వ్యాపార దృష్టితో కాకుండా సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారు. డిఫరెంట్‌గా ఉండటమే కాదు. నాకు, తెలుగు ఆడియెన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది” అన్నారు.

ప్రసన్న మాట్లాడుతూ – ”అర్జున్‌గారి కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ ఫిలింగా నటించిన 150 చిత్రంలో నేను నటించడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఆయన మంచి నటుడే కాదు. అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే వ్యక్తి. ఇక దర్శకుడు అరుణ్‌తో మంచి అనుబంధం ఉంది. తను డైరెక్టర్‌గా చేసిన సినిమాలోనే స్నేహతో పరిచయమైంది. ఆ ప్రేమ పెళ్ళి వరకు కొనసాగింది. నిర్మాతలు మంచి ప్యాషన్‌తో సినిమాన నిర్మించారు. వారు భవిష్యత్‌తో తెలుగులో స్ట్రయిట్‌ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేను కూడా బివిఎస్‌ రవి దర్శకత్వంలో జవాన్‌ సినిమాలో విలన్‌గా చేస్తున్నాను” అన్నారు.

దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ – ”ప్యాషనేట్‌ స్టూడియోస్‌పై నిర్మాతలు చేసిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం” అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన ఉమేష్‌ మాట్లాడుతూ – ”దర్శకుడు అరుణ్‌గారు యు.ఎస్‌ నుండి మంచి స్క్రిప్ట్‌తో వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి హీరో కావాలనుకోగానే మాకు అర్జున్‌గారైతే తప్పకుండా న్యాయం చేస్తారనిపించింది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, ఎమోషన్స్‌ అన్ని ఉన్న సినిమాగా మెప్పిస్తుంది” అన్నారు.

అరుల్‌ మాట్లాడుతూ – ”అర్జున్‌గారి 150వ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జూలై నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.