మూడు భారీ సినిమాల‌కు బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ !

`నా పేరు సూర్య‌` సినిమా ఎంతో క‌ష్ట‌ప‌డి చేసినా  అల్లు అర్జున్‌కు చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. ఇటీవల విడుద‌లైన ఆ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు బ‌న్నీ మ‌రో సినిమాను అంగీక‌రించలేదు. మంచి క‌థ‌, ద‌ర్శ‌కుడి కోసం బ‌న్నీ వెయిట్ చేస్తున్నాడ‌ని, ప్ర‌స్తుతం బ‌న్నీ ఏ సినిమాలూ అంగీక‌రించ‌లేద‌ని ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి.
అయితే తాజాగా బ‌న్నీ ఒకేసారి మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని స‌మాచారం. బ‌న్నీ తదుప‌రి సినిమా డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కే కుమార్‌తో ఉంటుందట‌. బ‌న్నీ కోసమే ప్ర‌స్తుతం విక్ర‌మ్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంద‌ట‌. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో బ‌న్నీ మ‌రోసారి సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చేస్తున్న `అర‌వింద స‌మేత‌` త‌ర్వాత త్రివిక్ర‌మ్.. బ‌న్నీ సినిమా కోసం క‌థ సిద్ధం చేస్తార‌ట‌. త్రివిక్ర‌మ్ త‌ర్వాత `సైరా` డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో బ‌న్నీ సినిమా చేస్తాడ‌ట‌. బ‌న్నీకి సురేంద‌ర్ రెడ్డి ఇప్ప‌టికే లైన్ చెప్పాడ‌ని స‌మాచారం.

ఆ చిత్రం తెరకెక్కాలంటే భారీ బడ్జెట్‌ !
అల్లు అర్జున్‌ తన కుటుంబంతో విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చేశారు.  ‘నా పేరు సూర్య’  తర్వాత విహార యాత్ర నిమిత్తం ప్యారీస్‌కు వెళ్లే ముందు విక్రమ్‌ కుమార్‌ ఓ కథను చెప్పారట. నవల తరహాలో ఉండే ఆ కథ విన్నవెంటనే బన్ని ఆశ్చర్యానికి గురయ్యాడట. ఆ చిత్రం తెరకెక్కాలంటే భారీ బడ్జెట్‌ అవసరమవుతుందట. సుమారుగా వంద కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత బడ్జెట్‌లో సినిమా చేస్తే అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్‌ చిత్రమవుతుంది. ఇప్పటి వరకూ బన్నికి అత్యధికంగా 60 కోట్లతో తీశారు. వంద కోట్లతో ఆయన హీరోగా సినిమా అంటే కాస్త ఆలోచిస్తారు. ఆ సందేహాన్నే బన్ని కూడా విక్రమ్‌ వద్ద వ్యక్తం చేశారట. చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే 70 నుంచి 80 కోట్ల మధ్యలో తీసేయొచ్చునని చెప్పారట దర్శకుడు. గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్స్‌ పని చేయాల్సి ఉంటుంది.

సీక్వెల్‌ కు అవకాశం ఉంది !
టాలీవుడ్‌లో మరో సీక్వెల్‌ రాబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కెరీర్‌లో ‘రేసు గుర్రం’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందన్నది ఆ కథనం సారాంశం.  2014లో వచ్చిన రేసు గుర్రానికి సురేందర్‌ రెడ్డి డైరెక్టర్‌. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్‌ కు అవకాశం ఉందని సురేందర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు.