పాత్ర కోసం పూర్ణ ఎంత పని చేసింది ?

పూర్ణ బహుభాషా నటి.అయితే ఆమె మంచి నటి. అంతకంటే మంచి డ్యాన్సర్‌.  అయినా తమిళం, తెలుగు, మలయాళం ఇలా ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోందని చెప్పవచ్చు.ఇంతకీ పూర్ణ ఏం చేసిందీ?

పూర్ణ తాజాగా “కొడివీరన్‌” అనే చిత్రంలో నటిస్తోంది.ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంబియార్  కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా “రేణుగుంట” చిత్రం ఫేమ్‌ సనూజ నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది.ఇది చాలా బలమైన పాత్ర . ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్ధం కాలే? గుండు కొట్టించుకుందట. సాధారణంగా కథానాయకులే గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడరు. విగ్‌తో మాయ చేస్తుంటారు. అలాంటిది నటి గుండు గీయించుకోవడం సంచలనం గా మారింది. ఆమె చేసిన సాహసం గురించి  పూర్ణను అడిగితే… “పాత్ర డిమాండ్‌ చేసినపుడు గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు “అని పేర్కొంది.

దర్శకుడు మిష్కిన్‌ నిర్మించిన “సవరకట్టి” చిత్రంలో దర్శకుడు రామ్‌కు భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా పూర్ణ నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటూ, అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ … ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం త్వరలో  విడుదల కావలసి ఉంది.