దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా ‘బ్రహ్మచారి’ టీజర్ విడుదల 

అద్వితీయ ఎంటర్టెయినర్స్  పతాకంపై గుంట మల్లేశం, సిరి, స్వప్న నటీ, నటులుగా నర్సింగ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బి. రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం “బ్రహ్మచారి'”.  దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో అమ్మాయి దొరకక ఎలాంటి  ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? అనేదే ఈ చిత్రం కథ.  విడుదలకు సిద్ధమైన సందర్బంగా తెలంగాణ ఉద్యమనేత,కవి,గాయకుడు, యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హజరయ్యి చిత్ర ఆడియో & టీజర్ ను  రిలీజ్ చేశారు.
దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణా జీవితాల్లో  వెలికి తీసి ప్రదర్శించేటటువంటి కథలు  ఉన్నాయి. అవి ఇప్పుడు ప్రారంభంయ్యాయి అని చెప్పవచ్చు.ఇప్పుడు తెలంగాణ కు సంబందించిన టెక్నిసియన్స్, యాక్టర్స్ రావడం శుభపరిణామం .దర్శకుడు  నర్సింగ్ మంచి రైటర్  తను రాసుకున్న కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. తను ఇలాంటి మంచి కథలతో సినిమాలు తీసి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకోవాలి.వ్యాపార రంగంలో   సక్సెస్ అయిన నిర్మాత రాంభూపాల్ రెడ్డి  ఇపుడు సినిమారంగంలో కూడా సక్సెస్ అవ్వాలని  కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత బి. రాంభూపాల్ రెడ్డి ,మాట్లాడుతూ..  ప్రస్తుతం తెలంగాణ లో బ్రహ్మాచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.  కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందిఅన్నారు.
చిత్ర దర్శకుడు నరసింగ్  మాట్లాడుతూ… ప్రతి సమస్య కు మా గురువు గారు  దొరవేటి పరిష్కొరం చూపారు. రిలీజ్ చేస్తానా లేదా అనుకున్న టైంలో మా ప్రొడ్యూసర్ రాంభూపాల్ గారు ముందుకు వచ్చి సపోర్ట్ గా నిలిచారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము . ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఈ సినిమా మరో బలగం సినిమా అవుతుంది అన్నారు.
హీరో గుంట మల్లేశం, మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. తెలంగాణ కు సంబందించిన ఇలాంటి మంచి కథ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్స్ సిరి, స్వప్న  మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.