ఘనంగా దర్శకరత్న దాసరి మూడవ వర్ధంతి

‘దర్శకరత్న’ దాసరి నారాయణ రావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఫిలింఛాంబర్ లో విగ్రహానికి పూలమాలలు వేసి హీరో శ్రీకాంత్, నిర్మాత సి.కళ్యాణ్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి నరసింహారావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు నివాళులు అర్పించారు.
 
సి.కళ్యాణ్ మాట్లాడుతూ…
సినిమా ఇండస్ట్రీలో కరోనా వల్ల జరిగిన నష్టాన్ని దాసరి గారు ఐతే వేరే రకంగా కాపాడేవారు. దాసరి గారిని తలుచుకోని రోజు ఉండదు, ఏ సమస్య వచ్చినా ముందువుండే వ్యక్తి దాసరి. ఆయన లేని లోటు కనిపిస్తోంది. ఈరోజు ఆయన మూడో వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదానం చేస్తున్నాము. వచ్చే ఏడాది మరింత ఘనంగా చేస్తామని అన్నారు.
 
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…
దాసరి గారి లేని లోటు పూడ్చలేము. ఇక్కడ ఉన్న నేను కానీ సి.కళ్యాణ్ కానీ, రామ సత్యనారాయణ కానీ ఆయన దగ్గర పనిచేయలేదు. అయినా, ‘ఆయన మనుష్యులమే’ అని గర్వంగా చెప్పుకుంటాం. ఆయన వర్ధంతి రోజున ఇలా ఆయనను స్మరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.
 
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…
ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి గారు, ఎటువంటి వచ్చినా వ్యవస్థలను ముందు పెట్టి ఆయన నడిపించేవారు. ప్రతి సినిమా టెక్నీషియన్ కు, నటుడికి విలువ ఇచ్చి మాట్లాడేవారు.ఈ కరోనా సమయంలో మరింత ఆయన లేని లోటు కనిపిస్తోంది. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చెయ్యలేరని అన్నారు.
 
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ…
దాసరి గారి మీద వున్న అపారమైన ప్రేమ తో ఈ రోజు ఈ 3 వ వర్ధంతి కార్యక్రమాన్ని కొనసాగించాను. నేను బతికి ఉన్నత కాలం దాసరి గారి పుట్టినరోజు మే 4న, దాసరి గారి వర్ధంతి మే 30 కచ్చితంగా జరుపుకుంటాను ప్రతి సంవత్సరం దాసరి అవార్డ్స్ ఫంక్షన్ ను దాసరి కుటుంబ సభ్యులు,శిష్యులు సమక్షంలో చేస్తానని తెలిపారు.దాసరి నారాయణ రావు 3వ వర్ధతి సందర్భంగా ఆహార పొట్లాలు, స్వీట్స్ పంచిపెట్టడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రామ సత్యనారాయణ.ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, దొరై, రాజా వన్నేం రెడ్డి , సత్తుపల్లి తాండవ, పిడివి ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.