‘యు టర్న్’లాంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో భారీబడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా… మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ” మా బేనర్ లో గోపీచంద్ ,సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం… మా బేనర్ కి మరోప్రెస్టీజియస్ మూవీ . గోపి చంద్ సరసన తమన్నా .. మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. రాజమండ్రి, ఢిల్లీ షెడ్యూల్స్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
గోపీచంద్, తమన్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్ రాజన్, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్ కుమార్, కథ-మాటలు-స్క్రీన్ప్లే- దర్శకత్వం: సంపత్ నంది.