కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా’ జనవరి 15న

‘ఆదిత్యా మ్యూజిక్‌’ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలో ‘ఆదిత్యా మ్యూజిక్ఇండియా’ పతాకంపై ‘ఎంత మంచివాడవురా’ చిత్రాన్ని నిర్మిస్తోంది.నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా ఈ
సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, విడుదలకు ముస్తాబవుతోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకుడు.
సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ…పాటలను డిసెంబరులో విడుదల చేసి..సంక్రాంతి సందర్భంగా జనవరి 15న చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకల్పన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట, రామజోగయ్య శాస్త్రి రెండు పాటలు, శ్రీమణి ఒక పాట రాశారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ గోదావరి నదిలో సాహోసోపేతంగా చిత్రీకరించామని.. ఫైట్ మాస్టర్ వెంకట్ రిస్క్ తీసుకున్నారని వివరించారు.
నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ… సినిమా షూటింగ్ కారక్రమాలు పూర్తయ్యాయని,
జనవరి 15న విడుదల చేయనున్నామని చెప్పారు. కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఖరి షెడ్యూల్‌ కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆడియో రంగంలో మా సంస్థ ఎలా దూసుకుపోయిందో చిత్ర నిర్మాణ రంగంలోనూ ఆ ఒరవడిని కొనసాగిస్తుంది….అని చెప్పారు .
చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ… ‘‘అన్ని వర్గాల
ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది. చాలా సంతృప్తికరంగా అవుట్ పుట్ వచ్చింది అన్నారు
వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా
లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు నటీనటులు .