‘బ్రహ్మస్త్ర’ తో మళ్ళీ బాలీవుడ్ లోకి ….

‘కింగ్’ నాగార్జున బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ‘బ్రహ్మస్త్ర’ దర్శకుడు అడగడం, కథ నచ్చటం.. పైగా అమితాబ్ కూడా నటిస్తుండటంతో … నాగ్‌ వెంటనే ఒప్పుకున్నారని ఓ ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది.ముంబైలో జరగబోయే షెడ్యూల్‌కు నాగ్‌ హాజరుకాబోతున్నట్లు పేర్కొంది…
 
 నాగార్జున చాలా గ్యాప్‌ తర్వాత తిరిగి బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ‘బ్రహ్మస్త్ర’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అమితాబ్‌ బచ్చన్‌, రణబీర్ కపూర్, అలియా భట్‌ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నాగ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నాగ్‌ గతంలో ‘ఖుదా గవా’, ‘క్రిమినల్‌’, ‘జక్మ్‌’ తదితర చిత్రాల్లో నటించగా, 2003లో ‘ఎల్‌వోసీ కార్గిల్‌’ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగ్‌ తిరిగి హిందీ సినిమాలో నటిస్తున్నారు
 
నాగార్జున నాని తో చేస్తున్న మల్టీస్టారర్‌ ‘దేవదాస్’ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ‘దేవదాస్‌’ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.