లెజెండ్ స్టార్ హీరో ‘పైడి జయరాజ్’ జయంతి వేడుక

‘దాదా సాహెబ్ అవార్డ్’ ను 1980 లో అందుకున్న తొలి తెలుగు వ్యక్తి స్వర్గీయ పైడి జైరాజ్.పైడి జైరాజ్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు పంజా జైహింద్ గౌడ్ .కరీంనగర్ లో 1909 సెప్టెంబర్ 28న జన్మించిన పైడి జయరాజ్ పంతొమ్మిదవ యేటనే సినిమాలపై మక్కువతో ముంబాయికి వెళ్లి .. 1930 లో ‘జగమతి జవాని’ అనే మూకీ చిత్రంలో నటించి మెప్పించిన… అనంతరం వరుసగా 200 లకు పైగా చిత్రాల్లో నటించి అనేక అవార్డులను సాధించారు.1980 సంవత్సరంలో దాదా సాహెబ్ అవార్డ్ ను కైవసం చేసుకున్న మొట్టమొదటి తెలుగు వ్యక్తి స్వర్గీయ పైడి జైరాజ్. ఇలాంటి మహోన్నత వ్యక్తిని కొన్నేళ్ళుగా అభిమానం తో… ఆయన జయంతిని ప్రతి యేటా ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్మాత,నటుడు పంజా జైహింద్ గౌడ్.
ఈ ఏడాది కూడా పైడి జైరాజ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు పంజా జైహింద్ గౌడ్. ఈ వేడుకలో ముఖ్య అథితులుగా పైడి జైరాజ్ మనవడు దీరజ్ నాయుడు, మనవరాలు సునీత నాయుడు, శ్రవణ్, ప్రముఖ రచయిత చిన్నికృష్ణ, శ్రావణ్ కుమార్ గౌడ్, మానిక్, చిన్నా, వెంకటేష్ గుప్తా, స్వామి గౌడ్, వైభవ్, రోషం బాలు, బి. సురేందర్ గౌడ్, ఆకుల మహేందర్, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైడి జైరాజ్ కు జోహారులు అందచేసారు.
తెలియకుండా చేయడమే తప్పిదం !
ఈ కార్యక్రమంలో రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. పైడి జైరాజ్ తెలుగు బిడ్డని ..ఒక రచయితగా నాకు తెలియనందుకు బాధపడుతూ, క్షమాపణలు తెలియచేసుకుంటున్నాను .నాకు పైడి జైరాజ్ తెలియకపోవడానికి కారణం.. ఇంతకు ముందు ఉన్న తరం వారు అని భావిస్తున్నా. బాలీవుడ్ లో రెండువందల సినిమాలకు పైగా నటించి… అనేక అవార్డులను కైవసం చేరుకున్న మహోన్నత వ్యక్తి గురించి తెలియకుండా చేయడమే వారు చేసిన తప్పిదం అని భావిస్తున్నా. ఇప్పటికైనా.. ఆయన సేవలను మన తెలుగు ఇండస్ట్రీ గుర్తించి.. పంజా జైహింద్ గౌడ్ గారిలా పైడి జైరాజ్ గారి పేరిట పలు కార్యక్రమాలు జరపాలని కోరుతున్నాను. వచ్చే నెలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారిని కలసి పైడి జైరాజ్ గారి విగ్రహ ఏర్పాటు విషయం చెప్పి, తప్పకుండా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపడతానని అన్నారు.
 
పంజా జైహింద్ గౌడ్ మాట్లాడుతూ… నేను పైడి జైరాజ్ గారి అభిమానిని . 2008 సంవత్సరం లో నాకు ఆయన కళామతల్లికి చేసిన సేవల గురించి తెలిసి …చాలా బాధపడి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన ఫోటోను పోరాడి పెట్టించాను . అలానే ఆయనను మరచిపోకుండా పైడి జైరాజ్ గారి జయంతి వేడుకలను ఏ స్వార్ధం లేకుండా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాను. నేడు 110 వ జయంతి వేడుక జరుగుతోంది . మొన్నామధ్య ‘సకల కళా సమ్మేళనం’ లో పైడి జైరాజ్ గారి విగ్రహ ప్రతిష్ట గురించి, ఆయన పొందిన అవార్డ్స్ గురించి.. హరీష్ రావు గారికి , కేశవరావు గారికి తెలియచేసాను. కానీ, ఆ పెద్దలు మాట దాటేయడం చాలా బాధాకరం. మన తెలంగాణ బిడ్డకు తగిన గౌరవం దక్కేదాక పోరాటాన్ని చేపడుతామని.. ఈ సందర్భంగా పైడి జైరాజ్ గారిని పట్టించుకోని వారిని హెచ్చరిస్తున్నా అని అన్నారు.
 
పైడి జైరాజ్ గారి మనవరాలు సునీత నాయుడు మాట్లాడుతూ… మా నాన్న గారి తమ్ముడు జైరాజ్ గారు. నా చిన్నతనం నుంచి మా తాత గారితో మంచి అనుబంధం ఉంది. మమ్మల్ని చాలా బాగా చూసుకునే వారు. అయన ఒక గ్రేట్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. గుడ్ హ్యూమన్ బీయింగ్ .. హుంబుల్ పర్సన్ కూడా.. అంతేకాదు ఏ సబ్జెక్ట్ గురించి అయినా ధారాళంగా మాట్లాడే పరిజ్ఞానమ్ తాత గారికి ఉంది. అలాంటి మహోన్నత వ్యక్తి ని ఈవిధం గా స్మరించుకోవడం, జ్ఞాపకాలను పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన పంజా జైహింద్ గౌడ్ గారికి నా కృతఙ్ఞతలు అన్నారు.