విడుదలకు ముందే రూ.150 కోట్ల బిజినెస్‌ !

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. తొలిసారి ఏ.ఆర్‌ మురుగదాస్‌, మహేశ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే రూ.150 కోట్ల బిజినెస్‌ చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అందులో రూ.120 కోట్లు థియేట్రికల్‌ హక్కులకే వచ్చినట్లు తెలుస్తోంది. మిగతా రూ.30 కోట్లు శాటిలైట్‌, ఆడియో డీల్స్‌తో వచ్చిన బిజినెస్సేనని చిత్రవర్గాలు అంటున్నాయి. అదే నిజమైతే ప్రీ రిలీజ్‌ బిజినెజ్‌గా ఇన్ని కోట్లు రాబట్టిన నాలుగో దక్షిణాది చిత్రం ‘స్పైడర్‌’ కావడం విశేషం.ఇందులో ఎస్‌.జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, అరబిక్‌ భాషల్లో ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ 
 ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’.  ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 9న చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.