అభిమానుల మధ్య ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు !

“మెగాస్టార్” చిరంజీవి తనయుడు రామ్ చరణ్మగధీర తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఏకంగా మూడు భారీ సినిమాల్లో నటిస్తుండడం ఈ పుట్టినరోజు విశేషం . ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో చేస్తుండడంతో పాటు తండ్రి మెగాస్టార్ నటిస్తున్న ‘ఆచార్య’ లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. రామ్ చరణ్ జన్మదినోత్సవం 27 శనివారం సందర్భంగా భారీ  స్థాయిలో జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు భారీ స్థాయిలో అభిమానులు పాల్గొనడం విశేషం.ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి నిర్మాత నవీన్ యెర్నేని, ఆర్ .స్వామి నాయుడు, యువ హీరో తేజ సజ్జ,’బిగ్ బాస్’ ఫేమ్ దేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ .. మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాకా మెగా హీరోలు ఎంతోమంది వచ్చారు. చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్నట్ట్టు ఎదిగారు. అయన దారిలో మెగా హీరోస్ అదే డెడికేషన్ తో హీరోలుగా సత్తా చాటుతున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ ఇలా హీరోలందరూ టాలీవుడ్ లో సత్తా చాటుకుంటున్నారు. ఈ ఏడాది చరణ్ కెరీర్ లో ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఆలాగే ఆచార్య లో మెగాస్టార్ తో కలిసి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ది గ్రేట్ శంకర్ దర్శకత్వంలో మా బ్యానర్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రం.. ఇలా ఒకే సారి మూడు భారీ సినిమాలతో రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు చరణ్ అన్నారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ … “ఇంత పెద్ద ఈవెంట్ లో మా బావ మా చరణ్ పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. మెగా ఫాన్స్ బ్లెస్సింగ్స్ వల్లే అయన మెగాస్టార్ అయ్యారు.  నేను మీకు ఓ  కథ చెబుతా… ‘ఓ చిన్న మామిడిపండు అక్కడ ఉంది.. స్కూల్ పిల్లలు, టీచర్ అందరు అక్కడే ఉన్నారు.  అక్కడున్న మామిడిపండు ఎవరు ముందు తీసుకుంటారో వాళ్ళకే మిగతా పళ్ళన్నీ అని టీచర్ చెబుతుంది. ఆ స్కూల్ టీచర్ చెప్పినట్టు ముందు ఆ చెట్టుదగ్గరికి వెళ్లి ఆ కాయ తీసుకుంటారో వాళ్ళకే అని చెప్పడంతో .. అందరు పిల్లలు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు .. కానీ ఒకరితో  ఒకరు నువ్వు ముందా? నేను ముందా? అని అనుకోకుండా.. ఆ పిల్లలంతా కలిసి ఆ పళ్ళన్నీ జట్టు కట్టి అందరు సమానంగా తీసుకున్నాం… ఆ చెట్టు ఆ పళ్ళు ఎవరో కాదు.. మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ పిల్లలు ఎవరో కాదు నేను చరణ్, అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ ఇలా అందరం. మేమంతా అయన పిల్లలం’. మాకు మీ సపోర్ట్ ఉంది. మీ ప్రేమకు మేమెప్పుడూ దాసులమే అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. రామ్ చరణ్ మా బ్యానర్ కు గొప్ప సినిమా ఇచ్చాడు. అయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ .. నేను దిల్ రాజు గారికి పెద్ద ఫ్యాన్ ను ఎందుకంటే అయన మా గురువు సుకుమార్ గారిని దర్శకుడు చేసారు. నేను దర్శకుడు అవ్వడానికి కారణం చరణ్ గారు.. నేను ఏ కథ చెప్పినా చాలా ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళు. అంతబాగా నన్ను అదరించారు అన్నారు.

వైష్ణవ తేజ్ మాట్లాడుతూ .. చరణ్ అన్న బర్త్ డే వేడుకలు ఇంత గ్రాండ్ గా చేసినందుకు మీ అందరికి థాంక్స్, అలాగే చరణ్ అన్న ఫాన్స్ కు చిరంజీవి మామ ఫాన్స్ అందరికి హాయ్. ఈ వేడుకల్లో నేను పాల్గొన్నందుకు చాల ఆనందంగా ఉంది అన్నారు.ఈ వెదికపై కరోనా సమయంలో సేవలు అందించిన పలువురిని సత్కరించారు.  ఈ వేదికపై కేక్ ను కట్ చేసారు.