శ‌ర్వానంద్‌, స‌మంత `జాను’ ఫిబ్ర‌వ‌రి 7న

‘ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ‌
తారా తీరం మ‌న దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉద‌యాల‌నే విసిరేలా..` అంటూ హార్ట్ ట‌చింగ్ మెలోడీ ప్రేమ‌లోని గాఢ‌త ఈ పాట‌లో తెలియ‌చేస్తుంది. గోవింద్ వ‌సంత సంగీత సార‌థ్యంలో శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ను చిన్మయి, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు.
శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
 
శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌,ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌,పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి