థౌజెండ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యానర్పై కె.ఎల్.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్ జె.అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు మాట్లాడుతూ – “మంచి ప్రేమకథ. అశ్విన్, రిద్ది, రాధా బంగారు సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతో మంచి ప్రేమకథను తెరకెక్కించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఓ కూతురుని మంచి దారిలో పెట్టడానికి తండ్రి ఏం చేశాడనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. డిసెంబర్ 14న సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం“ అన్నారు.
దర్శకుడు ప్రతాప్ తాతం శెట్టి మాట్లాడుతూ – “మంచి క్యూట్ లవ్ స్టోరీ. అహ్లాదకరంగా ఉంటుంది. కె.ఎల్.ఎన్.రాజుగారి సహాయంతో సినిమాను పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 14న విడుదలవుతోన్న మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది“ అన్నారు.
సునయన మాట్లాడుతూ – “మా మామగారు కె.ఎల్.ఎన్ రాజుగారు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో.. ఈ సినిమా చేశాం. సినిమా కోసం అందరం కష్టపడ్డాం. ఈ నెల 14న మా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది“ అన్నారు.
విరాట్జె.అశ్విన్ మాట్లాడుతూ – “రాజుగారు లేకుంటే సినిమా లేదు. ఆయన బ్యానర్లో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఆయనకు రుణపడి ఉంటాను. మావయ్య మార్తాండ్ కె.వెంకటేశ్గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. డిసెంబర్ 14న విడుదలవతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది“ అన్నారు.
రిద్ది కుమార్ మాట్లాడుతూ – “తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్రమిది. మంచి పాత్ర చేశాను. ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పిస్తాను“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.