విజయ్-పూరి చిత్రంలో అనన్య పాండే అడుగుపెట్టింది!

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది.స్క్రిప్టుకు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ విషయంలో పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది.తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో హీరోయిన్ అనన్య పాండే జాయిన్ అయ్యింది. ముంబైలో ఆర్ట్ డైరెక్టర్ జాని షైక్ బాషా నిర్మించిన భారీ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
 
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విష్ణురెడ్డి, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.కెమెరామెన్: విష్ణు శర్మ,
ఆర్ట్ డైరెక్టర్: జాని షైక్ బాషా,స్టంట్ మాస్టర్: కిచ, ఎడిటర్: జునైద్ సిద్దిక్