భావితరాలకు సంస్కృతిని తెలియజేసే ‘ఎపిక్టైజ్ మీడియా’

మన సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఆకాంక్షతో హరి దామెర, నాగరాజు తాళ్లూరి కలిసి ‘ఎపిక్టైజ్’ మీడియా హౌస్ తో పాటు వెబ్ సైట్ కూడా  ప్రారంభించారు.
ఫ్లూటిస్ట్ నాగరాజు…  విశాఖ పట్నంలో జన్మించిన నాగరాజు పదేళ్ళ ప్రాయంలోనే వేణుగానంలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇవాళ మనకున్న బెస్ట్ ఫ్లూటిస్టులలో ఆయన ప్రముఖులు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యూజిక్ కన్సర్ట్స్ లో ఆయన ఫ్లూటిస్ట్ గా తన ప్రతిభ చాటారు. సోలోగా ఎన్నో వందల పెర్ఫార్మెన్స్ లు చేశారు. ప్రముఖ రచయిత జె.కె. భారవి ‘జగద్గురు ఆది శంకర’ చిత్రానికి సంగీతం అందించారు. అలానే రామ్ గోపాల్ వర్మ ‘365’ మూవీకీ మ్యూజిక్ ఇచ్చారు.  తనికెళ్ళ భరణి రాసిన ‘ఆటకదరాశివ’ తత్త్వాలకు వాద్య కళాకారుడిగా అద్భుతమైన పెర్ఫార్మ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘కళారత్న’ బిరుదును అందుకున్నారు. ‘త్రివేణు యాత్ర’… కర్నాటిక్, హిందుస్తానీ, వెస్ట్రన్ క్లాసిక్స్ ను ఒకే వేదిక మీద ప్రదర్శిస్తూ నాగరాజు  చేసిన జుగల్ బందీకి అద్భుతమైన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు లభించాయి.
హరి దామెర… ప్రకృతి ప్రేమికులైన హరి తన స్వస్థలం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండంలోని చింతలపాలెం. బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలు పడ్డా..ఉన్నత విద్య ద్వారా సముపార్జించిన తెలివితేటలు సముపార్జించారు. చెన్నయ్, బెంగళూరు నగరాల మీదుగా అమెరికా చేరి.. అక్కడ ఉద్యోగిగా విజయం సాధించి, ఇప్పుడు వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్నారు. కరోనా కారణంగా లభించిన ఖాళీ సమయాన్ని సంగీతం పట్ల తనకున్న అభిరుచిని వెలికి తీయడానికి ఉపయోగించారు. ప్రముఖ ఫ్లూటిస్ట్ నాగరాజు దగ్గర యేడాదిన్నర క్రితం శిష్యరికం మొదలెట్టారు. ఈ గురుశిష్యుల సాంగత్యం వీరి సంగీత ప్రయాణాన్ని మరో మేలిమలుపు తిప్పింది. ‘ఎపిక్టైజ్’ మీడియా హౌస్ రూపంలో సరికొత్త చరిత్రకు నాంది పలుకబోతోంది.
‘రాగరస… రీగరీసా’… ఈ ‘ఎపిక్టైజ్’ మీడియా లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు మారుతి, దర్శకుడు వి ఎన్ ఆదిత్య, రాజ్ మాదిరాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఎపిక్టైజ్ మీడియా’ సంస్థ తన తొలి కార్యక్రమంగా ‘రాగరస… రీగరీసా’ అనే కార్యక్రమాన్ని నిర్వ హిస్తోంది. శ్రీమతి మణి నాగరాజు దీనిని రూపకల్పన చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య, త్యాగరాజు, పురందర దాసు, మీరా భజన్స్, మొదలైన కీర్తనలకు ఆధునిక వాద్యపరికరాలతో సప్తస్వరాలను జోడించి… సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను కాపాడుతూ.. తర్వాతి తరాలకు అందించే బాధ్యతలో రూపుదిద్దుకున్న ఈ ‘రాగరస’… దేశంలో సంగీత సామ్రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గడించిన విద్యాంసులను  ఓ వేదికపైకి తేవాలనే ధ్యేయంతో పని చేస్తుంది.
“నాగరాజు మంచి ఫ్లూట్ విద్వాంసుడు. ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసాడు. నాగరాజు, హరి మిత్రులు సత్ సంకల్పంతో ఈ ‘ఎపిక్టైజ్’ మీడియా ను మొదలుపెట్టి నందుకు అభినందిస్తున్నాను. మన సంగీతం అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా వింటుంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో సంగీతం ఉంది.వీరి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను”… అని  సి. కళ్యాణ్ మాట్లాడుతూ అన్నారు.
మారుతి మాట్లాడుతూ … “నాగరాజు మ్యూజిక్ నేను విన్నాను. నాగరాజు, హరి ఇద్దరు కలిసి ఓ గొప్ప ప్రయత్నానికి ప్రారంభం చేసారు. నిజంగా నేటి జనరేషన్ కు ఇలాంటి మ్యూజిక్ కావాలి” అన్నారు.
వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ … నాగరాజు ఫ్లూటిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అయన తన శిష్యుడు అనాలా, లేక ఫ్రెండ్ అనాలా తెలియదు కానీ హరి తో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మంచి విజయం సాదించాలి” అన్నారు.
రాజ్ మాదిరాజు మాట్లాడుతూ… “హరి, నాగరాజు ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. వారిద్దరూ కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది” అన్నారు.