తన గురువు కోసం దేవిశ్రీ స్పెషల్ పెర్ఫామెన్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా తన గురువు మాండొలిన్ శ్రీనివాస్ ను గుర్తుచేసుకుంటూ ‘దేవ దేవం’ సాంగ్ ను స్టేజ్‌పై స్పెషల్ పెర్ఫామెన్స్ చేసి త‌న గురువు మాండొలిన్ శ్రీనివాస్‌కు అంకితమిచ్చారు. ఆ సాంగ్‌ను బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “గురువు గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం. అందుకే నా గురువు మాండొలిన్ శ్రీనివాస్‌గారికి ఇష్టమైన కీరవాణి రాగంలో ఓ పాటను కంపోజ్ చేశాను. మీ అందరికి కూడా ఆ పాటంటే చాలా ఇష్టమే.. మా గురువుగారితో పాటు జీవితాలకు అర్ధం నేర్పే ప్రతి గురువుకి ఈ పాట అంకితం” అన్నారు.