రాజ్‌తరుణ్, షాలిని `ఇద్ద‌రి లోకం ఒక‌టే` డిసెంబ‌ర్ 25న

రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యి… నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.
 
రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్పల‌త త‌దిత‌రులు.కెమెరా: స‌మీర్ రెడ్డి,మ్యూజిక్‌: మిక్కీ జె.మేయ‌ర్‌,ఎడిటింగ్‌: తమ్మి రాజు,డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి,స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు,నిర్మాత‌: శిరీష్‌,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: జీఆర్‌.కృష్ణ