క‌ల్యాణ్‌రామ్ `ఎంత మంచివాడ‌వురా` ఫస్ట్ లుక్

క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌కులు. `శ‌త‌మానం భ‌వ‌తి`తో జాతీయ పుర‌స్కారం అందుకున్న స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మెహ‌రీన్‌ క‌థానాయిక‌.
నిర్మాత‌ ఉమేష్ గుప్తా, స‌మ‌ర్ప‌కులు శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌ మాట్లాడుతూ..“సినిమా చాలా బాగా వ‌స్తోంది. ఆగ‌స్టు 26 నుంచి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నాం. ఈ నెల 25 వ‌ర‌కు ఏక‌ధాటిగా జ‌రుగుతున్న ఈ షెడ్యూల్లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నాం.ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటున్నారు. తొర్రేడులో35 ల‌క్ష‌లతో భారీ జాత‌ర సెట్ వేశాం. అక్క‌డ క‌ల్యాణ్‌రామ్‌, న‌టాషా దోషి (`జై సింహా` ఫేమ్‌)పై పాట చేశాం. 50 మంది డ్యాన్స‌ర్లు, 500 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. పెండ్యాల‌లోని ఇసుక ర్యాంప్ ల మ‌ధ్య తీసిన యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ . గోదావ‌రిలో 16 బోట్ల‌తో తెర‌కెక్కించిన క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం“అని అన్నారు.
ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ…“ముందు అనుకున్న‌ ప్ర‌కారం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రాజ‌మండ్రి అందాల‌ను `ఎంత మంచివాడ‌వురా`లో మ‌రోసారి చూపుతున్నాం. మూడో షెడ్యూల్ అక్టోబ‌ర్ 9 నుంచి 22 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో జరుగుతుంది. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో నాలుగ‌వ షెడ్యూల్లో ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తాం“అని అన్నారు.
 
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని, శ‌ర‌త్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌ నటిస్తున్నఈ చిత్రానికి…
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌,సంగీతం: గోపీ సుంద‌ర్‌,ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,ఆర్ట్‌: రామాంజ‌నేయులు,
నిర్మాతలు ‌: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా,సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌