బాబీ రిలీజ్ చేసిన `మ‌ధుర పూడి గ్రామం అనే నేను` ట్రైల‌ర్‌

ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా .. శివ కంఠ‌మ‌నేని హీరోగా  హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామా `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను`నిర్మించారు. క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా న‌టించ‌గా మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  అక్టోబ‌రు 13న రిలీజ్ కాబోతున్న`మ‌ధుర పూడి గ్రామం అనే నేను` థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను  డైరెక్ట‌ర్ బాబీ విడుద‌ల చేశారు.
బాబీ మాట్లాడుతూ – “ఈ రోజు `మధుర‌పూడి గ్రామం అనే నేను` చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ల్లి నాకు బాగా కావాల్సిన వ్య‌క్తి.  ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన క్రొత్త‌లో ఒకే బైక్ మీద తిరిగేవాళ్లం. అప్ప‌ట్లో నాకు మోర‌ల్ స‌పోర్ట్‌గా ఉండేవారు. అప్పుడ‌ప్పుడు ఫైనాన్షియ‌ల్ స‌పోర్ట్ కూడా చేసేవారు. నా కెరీర్‌లో ఫ‌స్ట్ క‌థ ఇచ్చిన శ్రీ‌హ‌రి గారి `భ‌ద్రాద్రి` సినిమాకు మ‌ల్లి గారే ద‌ర్శ‌కులు.  చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి సినిమా చేశారు.  ట్రైల‌ర్ చూశాను..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకే ఊరిలో జ‌రిగే క‌థ‌. రా అండ్ ర‌ప్టిక్‌గా ఉంటూనే ఎమోష‌న్స్‌తో నిండి ఉంది. మ‌రో గొప్ప విష‌యం ఏంటంటే మ‌ణిశ‌ర్మ‌గారు సంగీతం అందించారు. అలాగే మా అంద‌రికీ గురు స‌మానులు గౌత‌మ్ రాజు గారు ఎడిట‌ర్‌గా చేశారు. హీరో శివ కంఠ‌మ‌నేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“అన్నారు.