‘మహర్షి’తో అన్నిరికార్డులనూ తన్నేయాలి !

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్‌ =పీపుల్స్‌ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన మహేష్‌ అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మహర్షి ‘థి¸యేట్రికల్‌ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్‌, కామన్‌ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ఆడియో సీడీలను విక్టరీ వెంకటేష్‌, విజయ్‌దేవరకొండ, కొరటాలశివ సంయుక్తంగా విడుదల చేశారు.
విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ – ”మహేష్‌ ప్రపంచాన్నే ఏలేస్తాడమ్మా!. ట్రైలర్‌ చూశారుగా.. అదిరిపోయిందిగా.. మహేష్‌ 25వ మూవీ ఇది. ఆయనకు ఇది 25వ సినిమా అయినా.. ఆయన ఏజ్‌ మాత్రం 25 లాగానే కనపడుతుంది. ప్రతి యాక్టర్‌కు ఒక ఫేవరేట్‌ కెమెరా యాంగిల్‌ ఉంటుంది.తనకి మాత్రం 360 డిగ్రీస్‌ .. ఏ కోణంలో పెట్టినా అందంగానే కనపడతారు. మహేష్‌కి ప్రెస్టీజియస్‌ మూవీ. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ సహా నిర్మాతలు దత్తుగారు, దిల్‌రాజు, పిపికి ఆల్‌ ది బెస్ట్‌. డెఫినేెట్‌గా మే 9న మంచి సినిమాను ఇస్తారనే అనుకుంటున్నాను. ఒకప్పుడు చిన్నోడు నాపై కోపంతో పూలకుండీని తన్నాడు. అలా తన్నినప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్‌ బద్దలు కొట్టిందో తెలుసు. మళ్లీ ఈ సినిమాతో అన్నీ రికార్డులను తన్నేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ – ”మా అన్నయ్య వెంకటేష్‌గారికి థాంక్స్‌. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయనంత ఎక్కువగా ఎవరినీ ఇష్టపడను. ఆయన ఏ సెట్‌కువెళ్లినా, ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అది సూపర్‌హిట్‌ అంటుంటారు. ఆయన మా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. గౌరవంగా కూడా భావిస్తున్నాను. యంగర్‌ జనరేషన్‌ హీరోల్లో విజయ్‌ను ఎక్కువగా ఆడ్మైర్‌ చేస్తాను. ‘అర్జున్‌ రెడ్డి’ లో తన నటన బాగా నచ్చింది. ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థాంక్స్‌ చెప్పుకోవాల్సిన డైరెక్టర్స్‌ చాలా మందే ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావుగారికి థాంక్స్‌. ఎందుకంటే ఆయన నన్ను ఇంట్రడ్యూస్‌ చేశారు. ఆయనకు ఎప్పడూ రుణపడి ఉంటాను. అలాగే ‘మురారి’ సినిమా చేసిన క ష్ణవంశీగారికి థాంక్స్‌. నన్ను స్టార్‌ను చేసిన సినిమా ‘ఒక్కడు’ చేసిన గుణశేఖర్‌కి థాంక్స్‌. అలాగే నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌, యు.ఎస్‌. ఆడియెన్స్‌కు దగ్గర చేసిన సినిమా ‘అతడు’. ఆ సినిమా చేసిన త్రివిక్రమ్‌గారికి థాంక్స్‌. నా లైఫ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పుకోవాలంటే ‘దూకుడు’ సినిమాయే. ఆ సినిమా చేసిన శ్రీనువైట్లగారికి థాంక్స్‌. ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ సినిమాలతో రెండు సార్లు లైఫ్‌ ఇచ్చిన కొరటాల గారికి  థాంక్స్‌. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ 25వ సినిమా వంశీపైడిపల్లి గురించి చెప్పాలంటే నేను ఎవరినీ పేరు పెట్టి పిలవలేదు. వంశీనే అలా పిలుస్తాను. అందుకు కారణం అతన్ని నా తమ్ముడిగా భావిస్తున్నాను. ఈ కథ వినడానికి ముందు పది నిమిషాలు విని పంపించేద్దామనుకున్నాను. అందుకు కారణం ముందుగా ఉన్న కమిట్‌ మెంట్స్‌. టైం ఉండదేమో అనుకున్నాను. అయితే వంశీ 20 నిమిషాల నెరేషన్‌ విన్న తర్వాత .. రెండు సినిమాల తర్వాతే ఈ సినిమా చేయాల్సి వస్తుందని అన్నాను. పర్లేదు సార్‌! నేను వెయిట్‌ చేస్తాను. మిమ్మల్ని తప్ప నేను ఎవరినీ ఊహించలేదని చెప్పాడు. తనకు ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్‌ దగ్గరైనా కథుంటే రెండు నెలలు డిలే అయినా మరో హీరో దగ్గరకు వెళ్లిపోతారు. అలా కాకుండా తను నా కోసం రెండేళ్లు వెయిట్‌ చేశాడు. సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ చేసిన అల్లరినరేష్‌గారికి థాంక్స్‌. సినిమాటోగ్రాఫర్‌గారు మోహనన్‌గారికి థాంక్స్‌. రామ్‌ లక్ష్మణ్‌గారు కథను అర్థం చేసుకుని ఫైట్‌ కంపోజ్‌ చేశారు. నా 25వ సినిమాకు రాజు మాస్టర్‌గారికి థాంక్స్‌. ఇక దేవిశ్రీ గురించి చెప్పాలంటే తను నా సినిమాల్లో దేనికైనా ఆర్‌ ఆర్‌ చేస్తున్నాడంటే కంప్లీట్‌గా రిలాక్స్‌ అయిపోతాను. టెన్షన్‌ ఉండదు. తనతో జర్నీ ఇలాగే కొనసాగాలి. నా ముగ్గురు నిర్మాతలు అశ్వినీదత్‌గారు, దిల్‌రాజుగారు, పివిపిగారికి థాంక్స్‌. నాకు చాలా ఇంపార్టెంట్‌ మూవీ. ఏం కావాలో దాన్ని సమకూర్చారు. ఈ 25 సినిమాల జర్నీలో ప్రేక్షకుల చూపించిన అభిమానానికి చెతులెత్తి దండం పెడుతున్నాను. ఈ అభిమానం, ప్రేమ మరో పాతిక సినిమాలు, 20 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు. 
క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ – ”నేను ఇంటర్మీడియట్‌ నుండి మహేష్‌బాబుగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయన్ని సార్‌! అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేం కాలేజ్‌లో ఉన్నప్పుడు మావాడు అని అనుకుంటుండే. ఆయన 25వ సినిమా. ఇదొక జర్నీ. జర్నీ ఆఫ్‌ రిషి.. జర్నీ ఆఫ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఒక్కొక్క జర్నీకి ఒక్కొక్క సూపర్‌స్టార్‌ ఉండేవాళ్లు. ఓ జనరేషన్‌కి చిరుసార్‌ ఉండేవాళ్లు. కోణార్క్‌లో మహేష్‌ బాబు సినిమాలు చూడాలనుకునేవాడిని. కానీ మాస్‌ ఫ్యాన్స్‌ కారణంగా టిక్కెట్స్‌ దొరికేవీ కావు. చివరకు లేడీస్‌ క్యూ తక్కువగా ఉంటుందని తెలుసుకుని సినిమా రిలీజ్‌ సమయంలో నా కజిన్స్‌ని పట్టుకుని టికెట్స్‌ తెప్పించుకునేవాడిని. అలా యాక్టర్‌ అయిన తర్వాత ఓ అవార్డ్‌ ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడకు మహేష్‌గారు రాగానే ఆయన్ను అందరూ విష్‌ చేయడం చూసి అరె! లైఫ్‌ అంటే అలా ఉండ్రాలా అనుకున్నాను. తర్వాత నేను ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలు చేశాను. వాటిని చూసి మహేష్‌గారు ట్వీట్‌ చేసేవారు. నా ఫోన్‌లో ట్విట్టర్‌ వాట్సాప్‌ ఉండవు కానీ. ఎవరో చెబితే వెళ్లి వెతుక్కునేవాడిని. నా గురించి ఆయన ఏదైనా గొప్పగా చెబితే సంతోషంగా అనిపించేది. ఆయన్ని గర్వంగా ఉంచడానికి కంటిన్యూగా సినిమాలు చేస్తాను. నా గురించి ట్వీట్స్‌ చేసేలా చూసుకుంటాను. నా పుట్టినరోజునే ఈ సినిమా విడుదలవుతుంది. ఓ రకంగా నాకు కూడా ప్రెషర్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా సూపర్‌డూపర్‌హిట్‌ కావాలి. వంశీ అన్న నాకు గైడెన్స్‌ ఇస్తుంటారు. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. మే 9న ఓ సూపర్‌హిట్‌ చూడాలని ఓ ఫ్యాన్‌గా, ఓ యాక్టర్‌గా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ”హైదరాబాద్‌లో పుట్టి పెరిగి టికెట్స్‌ కోసం ఆర్‌.టి.సి క్రాస్‌రోడ్స్‌లో దెబ్బలు తిని సినిమాలు చూసి హీరో ఇంట్రడక్షన్‌కి పేపర్స్‌ విసిరిని వాళ్లలో నేను ఒకడిని. ఒక ఆడియెన్‌ టికెట్‌ కొన్నప్పుడు ఏం కోరుకుంటారో నాకు తెలుసు. ఓ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుగారి ఫోటో ఉంటే సినిమాలో ఏం ఉండాలని కోరుకుంటారో నాకు తెలుసు. ‘ఒక్కడు’ సినిమా నా ముందు మహేష్‌గారు సినిమా చూస్తున్నారు. ఈరోజు ఆయన్ని డైరెక్ట్‌ చేయడమే ఓ జర్నీ. గతంలో నేను ఎక్కడున్నా.. ఇప్పుడు ఎక్కడున్నాననేదే జర్నీ. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. ఈ కథకు సంబంధించి హరి, సాల్మన్‌ ఎప్పుడో బీజం వేశారు. ‘ఊపిరి’ చేసేటప్పుడు వాళ్లు చెప్పిన క్యారెక్టర్‌ ఎందుకో నాకు బాగా ఎక్కేసింది. తర్వాత నేను హరి, సాల్మన్‌గారు కలసి కథను తయారు చేశాం. హరిగారు నాకు దేవుడిచ్చిన సోదరుడు. పర్సనల్‌గా, ప్రొఫెషపనల్‌గా నా చెయ్యి పట్టుకుని నడిపించారు. మోహనన్‌గారు షారూక్‌తో ‘డాన్‌’ సినిమా చేశారు. తర్వాత అమీర్‌తో ‘తలాష్‌ ‘చేశారు. మొన్న అంధాదున్‌ చేశారు. అలాంటి సెలబ్రిటీ సినిమాటోగ్రాఫర్‌తో ఈ సినిమాకు పనిచేశాను. ఆయన ఈ సినిమాకు ఏంజెల్‌. ఆయన అందించిన సపోర్ట్‌కి థాంక్స్‌. శ్రీమణి చాలా డెప్త్‌తో పాటలు రాశారు. సినిమాలో ఓ సర్‌ప్రైజ్‌ సాంగ్‌ త్వరలోనే రిలీజ్‌ చేయబోతున్నాం. దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ స్ట్రెంగ్త్‌గా నిలిచారు. 16 ఏళ్ల క్రితం ‘వర్షం’ సినిమాకు నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇక్కడి వరకు వచ్చింది. ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ అందించారు. నిర్మాతలు దిల్‌రాజుగారికి, దత్తుగారికి, పివిపి అన్నకు థాంక్స్‌. మే 9న ఎప్పుడో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చూసి.. సినిమా అంటే పిచ్చి పుట్టింది.మళ్లీ మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ ఫ్యాన్స్‌ గుర్తు పెట్టుకునే రోజుగా మే 9 నిలవనుంది. సినిమా కోసం మేం పడ్డ కష్టంపై నమ్మకంతో చెబుతున్న మాట ఇది. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానం. నరేష్‌గారు తన నటనతో నేను రాసుకున్న పాత్రకు ప్రాణం పోశారు. అలాగే పూజా హెగ్డేకు థాంక్స్‌. మే 9న సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ కాలర్‌ ఎత్తుకుని తిరిగే రోజని చెబుతున్నాను. ఈ సినిమా చేసే సమయంలో ఆయన అందించిన సపోర్ట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన స్టార్‌గానే సూపర్‌స్టార్‌ కాదు.. హ్యుమన్‌ బీయింగ్‌గా కూడా సూపర్‌స్టారే. నేను ఎప్పుడైనా ప్రెషర్‌ ఫీలయితే ఆయన నా పక్కన కూర్చుని ధైర్యం చెప్పారు. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయనతో మంచి స్నేహితుడ్ని, సోల్‌మేట్‌ను చూసుకున్నాను. నేను కథ చెప్పే రోజునే మీ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌ అవుతుందని చెప్పాను. ఇప్పుడు అభిమానుల సమక్షంలో ప్రామిస్‌ చేస్తున్నాను. ఈ జర్నీలో కామాస్‌ ఉంటాయే కానీ.. ఫుల్‌స్టాప్స్‌ ఉండవని మెసేజ్‌ పెట్టారు. అది నిజం. ఇదొక కామా మాత్రమే. ఆయన అందించిన సపోర్ట్‌కి థాంక్స్‌” అన్నారు.
రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ – ”చాలా హ్యాపీగా, ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. ఈ సినిమాలో భాగం కావడంతో గర్వంగా ఉంది. దిల్‌రాజుగారికి, పివిపిగారికి, దత్తుగారికి థాంక్స్‌. ఇక మహేష్‌గారితో పని చేయడం ఎప్పటికీ హ్యాపీనే. ఎందుకంటే ఆయన సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్‌ రెస్పాన్సిబిలీ కూడా ఉంటుంది. ఇలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉంది. గ్రేట్‌ జర్నీ. మహేష్‌గారు ఆయనతో పనిచేసే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తారు. కథ వినగానే చాలా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాను. సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. సినిమా క్లైమాక్స్‌ మరో ఎత్తు. క్లైమాక్స్‌ చూసి కన్నీళ్లు పెట్టుకోని వారుండరు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌లో సినిమా చూసి ఎమోషనల్‌ అయ్యాను” అన్నారు.