‘నా దేశం-నా జెండా’ నాట్స్ కవితల పోటీ విజేతలు

‘నా దేశం-నా జెండా’ అనే అంశంపై భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాట్స్ నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితల పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కవులు అశేషంగా పాల్గొన్నారు.
‘913 కి పైగా అందిన కవితల్లోంచి 9 మందిని విజేతలుగా ఎంపిక చేసి, వారితో కవి సమ్మేళనం నిర్వహించిన అనంతరం ఎవరు ఏ పురస్కారాన్ని అందుకున్నారో ప్రకటించడం జరిగింది’ అని ఈ కార్యక్రమ నిర్వాహకులు డా. సూర్యం గంటి అన్నారు.
నాట్స్ నూతన అధ్యక్షులు శ్రీ. శేఖర్ అన్నె, నిర్వాహకులు డా సూర్యం గంటి మరియు డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి గార్లు విజేతలను ఈ విధంగా ప్రకటించారు.
సర్వోత్తమ పురస్కారం: రూ 20,000/-: శ్రీ. దోర్నాథుల సిద్ధార్థ
ఉత్తమ పురస్కారం: రూ 15,000/-: శ్రీ. వంగర పరమేశ్వర రావు
విశిష్ట పురస్కారం: రూ 10,000/-: శ్రీ నూజిళ్ల శ్రీనివాస్
విశేష పురస్కారం: రూ 5,000/-: కుమారి. కిరణ్ విభావరి
గౌరవ పురస్కారం-1: రూ. 2000/- : శ్రీ వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని)
గౌరవ పురస్కారం-2: రూ. 2000/- : కుమారి. శిరీష మణిపురి
గౌరవ పురస్కారం-3: రూ. 2000/- : శ్రీ జోగు అంజయ్య
గౌరవ పురస్కారం-4: రూ. 2000/- :  శ్రీ అల్లాడి వేణు గోపాల్
గౌరవ పురస్కారం-5: రూ. 2000/- : శ్రీ చెరుకూరి రాజశేఖర్
‘పురస్కారాలు గెలుపొందిన తొమ్మిది మంది కవులూ సినీ కవులైన చంద్రబోసు, భాస్కరభట్ల, సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి గార్లతో కవితా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 14 సాయంత్రం తెలుగువారు అభివృద్ధి చేసిన ఆన్లైన్ వీడియో ప్లాట్ఫాం
https://nristreams.tv/NATS-live/ లోనూ నాట్స్ యూట్యూబ్ ఛానల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ ప్రసారం చేసాం. అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు’ అని సంచాలకులు రాజశేఖర్ అల్లాడ తెలిపారు.
‘మొదటి సారిగా ఈ ప్రయత్నం చేసాం. అనుకున్నదాని కంటే గొప్ప స్పందన లభించింది’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
‘భాషే రమ్యం- సేవే గమ్యం’ మా నాట్స్ నినాదం. ఆ దిశలో భాష విషయంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. కవితల పోటీలలో పురస్కారాలు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు. అతిథులుగా విచ్చేసిన చంద్రబోసు గారికి, సిరాశ్రీ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు’ అని నాట్స్ నూతన అధ్యక్షులు శ్రీ శేఖర్ అన్నె చెప్పారు.
‘ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలనే ఉత్సాహం నాట్స్ కి కలుగుతోంది. దీనికి కారణభూతమైన అశేషమైన కవులకు, కవయిత్రులకు మా కృతజ్ఞతలు. తెలుగు భాషకు చేస్తున్న సేవలో మీ ప్రోత్సాహం శిరోధార్యం’ అని నాట్స్ చైర్మన్ శ్రీ శ్రీధర్ అప్పసాని తెలిపారు.
NRI STREAMS CONNECT APP లో ప్రసారమైన ఆన్లైన్ కవి సమ్మేళన కార్యక్రమంలో చివరిగా సినీ కవులు కూడా తమ దేశభక్తి కవితలను చదివి వినిపించారు. ‘విశేషమేమిటంటే ‘జూం’ లో కాకుండా పూర్తిగా తెలుగువారి చేత తయారుచేయబడిన NRI STREAMS CONNECT APP ద్వారా ఈ ఆన్లైన్ కవిసమ్మేళనాన్ని నిర్వహించడం మరింత ఔచిత్యంగా అనిపిస్తోంది’ అని సినీ కవి చంద్రబోస్ అన్నారు.
ఆ కార్యక్రమాన్ని ఈ లింకుల్లో చూడవచ్చు: https://nristreams.tv/NATS-live/ మరియు  https://www.youtube.com/watch?v=yWoDY7queO0