రెండురోజుల కాల్‌షీట్స్‌ … ఐదుకోట్లు పారితోషికం !

నయనతార  తన సినీ పయనంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఈ స్థాయికి చేరుకుంది.  నయనతార నిజజీవితంలోనూ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచింది.ఒక్క చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం డిమాండ్‌ చేసే స్థాయికి ఎదిగిన నటి ఈ కేరళా బ్యూటీ. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ అంటే అది నయనతారనే. ఒక దశలో ఈ అమ్మడి పరిస్థితి చూసి అయ్యో పాపం అని జాలి పడినవారు లేకపోలేదు. అయినా ఈ క్రేజీ హీరోయిన్‌ మార్కెట్‌ ఏ మాత్రం సడలలేదు. నయన్‌ అంటే అభిమానుల్లో ఇప్పటికీ మహా క్రేజ్‌. ఇప్పటికీ దక్షిణాది నిర్మాతలు ఈమె కాల్‌షీట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారనడం అతిశయోక్తి కాదేమో.

నయనతారా..మజాకా!

కాగా నయనతార టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నా, ఇటీవల వరకూ ఆ పాపులారిటీని ఇతరత్రా వాడుకోలేదు. చాలా మంది కథానాయికలు తమ ఇమేజ్‌ను వాణిజ్య ప్రకటనలకు వాడుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.ఈ మధ్యనే నయనతార కూడా వాణిజ్య ప్రకటనలో నటించడం ప్రారంభించారు. ఇటీవల ఒక డీటీహెచ్‌ వాణిజ్య ప్రకటనలో నటించారు. అయితే అందుకు ఈ భామ పుచ్చుకున్న మొత్తం రూ.5 కోట్లట.అందుకు కేటాయించింది మాత్రం కేవలం రెండురోజుల కాల్‌షీట్సేనట. ఇది  విన్న వారంతా  అవాక్కు అవుతున్నారని  టాక్‌.