రజనీకాంత్‌, శంకర్‌ ‘2.0’ ప్రపంచ యాత్ర

రజనీకాంత్‌,  శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.
ఈ చిత్ర విశేషాలను లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేస్తూ – ”షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుగుతోంది. హాలీవుడ్‌ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అదే స్థాయిలో ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ‘2.0’ చిత్రానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా వరల్డ్‌ టూర్‌ ప్లాన్‌ ప్లాన్‌ చేశాం. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశాం. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నార. దీపావళికి ‘2.0’ ఫస్ట్‌లుక్‌ను, ప్రోమో టీజర్‌ను విడుదల చేసి, రజనీకాంత్‌గారి పుట్టినరోజున ట్రైలర్‌ రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశార. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నార” అన్నారు.
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.