రక్షిత్.. కోమలి.. అహితేజ ల ‘శశివదనే’ ప్రారంభం !

గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. ‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రక్షిత్ అట్లూరి హీరో. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు మారుతి క్లాప్ ఇచ్చారు. సంగీత దర్శకులు రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత శరత్ మరార్ తదితర ప్రముఖులు  కార్యక్రమానికి హాజరయ్యారు.
అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. “రక్షిత్ గారు, కోమలి ప్రసాద్ గారి పెయిర్ చాలా బావుంది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇదే తొలి సినిమా. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం” అని చెప్పారు.
సాయి మోహన్ ఉబ్బన మాట్లాడుతూ… “నా ఫస్ట్ మూవీ ఇది. మమ్మల్ని ఆశీర్వదించడానికి థాంక్యూ” అని అన్నారు.
రక్షిత్ మాట్లాడుతూ… “తేజగారు చాలా అభిరుచి గల ప్రొడ్యూసర్. దర్శకుడు సాయి గారికి అద్భుతమైన విజన్ ఉంది. రెహమాన్ గారి శిష్యుడు శరవణ వాసుదేవన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమా అవుతుంది. ‘నరకాసుర’ అనే సినిమా చేస్తున్నాను ” అని అన్నారు.
త్వరలో దర్శకుడు కానున్నఎడిటర్ గ్యారీ మాట్లాడుతూ… “ఇది మంచి కథ. విన్నప్పటి నుంచి నేనే చేస్తానని వెంట పడుతున్నాను. తేజ నాకు మంచి ఫ్రెండ్” అని అన్నారు.
సీనియర్ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు ప్రిన్స్ దీపక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్,సమర్పణ: గౌరీ నాయుడు.