సాయితేజ్ కొత్త చిత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ క్లాప్‌తో ప్రారంభం!

జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాయితేజ్ హీరోగా చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ’ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో ఇది గురువారం ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌లో ‘ప‌వ‌ర్‌స్టార్’ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అల్లు అర‌వింద్‌, ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, ఎ.ఎం.ర‌త్నం, ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్. ప్ర‌సాద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాప్ కొట్ట‌గా.. అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వంశీ పైడిప‌ల్లి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం చేశారు. అల్లు అర‌వింద్ స్క్రిప్ట్‌ను అందించారు. ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.ర‌మ్య‌కృష్ణ‌,రాహుల్ రామ‌కృష్ణ‌ ఇతర పాత్ర ధారులు
‘‘ఇది ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లిగించే అద్భుత‌మైన క‌థ‌తో చేస్తున్న సినిమా.సాయితేజ్‌, నివేదా పేతురాజ్‌, మ‌ణిశ‌ర్మ‌, శ్యామ్ ద‌త్‌, నిర్మాత‌లు భ‌గ‌వాన్‌గారు, పుల్లారావుగారు ఇలా క‌థ‌కు త‌గిన‌ ఎక్స్‌ట్రార్డిన‌రీ టీమ్ కుదిరింది ’’… అని దేవ క‌ట్ట అన్నారు. స్క్రీన్‌ప్లే: దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌,
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, పాట‌లు: సుద్దాల అశోక్ తేజ‌, రెహ‌మాన్‌, ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్‌