నవీన్ లొట్ల దర్శకత్వంలో ‘విక్టోరియా’ ప్రారంభం

ముగ్గురు అమ్మాయిలకు జరిగిన అనుకోని సంఘటనలు..వారి జీవితాల్లో ఏ మార్పులు తీసుకువచ్చాయి? అనేది ‘విక్టోరియా’ సినిమా ముఖ్య భూమిక. మోహన్ ప్రొడక్షన్స్ సమర్పణలో చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ లు ప్రధాన పాత్రధారులుగా నవీన్ లొట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విక్టోరియా’ దీనికి టాగ్ లైన్ మహారాణి. ఓ అలానే అమ్మాయిలను రేప్ చేసి చంపేయడం, ప్రజలు దాని గురుంచి సామాజిక మాధ్యమాల్లో చర్చిండం … ఈ తరహా తీరును ఈ సినిమాలో ప్రస్తావిస్తూ తెరకెక్కించిన చిత్రమే విక్టోరియా.వి. అర్జున్ అప్పారావు నిర్మాత గా ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.ఈ నూతన చిత్రానికి క్లాప్ నిర్మాత రాజ్ కందుకూరి ఇవ్వగా..గౌ. దర్శకత్వం సీనియర్ దర్శకుడు సముద్ర వహించగా.. శ్రీ. రాఘవ సతీష్ స్వామిజీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
దర్శకుడు నవీన్ లొట్ల మాట్లాడుతూ…ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగిన అనుకోని సంఘటనలు,వారి జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చాయి అనేది చిత్ర కథాంశం. 6 నెలలుగా ఈ చిత్ర కథపై కష్టపడితే.. అర్జున్ అప్పారావు గారికి నచ్చి ఈ అవకాశాన్ని కల్పించారు.ఈ సినిమాలో స్క్రీన్ ప్లే హైలెట్ గా నిలుస్తుంది. అదే సినిమాకు బలం .త్వరలో సెట్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మరికొంత మంది ప్రముఖ నటీ నటులు నటించనున్నారు అని తెలిపారు.
 
చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర, విజయ్, నాని భాష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మురళి వై. కృష్ణ, మ్యూజిక్: ఎల్. వి. ముత్తు గణేష్, ఎడిటర్: మోహన్ రామా రావు