శ్రీ శివాయ్ ఫిలింస్ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

‘శ్రీమంతుడు’ ,’ఖైదీ’ చిత్రాల ఫేం హరీష్ ఉత్తమన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ‘అర్ధనారీ’ చిత్రం హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్న చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.గౌతమ్ వ్యాస్ , ‘మిస్ తెలంగాణ’ దీపికా వధానిలు హీరో హీరోయిన్లుగా … శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు స్రవంతి మురళీ మోహన్ తెరకెక్కిస్తున్న చిత్రం హైద్రాబాద్ లో ప్రారంభమైంది .దీన్ని కె.రమేష్ బాబు నిర్మిస్తున్నారు.
 
చిత్ర దర్శకుడు స్రవంతి మురళీ మోహన్ మాట్లాడుతూ… గౌతమ్ వ్యాస్ , ‘మిస్ తెలంగాణ’ దీపికా వధాని లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రూపొందిస్తున్నామని తెలిపారు . నలభై రోజుల్లో సినిమా పూర్తి చేస్తామని ..సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్ లో ,సెకండ్ షెడ్యూల్ గోవాలో ,థర్డ్ షెడ్యూల్ కేరళలో చేయనున్నట్లు తెలిపారు .
 
చిత్ర నిర్మాత కె .రమేష్ బాబు మాట్లాడుతూ… దర్శకులు స్రవంతి మురళీ మోహన్ చెప్పిన కథ బాగా నచ్చింది . ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ గా నిర్మిస్తామని తెలిపారు
 
కెమెరా : జి ఎస్ .రాజ్ (మురళి ) ,మ్యూజిక్ :శివ నందిగామ, చీఫ్ అసోసియేట్ :అనిల్ పురేటి , కథ ,స్క్రీన్ ప్లే – గౌతమ్ వ్యాస్, పి .ఆర్ .ఓ : శ్రీధర్