‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ లో కామెడీ.. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌

‘సూపర్‌హిట్‌’ టెలివిజన్‌ షో ‘జబర్దస్త్‌’ ద్వారా పాపులర్‌ అయిన ‘సుడిగాలి’ సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇది డాక్టర్‌ ఎన్‌.శివ ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ 10 మిలియన్‌ వ్యూస్‌కి పైగా సాధించి ట్రెండింగ్‌లో నిలిచిందంటే ఈ చిత్రం పట్ల ఆడియన్స్‌లో ఎంతటి అటెన్షన్‌ ఉందో అర్థమవుతోంది. డిసెంబర్‌ మొదటి వారంలో సినిమా విడుదలవుతున్న సందర్భంగా …
 
దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ”ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్‌ వేర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండే మూవీఇది . షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సుధీర్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. టీజర్‌కి వ్యూస్‌ బాగా రావడంతో సినిమా సక్సెస్‌ పట్ల కాన్ఫిడెన్స్‌ పెరిగింది. మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. మేం వైజాగ్‌ అంటే.. ‘మలేషియాలో అయితే బాగుంటుంది’ అని అక్కడ పాట చిత్రీకరించారు. గొప్ప ప్రొడ్యూసర్‌ దొరికినందుకు హ్యాపీగా ఉంది. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కావాలని సుధీర్‌ని… పెర్ఫామెన్స్‌కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్‌ కావడంతో ధన్య బాలకృష్ణ ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. వారు చాలా బాగా నటించారు. ఈ చిత్రంలో ‘ప్రజా గాయకుడు’ గద్దర్‌ ఒక పాట పాడి నటించడం జరిగింది. ఇటీవల మనకు దూరం అయిన మాజీ ఎంపి, నటుడు డా.శివప్రసాద్‌గారు ఒక పాత్రలో నటించారు. అలాగే మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు ఒక రోల్‌ చేయడం జరిగింది. ఈ చిత్రంతో తప్పకుండా సక్సెస్‌ సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం” అన్నారు.
 
హీరోయిన్‌ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అయింది. సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను. రేపు సినిమా హిట్‌ అయితే దానికి కేవలం ఆయన ఫ్యాన్స్‌ కారణం. రాజశేఖర్‌ రెడ్డి ప్రాపర్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌. ఇంకో రెండుమూడేళ్లలో పెద్ద హీరోలతో తప్పకుండా వర్క్‌ చేస్తాడు. శేఖర్‌ రాజుగారికి తొలి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఆయన పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
 
చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌లో ఫస్ట్‌ మూవీ. రాజశేఖర్‌ చెప్పిన స్టోరీ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి ఒప్పుకున్నాను. అలాగే సుధీర్‌గారిని మా బేనర్‌లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా తప్పకుండా సూపర్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.
 
హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ” మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్‌ చెప్పారు. చాలా బాగుంది సర్‌. టెక్నీషియన్స్‌ ఎవరు? అని అడిగాను. వెంటనే రామ్‌ ప్రసాద్‌గారు కెమెరా, గౌతం రాజు ఎడిటర్‌, రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్‌, భీమ్స్‌ మ్యూజిక్‌, అని చెప్పారు. అంత పెద్ద టెక్నీషియన్స్‌ నా సినిమాకు ఎందుకు వర్క్‌ చేస్తారు అనుకున్నాను. కానీ సెకండ్‌ మీటింగ్‌లో ప్రొడ్యూసర్‌గారితో వచ్చి అడ్వాన్స్‌ ఇచ్చి మార్చి 20 షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది అని చెప్పారు. మార్చి 20 నా లక్కీ డే. ఆరోజు నా రెండు సినిమాలు షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాయి . సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ధన్య బాలకృష్ణగారితో షూటింగ్‌ ఫన్నీగా జరిగింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్‌ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు రజినీకాంత్‌గారు, పవన్‌ కల్యాణ్‌గారు. ఈ సినిమాలో వారిద్దర్నీ ఇమిటేట్‌ చేయడం జరిగింది. డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌ రిలీజ్‌ అనుకుంటున్నాం” అన్నారు.
 
ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ ఇతర పాత్రదారులు .ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల