యంగ్ డైరెక్టర్స్ మెచ్చిన ట్రూ హారర్ డ్రామా ‘మసూద’

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ‘మళ్ళీ రావా’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తన మూడవ చిత్రంగా మసూద అనే హారర్ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ ముఖ్య పాత్రలను పోషించారు. 18న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు.. యువ దర్శకులు చూశారు…

ఈ సంద్భంగా యువ దర్శకులు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ దర్శకుడు స్వరూప్ అర్. ఎస్. జే.,  ‘కేరాఫ్ కంచర పాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, అంటే సుందరానికీ… దర్శకుడు వివేక్ ఆత్రేయ, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడు వినోద్ అనంతోజు, ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే… హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు.  హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే ఆ అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించిందో మసూద కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు. దర్శకుడు సాయి కిరణ్ గురించి మాట్లాడుతూ… కథలోనే హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం చాలా కష్టమని, ఆ విషయంలో దర్శకుణ్ణి అభినందించారు. ఈ చిత్రానికి సౌండ్ అండ్ విజువల్ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు.  

చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ..  మళ్లీరావా, ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కచితంగా నచ్చుతుంది అని మా నమ్మకం’ అని అన్నారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ మాట్లాడుతూ.. ‘సరైన హారర్ సినిమాగా మసూద వస్తోంది. మేం సినిమాను చూస్తూ ఎంత ఎంజాయ్ చేశామో మీరు చూసినపుడు మీకు కూడా అర్థమవుతుంది . అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగా పని చేశాయి.’ అని అన్నారు.

‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ కానీ సినిమా చూసిన తరువాత షాక్ అయ్యాను. చాలా చోట్ల కచ్చితంగా భయపడతాం. డెబ్యూ డైరెక్టర్‌ తీసిన సినిమాగా అనిపించదు. సరైన టీం కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. మ్యూజిక్, సౌండ్, కెమెరా అన్నీ చక్కగా కుదిరాయి’ అని అన్నారు.

వెంకటేష్‌ మహా మాట్లాడుతూ.. ‘నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. హారర్‌ను ఫుల్లుగా ఎక్స్‌పీరియెన్స్ చేశాను. చాలా భయపడ్డాను. సాయి విజన్‌కు తగ్గట్టుగా అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఇది విజువల్ హారర్ ఫిల్మ్. సౌండింగ్, మ్యూజిక్ పరంగానూ అద్భుతంగా పని చేశారు. హారర్ అంటే కామెడీ, మసాలా ఉండాలని అనుకునే సమయంలో.. ఇలాంటి కథను నిర్మించిన రాహుల్‌కు థాంక్స్. ‘ అని అన్నారు.

మిడిల్ క్లాస్ మెలోడిస్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ.. ‘దెయ్యాన్ని చూస్తే వచ్చే భయం కాదు. ఆ సీన్‌లోంచి, వాతావరణంలోంచి భయాన్ని క్రియేట్ చెయ్యటం మామూలు విషయం కాదు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల్లోనే భయపెట్టేస్తాడు. టీం అంతా కలిసి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. థియేటర్లోనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథను నమ్మి తీసిన రాహుల్‌కు థాంక్స్’ అని అన్నారు.

వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ‘రాహుల్, ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్స్. ప్రీమియర్స్‌కు పిలిచారు. అమ్మోరు, కాంతారా ప్రపంచంలో మనం ఉన్నప్పుడు.. పాత్రలకు ఏమైనా జరుగుతూ ఉంటే మనం భయపడుతుంటాం. ఈ చిత్రంలోనూ అలాంటి ఫీలింగ్ వస్తుంది. హారర్ సినిమా చేయాలంటే టెక్నికల్‌గా ఎంతో నాలెడ్జ్ ఉండాలి. సాయి మొదటి సినిమానే ఇలా చేయడం చాలా గ్రేట్. సంగీత, తిరువీర్, కావ్యా, శుభలేఖ సుధాకర్ ఇలా అందరూ చక్కగా నటించారు. బెలూన్ సౌండ్‌కి కూడా నా గుండె ఝల్లుమంది. హారర్ సినిమాకు ఆర్ఆర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆర్ఆర్, విజువల్స్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లోనే ఈ సినిమాను చూడండి’ అని కోరారు.

సాయి కిరణ్ మాట్లాడుతూ.. ‘మంచి సినిమాను తీశాం. నాకు ఆఫర్ ఇచ్చినందుకు రాహుల్‌కు థాంక్స్.  సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మసూద కల్పిత చిత్రమే. ఇందులో మసూద నెగెటివ్ పాత్ర. ఆమె కోణంలోంచి సినిమా నడుస్తుంది. కాబట్టే ఈ చిత్రానికి మసూద అని టైటిల్ పెట్టాం. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.

తిరువీర్ మాట్లాడుతూ.. ‘నాకు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్‌గా అందరినీ భయపెట్టే ఇమేజ్ ఉంది. స్వధర్మ్ వాళ్లు నన్ను ఈ పాత్రకు అప్రోచ్ అయినప్పుడు షాక్ అయ్యాను. కథ నాకు ఎంతో బాగా నచ్చింది. నాకు డ్రామాలంటే చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను నాకు ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.

కావ్యా కళ్యాణ్‌ రామ్ మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చిన దర్శకులంతా కూడా మా సినిమాను ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి క్రియేటివ్ పీపుల్స్ చెప్పాక మేం చెప్పడానికి ఇంకేం ఉంటుంది. ఆడియెన్స్ సినిమాను చూశాక వాళ్లకి కూడా తెలుస్తుంది. కరోనాలో ఎన్నో కష్టాలు వచ్చినా సినిమాను పూర్తి చేశాం’ అని అన్నారు.

భాందవి శ్రీదర్ మాట్లాడుతూ.. ‘ ఇందులో ఓ మంచి సందేశం ఉంది. మనిషికి మూడు సందర్భాల్లో ఏడుపు వస్తుంది.ఎంతో సహజంగా తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. హారర్ సినిమాలకు విజువల్స్, మ్యూజిక్ ఇంపార్టెంట్. అవి రెండూ చక్కగా కుదిరాయి ‘ అని అన్నారు.

ప్రశాంత్ ఆర్.విహారి మాట్లాడుతూ.. ‘భయపెట్టడం చాలా కష్టమని నాకు తెలిసింది.  నేను చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది ‘ అని అన్నారు.
ఆర్డ్ డైరెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. ‘స్వధర్మ్ బ్యానర్‌లో వరుసగా మూడు చిత్రాలు చేశాను. శివపుత్రుడు, ఖడ్గం, మసూద అనేవి సంగీత మేడం కెరీర్‌లో నిలిచిపోతాయి. ఈ చిత్రంలో చిన్న పాత్రను కూడా పోషించాను’ అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ నగేష్ బనెల్ మాట్లాడుతూ… ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్ గారికి, దర్శకుడు సాయి గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ కథని తెరకెక్కించడానికి కావాల్సిన అన్నింటినీ స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ అందించింది.  దర్శకుడు సాయి కిరణ్ మైండ్ లో  వున్న షాట్స్ ని అలాగే తెరకెక్కించారు. సినిమాలో విజువల్స్ గ్రాండ్ గా వుంటాయని, ఈ సినిమాని థియేటర్ లోనే చూడాలని కోరారు.