వింగ్స్ ‘మిస్ ఇండియా అండ్ మిస్టర్ ఇండియా’ కాంటెస్ట్!

‘వింగ్స్ మోడల్ హబ్’… ఇప్పటివరకు హైద్రాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఈసారి పాన్ ఇండియా లెవెల్లో  మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంపిటీషన్ నిర్వహించి ఫైనల్ గా హైద్రాబాద్ లో జరిగే గ్రాండ్ ఫినాలే లో విజేతను ప్రకటిస్తారు. ఈ సందర్బంగా పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిధులుగా హీరోయిన్ చాందిని, జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, కిరాక్ ఆర్పీ, మహేష్, కృతిక మిస్సెస్ ఇండియా 2018, జాహ్నవి, మిస్ తెలంగాణ అంజు, హరి, శాంతి భూషణ్, మనోజ్, పవన్, అర్జున్ పాల్గొన్నారు.మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా పోస్టర్ ని హైపర్ ఆది, హీరోయిన్ చాందిని విడుదల చేసారు.

చాందిని మాట్లాడుతూ.. వింగ్స్ మోడల్ హబ్ బ్రోచర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్లకు మంచి ప్లాట్ ఫార్మ్ అని నా అభిప్రాయం, కాబట్టి టాలెంట్ ఉన్నవాళ్లు తప్పకుండా మీ ప్రయత్నాన్ని ఈ వేదిక ద్వారా సక్సెస్ చేసుకోండి, ఈ కార్యక్రమం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

మనోజ్ వీరగోని మాట్లాడుతూ .. ఈ కార్యక్రమం చేయడానికి నాకు సపోర్ట్ చేస్తున్న టీం ఇక్కడ ఉంది. వీళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ఏదీ చేయలేను. ఇప్పటి వరకు హైదరాబాద్ లో చేసిన ఈ కార్యక్రమాన్ని ఇకపై పాన్ ఇండియా లెవెల్లో చేయాలని ప్లాన్ చేసాం. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే బాలీవుడ్ స్టార్ అర్బాజ్ ఖాన్ గారు బాగుంది అని సపోర్ట్ అందిస్తున్నారు. ఈ వేడుకలో ఆయనకూడా పాల్గొంటారు. ఆయనే మాకు మెంటర్,  మే 29న  హైద్రాబాద్ లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది, చాలా గ్రాండ్ గా జరిగే కార్యక్రమం ఇది.

హైపర్ ఆది మాట్లాడుతూ .. పాన్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల నుండి మోడల్స్ ని తీసుకొచ్చి మే 29న హైదరాబాద్ లో జరిగే గ్రాండ్ ఫినాలే లో ఫైనల్ విన్నర్ ని ఎంపిక చేస్తారు. ఈ వింగ్స్ హబ్ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ.. మిస్ ఇండియా గా ఎన్నికయిన చాలా మంది హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. అలాగే ఈ వింగ్స్ ద్వారా ఏర్పాటు చేస్తున్న మిస్ అండ్ మిస్టర్ ఇండియా గా చాలా మంది పాల్గొనాలని, అలాగే ఇందులో విన్నర్ అయినవాళ్లకు సినిమాల్లో కూడా చాలా అవకాశాలు వస్తాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనోజ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృతిక మిస్సెస్ ఇండియా 2018, జాహ్నవి, కిర్రాక్ ఆర్పీ, మహేష్ లు తమ అభిప్రాయాలూ తెలిపారు