అభిషేక్ పిక్చ‌ర్స్ ‘భైర‌వగీత’ 14న విడుద‌ల‌

‘భైర‌వ‌గీత’ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. సెన్సార్ బోర్డ్ A స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని 23 ఏళ్ల కొత్త ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు. ఈ చిత్ర ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.. అన్ని వ‌ర్గాల నుంచి దీనికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ర‌విశంక‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం విశేషం. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా మ‌రియు భాస్క‌ర్ రిషి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 14న భైర‌వ‌గీత విడుదల కానుంది.
 
న‌టీన‌టులు:
ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్..
 
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: సిద్ధార్థ్ తాతోలు
నిర్మాత‌లు: అభిషేక్ నామా మ‌రియు భాస్క‌ర్ రిషి, నిర్మాణ సంస్థ‌: అభిషేక్ పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌కులు: రామ్ గోపాల్ వ‌ర్మ, సంగీత ద‌ర్శ‌కుడు: ర‌వి శంక‌ర్,సాహిత్యం: సిరా శ్రీ‌
క‌థ‌, స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వ‌ర్మ/ రామ్ వంశీ కృష్ణ, సినిమాటోగ్ర‌ఫర్: జ‌గ‌దీష్ చీక‌టి M.F.A