గోపీ చంద్ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్ ప్రసాద్ సినిమా ప్రారంభం

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్.ఎల్‌.పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.26గా గోపీ చంద్ హీరోగా సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభ‌మైంది. బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను ఇండియా స‌హా నేపాల్‌, కాంబోడియా, థాయ‌లాండ్‌లో చిత్రీక‌రిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌తీశ్ కురుప్ కెమెరా వ‌ర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ స‌హా మిగిలిన న‌టీన‌టుల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని యూనిట్ తెలియ‌జేసింది.
‘సాహ‌సం’ త‌ర్వాత గోపీచంద్, బి.వి.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్ర‌మిది. గోపీ చంద్ను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించ‌నున్నామ‌ని, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే చిత్ర‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు బిను సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు.
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, ద‌ర్శ‌క‌త్వం: బిను సుబ్ర‌మ‌ణ్యం, సినిమాటోగ్ర‌ఫీ: స‌తీశ్ కురుప్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌