నేను నటుడిగా చ‌నిపోను, అందుకే ఇక సినిమాలు చెయ్యను !

రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌హాస‌న్.. ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని తేల్చిచెప్పారు.    క‌మ‌ల్ హాస‌న్ త‌న అభిమానుల‌కు నిరాశ‌ను మిగులుస్తూ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం బోస్ట‌న్‌లో ఉన్న క‌మ‌ల్.. అక్క‌డ ఓ ప్రైవేట్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యం వెల్ల‌డించారు. అయితే ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు సినిమాలు మాత్రం య‌థావిధిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయ‌ని తెలిపారు.ఈ నెల‌లోనే తన పార్టీ పేరును, విధివిధానాల‌ను వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు…
‘‘త్వ‌ర‌లో రాబోతున్న రెండు సినిమాల త‌ర్వాత నేను సినిమాలు చేయ‌ను. నేను నటుడిగా చ‌నిపోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. ప్ర‌జాసేవ చేసిన త‌ర్వాతే తుది శ్వాస విడుస్తా. అందుకే పూర్తిగా రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. ప్ర‌జ‌లు నిజాయితీగా బ‌తికేందుకు ఏదో ఒక‌టి చేయాల‌ని భావిస్తున్నాను. 37 ఏళ్లుగా నేను ప్ర‌జా జీవితంలో ఉన్నాను. ఈ 37 సంవ‌త్స‌రాల‌లో దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది నిజాయితీప‌రులైన ప‌నిమంతుల‌ను క‌లుసుకున్నాను. గ‌త 37 ఏళ్లుగా వారు నాతోనే ఉన్నారు. బ్యాంక్‌లో నా అకౌంట్‌లు డ‌బ్బులు వేసుకోవ‌డానికి నేను రాజ‌కీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి రావాల‌ని ప‌దేళ్ల క్రిత‌మే నిర్ణ‌యం తీసుకున్న‌ా’’ అని క‌మ‌ల్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు సినిమాలు ‘విశ్వరూపం 2’ , ‘శభాష్ నాయుడు’ విడుదలకు సిద్ధమయ్యాయి