కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది !

కార్తీ హీరోగా లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలోడ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ రూపొందిన ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ విడుదలయ్యింది
 
పాటలు, రొమాన్స్ లేకుండా యాక్షన్ – థ్రిల్స్ తో సిద్దమవుతున్న ‘ఖైదీ’ ఆడియన్స్ కి ఒక ‘స్పెషల్ కిక్కు’ అని అర్ధమవుతోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. జీవిత ఖైదిగా ఉన్న ఒక కూతురి తండ్రిగా కార్తీ ఇందులో చేస్తున్నాడు. జైలు నుంచి తప్పించుకొని… పోలీస్ ఆఫీసర్ తో అతని ప్రయాణం ఎలా సాగింది? అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. సినిమాలో యాక్షన్ డోస్ గట్టిగానే ఉంది. ప్రశంసలు అందుకున్న ‘నగరం’ దర్శకుడు లోకేష్ ట్రైలర్ తో ఆడియెన్స్ లో మంచి హైప్ ని క్రియేట్ చేశాడు. డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. “ఎక్కడికి పోతున్నావ్? ఏం చేస్తున్నావ్ చుట్టూ పాతిక మంది ఉన్నారు” అని అనగానే… “పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే నీకు తెలుసు.. లోపలికి వెళ్లే ముందు ఏం చేసేవాడినో తెలీదు కదా” అంటూ కార్తీ చెప్పే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ” ఏం సత్తావని భయమేస్తుందా? చావునైనా ఎదిరించి చావాల్సిందే” అంటూ కార్తీ చివరలో చెప్పిన డైలాగ్ బలంగా ఉంది.