సస్పెన్స్ థ్రిల్లర్ గా కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ చిత్రం

కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై, పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో, ఊర శ్రీనివాస్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో ప్రొడ‌క్ష‌న్ నం.1 చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది. యస్వంత్, సాయితేజ, అరుషి, నిఖిల హీరోలు హీరోయిన్లుగా నటించే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జరిగింది. అమ్మ న్యూస్ ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు, రచయిత బిక్కి కృష్ణ స్విచ్ ఆన్ చేశారు.

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ సినిమా నిర్మాణంలో నా వంతు  బాధ్యత తీసుకుంటా. మంచి టాలెంట్ ఉన్న ఊర శ్రీను గొప్ప దర్శకుడు అవుతాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వంద కోట్లు సాధిస్తున్న రోజులు ఇవి.. అని అన్నారు
నిర్మాత పోతురాజు నర్సింహారావు మాట్లాడుతూ.. మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. అందరి సహకారం ఉండాలి. కొత్త తరం నటులను ఆశీర్వదించండి.
డైరెక్టర్ ఊర శ్రీనివాస్ మాట్లాడుతూ…. మా సస్పెన్స్ థ్రిల్లర్  అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ అవుతుందని అన్నారు…

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ ఆత్రేయ మాట్లాడుతూ.. పాటలు బాగా వచ్చాయి. నాలుగు పాటలు ఉన్నాయి. మ్యూజికల్ హిట్ కూడా అవుతుందని నమ్మకం ఉంది. సినిమాను సూపర్ హిట్ చేయాలి.
మాటల రచయిత దాసరి వెంకట్ మాట్లాడుతూ… ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోకు ధన్యవాదాలు. ఊపిరి బిగబట్టుకుని చూసే సస్పెన్స్ క్రిస్పీ థ్రిల్లర్ ఇది. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
కథ రచయిత సుస్మా ప్రియదర్శిని మాట్లాడుతూ.. థ్రిల్లర్ అండ్ కామెడీ మిక్స్ చేసి తీస్తున్న సినిమా ఇది. అందరిని ఆకట్టుకుని హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది.