ఇన్నేండ్ల జర్నీలో నన్ను నేను తెలుసుకున్నాను !

కత్రినా కైఫ్‌… బాలీవుడ్‌లో కథానాయిక కత్రినా కైఫ్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరు అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఆమెకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అభిమానులు న్నారు.బాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. అనుష్క, సోనమ్, దీపిక, ప్రియాంకా చోప్రాలు ఇటీవలే పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా హీరోయిన్ కత్రీనాకైఫ్ తన పెళ్లి, పిల్లల ఆలనాపాలన గురించి తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది….
“కొద్ది రోజుల నుంచి నా మనసులో ఇదే విషయం తిరుగుతోంది. అయితే దీనిని నేను భగవంతునికే విడిచిపెట్టేశాను. జీవితంలో ఏది మనకు నిర్ధారితమై ఉందో, దానినే చేస్తుంటాం. ఇది గ్రహించాక శాంతంగా ఉండగలుగుతున్నాను. మనకు వచ్చిన ఆలోచనలన్నీ సాకారం కావు’ అని తెలిపారు. కాగా కత్రీనా రణబీర్‌కపూర్‌తో ఐదేళ్ల పాటు రిలేషన్‌లో ఉంది. 2016లో వీరికి బ్రేక్ అప్ అయింది. అప్పటి నుంచి కత్రీనా సింగిల్‌గానే ఉంటోంది. ప్రస్తుతం రణబీర్.. అలియాభట్‌తో డేట్‌లో ఉంటున్నాడు. కాగా కొంతకాలం క్రితం వరకూ కత్రీనా, అలియా స్నేహితులుగా ఉన్నారు. తాజాగా రణబీర్, అలియాభట్ ప్రేమాయణం కారణంగా కత్రీనా, అలియాల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం.
 
షారూఖ్‌ ఖాన్‌ ‘జీరో’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కత్రినా తన కెరీర్‌ గురించి చెబుతూ… ‘ఇన్నేండ్ల జర్నీలో నన్ను నేను తెలుసుకున్నాను. ప్రేమకు దూరంగా సింగిల్‌గా ఉండటం స్వేచ్ఛగా ఉంది. కెరీర్‌పై దృష్టిసారించాను. విభిన్న కోణాల్లో కొత్త విషయాలు చాలా నేర్చుకుంటున్నా’ అని తెలిపింది. కత్రినా ‘జీరో’తోపాటు సల్మాన్‌తో కలిసి ‘భారత్‌’ చిత్రంలోనూ నటిస్తోంది.