అప్పుడు భవిష్యత్తు గురించి భయం వెంటాడేది!

“కెరీర్ ఆరంభంలో అవకాశాల విషయంలో తీవ్రంగా నిరుత్సాహపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా తొలి చిత్రం ‘ఫగ్లీ’ పరాజయం పొందడంతో అవకాశాలు కరువై పోయాయి. ఓ దశలో ఏమీ తోచక ఇంటిపట్టునే ఉండిపోయేదాన్ని. భవిష్యత్తు ఎలా ఉంటుందో? అనే భయం వెంటాడేది”…. అంటూ చెప్పింది కియారా అద్వాని.
“ప్రస్తుతం నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉంది. నా గమ్యమేమిటో ఇంకా నిర్ణయించుకోలేదు కానీ.. ఈ ప్రయాణాన్ని మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తున్నా”.. అని చెప్పింది కియారా. “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” తో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుందీ ఢిల్లీ భామ. ఇప్పుడు బాలీవుడ్‌లో భారీ అవకాశాలతో దూసుకుపోతోంది . ఈమె కథానాయికగా నటించిన కబీర్‌సింగ్ (‘అర్జున్‌రెడ్డి’ రీమేక్) మూడొందల కోట్ల క్లబ్‌లో నిలిచింది. “కెరీర్‌లో మొదటిలోనే అంత భారీ సినిమాలో భాగమవడం అదృష్టం. అయితే, కెరీర్ ఆరంభంలో అవకాశాల విషయంలో తీవ్రంగా నిరుత్సాహపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తొలి చిత్రం ‘ఫగ్లీ’ పరాజయం తో అవకాశాలు మృగ్యమైపోయాయి. ఓ దశలో ఎటు తోచక ఇంటివద్దనే ఉండిపోయేదాన్ని. భవిష్యత్తు ఎలా ఉంటుందో? అనే సందిగ్ధం వెంటాడేది. ఆ సమయంలో …’అవకాశాల్ని మనమే సృష్టించుకోవాలి. అన్వేషణ ఆపకూడదు. ప్రయత్నాలు ఏదో ఒకరోజు ఫలిస్తాయి’ అంటూ అమ్మ చెప్పిన మాటలు నాలో స్ఫూర్తినింపాయి“.. అని చెప్పింది కియారా అద్వాని.
 
ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం
“నాలుగు చిత్రాల్లో నటించడంతోపాటు మరో నాలుగు చిత్రాల్లో నటించే అరుదైన అవకాశాన్ని కల్పించిన ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. ‘కబీర్‌సింగ్‌’, ‘కళంక్‌’ వంటి భిన్న చిత్రాల్లో నటించే అరుదైన అవకాశాన్ని ఈ సంవత్సరం నాకు కల్పించింది. అనుకోనివిధంగా ‘గుడ్‌న్యూస్’ విడుదలతో ఈ ఏడాది ముగుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని అంటోంది కైరా అద్వానీ. ఈ ఏడాది తెలుగులో ‘వినయ విధేయ రామా’ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో మూడు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది . అంతేకాదు, పలు భారీ ఆఫర్లు సైతం అందుకుంది. ప్రస్తుతం ‘లక్ష్మీబాంబ్‌’, ‘ఇందూ కీ జవానీ’, ‘భూల్‌ భులయ్య 2’, ‘షేర్‌షా’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. “నాలుగు చిత్రాల్లో నటించడంతోపాటు మరో నాలుగు చిత్రాల్లో నటించే అరుదైన అవకాశాన్ని కల్పించిన ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు కూడా చాలా మంచి చిత్రాలు. పైగా కరణ్‌జోహార్‌లాంటి నిర్మాత బ్యానర్‌లో చేయడం నా కెరీర్‌లో పెద్ద విజయం” అంటూ కైరా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
విజయ్‌ దేవరకొండ సినిమాకు గ్రీన్ సిగ్నల్?
‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ తర్వాత తెలుగు సినిమాలపై అంతగా ఆసక్తి చూపించ లేదు కియారా అద్వానీ. ‘కబీర్‌ సింగ్‌’తో బాలీవుడ్‌ టాప్‌ లీగ్‌లో చేరిపోయింది కియారా అద్వాని. అందుకే . తాజాగా తెలుగులో ఇద్దరు యువ కథానాయకుల సినిమాలను రిజెక్ట్ చేసిన కియారా ఓ క్రేజీ స్టార్‌కి మాత్రం ‘ఓ.కె’ చెప్పిందట. వరుణ్‌తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కియారాని అడిగారట. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలోనూ హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ వరుణ్‌తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌ చిత్రాలకు నో చెప్పేసిందట కియారా. అయితే ఈ ఇద్దర్నీ కాదన్న కియారా విజయ్‌ దేవరకొండతో మాత్రం సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్త.. విజయ్‌ హీరోగా పూరి ‘ఫైటర్‌’లో కియారా కథానాయికగా నటించే అవకాశాలున్నాయట. విజయ్‌ దేవరకొండ-కియారా గతంలో ఓ యాడ్‌ ఫిల్మ్‌లో నటించారు.
ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్‌లో ఐదు సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో అక్షయ్ కుమార్‌తోనే రెండు సినిమాలు నటిస్తుండడం విశేషం. ‘కాంచన’ రీమేక్‌ ‘లక్ష్మీ బాంబ్‌’లో అక్షయ్‌కి జోడీగా చేస్తోంది కియారా. ఇక అక్షయ్ కుమార్-కరీనా కపూర్ నటిస్తున్న కామెడీ డ్రామా ‘గుడ్ న్యూస్’లోనూ ఒక కథానాయికగా నటించింది. ఇంకా కార్తీక్ ఆర్యన్‌తో ‘భూల్ భూలయ్య-2’, సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘షేర్షా’, ఆదిత్య సీల్‌కి జోడీగా ‘ఇందూ కి జవానీ’ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది కియారా అద్వానీ.