నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో చిత్రం

నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ , నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..నారాయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్‌ అల్లుఅరవింద్‌ క్లాప్‌ నివ్వగా… దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు.
 
నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ – ”నార్త్‌ స్టార్‌ ఎంటర్టైన్మెంట్‌ , శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ పై నారాయణదాస్‌ నారంగ్‌, రామ్‌ మోహన్‌ రావు తో కలిసి నాగశౌర్య హీరోగా ఈ చిత్రం నిర్మిస్తున్నాను. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక స్పోర్ట్‌ బేస్డ్‌ మూవీ. కథ అద్భుతంగా ఉంది… అలాగే సంతోష్‌ ప్రామిసింగ్‌ డైరెక్టర్‌” అన్నారు.
 
నాగశౌర్య మాట్లాడుతూ – ”ఏషియన్‌ సునీల్‌. శరత్‌ మరార్‌ కాంబినేషన్లో ఈ చిత్రం హ్యాపీగా ఉంది. సంతోష్‌ సెకండ్‌ ఫిలిమ్‌. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌… తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
 
దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ – ”ఇది ఒక స్పోర్ట్స్‌ డ్రామా…ఒక ఇమాజినరీ బయోపిక్‌లా ఉంటుంది. నాకు మైలేజ్‌ ఇచ్చే మూవీ .ఈ సినిమాలో మీరు సరికొత్త నాగశౌర్యని చూస్తారు ‘అన్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ : మనోజ్‌ రెడ్డి, నిర్మాతలు: నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌ రావు, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి